‣ ఎంపికైతే ఉచిత విద్య, ఉద్యోగం
దేశ రక్షణ దళాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్లో చేరటం అంటే భవితను అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఛాన్స్ చేజిక్కించుకున్నట్టే! విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే చక్కని హోదాతో ఉద్యోగంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకు వీలు కల్పించే నేవీ ఎంట్రీ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి, ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.
నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీం
ఇండియన్ నేవీ విభాగం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పర్మినెంట్ కమిషన్ కింద 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీం ప్రవేశాలకు సంక్షిప్త ప్రకటన విడుదలచేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. జేఈఈ మెయిన్స్- 2018లో సాధించిన స్కోరు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారు కేరళ ఎజిమాలలోని నేవల్ అకాడెమీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ బ్రాంచిల్లో ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. నాలుగేళ్ల కోర్సు అనంతరం నేవీలోనే ఉన్నత ఉద్యోగిగా సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధులు కొనసాగించవచ్చు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. జనవరి 2, 2000 - జులై 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
జేఈఈ ర్యాంకు, వివిధ రకాల పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు, ఫిజికల్ టెస్టు, వైద్య ఆరోగ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేదీలు: 03.11.2018 నుంచి 22.11.2018 వరకు. పూర్తి వివరాలకు 03.11.2018 నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడవచ్చు.
వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/