• facebook
  • whatsapp
  • telegram

పిల్లల్ని బడులకు పంపేందుకు తల్లిదండ్రులతో సమావేశాలు  

* 14న 6, 7 తరగతుల పునఃప్రారంభం 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో డిసెంబ‌రు 14 నుంచి పునఃప్రారంభం కానున్న 6, 7 తరగతుల విద్యార్థులను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం విద్యార్థుల తల్లిదండ్రుల్లో మూడో వంతు మందితో వారానికోసారి సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే 8, 9, 10 తరగతులకు బడులను నిర్వహిస్తుండగా.. 14 నుంచి 6, 7 తరగతులను పునఃప్రారంభించనున్నారు. ఇందు కోసం పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వర్క్‌బుక్స్, ఆన్‌లైన్‌తరగతుల పర్యవేక్షణ, సందేహాల నివృత్తికి విద్యార్థులు బడులకు వచ్చేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. కొవిడ్‌నిబంధనలను పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నారు.

ప్రవేశాలు నిర్వహించాలి..
* ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులందరూ రోజూ పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది. 
* ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు బడులు కొనసాగుతాయి. 
* అంగన్‌వాడీ కేంద్రాలను సంప్రదించి, ప్రాథమిక స్థాయిలో ప్రవేశాలకు వయసు కలిగిన పిల్లలందర్నీ ఉపాధ్యాయులు బడుల్లో చేర్పించాలి. 
* విద్యార్థులు పూర్తి చేసిన వర్క్‌షీట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేయడంతోపాటు ఆన్‌లైన్‌శిక్షణకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలి. 
* ‘పఠనాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా గ్రంథాలయ పుస్తకాలను పిల్లలకు అందించనున్నారు. గ్రంథాలయాల వద్ద నిర్వహించే ‘ఆదివారం కథ’ సమయానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా హాజరుకావొచ్చు.
* జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం బియ్యం, ఇతర సామగ్రి పంపిణీ సమాచారాన్ని మొబైల్‌యాప్‌లో ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.