* ఖాళీల భర్తీకి సన్నద్ధం
గోదావరిఖని : సింగరేణిలో కొలువుల జాతర సాగుతోంది. ఓ వైపు అంతర్గత అభ్యర్థులు.. మరోవైపు ఇతరులు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. సింగరేణిలో ఒకేసారి అంతర్గత, ఇతరులకు వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేయడంతో అర్హులైన అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇతరులకు 372 ఖాళీలను భర్తీ చేసేందుకు జనవరి 21న నోటిఫికేషన్ జారీ చేసిన సింగరేణి అంతర్గత అభ్యర్థులకు 879 ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 1న ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1,251 ఖాళీలు ఉన్నాయి. అంతర్గత అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అంతర్గత అభ్యర్థులు ప్రింట్ దరఖాస్తులను ఫిబ్రవరి 15 లోగా సింగరేణి రిక్రూట్మెంటు విభాగానికి పంపించాలని సూచింది. ఇక బయటి అభ్యర్థులు మాత్రం కేవలం ఆన్లైన్లోని దరఖాస్తులు పంపించాలని సూచించింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకే బయటి వారికి ఆన్లైన్లో దరఖాస్తులు అందజేసే అవకాశం కల్పించింది. ప్రింట్ దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో పంపించకూడదని సూచించింది. బయటి వారికి వయో పరిమితి 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు సడలింపు ఇచ్చింది. అంతర్గత అభ్యర్థులకు వయో పరిమితి నిబంధన వర్తించదు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాత పరీక్షలు త్వరలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఖాళీల భర్తీకి సింగరేణి విడుదల చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్హతల ఆధారంగా నిర్వహించే పరీక్షల్లో ఎక్కువగా మెంటల్ ఎబిలిటీతో పాటు వర్తమాన విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
కసరత్తులు షురూ.. : కొలువులు దక్కించుకోవడానికి అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. శిక్షణ కేంద్రాల్లో రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్ను సిద్ధం చేసుకుంటున్నారు. సింగరేణిలో ఉద్యోగ భద్రత ఉండటంతో కష్టపడి ఉద్యోగం దక్కించుకోవడానికి మరింత కష్టపడుతున్నారు. ఇప్పటికే సింగరేణికి బయటి వారి నుంచి పది వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్గత అభ్యర్థుల నుంచి కూడా పోటీ ఉండటంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సింగరేణి సమాయత్తమవుతోంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.