తెలంగాణలో కొత్తగా పాలీసెట్ ఆధారంగానే అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ), దాని అనుబంధ కళాశాలల్లోని సీట్లను ఇకనుంచి పాలీసెట్ ప్రాతిపదికగా కేటాయిస్తారు. ఈమేరకు పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పాత పద్ధతినే పాటిస్తోంది. పాలిటెక్నిక్ ర్యాంకును అనుసరించి యథావిధిగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లు ఇస్తారు. అగ్రికల్చర్ డిప్లొమా సీట్లను మాత్రం విడిగా మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.
తెలంగాణలో అగ్రి డిప్లొమాలకూ పాలీసెట్
Posted Date : 28-06-2021