నవోదయ విద్యాలయ సమితి ఆరు, లేటరల్ ఎంట్రీ తొమ్మిదో తరగతి దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్ నవోదయ విద్యాలయాలలో 2021-22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి, లేటరల్ ఎంట్రీ ద్వారా తొమ్మిదో తరగతి ప్రవేశ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. కొన్ని పరిపాలనా(అడ్మినిస్ట్రేటివ్) కారణాల వలన చివరి తేదీని పొడగిస్తున్నట్లు ఉత్వర్వుల్లో తెలిపింది. ఆరోతరగతి దరఖాస్తు తేదీని డిసెంబరు 29 వరకు పెంచింది. అయితే కరెక్షన్ విండో మాత్రం డిసెంబరు 30, 31 వరకు తెరిచి ఉంటుందని తెలియజేసింది. అలాగే లేటర్ ఎంట్రీ తొమ్మిదో తరగతి దరఖాస్తులను డిసెంబరు 31వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు https://navodaya.gov.in/ వెబ్సైట్ను చూడవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.