* వెసులుబాటును బట్టి ఎక్కడైనా హాజరు కావచ్చు
నూజివీడు, న్యూస్టుడే: ఆర్జీయకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ఐటీల్లో జనవరి 4 నుంచి 11 వరకు ప్రవేశాలు జరగనున్న నేపథ్యంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్ల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారని, అభ్యర్థులు తమ వెసులుబాటుకు అనుగుణంగా రెండు క్యాంపస్ల్లో ఎక్కడైనా హాజరు కావచ్చని ఆర్జీయకేటీ కులపతి ఆచార్య కె.సి.రెడ్డి డిసెంబరు 30న తెలియజేశారు. వేరే విద్యాలయాల్లో ఇప్పటికే చేరి, ట్రిపుల్ఐటీల్లో చేరాలనుకునే అభ్యర్థులు(అర్హత ఉన్నవారు), తమ ధ్రువీకరణ పత్రాలను ఆయా విద్యాలయాల్లో సమర్పించినట్లు ఆధారాలతో కౌన్సెలింగ్కు హాజరు కావచ్చని చెప్పారు. ఒకవేళ ట్రిపుల్ఐటీకి ఎంపికైతే టీసీ సమర్పించేందుకు సమయం ఇస్తామని తెలిపారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు డిసెంబరు 30న 977 మందికి గాను 555 మంది హాజరైనట్లు ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.