‣ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. చివరి తేదీ మార్చి 2
‣ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడి
దిల్లీ: యూజీసీ-నెట్ 2021 పరీక్ష తేదీల షెడ్యూలు విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్ష మే 2 నుంచి జరగనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ మేరకు ఫిబ్రవరి 2 మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు. దీంట్లో స్కోరు సాధిస్తే జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలు మే 2,3,4,5,6,7,10,11,12,14 మరియు 17 తేదీల్లో జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు.
యూజీసీ నెట్ పరీక్ష ఆన్లైన్లో జరగనుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వరకు అభ్యర్థులు ugcnet.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 3 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. నెట్ ద్వారా జేఆర్ఎఫ్కి ఎంపికైనవారు స్టైపెండ్తో కూడిన పీహెచ్డీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. జేఆర్ఎఫ్ అర్హత సాధించినవారికి ప్రతి నెలా స్ట్టైపెండ్, ఏటా కాంటింజెన్సీ గ్రాంటు అందుతాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.