ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: జేఈఈ మెయిన్ బీ ఆర్క్, బీ ప్లానింగ్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు మెరిశారు. సెప్టెంబర్ 1న రెండు విడతలుగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం సెప్టెంబర్ 18న విడుదల చేసింది. బీ ఆర్క్లో విశాఖపట్నానికి చెందిన చైతన్య కృష్ణకు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు లభించగా.. ఇదే జిల్లాకు చెందిన వచన్ సిద్ధార్థకు బీ ప్లానింగ్లో నాలుగో ర్యాంకు వచ్చింది.
సివిల్స్ సాధనే తన లక్ష్యమని చైతన్య కృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఆయన అడ్వాన్స్డ్ పరీక్షకు సాధన చేస్తున్నారు. ‘మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నా. బాంబే ఐ.ఐ.టి.లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేయాలని భావిస్తున్నా. తల్లిదండ్రులు, శ్రీచైతన్య కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించగలిగాను’ అని చైతన్యకృష్ణ వివరించారు.
ర్యాంకులు..
* వాళ్ల చైతన్య కృష్ణ (విశాఖపట్నం): బీ ఆర్క్- 2వ ర్యాంకు
* వారణాసి వచన్ సిద్ధార్థ (విశాఖ): బీ ఆర్క్-95, బీ ప్లానింగ్-4వ ర్యాంకు
* వాణికృష్ణ బర్ల (విశాఖపట్నం): బీ ఆర్క్-65, బీ ప్లానింగ్-10వ ర్యాంకు
* చిలుకూరి ప్రణీత్ (విజయవాడ): బీ ఆర్క్-11, బీ ప్లానింగ్-42 ర్యాంకు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.