‣ 6,100 ఖాళీలకు ప్రకటన విడుదల
‣ డిగ్రీ అర్హత
కరోనా ప్రభావం ఉద్యోగాలపై తీవ్రంగా పడింది. ఎంతోమంది కొలువులు కోల్పోయారు. ఇలాంటి తరుణంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ అప్రెంటిస్ శిక్షణకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంది. ఆ సమయంలో ఏడాదిపాటు నెలకు రూ.15 వేల స్టైపెండ్ చెల్లిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 6,100 ఖాళీలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్లో 100, తెలంగాణలో 125 ఉన్నాయి.
ఇది శాశ్వత ఉద్యోగం కానప్పటికీ ఎస్బీఐ అప్రెంటిస్షిప్కు విలువ ఎక్కువే. ఏడాది తరువాత ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అనుభవం ఉపయోగపడుతుంది. బ్యాంకులు, స్టాఫ్సెలక్షన్కమిషన్ నిర్వహించే వివిధ రకాల పరీక్షలకూ ఇది ఉపయోగపడుతుంది. అప్రెంటిస్షిప్చేసిన వారికి ఉద్యోగాల ఎంపికలోనూ ప్రాధాన్యం లభిస్తుంది.
ఇదీ అర్హత
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి. అక్టోబరు 31, 2020 నాటికి వయసు 20 ఏళ్లకు తగ్గకూడదు. అలాగే 28 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక ఇలా..
అర్హులైన అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. తొలుతఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంతోపాటు స్థానిక భాషలో రాత పరీక్ష ఉంటుంది. వీటిలో ప్రతిభ చూపిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుం జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీలకు రుసుం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు జులై 26, 2021.
ఖాళీలు ఎక్కడెక్కడ? ఎన్నెన్ని?
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 225 ఖాళీల్లో ఏపీలో 100 ఉండగా.. తెలంగాణలో 125 ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళంలో-8, విజయనగరం-8, విశాఖపట్నం-7, తూర్పు గోదావరి-8, పశ్చిమ గోదావరి-8, కృష్ణా-7, గుంటూరు-7, ప్రకాశం-8, నెల్లూరు-8, చిత్తూరు-8, కడప, అనంతపురం-8, కర్నూలు-7.
తెలంగాణ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం-6, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి-3, జోగులాంబ గద్వాల, కామారెడ్డి-4, కరీంనగర్-4, ఖమ్మం-7, అసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మల్కాజ్గిరి-2, మంచిర్యాల, మెదక్, నాగర్కర్నూలు-4, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి-3, రంగారెడ్డి-6, సంగారెడ్డి-5, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి-3, వరంగల్, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి-4.
రాత పరీక్ష
ఆన్లైన్ రాతపరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాష్లలో ఉంటుంది. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్నుంచి 25, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 25, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట (60 నిమిషాలు). ఒక్కో విభాగానికి 15 నిమిషాల సమయం ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో రుణాత్మక మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు. మొదటి దశ రాత పరీక్షలో ఎంపికైనవారు తాము ఎంచుకున్న స్థానిక భాష (లోకల్ లాంగ్వేజి) సామర్థ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక వేళ అభ్యర్థులు పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే లోకల్ లాంగ్వేజి టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం తప్పనిసరిగా అర్హత సాధించాలి. ఈ పరీక్షలో మార్కులకు వెయిటేజీ ఉండదు. ఇందులో ముఖ్యంగా అభ్యర్థికి ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం, భాషను అర్థం చేసుకోవడం వచ్చా? లేదా? అని పరీక్షిస్తారు. మొదటి దశలో అర్హత సాధించి, ఇందులో అవసరమైన మెరిట్ సాధించకపోతే అభ్యర్థులు అవకాశం కోల్పోతారు.
పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ప్రిపరేషన్ ప్రణాళిక
రాత పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వాటిని సాధించడానికి గంట సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి వేగం, కచ్చితత్వం ముఖ్యం. ప్రశ్నలు క్లర్కులకు నిర్వహించే పరీక్ష స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. పాత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే అవగాహన ఏర్పడుతుంది. ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగాలి. సాధన వల్ల త్వరగా సమాధానాలను గుర్తించే సామర్థ్యం అలవడుతుంది.
జనరల్/ ఫినాన్షియల్ అవేర్నెస్: ఈ విభాగంలో కరెంట్అఫైర్స్, బ్యాంకింగ్ టర్మినాలజీ, స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్నుంచి ప్రశ్నలుంటాయి. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గత 5, 6 నెలలకు సంబంధించిన తాజా పరిణామాలపై అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మొదలైనఅంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్టాక్ మార్కెట్, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను గమనించి అధ్యయనం చేయాలి. బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థల నేపథ్యాన్ని అనుసరించి ముఖ్యమైన దినోత్సవాల వివరాలనూ తెలుసుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో అభ్యర్థి సాధారణ ఆంగ్లభాష పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. రీడింగ్కాంప్రహెన్షన్, క్లోజ్టెస్ట్, సెంటెన్స్అరేంజ్మెంట్, సెంటెన్స్కరెక్షన్, జంబుల్డ్సెంటెన్స్అంశాల నుంచి 15-18 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా క్లర్క్ప్రిలిమినరీ మోడల్పరీక్షలు సాధనలో బాగా ఉపయోగపడతాయి. గ్రామర్రూల్స్, ఒకాబులరీ, యాంటనిమ్స్, సిననిమ్స్మీద దృష్టిపెట్టాలి. గ్రామర్పై కొంత సాధారణ పట్టు సాధిస్తే ఈ ప్రశ్నలకు జవాబులను తేలిగ్గా గుర్తించవచ్చు.
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్: అభ్యర్థుల తార్కిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. లాజికల్ రీజనింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్, డైరెక్షన్, ఆల్ఫాబెట్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, కోడెడ్ ఇన్-ఇక్వాలిటీస్, పజిల్స్, సిలాజిజమ్, ఇన్పుట్అవుట్పుట్, రక్తసంబంధాలు, సీటింగ్అరేంజ్మెంట్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఆ విభాగాల ప్రశ్నలను అభ్యర్థులు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో చాప్టర్నుంచి 200-300 వరకూ ప్రశ్నలు సాధన చేయడం మంచిది. స్టేట్మెంట్ సంబంధప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవే అనిపించేలా ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంగ్లిష్ పరిజ్ఞానం పెంచుకుంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: న్యూమరికల్ఎబిలిటీ నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ విభాగంలో సిప్లిఫికేషన్, నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాలం-పని, కాలం-దూరం, భాగస్వామ్యం, లాభనష్టాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అరిథ్ మెటిక్ టాపిక్ లపై పట్టు సాధిస్తే వేగంగా జవాబులను గుర్తించడానికి వీలవుతుంది. ముఖ్యంగా వయసులు, చక్రవడ్డీ-బారువడ్డీ, శాతాలు, నిష్పత్తి, లాభనష్టాలు, కాలం-పని-దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు- ఘనపరిమాణాలు, పర్సంటేజెస్, యావరేజ్, రేషియో-ప్రపోర్షన్లపై మంచి అవగాహన వుండాలి. కాలుక్యులేషన్స్ వేగంగా చేయగలగాలి. ఈ విభాగానికి ప్రాక్టీస్ బాగా అవసరం.
వెబ్సైట్: https://sbi.co.in/