• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIMCET: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌)-2023 

దేశంలో సాంకేతిక విద్యకు ఐఐటీల తర్వాత ఎన్‌ఐటీలదే పేరు! వీటిలో చాలా సంస్థలు ఎంసీఏ కోర్సునూ అందిస్తున్నాయి. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇందుకోసం ఏటా జాతీయ స్థాయిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌) నిర్వహిస్తున్నాయి. ఇటీవలే నిమ్‌సెట్‌-2023 ప్రకటన వెలువడింది. ఈ ఏడాది నిమ్‌సెట్‌ను నిట్, జంషెడ్‌పూర్‌ నిర్వహిస్తోంది. 

పరీక్ష వివరాలు...

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌)-2023

తొమ్మిది నిట్‌ల్లో ప్రవేశం: నిమ్‌సెట్‌తో 9 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో వరంగల్‌ ఒకటి. దేశీయ, విదేశీ ఐటీ సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసీఏ సిలబస్‌ను రూపొందిస్తారు. అన్ని సంస్థలూ ఉమ్మడి కరిక్యులమ్‌ అనుసరిస్తాయి. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్‌ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. 

నిట్‌లలో సీట్ల వివరాలు: అగర్తలా- 30, అలహాబాద్‌ - 116, భోపాల్‌ - 115, జంషెడ్‌పూర్‌ - 115, కురుక్షేత్ర - 96 (వీటిలో 32 సెల్ఫ్‌ ఫైనాన్స్‌), రాయ్‌పూర్‌ - 110, సూరత్కల్‌ - 58, తిరుచురాపల్లి - 115, వరంగల్‌ - 58.

మొత్తం సీట్ల సంఖ్య: 813.

అర్హత: మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మ్యాథమేటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు, ఎనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 40, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ నుంచి 20, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 10 ప్రశ్నలడుగుతారు. మొత్తం 1000 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో ఉంటుంది. 

సీట్ల కేటాయింపు: మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను కేటాయిస్తారు. 

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మార్చి 5 నుంచి ఏప్రిల్‌ 10 వరకు.

పరీక్ష తేది: జూన్‌ 11.

ఫలితాల ప్రకటన: జూన్‌ 16.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 04-03-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :