• facebook
  • whatsapp
  • telegram

సైన్యంలో సాంకేతిక పోస్టులు! 

191 ఉద్యోగాలకు ప్రకటన

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) విధానంలో టెక్‌ పోస్టులకు ఇండియన్‌ ఆర్మీ ప్రకటన వెలువరించింది. వీటికి బీటెక్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేస్తారు. వీరు లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందుకోవచ్చు! 

ఎస్‌ఎస్‌సీ టెక్‌ మెన్, ఉమెన్‌ ఖాళీలు మొత్తం 191 ఉన్నాయి. వీటిలో పురుషులకు 175, మహిళలకు 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. 

పురుషులకు సంబంధించి ఖాళీల్లో విభాగాలవారీ.. సివిల్‌లో 41, ఆర్కిటెక్చర్‌ 2, మెకానికల్‌ 20, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ 14, కంప్యూటర్‌ సైన్స్‌ 32, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 9, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ 5, టెలి కమ్యూనికేషన్‌ 3, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 8, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ 2, ఎలక్ట్రానిక్స్‌ 2, మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మైక్రోవేవ్‌ 2, ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌/ ఏవియానిక్స్‌ 5, రిమోట్‌ సెన్సింగ్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 4, ప్రొడక్షన్‌ 1, ఆటోమొబైల్‌ 3, ఇండస్ట్ర్టియల్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌ 2, బాలిస్టిక్స్‌ 1, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ 1, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్‌ 1, టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ 1, ఫుడ్‌టెక్‌ 1, అగ్రికల్చర్‌ 1, మెటలర్జికల్‌ అండ్‌ మెటలర్జీ 1, న్యూక్లియర్‌ టెక్నాలజీ 1, ఆప్టోఎలక్ట్రానిక్స్‌ 2, ఫైబర్‌ ఆప్టిక్స్‌ 2, వర్క్‌షాప్‌ టెక్నాలజీ 2, లేజర్‌ టెక్నాలజీ 2, బయోటెక్నాలజీ 1, రబ్బర్‌ టెక్నాలజీ 1, కెమికల్‌ ఇంజినీరింగ్‌ 1. చొప్పున ఉన్నాయి. 

మహిళలకు సంబంధించి సివిల్‌ 3, ఆర్కిటెక్చర్‌ 1, మెకానికల్‌ 2, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ 1, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 4, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2, ఏరోనాటికల్‌ 1 ఉన్నాయి. 

విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులు పోటీపడవచ్చు.

వయసు: ఏప్రిల్‌ 1, 2022 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1995 - ఏప్రిల్‌ 1, 2002లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం

వచ్చిన దరఖాస్తులను వారి గ్రాడ్యుయేషన్‌ (బీటెక్‌) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో నెగ్గినవారికి  వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 

శిక్షణ.. వేతనాలు

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2022 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్‌ కమిషన్‌) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం వీరు వైదొలగాల్సి ఉంటుంది. 

లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ప్రోత్సాహకాలూ పొందవచ్చు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 27 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐటీల్లో కోర్సుల డిజైన్‌

‣ డీఈఈసెట్‌కి సిద్ధమేనా?

Posted Date : 13-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌