* మరో ఆరు నెలలు పొడిగిస్తూ యూజీసీ నిర్ణయం
దిల్లీ: ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులు పరిశోధనా పత్రాలు సమర్పించే గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు యూజీసీ పేర్కొంది. ఇంతకుముందు ఈ గడువు డిసెంబరు 31 వరకు ఉండగా.. ఇప్పుడు వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది. కొవిడ్-19 పరిస్థితులతో యూనివర్సిటీలను ఇంకా తెరవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పీహెచ్డీ, ఎంఫిల్ ఫెలోషిప్ గడువు యథావిధిగా ఐదేళ్లే ఉంటుందని యూజీసీ స్పష్టం చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.