• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AS ICET: ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023

ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఐసెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్‌కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్య‌ర్థులు మార్చి 20 నుంచి ఏప్రిల్‌19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష వివరాలు:

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ ఐసెట్‌)

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)/ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జె్క్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తు రుసుము: రూ.650 (బీసీలకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.550).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 20న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, ఏప్రిల్‌ 19తో ముగుస్తుంది. 

పరీక్షల నిర్వహణ: మే 24, 25 తేదీల్లో ప్రవేశపరీక్షలు జరుగుతాయి. 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేటి స్కోరుకు ఇదిగో రూటు!

‣ డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

‣ మాన‌సికంగా దృఢంగా ఉన్నారా?

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 17-03-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :