1. కాన్స్టంట్నోపుల్ను తురుష్కులు ఏ సంవత్సరంలో ఆక్రమించారు?
జ: క్రీ.శ.1453
2. నీలి నీటి విధానాన్ని అనుసరించిన పోర్చుగీసు వైస్రాయ్ ఎవరు?
జ: ఫ్రాన్సిస్ డి ఆల్మైడా
3. భారతదేశంలో డచ్చివారి మొదటి వర్తక స్థావరం ఏది?
జ: మచిలీపట్నం
4. భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి రాజధాని ఏది?
జ: కొచ్చిన్
5. భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసు వారు భారతీయ స్త్రీలను వివాహం చేసుకునేలా ప్రోత్సహించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
జ: అల్ఫోన్సో డి అల్బూకర్క్
6. జవిలియం హాకిన్స్ను జహంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపించిన ఇంగ్లండ్ పాలకుడు ఎవరు?
జ:మొదటి జేమ్స్
7. 1542లో గోవాను సందర్శించిన ప్రసిద్ధ క్రైస్తవ మతప్రచారకుడు ఎవరు?
జ: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్
8. ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజప్రతినిధి నుంచి మద్రాసును ఏ సంవత్సరంలో పొందాడు?
జ: క్రీ.శ.1639
9. ఆంగ్లేయులు సెయింట్ డేవిడ్ కోటను నిర్మించిన ప్రదేశం ఏది?
జ: కడలూరు
10. కిందివాటిలో ఫ్రెంచి వర్తక స్థావరం కానిది?
ఎ) సూరత్ బి) యానాం సి) చంద్రనగర్ డి) బొంబాయి
జ: డి (బొంబాయి)