ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా ఆరు రకాల ఫీజులను రద్దు చేస్తూ ఇంటర్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. రీ-అడ్మిషన్, మొదటి ఏడాది తర్వాత టీసీతో మరో కళాశాలలో ప్రవేశం, మొదటి ఏడాదిలో రెండో భాష, మాధ్యమం, గ్రూపు మార్పు, రెండో ఏడాదిలో గ్రూపు మార్చుకోవడానికి ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ విద్యామండలికి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బోర్డుకు ఫీజులను చెల్లించారు. వీటిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.