* జూన్ 10 వరకు నిర్వహణ
* కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడి
దిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను 2021 మే 4 నుంచి జూన్ 10 వరకు నిర్వహించనున్నారు. ఫలితాలు జులై 15న వెల్లడవనున్నాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ డిసెంబరు 31న ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించనున్నట్లు తెలిపారు. సాధారణంగా ఏటా ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో జరుగుతుండేవి. రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ దఫా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. 2021లో బోర్డు పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించబోమని సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించిన సంగతి గమనార్హం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.