• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IDBI JAM Jobs: ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు 

ఐడీబీఐ 600 అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీ ప్రక్రియ చేప‌ట్టింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ వెలువడింది. మ‌ణిపాల్ (బెంగ‌ళూరు), నిట్టే (గ్రేట‌ర్ నోయిడా) విద్యాసంస్థలతో క‌లిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (6 నెలలు త‌ర‌గ‌తి పాఠాలు, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలు ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌) పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది. 

ప్రకటన వివరాలు...

* జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ): 600 పోస్టులు (యూఆర్‌- 243, ఎస్సీ- 90, ఎస్టీ- 45, ఈడబ్ల్యూఎస్‌- 60, ఓబీసీ- 162)

అర్హత‌: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాల‌యం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వ‌య‌సు 31/08/2023 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఇస్తారు. 

ఎంపిక ప్రక్రియ: అర్హులైన అభ్యర్థుల‌కు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ క‌న‌బ‌ర్చిన వారు ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూల‌కు అర్హత సాధిస్తారు. అందులో ప్రతిభ, ధ్రువపత్రాల పరీశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక‌లు చేప‌డ‌తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌. 

రాత ప‌రీక్ష: ప‌రీక్షను మొత్తం 200 మార్కుల‌కు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్ (60 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్ (60 ప్రశ్నలు, 60 మార్కులు) అంశాల‌ నుంచి మొత్తం 200 ప్రశ్నలు వ‌స్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. ప‌రీక్షలో రుణాత్మక మార్కులుంటాయి.  తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. 

శిక్షణ, ఫీజు వివ‌రాలు: ఎంపికైన అభ్యర్థుల‌ను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సులో చేరుస్తారు. ఆ స‌మ‌యంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా విడ‌త‌ల వారీగా ఫీజు క‌ట్టే వెసులుబాటు ఉంది. అర్హుత గ‌ల అభ్యర్థుల‌కు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేట‌ప్పుడు అభ్యర్థులు మూడేళ్లు స‌ర్వీస్ బాండ్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 

జీతభ‌త్యాలు: ఎంపికైన అభ్యర్థుల‌కు శిక్షణ కాలం (6 నెల‌లు)లో నెల‌కు రూ.5000 ఇస్తారు. ఇంట‌ర్న్‌షిప్ (2 నెల‌లు) స‌మ‌యంలో నెల‌కు రూ.15 వేలు చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన‌వారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వ‌ర‌కు వార్షిక వేతనం అందుతుంది. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-09-2023.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30.09.2023.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30.09.2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 20-10-2023.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

‣ రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 15-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :