‣ 1531 ట్రేడ్స్మెన్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల
పదో తరగతి.. ఆపై ఐటీఐ చదివి.. కేంద్రప్రభుత్వ కొలువు సాధించాలని భావిస్తున్నారా? మీ అభిలాషను నిజం చేసేదే ఈ ప్రకటన. ఆ వివరాలేమిటో.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి!
భారత నౌకాదళంలో 1531 ట్రేడ్స్మన్ (స్కిల్డ్) నియామకాల కోసం ప్రకటన వెలువడింది. వీటిలో అన్రిజర్వ్డ్కు 697, ఎస్సీలకు 215, ఎస్టీలకు 93, ఓబీసీలకు 385, ఈడబ్ల్యూఎస్లకు 141 పోస్టులను కేటాయించారు. ఈ గ్రూప్-సి, నాన్-గెజిటెడ్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
విద్యార్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష పాసైవుండాలి. ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత ట్రేడులో ఐటీఐ అప్రెంటిస్షిప్ పూర్తిచేసి ఉండాలి. లేదా ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్సుల్లో మెకానిక్ లేదా ఇతర విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అర్హులకు విద్యార్హతల విషయంలో సడలింపు ఉంటుంది.
వయసు: 18-25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక ఇలా: అర్హులైన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపికచేస్తారు. గతంలో నౌకాదళంలో అప్రెంటిస్గా పనిచేసిన అభ్యర్థులకు రాత పరీక్షలో ప్రాధాన్యమిస్తారు. ఖాళీల కంటే దరఖాస్తులు ఎక్కువగా ఉంటే తుది జాబితాను తయారుచేసి అభ్యర్థులను రాతపరీక్షకు పిలుస్తారు.
రాత పరీక్ష: ఇది మెట్రిక్యులేషన్ స్థాయిలో.. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్కు 10 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీకి 10 మార్కులు, జనరల్ ఇంగ్లిష్కు 10 మార్కులు, జనరల్ అవేర్నెస్కు 20 మార్కులు, అప్రెంటిస్ సిలబస్కు 50 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష తేదీ, సమయం, వేదిక వివరాలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి తెలియజేస్తారు. పరీక్షకు సంబంధించిన సూచనలను ఈ-ఎడ్మిట్కార్డ్తో పాటు తెలియజేస్తారు. ఈ కార్డును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు ప్రకటనలోని వివరాలను పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
వేతనం: లెవెల్-2 ప్రకారం రూ.19,900 - 63,200 చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుల గడువు: 20.03.2022
వెబ్సైట్: www.joinindiannavy.gov.in