ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 7, 8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పీజీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేశ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 10వ తేదీన సీట్ల కేటాయించనున్నట్లు చెప్పారు. డిసెంబరు 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కన్వీనర్ కోటా కింద 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలో 8040 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.