ఈనాడు, హైదరాబాద్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్ఎస్) కింద ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థులు నవంబరు 20వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెసిడెన్షియల్ వసతి లేని అన్నిరకాల సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్థులు దీనికి అర్హులని తెలిపారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున 9, 10వ తరగతితో పాటు ఇంటర్లో రెండేళ్లు కలిపి మొత్తం నాలుగు సంవత్సరాల పాటు ఉపకార వేతనం అందుతుంది. పూర్తి వివరాలకు www.bse.telangana.gov.in వెబ్సైట్ చూడాలని ఆయన సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.