* మే 26న పరీక్ష.. జూన్ 9న ఫలితాలు
* 2.5 లక్షల మందికి అర్హత
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) గాను బీటెక్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్లో నిర్ణీత కటాఫ్ పర్సంటైల్ సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష మే 26వ తేదీన నిర్వహించనున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ మద్రాస్.. జేఈఈ అడ్వాన్స్డ్-2024 రిజిస్ట్రేషన్ లింక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్ష రాసేందుకు 2.5 లక్షల మందికి అర్హత ఉంది.
జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ లింక్
జేఈఈ అడ్వాన్స్డ్-2024 నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి