* కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకు ఖాళీగా చూపుతున్న బోధన, బోధనేతర పోస్టులు రద్దయ్యాయి. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ పోస్టులను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రంలోని 64 ఎయిడెడ్ కళాశాలలకు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి ఎయిడెడ్ కళాశాలల్లో పోస్టుల భర్తీపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2006లోనే నిషేధం విధించింది. దానివల్ల బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ పొందటమేగాని వారి స్థానంలో నియామకాలు జరగడం లేదు. కళాశాల విద్యాశాఖ వాటిని ఖాళీ పోస్టులుగా చూపిస్తూ వచ్చింది. తాజాగా ఆ మొత్తం పోస్టులను రద్దు చేస్తున్నట్లు కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. వాటి సంఖ్య దాదాపు 3 వేలకుపైనే ఉండొచ్చని చెబుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.