ఈనాడు డిజిటల్, చెన్నై: విదేశీ విశ్వవిద్యాలయాల్లో పూర్తి సెమిస్టర్ చదివే అవకాశాన్ని తమ విద్యార్థులకు కల్పిస్తున్నామని ఐఐటీఎం నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘అక్కడ వారు పూర్తి చేసిన కోర్సును ఐఐటీఎం కరిక్యులమ్లోకి కూడా బదిలీ చేస్తాం. కొన్ని నిబంధనల మేరకు చదవాలనుకునే కోర్సును దాదాపు 50 శాతం ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. 16 విభాగాలకు చెందిన ఎనిమిది కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థి ఒక విభాగంలో నాలుగు కోర్సులను ఎంపిక చేసుకుంటే... వారిని ఆ విభాగంలో ‘మైనర్’గా గుర్తిస్తాం. పూర్తి వివరాలకు www.iitm.ac.in వెబ్సైట్ను సంప్రదించాలి...’ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా దేశాల్లోని 400లకుపైగా ఇన్స్టిట్యూట్లతో ఐఐటీఎం ఒప్పందాలు చేసుకుంది. ప్రొఫెసర్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆసక్తి ఉన్న రంగంలోనే విద్యార్థులు క్రెడిట్లు సాధించుకోవచ్చు. రోబోటిక్స్పై ఆసక్తి ఉన్న విద్యార్థి ఆ కోర్సు చదువుతూ క్రెడిట్స్ కూడా సంపాదించుకోవచ్చు. సెమిస్టర్ చివరిలో బ్రాంచ్ మార్చుకునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చాం. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు అదనంగా ఒక సంవత్సరం చదివితే ఎంబీఏ డ్యూయల్ డిగ్రీ అందించనున్నాం...’ అని వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.