మాదిరి ప్రశ్నలు
1. ఒక దేశం ఆదాయ సమానత్వాన్ని సాధించినప్పుడు అదృశ్యమయ్యే పేదరికం ఏది?
ఎ) నిరపేక్ష పేదరికం బి) సాపేక్ష పేదరికం సి) పాక్షిక పేదరికం డి) నిరపేక్ష - సాపేక్ష పేదరికం
జ: (బి)
2. 'పావర్టీ ఇన్ ఇండియా' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ బి) మిన్హాస్ సి) దండేకర్, రథ్ డి) బర్దన్
జ: (సి)
3. మన దేశంలో పేదరికపు అంచనాలను అధికారికంగా ప్రకటించే సంస్థ ఏది?
ఎ) ప్రణాళిక సంఘం బి) నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ సి) ప్రణాళిక మంత్రిత్వ శాఖ డి) కేంద్ర గణాంక సంస్థ
జ: (ఎ)
4. మొత్తం జనాభాలో పేద ప్రజల శాతం తెలిపే పేదరిక లెక్కింపు కొలమానం?
ఎ) పేదరిక వ్యత్యాస సూచి బి) సేన్ పేదరిక సూచి సి) బహుపార్శ్వ పేదరిక సూచి డి) తలల లెక్కింపు పద్ధతి
జ: (డి)
5. పేదరికాన్ని అంచనా వేసే పద్ధతిని సమీక్షించడానికి 2005 డిసెంబరులో వేసిన కమిటీ ఏది?
ఎ) లక్డావాలా బి) తెందూల్కర్ సి) రంగరాజన్ డి) అహ్లూవాలియా
జ: (బి)
6. ఎన్ఎస్ఎస్వో (68వ రౌండ్) ప్రకారం భారతదేశ మొత్తం జనాభాలో పేదరికంలో ఉన్న జనాభా శాతం ఎంత?
ఎ) 26.1 బి) 22.9 సి) 21.9 డి) 20.9
జ: (సి)
7. 'ట్రికిల్ డౌన్ సిద్ధాంతం' ప్రకారం ఒక దేశంలో వృధ్ధి జరుగుతున్నపుడు పేదరికం ఏ విధంగా ఉంటుంది?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది సి) స్థిరంగా ఉంటుంది డి) సంబంధం లేదు
జ: (బి)
8. 'గరీబీ హటావో' అనే నినాదం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ప్రధాని ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ బి) లాల్బహదూర్ శాస్త్రి సి) చరణ్ సింగ్ డి) ఇందిరాగాంధీ
జ: (డి)
9. పేదరిక నిర్మూలకు 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశ పెట్టారు?
ఎ) 3వ ప్రణాళిక బి) 4వ ప్రణాళిక సి) 5వ ప్రణాళిక డి) 6వ ప్రణాళిక
జ: (సి)
10. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 10వ ప్రణాళికలో ప్రారంభించిన పథకం ఏది?
ఎ) జాతీయ పనికి ఆహార పథకం బి) సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన
సి) ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డి) భారత్ నిర్మాణ్ యోజన
జ: (డి)
11. కిందివాటిలో పేదరికానికి కారణం కానిది ఏది?
ఎ) జనాభా పెరుగుదల బి) మూలధన కొరత సి) ఆర్థిక శక్తి వికేంద్రీకరణ డి) ద్రవ్యోల్భణ పెరుగుదల
జ: (సి)
12. ఇటీవల ప్రవేశపెట్టిన 'జన్ధన్ యోజన' ఉద్దేశం ఏమిటి?
ఎ) గ్రామీణ పేదల ఉత్పాదకతను పెంచడం
బి) జనాభాను శీఘ్రంగా నియంత్రించడం
సి) గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచడం
డి) ఆర్థికంగా సమ్మిళితం
జ: (డి)
13. తెందూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం పేదలున్న రాష్ట్రం ఏది?
ఎ) ఒడిశా బి) బిహార్ సి) రాజస్థాన్ డి) ఉత్తర్ప్రదేశ్
జ: (ఎ)
14. భారతదేశంపై ప్రత్యేక దృష్టితో పేదరికం గురించి అధ్యయనాలను చేసినందుకు ఈ ఏటి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఆంగస్ డీటన్ ఏ దేశానికి చెందినవారు?
ఎ) అమెరికా బి) జపాన్ సి) ఫ్రాన్స్ డి) స్కాట్లాండ్
జ: (డి)
15. తెలంగాణ ప్రభుత్వం 'ఆసరా' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
ఎ) 2014, అక్టోబరు బి) 2014, ఆగస్టు 15 సి) 2014, జూన్ 2 డి) 2014, నవంబరు 8
జ: (డి)
16. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కల్యాణ లక్ష్మి' పథకం ఎవరికి ఉద్దేశించింది?
ఎ) పేద ఎస్సీ బాలికలకు బి) పేద ఎస్టీ బాలికలకు సి) పేద ఎస్సీ, ఎస్టీ బాలికలకు డి) పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికలకు
జ: (సి)