‣ ఎస్ఐ/కానిస్టేబుల్స్: మెయిన్స్ వ్యూహం
రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో మెయిన్స్ చాలా ముఖ్యం. దీనిలో నెగ్గాలంటే మూస విధానం పనికిరాదు. వివిధ అంశాలను సమకాలీన సామాజిక అంశాలతో పోల్చి చదవాలి. ఈ తరహాలో ఇప్పటినుంచే సన్నద్ధత ఆరంభిస్తే విజయ పథంలో కొనసాగుతున్నట్టే!
ఎస్ఐ మెయిన్స్ పరీక్ష విధానం
ఎస్సై మెయిన్స్ తుది పరీక్షలో 4 పేపర్లను రాయాల్సి ఉంటుంది.
పేపర్-1: జనరల్ ఇంగ్లిష్
పేపర్-2: తెలుగు/ ఉర్దూ
పేపర్-3: అరిథ్మెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
పేపర్-4: జనరల్ స్టడీస్
పేపర్-1: జనరల్ ఇంగ్లిష్: దీనిలో ఉండే పార్ట్ - ఎ, బిలను మొత్తం 3 గంటల సమయంలో పూర్తిచేయాల్సివుంటుంది. టెన్త్ ప్రామాణిక స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు.
పార్ట్-ఎ: గ్రామర్పై 50 బహుళైచ్చిక ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు. దీనికి 45 నిమిషాలు కేటాయిస్తారు. 1/4వ వంతు నెగిటివ్ మార్కు విధానాన్ని ఈసారి ప్రవేశపెట్టారు.
పార్ట్ -బి: డిస్క్రిప్టివ్ విధానంలో 75 మార్కులకు ప్రశ్నలుంటాయి. 2.15 గంటల సమయం ఇస్తారు. ప్రెస్సీ రైటింగ్, లెటర్స్, రిపోర్ట్స్, ఎస్సై టైప్, టాపికల్ పారాగ్రాఫ్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
పేపర్ - 2: తెలుగు /ఉర్దూ: తెలుగు లేదా ఉర్దూను ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో కూడా రెండు భాగాలుంటాయి. దీన్ని కనీస అర్హత పరీక్షగా మాత్రమే నిర్వహిస్తారు. అయితే పార్ట్ ఎ,బిలలో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30% కనీస క్వాలిఫయింగ్ మార్కులు తెచ్చుకోని పక్షంలో మిగతా రెండు పేపర్లను పరిగణించరు.
పార్ట్-ఎ: తెలుగు / ఉర్దూ పదజాలం, వ్యాకరణం, లాంగ్వేజీ స్కిల్స్, కాంప్రహెన్షన్పై బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి.50 ప్రశ్నలు, 25 మార్కులు. 45 నిమిషాల సమయం ఉంటుంది. నెగెటివ్ మార్కు 1/4 వ వంతు ఉంటుంది.
పార్ట్-బి: తెలుగు/ ఉర్దూ పేపర్ను డిస్క్రిప్టివ్ విధానంలో 75 మార్కులకు ఇస్తారు. 2.15 గంటల సమయంలో ప్రెస్సీ రైటింగ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్స్, రీడింగ్, కాంప్రహెన్షన్ ప్రశ్నలు రాయాల్సివుంటుంది.
జనరల్ స్టడీస్లో
ప్రధాన పరీక్షలో పేపర్ - 3 అరిథ్మెటిక్, రీజనింగ్; పేపర్ - 4 జనరల్ స్టడీస్ అత్యంత ప్రధానమైనవి. దీనిలో పేపర్ - 4 జనరల్ స్టడీస్ది గణనీయమైన కీలక పాత్ర. దీనిలో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు...
1. కరెంట్ అఫైర్స్
2. జనరల్ సైన్స్
3. భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం
4. తెలంగాణ, భారతదేశ భూగోళం
5. భారత ఆర్థిక వ్యవస్థ
6. భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ
7. తెలంగాణ చరిత్ర - తెలంగాణ ఉద్యమం
8. మూర్తిమత్వ పరీక్ష
కానిస్టేబుల్ తుది పరీక్ష
ఎస్ఐ పరీక్ష సన్నద్ధతకు పేర్కొన్న అంశాలన్నీ కానిస్టేబుల్ తుది పరీక్ష (మెయిన్స్) లో ఉంటాయి. అదనంగా చూడాల్సినవి...
జనరల్ ఇంగ్లిష్: దీనిలో దాదాపు 20 మార్కుల వరకు ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా యాంటనిమ్స్. సిననిమ్స్, ఆర్టికల్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్, పారాజబ్లింగ్స్, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్, జనరల్ గ్రామర్పై ప్రశ్నలు అడుగుతున్నారు.
అరిథ్మెటిక్- రీజనింగ్: దీనిలో 60 ప్రశ్నల వరకు వస్తాయి.
జనరల్ నాలెడ్జ్: ఇందులో 120 ప్రశ్నల వరకు వస్తాయి. జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, చరిత్ర - తెలంగాణ ఉద్యమం, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, మూర్తిమత్వ పరీక్ష వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.