* సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
దిల్లీ: కరోనా కారణంగా గత ఏడాది జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని జనవరి 22న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించిన కేసును విచారిస్తున్న జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు ఈ విషయాన్ని చెప్పారు. దీనిపై ప్రమాణ పత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. దాంతో కేసు విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.