• facebook
  • whatsapp
  • telegram

ఐరోపా వారి రాక

1. కాన్‌స్టంట్‌నోపుల్‌ను తురుష్కులు ఏ సంవత్సరంలో ఆక్రమించారు?
: క్రీ.శ.1453

 

2. నీలి నీటి విధానాన్ని అనుసరించిన పోర్చుగీసు వైస్రాయ్ ఎవరు?
జ: ఫ్రాన్సిస్ డి ఆల్మైడా

 

3. భారతదేశంలో డచ్చివారి మొదటి వర్తక స్థావరం ఏది?
జ: మచిలీపట్నం

 

4. భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి రాజధాని ఏది?
జ: కొచ్చిన్

 

5. భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసు వారు భారతీయ స్త్రీలను వివాహం చేసుకునేలా ప్రోత్సహించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
జ: అల్ఫోన్సో డి అల్బూకర్క్

 

6. జవిలియం హాకిన్స్‌ను జహంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపించిన ఇంగ్లండ్ పాలకుడు ఎవరు?
జ:మొదటి జేమ్స్

 

7. 1542లో గోవాను సందర్శించిన ప్రసిద్ధ క్రైస్తవ మతప్రచారకుడు ఎవరు?
జ: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్

 

8. ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజప్రతినిధి నుంచి మద్రాసును ఏ సంవత్సరంలో పొందాడు?
జ: క్రీ.శ.1639

 

9. ఆంగ్లేయులు సెయింట్ డేవిడ్ కోటను నిర్మించిన ప్రదేశం ఏది?
జ: కడలూరు

 

10. కిందివాటిలో ఫ్రెంచి వర్తక స్థావరం కానిది?
ఎ) సూరత్ బి) యానాం సి) చంద్రనగర్ డి) బొంబాయి
జ: డి (బొంబాయి)

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌