• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APRJC CET: ఏపీ ఆర్‌జేసీ సెట్‌(మైనార్టీ)-2023 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్​(ఆంగ్ల/ ఉర్దూ మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీ ఆర్‌జేసీ సెట్‌(మైనార్టీ)-2023 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలు(బాలురు, బాలికలు) ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 7 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు..

ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(మైనార్టీ)-2023

గ్రూప్స్‌: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ.

మొత్తం సీట్ల సంఖ్య: 345.

అర్హత: 2023 ఏప్రిల్‌లో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: లేదు.

ముఖ్య తేదీలు... 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం(మొదటి జాబితా): 15.05.2023.

దరఖాస్తుకు చివరి తేదీ: 07.06.2023.

ఎంపిక జాబితా వెల్లడి(మొదటి): 08.06.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం(రెండో జాబితా): 10.06.2023.

దరఖాస్తుకు చివరి తేదీ: 19.06.2023

ఎంపిక జాబితా వెల్లడి(రెండవది): 20.06.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం(మూడో జాబితా):: 22.06.2023

దరఖాస్తుకు చివరి తేదీ: 28.06.2023

ఎంపిక జాబితా వెల్లడి(మూడోది): 30.06.2023.

ప్రవేశాల ముగింపు: 30.06.2023
 

మరింత సమాచారం... మీ కోసం!

నిప్ట్‌-హైదరాబాద్‌లో 11 గ్రూప్‌ సీ పోస్టులు

బెల్‌లో ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టులు

ఏఐఏఎస్‌ఎల్‌-వారణాసిలో 36 పోస్టులు

తెలంగాణ గురుకులాల్లో 134 ఆర్ట్‌, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 15-04-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :