• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - కాలుష్య కారకాలు

           పర్యావరణం సరళమైంది, సంక్లిష్టమైంది. అది శుద్ధంగా ఉన్నంతవరకు సరళంగా ఉంటుంది. కానీ కొన్ని అనూహ్య మార్పులు సంభవించినప్పుడు సంక్లిష్టంగా మారుతుంది. ఇలా పర్యావరణంలో వివిధ మార్పులు సంభవించడాన్నే కాలుష్యం అంటారు.


           కాలుష్య కారకాలు భౌతిక ఏజెంట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణం నుంచి గ్రహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు వచ్చినప్పుడు పర్యావరణం కలుషితమవుతుంది. ఇలా పర్యావరణానికి ఉన్న స్వాభావిక లక్షణాలైన భౌతిక, రసాయనిక అంశాల్లో పరిణామాలు ఏర్పడటాన్నే కాలుష్య కారకాలు అంటారు. ఈ కారకాల్లో ప్రధానంగా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం; వాయు, ఘన వ్యర్థ పదార్థాలు, థర్మల్, రేడియో ఆక్టల్‌ కాలుష్యాలు ప్రధానమైనవి.


జల కాలుష్యం: 
           జీవరాశులకు గాలి, ఎండ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. భూ ఉపరితలంపై 71 శాతం నీరు ఆవరించి జీవరాశులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. మానవుడి శరీరంలో 90% నీరు ఉంటుంది. ఆక్సిజన్, హైడ్రోజన్‌ వాయువుల 1 : 2 నిష్పత్తి సమ్మేళనాల ద్వారా ఏర్పడిన ద్రవపదార్థమే నీరు. ఇది జీవజాల సహజ ప్రధాన వనరు. కాబట్టి నీటిని అత్యంత విలువైన వనరుగా పరిగణిస్తారు. నీరు లేకపోతే భూమిపై జీవం ఉండదు.

ఉదా: 1986 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ‘గంగా యాక్షన్‌ ప్రణాళిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2000 మార్చిలో ఉపసంహరించారు. మళ్లీ ఈ నది 1760 కి.మీ. పొడవున కలుషితమవడంతో 2014 డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర జలవనరుల శాఖ నిర్వహణలో గంగానది కాలుష్యాన్ని తొలగించడానికి ‘నమామి గంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ప్రధాన కారణాలు:
* మానవ వ్యర్థాలు మేటవేయడం, గృహాల్లోని వ్యర్థాలు
* పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక క్రిమి సంహారకాలు
* విషపూరితమైన లోహ మూలకాలు, మందులు, వ్యర్థాలు మొదలైన వాటివల్ల నీరు కలుషితమవుతుంది.
 

ప్రభావాలు:
* జల కాలుష్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది.
* స్వచ్ఛమైన నీరు అనేక రకాల వ్యర్థాల వల్ల మురుగు నీరుగా మారి నీటి స్వచ్ఛతను క్షీణింపజేస్తుంది.
ఉదా: నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్‌ బిళ్లలను వినియోగించాలి.

* నీటిలో అనేక వ్యర్థాలు కలవడం వల్ల వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. నీటి కాలుష్యం వల్ల ప్రధానంగా కలరా, కామెర్లు (జాండీస్‌), డిఫ్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.
ఉదా: డయేరియా వ్యాపించినప్పుడు వేడి చేసిన నీరు, టీ డికాషన్, లేత కొబ్బరి నీళ్లను తాగాలి.
* చమురు శుద్ధి ద్వారా వచ్చే వ్యర్థాలు, ఇతర ఉత్పత్తులు సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు కలుషితమవుతుంది.
ఉదా: సముద్రాల్లోని వ్యర్థాల వల్ల చేపల్లో హైడ్రోకార్బన్ల సంఖ్య పెరిగి క్యాన్సర్‌ కారక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
* నదులు, సముద్రాల్లో అనేక కలుషితాల ద్వారా ఆక్సిజన్‌ తగ్గి వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు
దారితీస్తుంది. ఈ మార్పు జలచరాల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఉదా: మానవ జీవ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల నత్రజని శాతం పెరిగి, ఆక్సిజన్‌ తగ్గి జీవులు మరణిస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుంది.
* నీటి కాలుష్యాన్ని బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పారామీటర్‌ ద్వారా అంచనా వేస్తారు.
 

ధ్వని కాలుష్యం:


         ప్రస్తుతం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ వేగంగా జరుగుతుండటంతో ధ్వని కాలుష్య పరిమాణం పెరుగుతుంది.
          తీవ్రమైన శబ్దాన్నే ధ్వని అంటారు. శబ్దం అనేది శక్తికి ఒక రూపం. ఎలాంటి కంపనమైనా శబ్దాన్ని సృష్టిస్తుంది. శబ్దం వాయు, ఘన, ద్రవ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు శబ్దాల స్థాయి తీవ్రంగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. పీడన స్థాయిని బట్టి ధ్వనిని యూనిట్‌లలో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబుల్స్‌లో (db) సూచిస్తారు.

* పీడనాన్ని బట్టి ధ్వనిని రెండు రకాలుగా వర్గీకరించారు.
            1) శబ్ద తీవ్రత                   2) శబ్ద స్థాయి
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పగటి సమయంలో 45 db, రాత్రివేళలో 35 db; సగటున 50 - 90 డెసిబుల్స్‌ మధ్య ఉండే శబ్దాన్ని ధ్వనిగా పేర్కొంది. గరిష్ఠంగా 120 డెసిబుల్స్‌ ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు. 120 డెసిబుల్స్‌ పీడనం కంటే ఎక్కువగా ఉండే ధ్వనులు పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి.
 

జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (NCPB) ప్రకారం వివిధ ప్రాంతాల్లో ఉండాల్సిన శబ్ద స్థాయి:  
1) పారిశ్రామిక ప్రాంతాలు : 65 - 75 db
2) వాణిజ్య ప్రాంతాలు : 50 - 60 db
3) నివాస ప్రాంతాలు : 40 - 50 db
4) ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నిశ్శబ్ద ప్రాంతాలు : 30 - 40 db
ఉదా: దిల్లీలో శబ్ద కాలుష్యానికి గురవుతున్న 60 ఏళ్ల వయసున్న వారిని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని ‘వృత్తిపరమైన, పర్యావరణ ఆరోగ్య కేంద్రం’ అధ్యయనం చేసింది. వారు వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ వయసు కంటే 15 ఏళ్లు ముందుగానే వినికిడి సమస్య బారిన పడుతున్నట్లు వెల్లడించింది. అంటే సైన్స్‌ ప్రకారం 75 ఏళ్లకు రావాల్సిన వినికిడి సమస్యలు 60 ఏళ్లకే వస్తున్నాయి.

కారణాలు:
* లౌడ్‌ స్పీకర్లు, సైరన్ల వాడకం పెరగడం
* నగరాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక యంత్రాల ధ్వనులు
* థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు; గనులు, ఖ్వారీల బ్లాస్టింగ్‌
* విమానాశ్రయాలు, వివిధ వాహనాల ద్వారా వెలువడుతున్న ధ్వని
 

ప్రభావాలు:
* ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్ఛతను, వివిధ ప్రాణులను ప్రభావితం చేస్తుంది.
* మానవుల శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది.
ఉదా: నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేమి, జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు లాంటివి సంభవిస్తాయి.
* నాడులు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం ధ్వని కాలుష్యం.
ఉదా: రక్తంలో కొవ్వు శాతం పెరగడం, గర్భస్థ శిశువులకు వచ్చే ప్రమాదాలు.
* తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
* ధ్వని కాలుష్యం వల్ల నరాల బలహీనత, హైపర్‌టెన్షన్, మైగ్రేన్, ఒత్తిడి పెరుగుతాయి.
ఉదా: కార్డియో వ్యాస్కులర్, జీర్ణవ్యవస్థ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది.

కిరణధార్మిక (న్యూక్లియర్‌) కాలుష్యం:

          అణు విద్యుత్, అణు సంబంధిత పరిశ్రమలు, అధునాతన వైద్య పరికరాల నుంచి వెలువడే కిరణధార్మిక వ్యర్థాలను రేడియో ధార్మిక కాలుష్యం అంటారు. థోరియం, యురేనియం, ఆక్టీనియం, రేడియం, గాలి, నీరు భూమిపై నిక్షిప్తమై ఉంటాయి. ఈ ఖనిజాలు న్యూక్లియర్‌ రియాక్టర్లలో పరమాణు కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసి విద్యుత్, కిరణధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
ఉదా: ఒక అణుబాంబు పేలితే 50% శక్తి, 33% ఉష్ణం, 17% కిరణధార్మిక దుమ్ము వెలువడుతుంది.
 

కారణాలు:
* అణు విద్యుత్‌ శక్తి కర్మాగారాలు
* అణు సంబంధిత పరిశ్రమలు
* వైద్య పరికరాలుగా ఉపయోగించే ఎమ్‌ఆర్‌ఐ సీటీ స్కాన్, ఎక్స్‌రే, రేడియోఆక్టివ్‌లు
 

ప్రభావాలు:

           పర్యావరణం సరళమైంది, సంక్లిష్టమైంది. అది శుద్ధంగా ఉన్నంతవరకు సరళంగా ఉంటుంది. కానీ కొన్ని అనూహ్య మార్పులు సంభవించినప్పుడు సంక్లిష్టంగా మారుతుంది. ఇలా పర్యావరణంలో వివిధ మార్పులు సంభవించడాన్నే కాలుష్యం అంటారు.


           కాలుష్య కారకాలు భౌతిక ఏజెంట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణం నుంచి గ్రహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు వచ్చినప్పుడు పర్యావరణం కలుషితమవుతుంది. ఇలా పర్యావరణానికి ఉన్న స్వాభావిక లక్షణాలైన భౌతిక, రసాయనిక అంశాల్లో పరిణామాలు ఏర్పడటాన్నే కాలుష్య కారకాలు అంటారు. ఈ కారకాల్లో ప్రధానంగా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం; వాయు, ఘన వ్యర్థ పదార్థాలు, థర్మల్, రేడియో ఆక్టల్‌ కాలుష్యాలు ప్రధానమైనవి.


జల కాలుష్యం: 
           జీవరాశులకు గాలి, ఎండ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. భూ ఉపరితలంపై 71 శాతం నీరు ఆవరించి జీవరాశులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. మానవుడి శరీరంలో 90% నీరు ఉంటుంది. ఆక్సిజన్, హైడ్రోజన్‌ వాయువుల 1 : 2 నిష్పత్తి సమ్మేళనాల ద్వారా ఏర్పడిన ద్రవపదార్థమే నీరు. ఇది జీవజాల సహజ ప్రధాన వనరు. కాబట్టి నీటిని అత్యంత విలువైన వనరుగా పరిగణిస్తారు. నీరు లేకపోతే భూమిపై జీవం ఉండదు.

ఉదా: 1986 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ‘గంగా యాక్షన్‌ ప్రణాళిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2000 మార్చిలో ఉపసంహరించారు. మళ్లీ ఈ నది 1760 కి.మీ. పొడవున కలుషితమవడంతో 2014 డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర జలవనరుల శాఖ నిర్వహణలో గంగానది కాలుష్యాన్ని తొలగించడానికి ‘నమామి గంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ప్రధాన కారణాలు:
* మానవ వ్యర్థాలు మేటవేయడం, గృహాల్లోని వ్యర్థాలు
* పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక క్రిమి సంహారకాలు
* విషపూరితమైన లోహ మూలకాలు, మందులు, వ్యర్థాలు మొదలైన వాటివల్ల నీరు కలుషితమవుతుంది.
 

ప్రభావాలు:
* జల కాలుష్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది.
* స్వచ్ఛమైన నీరు అనేక రకాల వ్యర్థాల వల్ల మురుగు నీరుగా మారి నీటి స్వచ్ఛతను క్షీణింపజేస్తుంది.
ఉదా: నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్‌ బిళ్లలను వినియోగించాలి.

* నీటిలో అనేక వ్యర్థాలు కలవడం వల్ల వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. నీటి కాలుష్యం వల్ల ప్రధానంగా కలరా, కామెర్లు (జాండీస్‌), డిఫ్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.
ఉదా: డయేరియా వ్యాపించినప్పుడు వేడి చేసిన నీరు, టీ డికాషన్, లేత కొబ్బరి నీళ్లను తాగాలి.
* చమురు శుద్ధి ద్వారా వచ్చే వ్యర్థాలు, ఇతర ఉత్పత్తులు సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు కలుషితమవుతుంది.
ఉదా: సముద్రాల్లోని వ్యర్థాల వల్ల చేపల్లో హైడ్రోకార్బన్ల సంఖ్య పెరిగి క్యాన్సర్‌ కారక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
* నదులు, సముద్రాల్లో అనేక కలుషితాల ద్వారా ఆక్సిజన్‌ తగ్గి వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు
దారితీస్తుంది. ఈ మార్పు జలచరాల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
ఉదా: మానవ జీవ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల నత్రజని శాతం పెరిగి, ఆక్సిజన్‌ తగ్గి జీవులు మరణిస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుంది.
* నీటి కాలుష్యాన్ని బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పారామీటర్‌ ద్వారా అంచనా వేస్తారు.
 

ధ్వని కాలుష్యం:


         ప్రస్తుతం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ వేగంగా జరుగుతుండటంతో ధ్వని కాలుష్య పరిమాణం పెరుగుతుంది.
          తీవ్రమైన శబ్దాన్నే ధ్వని అంటారు. శబ్దం అనేది శక్తికి ఒక రూపం. ఎలాంటి కంపనమైనా శబ్దాన్ని సృష్టిస్తుంది. శబ్దం వాయు, ఘన, ద్రవ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు శబ్దాల స్థాయి తీవ్రంగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. పీడన స్థాయిని బట్టి ధ్వనిని యూనిట్‌లలో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబుల్స్‌లో (db) సూచిస్తారు.

* పీడనాన్ని బట్టి ధ్వనిని రెండు రకాలుగా వర్గీకరించారు.
            1) శబ్ద తీవ్రత                   2) శబ్ద స్థాయి
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పగటి సమయంలో 45 db, రాత్రివేళలో 35 db; సగటున 50 - 90 డెసిబుల్స్‌ మధ్య ఉండే శబ్దాన్ని ధ్వనిగా పేర్కొంది. గరిష్ఠంగా 120 డెసిబుల్స్‌ ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు. 120 డెసిబుల్స్‌ పీడనం కంటే ఎక్కువగా ఉండే ధ్వనులు పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి.
 

జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (NCPB) ప్రకారం వివిధ ప్రాంతాల్లో ఉండాల్సిన శబ్ద స్థాయి:  
1) పారిశ్రామిక ప్రాంతాలు : 65 - 75 db
2) వాణిజ్య ప్రాంతాలు : 50 - 60 db
3) నివాస ప్రాంతాలు : 40 - 50 db
4) ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నిశ్శబ్ద ప్రాంతాలు : 30 - 40 db
ఉదా: దిల్లీలో శబ్ద కాలుష్యానికి గురవుతున్న 60 ఏళ్ల వయసున్న వారిని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని ‘వృత్తిపరమైన, పర్యావరణ ఆరోగ్య కేంద్రం’ అధ్యయనం చేసింది. వారు వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ వయసు కంటే 15 ఏళ్లు ముందుగానే వినికిడి సమస్య బారిన పడుతున్నట్లు వెల్లడించింది. అంటే సైన్స్‌ ప్రకారం 75 ఏళ్లకు రావాల్సిన వినికిడి సమస్యలు 60 ఏళ్లకే వస్తున్నాయి.

కారణాలు:
* లౌడ్‌ స్పీకర్లు, సైరన్ల వాడకం పెరగడం
* నగరాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక యంత్రాల ధ్వనులు
* థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు; గనులు, ఖ్వారీల బ్లాస్టింగ్‌
* విమానాశ్రయాలు, వివిధ వాహనాల ద్వారా వెలువడుతున్న ధ్వని
 

ప్రభావాలు:
* ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్ఛతను, వివిధ ప్రాణులను ప్రభావితం చేస్తుంది.
* మానవుల శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది.
ఉదా: నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేమి, జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు లాంటివి సంభవిస్తాయి.
* నాడులు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం ధ్వని కాలుష్యం.
ఉదా: రక్తంలో కొవ్వు శాతం పెరగడం, గర్భస్థ శిశువులకు వచ్చే ప్రమాదాలు.
* తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
* ధ్వని కాలుష్యం వల్ల నరాల బలహీనత, హైపర్‌టెన్షన్, మైగ్రేన్, ఒత్తిడి పెరుగుతాయి.
ఉదా: కార్డియో వ్యాస్కులర్, జీర్ణవ్యవస్థ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది.

కిరణధార్మిక (న్యూక్లియర్‌) కాలుష్యం:

          అణు విద్యుత్, అణు సంబంధిత పరిశ్రమలు, అధునాతన వైద్య పరికరాల నుంచి వెలువడే కిరణధార్మిక వ్యర్థాలను రేడియో ధార్మిక కాలుష్యం అంటారు. థోరియం, యురేనియం, ఆక్టీనియం, రేడియం, గాలి, నీరు భూమిపై నిక్షిప్తమై ఉంటాయి. ఈ ఖనిజాలు న్యూక్లియర్‌ రియాక్టర్లలో పరమాణు కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసి విద్యుత్, కిరణధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
ఉదా: ఒక అణుబాంబు పేలితే 50% శక్తి, 33% ఉష్ణం, 17% కిరణధార్మిక దుమ్ము వెలువడుతుంది.
 

కారణాలు:
* అణు విద్యుత్‌ శక్తి కర్మాగారాలు
* అణు సంబంధిత పరిశ్రమలు
* వైద్య పరికరాలుగా ఉపయోగించే ఎమ్‌ఆర్‌ఐ సీటీ స్కాన్, ఎక్స్‌రే, రేడియోఆక్టివ్‌లు
 

ప్రభావాలు:
* శరీరం అలసిపోయి కండరాలు దెబ్బతినడం, లుకేమియా, అకాల వార్థక్యం, ఆయువు తగ్గడం, అంగవైకల్యం వస్తాయి.

ఉదా: 1986, ఏప్రిల్‌ 26న రష్యాలోని ఉక్రెయిన్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణు దుర్ఘటన వల్ల ఏర్పడిన రేడియేషన్‌ ప్రభావానికి 50% మంది ప్రజలు మరణించారు. కొంతమంది వెంట్రుకలు ఊడిపోయి, క్రోమోజోమ్‌లు దెబ్బతిని, అనేక క్యాన్సర్‌ వ్యాధుల బారినపడ్డారు.


* శరీరం అలసిపోయి కండరాలు దెబ్బతినడం, లుకేమియా, అకాల వార్థక్యం, ఆయువు తగ్గడం, అంగవైకల్యం వస్తాయి.

ఉదా: 1986, ఏప్రిల్‌ 26న రష్యాలోని ఉక్రెయిన్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణు దుర్ఘటన వల్ల ఏర్పడిన రేడియేషన్‌ ప్రభావానికి 50% మంది ప్రజలు మరణించారు. కొంతమంది వెంట్రుకలు ఊడిపోయి, క్రోమోజోమ్‌లు దెబ్బతిని, అనేక క్యాన్సర్‌ వ్యాధుల బారినపడ్డారు.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌