• facebook
  • whatsapp
  • telegram

బానిసలు కనిపించని మహాజనపదం!

మగధ సామ్రాజ్యం

 

ప్రాచీన భారతదేశంలోని మహాజనపదాల్లో ప్రముఖ రాజ్యం మగధ. పాటలీపుత్రం రాజధానిగా మౌర్యులు, గుప్తుల పాలనలో శక్తిమంతమైన సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. వ్యవసాయం, వాణిజ్యం, సైనిక రంగాల్లో ప్రగతితో అత్యంత సంపన్న ప్రాంతంగా దేశ వైభవాన్ని నలుదిశల్లో చాటింది. బౌద్ధ, జైన మతాల వ్యాప్తికి కేంద్ర స్థానంగా నిలిచిన మగధ విశేషాలన్నీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పరాక్రమంలో అజేయంగా, ప్రజాసంక్షేమంలో ఆదర్శంగా నిలిచిన మౌర్యుల గురించి పోటీ పరీక్షార్థులు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మౌర్య సామ్రాజ్యం ఆవిర్భావం, విస్తరణ తీరు, నాటి పాలనా విధానాలు, అశోకుడి ఔన్నత్యం, శాశ్వతంగా నిలిచిపోయిన అతడి కీర్తి తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1.    కిందివాటిలో చంద్రగుప్త మౌర్యుడు నంద రాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఉన్న గ్రంథం?

1) కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’         2) విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’

3) పతంజలి ‘మహాభాష్యం’   4) మాడలీన్‌ ‘స్లేడ్‌’


2.     మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి సరైనవి?

ఎ) క్రీ.పూ.321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

బి) ఈయన మొరియా తెగకు చెందినవాడు.

సి) జైన, బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియులు.

డి) పురాణాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడిది శూద్రవంశం.

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, బి, సి       4) ఎ, డి


3.     కింద ఇచ్చిన రచయితలు, గ్రంథాలను జతపరచండి.

1) ప్లీనీ ఎ) ఇండికా
2) ప్లూటార్క్‌ బి) ది లైన్స్‌  
3) టాలమీ సి) నేచురల్‌ హిస్టరీ
4) మెగస్తనీస్‌ డి) జాగ్రఫీ

1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి      2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి      4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి


4.     కిందివాటిలో అశోకుడి గురించి తెలుసుకోవడానికి ఆధారమైన స్వదేశీ గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి.

    రచయితలు       గ్రంథాలు
1) విశాఖదత్తుడు ఎ) రాజతరంగిణి
2) హేమచంద్ర బి) పరిశిష్ట పర్వన్‌
3) సోమదేవుడు సి) ముద్రారాక్షసం
4) కల్హణుడు డి) కథాకవితాసాగరం

1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి    2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ    4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి


5.     కౌటిల్యుడి అర్థశాస్త్రానికి సంబంధించి సరైనవి ఏవి?

ఎ) కౌటిల్యుడిని చాణుక్యుడు, విష్ణుగుప్తుడు అని అంటారు.

బి) సంస్కృతంలో రాసిన అర్థశాస్త్రం 1905లో తంజావూర్‌ వద్ద దొరికింది. దీన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఆర్‌.శ్యామశాస్త్రి.

సి) అర్థశాస్త్రం అనే గ్రంథంలో 15 అధికరణలు, 180 ప్రకరణలు ఉన్నాయి.

డి) మౌర్యుల కాలంలోని ధర్మస్థేయ అనే పౌర న్యాయస్థానం; కంఠక శోధన అనే క్రిమినల్‌ న్యాయస్థానాల గురించి దీనిలో ఉంది.

1) ఎ, బి, సి        2) ఎ, బి, సి, డి

3) ఎ, బి, డి       4) ఎ, సి, డి


6. ఇండికా గ్రంథానికి సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.    

ఎ) గ్రీకు దేశానికి చెందిన సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారి అయిన మెగస్తనీస్‌ ఈ గ్రంథాన్ని రచించారు.

బి) ప్రస్తుతం ఈ గ్రంథం అందుబాటులో లేదు.

సి) ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి సైనిక వ్యవస్థ గురించి ఉంది.

డి) మెగస్తనీస్‌ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు.

1) ఎ, బి, సి, డి 2) ఎ, సి  3) ఎ, సి, డి 4) ఎ, బి, డి 


7. జునాగఢ్‌ శాసనం ఎవరు వేయించారు?

1) అశోకుడు       2) చంద్రగుప్త మౌర్యుడు   

3) రుద్రదమనుడు     4) బిందుసారుడు


8.     చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్‌ నికేటర్‌తో జరిగిన యుద్ధంతో సంబంధం లేనిది?

1) వీరి మధ్య క్రీ.పూ.305లో యుద్ధం జరిగింది.

2) వీరి మధ్య క్రీ.పూ.303లో సంధి జరిగింది.

3) సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారిగా మెగస్తనీస్‌ పాటలీపుత్రంలో చాలాకాలం ఉన్నాడు.

4) చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్‌ నికేటర్‌కు 5000 ఏనుగులు ఇచ్చాడు.


9.     సంగమ సాహిత్యం అంటే?

1) చోళ సాహిత్యం       2) పాండ్య సాహిత్యం   

3) చేర సాహిత్యం      4) పైవన్నీ


10. బిందుసారుడి గురించి సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) బిందుసారుడిని ‘అమిత్రఘాత’ అంటారు.

బి) బిందుసారుడు అజీవక మతం ఆచరించాడు.

సి) ఈయనకు సిరియా రాజు ఒకటో యాంటి యోకస్‌తో సంబంధాలు ఉండేవి.

డి) సిరియా రాజు రాయబారి డైమోకస్‌ మౌర్యుల ఆస్థానంలో ఉండేవాడు.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి, డి

3) బి, సి       4) ఏదీకాదు


11. బిందుసారుడి కాలంలో అతడి ఆస్థానంలో ఉన్న సిరియా రాయబారి?

1) స్ట్రాబో 2) హెరిడోటస్‌     3) డైమోకస్‌    4) ప్లీనీ


12. బిందుసారుడి కాలంలో తక్షశిల వద్ద జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన యువరాజు?

1) సుశిమా       2) మహేంద్ర   

3) అశోకుడు       4) బృహద్రదుడు


13. కిందివాటిలో అశోకుడికి సంబంధించి సరైనవి?

ఎ) అశోకుడి పేరును శాసనాల్లో దేవానాంప్రియ, ప్రియదర్శి అని పేర్కొన్నారు.

బి) ఈయన పేరుతో ఉన్న శాసనం కర్ణాటకలోని మస్కి వద్ద ఉంది.

సి) టిబెట్‌ చరిత్రకారుడు తారానాథ్‌ ప్రకారం అశోకుడు ఒక వైశ్య స్త్రీకి జన్మించాడు.

డి) అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం.

1) ఎ, డి       2) ఎ, బి, సి, డి    

3) బి, సి, డి       4) ఎ, బి, సి 


14. ‘చార్లెమేన్, కాన్‌స్టాంటన్‌ గురించి తెలిసిన వారి కంటే అశోకుడి గురించి తెలిసిన వారే ఎక్కువ’ అని ఎవరు అన్నారు?

1) ప్లీనీ        2) హెచ్‌.జి.వెల్స్‌  

3) టాలమీ      4) ప్లూటార్క్‌


15. కిందివాటిలో కళింగ యుద్ధానికి సంబంధించి సరైనవి గుర్తించండి.

ఎ) కళింగ అంటే నేటి ఒడిశా ప్రాంతం.

బి) 13వ శిలాశాసనం ఈ యుద్ధం గురించి తెలుపుతుంది.

సి) అశోకుడు రాజైన ఎనిమిదేళ్లకు ఈ యుద్ధం చేశాడు.

డి) కళింగ యుద్ధంలో మృతులు 1,00,000 మందికి పైగా కాగా, బంధీలైనవారు 1,50,000 మంది.

1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) ఎ, సి 4) బి, డి 


16. అశోకుడి ధర్మ సూత్రాల్లో లేనిది?

ఎ) తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి.    బి) పెద్దలను గౌరవించాలి.

సి) ఇతర మతాలను దూషించరాదు.    డి) విగ్రహారాధన చేయవచ్చు.

1) సి, డి 2) సి మాత్రమే  3) డి మాత్రమే 4) ఎ, డి


17. ధర్మప్రచారం, శాసనాల్లోని అంశాలను చదివి వినిపించడానికి అశోకుడు ఎవరిని నియమించాడు?

1) అమాత్యులు           2) ధర్మాధ్యక్షులు

3) ధర్మమహామాత్రులు      4) పైవారందరూ


18. అశోకుడికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

ఎ) కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతం స్వీకరించాడు.

బి) ఈయన బౌద్ధమతాన్ని ఈజిప్ట్, శ్రీలంక, గ్రీసు, సిరియా దేశాల్లో వ్యాప్తి చేశాడు.

సి) అశోకుడి తరఫున బౌద్ధమత ప్రచారం చేసినవారు మహేంద్ర, సంఘమిత్ర.

డి) అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధమత సన్యాసి ఆచార్య నాగార్జునుడు.

1) ఎ, బి       2) డి మాత్రమే   

3) బి, డి       4) ఎ మాత్రమే


19. మౌర్యుల తర్వాత మగధలో స్థాపించిన రాజవంశం, స్థాపకుడు? 

1) కాణ్వా - సుశర్మ       2) శుంగ - పుష్య మిత్ర 

3) పుష్యభూతి - హర్షవర్ధన     4) గుప్త - గుప్తుడు


20. అశోకుడి ఏ శాసనాలు సంగమ యుగం గురించి వివరిస్తాయి?

1) 2, 13  2) 2, 14     3) 1, 6      4) 7, 8


21. మగధ సామ్రాజ్య పరిపాలనకు సంబంధించి సరికానిది?

ఎ) మగధకు ప్రధాన రాజధాని పాటలీపుత్రం.

బి) పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిపాలించేవారు.

సి) మగధలో నాలుగు ప్రాదేశిక రాజధానులున్నాయి. అవి తక్షశిల, తోసలి, సువర్ణగిరి, ఉజ్జయిని.

డి) ప్రాదేశిక రాజధానులను పరిపాలించేవారు సామంతులు.

1) ఎ, బి, సి  2) డి   3) బి, డి   4) ఎ, డి 


22. మగధలో గ్రామాల వర్గీకరణను జతపరచండి.

1) సీత ఎ) సైనికులను పంపించే గ్రామాలు
2) ఆయుధేయ బి) రాజుకు, ప్రభుత్వానికి చెందిన భూములున్న గ్రామం
3) పరిహారిక సి) పన్ను మినహాయింపు ఇచ్చిన గ్రామాలు
4) కుప్య డి) ముడి పదార్థాలను సరఫరా చేసే గ్రామాలు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి

3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి      4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి


23. అశోకుడి ఏ శిలాశాసనం బోస్రో -ఫెడాన్‌ పద్ధతిలో రాసి ఉంది?

1) ఎర్రగుడి మైనర్‌ రాక్‌ ఈడిక్ట్‌     2) లంపక రాక్‌ ఈడిక్ట్‌ 

3) షాబజోగిరి రాక్‌ ఈడిక్ట్‌    4) మాన్‌షేరా రాక్‌ ఈడిక్ట్‌


24. మెగస్తనీస్‌ తన గ్రంథంలో తెలియజేసిన పెద్దరాచబాట ఏ ప్రాంతాలను కలుపుతుంది?

1) ఇండస్‌ - పాటలీపుత్రం            2) పాటలీపుత్రం - ప్రయాగ 

3) ప్రయాగ - ఉజ్జయిని 4) పాటలీపుత్రం - తక్షశిల 


25. అశోకుడి స్తంభ శాసనంలో అతిదీర్ఘమైనది?

1) 7వ    2) 6వ    3) 5వ    4) 4వ 


26. ఇండికా గ్రంథం ప్రకారం మగధ సామ్రాజ్యంలోని కులాలు ఎన్ని?

1) 4     2) 5     3) 6     4) 7


27. మౌర్యుల కాలంలో రాజు గుత్తాధిపత్యం కింద లేని అంశం?

1) గనులు, అడవులు           2) చేపల పరిశ్రమ

3) మద్యం, జలరవాణా     4) వధశాలలు, జూద గృహాలు


28. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు?

1) శాసనాల ద్వారా      2) ప్రాకృతం ఉపయోగించడం ద్వారా

3) విదేశాలకు భిక్షువులను పంపడం ద్వారా     4) పైవన్నీ

29. కిందివాటిలో సరికానిది?

1) మౌర్యుల కాలం నాటి వెండి నాణెం పణం.

2) చంద్రగుప్త మౌర్యుడు చివరి రోజుల్లో శ్రావణబెళగొళ వద్ద ఉన్నాడు.

3) చక్రవర్తి క్షేత్రం అనే పదం ఉన్న గ్రంథం అర్థశాస్త్రం.

4) చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన ప్రముఖ గ్రీకు రాజు అలెగ్జాండర్‌.


30. మౌర్య సామ్రాజ్య పతనానికి కారణాలు?

ఎ) బలహీనులైన వారసులు             

బి) అశోకుడి అహింసా విధానం

సి) మౌర్య సామ్రాజ్యం పట్ల బ్రాహ్మణ వ్యతిరేకత   

డి) విదేశీ దండయాత్రలు

1) ఎ, బి, డి         2) ఎ, బి, సి     

3) ఎ, బి, సి, డి       4) ఎ, డి మాత్రమే


31. కిందివారిలో చంద్రగుప్త మౌర్యుడి మనుమడు?

1) బింబిసారుడు      2) బిందుసారుడు

3) అశోకుడు        4) కనిష్కుడు


32. ఒకనాటి మగధ సామ్రాజ్యం ఈ ప్రాంతాల మధ్యలో విస్తరించింది?

1) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన ఆంధ్ర, తూర్పున బెంగాల్‌ వరకు 

2) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన తమిళనాడు, తూర్పున ఒడిశా వరకు

3) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన కర్ణాటక, తూర్పున బెంగాల్‌ వరకు

4) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన కర్ణాటక, తూర్పున అస్సాం వరకు


33. పెద్ద పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అని అంటారు. వాటి రాజులను ఏమంటారు?

1) రాజులు    2) పెద్దరాజులు   

3) చక్రవర్తులు    4) సామంతులు


34. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో ఒకరు-

1) చంద్రగుప్తుడు    2) రెండో చంద్రగుప్తుడు    

3) చంద్రగుప్త మౌర్యుడు    4) కనిష్కుడు


35. కిందివాటిలో మగధ సామ్రాజ్యంలో భాగం కాని ప్రాంతం-

ఎ) హిందూకుష్‌ పర్వతాలు, థార్‌ ఎడారి 

బి) గుజరాత్, గంగా నదీ లోయలు

సి) మధ్య భారత్‌ అడవులు, కృష్ణా, తుంగభద్ర, గోదావరి లోయలు

డి) కావేరి నది తీరప్రాంతం

1) ఎ, డి            2) బి మాత్రమే 

3) డి మాత్రమే       4) సి, డి


36. మగధ సామ్రాజ్యంలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు

ఎ) గంగా, కష్ణా నదీ లోయలు       బి) మాళ్వా, గుజరాత్‌

సి) పంజాబ్‌      డి) హిందూకుష్‌ పర్వతాలు

1) ఎ, బి, సి, డి          2) బి, సి, డి      

3) ఎ, బి, సి      4) డి మాత్రమే


37. మగధ రాజధాని పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను నియంత్రించేది ఎవరు?

1) చక్రవర్తి  2) రాజు 3) గవర్నర్‌ 4) యువరాజు


38. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.  

ఎ) చక్రవర్తికి సమాచారం చేరవేసేవారు - వేగులు

బి) చక్రవర్తి నుంచి సమాచారం తెచ్చేవారు - దూతలు

సి) చక్రవర్తికి పరిపాలనలో సహాయపడేవారు - మంత్రులు, రాజకుటుంబీకులు

డి) ప్రాదేశిక రాజధానులను పరిపాలించేవారు - గవర్నర్‌లు

1) ఎ, బి, సి, డి     2) సి, డి

3) డి మాత్రమే     4) ఏదీకాదు


39.   మగధ సామ్రాజ్యంలో ప్రాదేశిక రాజధాని కానిది-

1) తక్షశిల     2) ఉజ్జయిని 

3) సువర్ణగిరి     4) చంప


40. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని కౌటిల్యుడి మరో పేరు- 

1) చాణక్యుడు          2) విష్ణుగుప్తుడు          

3) రాధ గుప్తుడు         4) 1, 2


41. ‘ఇండికా’ గ్రంథ రచయిత మెగస్తనీస్‌ ఏ దేశానికి చెందినవాడు?

1) ఆస్ట్రియా 2) పర్షియా 3) గ్రీకు 4) రోమన్‌


42.. కింది వాక్యాలు పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి.

ఎ) బంగారం అధికంగా దొరికే ప్రాంతం - తక్షశిల

బి) విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం - సువర్ణగిరి.

సి) వ్యాపారులు, సైన్యం ప్రయాణించడానికి రహదారి మార్గాలున్నాయి.

డి) రాజులు ఆటవిక తెగల జీవితాల్లో అంతగా జోక్యం చేసుకునేవారు కాదు.

1) ఏదీకాదు          2) ఎ, బి, డి 

3) ఎ, బి, సి, డి            4) ఎ, బి, సి


43. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని అంశాలు?

ఎ) రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి

బి) రాజు రాజ్యాన్ని కుట్రలు, కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి

సి) రాజు ప్రజల వద్ద నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి

డి) భారత ఉపఖండంలో లభించే వనరులు ఏమిటి

1) ఎ, బి, సి, డి      2) ఎ, బి, సి      

3) బి, సి           4) ఎ మాత్రమే


44. మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? 

1) బిందుసారుడు     2) చంద్రగుప్త మౌర్యుడు 

3) రిపుంజయుడు     4) బింబిసారుడు  


45. అశోకుడు తన శాసనాలను ఏ భాషలో, ఏ లిపిలో వేయించాడు?

1) బ్రాహ్మీ-ప్రాకృత     2) ప్రాకృత-బ్రాహ్మీ

3) బ్రాహ్మీ-సంస్కృత     4) సంస్కృత-సంస్కృత


46. ప్రపంచ చరిత్రలో యుద్ధాల్లో విజయం తర్వాత వాటికి స్వస్తి పలికిన ఒకే ఒక రాజు?

1) బిందుసారుడు      2) అశోకుడు    

3) కనిష్కుడు      4) కాలాశోకుడు


47. అశోకుడు చక్రవర్తి అయ్యాక ఎన్నేళ్లకు కళింగ యుద్ధం చేశాడు?

1) 7      2) 8     3) 9     4) 6 


48. ‘దమ్మ’ ఏ భాషా పదం?

1) ప్రాకృత      2) సంస్కృత 

3) తమిళ     4) హిందీ


49. కిందివాటిలో సరికాని వాక్యం?

ఎ) అశోకుడి ధర్మ/దమ్మలో దేవతలకు జంతుబలులు అధికం.

బి) తండ్రి పిల్లలకు నేర్పినట్లు అశోకుడు ప్రజలకు బోధించాడు.

సి) బుద్ధుడి బోధనలకు ప్రభావితుడు అయ్యాడు.

డి) తన సందేశాలను రాతి స్తంభాలపై చెక్కించాడు.

1) బి మాత్రమే    2) ఎ మాత్రమే

3) ఎ, డి    4) ఎ, బి


50. కిందివాటిలో అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయని దేశం?

1) పర్షియా      2) ఈజిప్టు  

3) సిలోన్‌      4) సిరియా
 


సమాధానాలు


1-2; 2-2; 3-2; 4-3; 5-2; 6-1; 7-3; 8-4; 9-4; 10-2; 11-3; 12-3; 13-2; 14-2; 15-1; 16-3; 17-3; 18-2; 19-2; 20-1; 21-2; 22-2; 23-1; 24-4; 25-1; 26-4; 27-4; 28-4. 29-4; 30-3; 31-3; 32-3; 33-3; 34-3; 35-3; 36-3; 37-1; 38-1; 39-4; 40-4; 41-3; 42-3; 43-1; 44-2; 45-2; 46-2; 47-2; 48-1; 49-1; 50-4;  


రచయిత: గద్దె నరసింహారావు 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 27-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌