* అశోకుడు క్రీ.పూ.273 నుంచి క్రీ.పూ. 232 వరకు రాజ్యాన్ని పాలించాడు.
* ఇతడు ఉజ్జయినిలో గవర్నర్గా ఉన్న సమయంలో ‘విదిశ’ పట్టణానికి చెందిన వైశ్య స్త్రీ మహాదేవిని ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. వీరికి మహేంద్ర, సంఘమిత్ర జన్మించారు.
* అశోకుడికి అసంధిమిత్ర, తిస్మరఖ, చారువాకి, కారువాకి, పద్మావతి అనే భార్యలు ఉన్నారు.
* ఇతడికి చారుమతి అనే కుమార్తె; కుణాల, త్రివర, జతాక అనే కుమారులు ఉన్నారు.
* అశోకుడి శాసనాల్లో ఇతడ్ని ‘దేవానాం ప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (సుందరరూపం కలవాడు) అని పేర్కొన్నారు.
* మస్కి, గిర్నార్ శాసనాల్లో ‘అశోక’ అనే పేరు ఉంది.
* పురాణాల్లో ఇతడ్ని ‘అశోకవర్ధన’ అని పేర్కొన్నారు.
* బబ్రూ శాసనంలో అశోకుడి పేరు ‘ప్రియదర్శిరాజా మగధే’ అని ఉంది.
* అశోకుడి పట్టాభిషేకం, బౌద్ధమత దీక్ష తీసుకోవడం మొదలైన విషయాల్లో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
* అశోకుడి పట్టాభిషేకం జరిగిన తొమ్మిదేళ్లకు (క్రీ.పూ.261లో) ‘కళింగ యుద్ధం’ చేసినట్లు 13వ శిలాశాసనంలో ఉంది.
అశోకుడి శాసనాలు
* అశోకుడు స్వయంగా శిలలు, స్తంభాలపై తన ఆశయాలు, పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను చెక్కించాడు. వీటిలో మొత్తం 14 శిలా, 7 స్తంభ శాసనాలు ఉన్నాయి. ఇవి దిల్లీ, ఎర్రగుడి, మధుర, శ్రీనగర్, నందన్ఘాట్, రాంపూర్వ, సారనాథ్ మొదలైన ప్రదేశాల్లో లభించాయి.
* మనదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు వేయించింది అశోకుడు. అవి బ్రహ్మీ, ఖరోష్ఠి, గ్రీకు, అరబిక్ లిపుల్లో ఉన్నాయి.
* వాయవ్య భారతదేశంలో అరబిక్, ఖరోష్ఠి; అఫ్గానిస్థాన్లో అరబిక్, గ్రీకు లిపులను వాడారు.
* ఈ శాసనాల్లో అశోకుడి జీవితం, అతడి దేశీ - విదేశీ విధానాలు, సామ్రాజ్య విస్తృతి మొదలైన విషయాలు ఉన్నాయి.
* అశోకుడి రుమిందై స్తంభశాసనం బ్రహ్మీ లిపిలో, ప్రాకృత భాషలో ఉంది. బబ్రూ శాసనంలో అశోకుడు తనను తాను మగధరాజుగా పేర్కొన్నాడు.
* 1837లో జేమ్స్ ప్రిన్సెప్ అశోకుని శాసనాల్లో ‘ప్రియదర్శి’ అనే పదాన్ని కనుకున్నాడు.
* అశోకుడి స్తంభ శాసనాలైన తోప్రా (హరియాణా), మీరట్ (ఉత్తర్ ప్రదేశ్)లను ఫిరోజ్ తుగ్లక్ దిల్లీకి తరలించాడు.
* అలహాబాద్ స్తంభ శాసనాన్ని అక్బర్ కౌశాంబి నుంచి అలహాబాద్కు తరలించాడు.
* ఇంగ్లండ్కి చెందిన అలెగ్జాండర్ కన్నింగ్హామ్ బబ్రూ శాసనాన్ని బైరాట్ (జైపూర్) నుంచి కలకత్తాకు మార్చాడు.
* 14 పెద్దశిలా శాసనాల్లో మస్కి, ఎర్రగుడి (కర్నూలు), రాజుల మందగిరి (కడప) ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.
* అశోకుడి పేరును మొదటిసారి మస్కి శాసనంలో ప్రస్తావించారు.
* 4వ చిన్న శిలాశాసనాన్ని ‘రాణిశాసనం’గా పేర్కొంటారు.
* అశోకుడు బరాబర్ గుహల (బిహార్)ను అజీవకులకు దానం చేశాడని గుహాలయ శాసనాల్లో ఉంది. ఇవి అశోకుడితో పాటు మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు.
* మౌర్యుల తర్వాతి కాలానికి చెందిన సాగౌర తామ్ర (రాగి) శాసనం, మహాస్థాన్ శాసనాలు కరవు కాటకాల సమయంలో మౌర్యులు తీసుకొన్న చర్యల గురించి తెలియజేస్తున్నాయి.
* అశోకుడి శాసనాలు ఉత్తర్ ప్రదేశ్, పాకిస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో లభించాయి.
* అశోకుడు శిలా, స్తంభ, గుహాలయ శాసనాల్లో ‘ధర్మం’ అనే పదంతోపాటు, అహింస, సత్ప్రవర్తనను బోధించాడు.
అశోకుడి దమ్మ విధానం
* రోమిల్లా థాపర్ ప్రకారం, ధర్మ అనే సంస్కృత పదానికి ప్రాకృత రూపం ‘దమ్మ’. దీని అర్థం విశ్వవ్యాప్త చట్టం లేదా ధార్మికత.
* మానవుడు ధర్మానికి, సామాజిక నీతికి కట్టుబడి ఉండటం, సమాజంలోని అసహనాన్ని తగ్గించి, సామాజిక ఘర్షణలను తొలగించి, నీతిమంతమైన జీవితం గడపటమే దమ్మవిధాన లక్ష్యం.
* అశోకుడు సామ్రాజ్యాన్ని విస్తరించటం, నూతన పట్టణాల ఆవిర్భావం, వ్యాపార సమూహాలు ఏర్పడటం, చేతివృత్తి పనివారు తమ హక్కుల గురించి ప్రతిపాదించడం లాంటివి రాజ్య పాలనను క్లిష్టతరం చేశాయి. సామ్రాజ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో ప్రజలందరినీ ఒకే తాటిపై తెచ్చేందుకు అశోకుడు దర్మమార్గాన్ని ఎంచుకున్నాడు.
* అశోకుడి ధర్మయాత్రల గురించి తెలిపే బౌద్ధ గ్రంథం ‘దివ్యవదన్’.
* అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించినప్పటికీ దాన్ని రాజమతంగా ప్రకటించలేదు.
* ‘‘ధర్మం అంటే నైతిక విలువలతో కూడిన జీవనం సాగించడం, వాటిని సాధించడానికి కరుణ, దయ, ప్రేమ, సత్ప్రవర్తన, ఆత్మనిగ్రహం లాంటి లక్షణాలు ఉండాలి’’ అని ప్రజలకు తెలిపాడు.
దమ్మ సిద్ధాంతంలో ముఖ్యమైనవి:
* పెద్దలు, గురువుల పట్ల గౌరవం; తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి. బ్రాహ్మణులు, స్నేహితులు, బంధువుల పట్ల ఉదారత చూపించాలి. ఈ విషయాలను తన మూడో శిలాశాసనంలో పేర్కొన్నాడు. మొదటి శిలాశాసనంలో విందు, వినోదాలను నిషేధించాడు.
* బ్రాహ్మణులు, యాచకులకు దానధర్మాలు చేయాలి. అన్ని జీవుల పట్ల దయ చూపాలి.
* మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రజల అభిప్రాయాలు, భావాలను ప్రతివారు సహనంతో ఆమోదించాలి. తన ఏడో శిలాశాసనంలో ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని పేర్కొన్నాడు.
* ఇతర మతాలు, సిద్ధాంతాలను కించపరచ కూడదు. ప్రతి ఒక్కరూ ఇతర మతాలవారిని గౌరవించాలి. ప్రజలు సామరస్యంతో జీవించాలి. ఈ విషయాలను తన మూడో శాసనంలో పేర్కొన్నాడు.
* విభేదాలను బహిరంగంగా ఒప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు. వాటిని సహనంతో ఆమోదించాలి. తన అయిదో శాసనంలో సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.
* ప్రజల సామరస్యాన్ని దెబ్బతీసే, వ్యతిరేక భావాలు పెంపొందించే సభలు, సమావేశాలను నిషేధించాలి.
* హింసను విడనాడాలి. యుద్ధాన్ని బలప్రయోగం ద్వారా జయించడం త్యజించాలి.
* జంతుహింస చేయకూడదు.
* వైద్య సంబంధ చెట్లు నాటాలి. వాటివల్ల మానవులకు మేలు కలుగుతుంది.
* 7వ స్తంభశాసనంలో చెట్లు నాటడం, బావులు తవ్వించడం, ప్రతి 9 మైళ్లకు విశ్రాంతి గృహాలు నిర్మించడం లాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాడు.
మౌర్యుల కాలంలోని ప్రాదేశిక రాజ్యాలు - రాజధానులు
* ఉత్తరాపథ - తక్షశిల
* దక్షిణాపథ - సువర్ణగిరి
* ప్రాచ్య - పాటలీపుత్ర
*కళింగ - తోసలి
* అవంతిరథ - ఉజ్జయిని
అశోకుడి వ్యక్తిగత విశేషాలు
సోదరులు: సుమన, తిస్స, వితోసన్
భార్యలు: దేవి, కారువాకి, అసంధిమిత్ర, పద్మావతి, తిష్యరక్షిత
కుమారులు: మహేంద్ర, తివర, కునాల, జాలూక
కుమార్తెలు: సంఘమిత్ర, చారుమతి
అల్లుళ్లు: అగ్నిబ్రహ్మ (సంఘమిత్ర భర్త), దేవపాల క్షత్రియ (చారుమతి భర్త)
మనవళ్లు: దశరథుడు, సంప్రతి, సుమన
వ్యక్తిగత సేవకులు: కంచు, ఉష్నిషి, కల్పక, ప్రసాదక, సనపాక
అశోకుని స్తంభాలపై ఉన్న జంతు తలలు
* రామపూర్వ - 1 : ఏక సింహం
* లౌర్య - నందన్గర్ : ఏకసింహం
* బాసర్: ఏక సింహం
* రామపూర్వ - 2 : ఏక వృషభం
* సారనాథ్ : నాలుగు సింహాలు
* సాంచి : నాలుగు సింహాలు
* శాన్కిస్సా : ఏక గజం
మౌర్యుల మత నమ్మకాలు
* చంద్రగుప్తుడు - జైన మతం
* బిందుసారుడు - అజీవక
* అశోకుడు - బౌద్ధమతం
* దశరథుడు - అజీవక
అశోకుడి శాసనాల వర్గీకరణ
* బబ్రూ - బౌద్ధమతాన్ని స్వీకరించడం
* బరాబర్ - మతసహనం
* తెరయి స్తంభాలు - బౌద్ధమతం పట్ల అశోకుడికి ఉన్న గౌరవం
* 14 రాతి శాసనాలు - పరిపాలన, నైతికత
* చిన్న రాతి శాసనాలు - అశోకుడి వ్యక్తిగత చరిత్ర, స్థూలంగా ధర్మాన్ని గురించిన వివరణ
* 7 స్తంభ రాతిశాసనాలు - రాతి శాసనాలకు అనుబంధాలు
* 4 చిన్న స్తంభశాసనాలు - విలువైనవి కావు
కళింగ యుద్ధం
* బిందుసారుడి కాలం నాటికే మౌర్యసామ్రాజ్యం దక్షిణాన కర్ణాటకలోని ‘సిద్ధపురం’ వరకు విస్తరించింది. ఆ సమయంలో ‘కళింగ’ (ఒడిశా) రాజ్యం స్వతంత్రంగా ఉండేది. దీన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యంలో విలీనం చేసుకోవాలని అశోకుడు భావించాడు.
* కళింగ గోదావరి, మహానది మధ్య ఉంది. ఉత్తర - దక్షిణ భారతదేశానికి భూ, జలమార్గాలు కళింగ ద్వారా ఉండటం; మౌర్య సామ్రాజ్య వాణిజ్యం బర్మా, ఆగ్నేయ ఆసియా, సింహళంతో జరగడం; అదే సమయంలో భూ, జల మార్గాల వాణిజ్యాన్ని కళింగ హస్తగతం చేసుకోవడం లాంటి కారణాల వల్ల మౌర్య సామ్రాజ్య వాణిజ్యానికి అవరోధం ఏర్పడింది. అంతేకాక బిందుసారుడు దక్షిణ భారతదేశంపై దండెత్తినప్పుడు కళింగ రాజ్యం చోళ, పాండ్యులకు తన సహాయాన్ని అందించింది. ఈ కారణాల వల్లే అశోకుడు కళింగపై దండెత్తాడు.
* ఈ యుద్ధంలో అశోకుడు విజయం సాధించాడు.
* ఇందులో సుమారు లక్షమంది మరణించగా, లక్షన్నర మంది గాయపడ్డారు. ఈ సంఘటనలతో అశోకుడు తన యుద్ధ కాంక్షను వదిలి; శాంతి, అహింసను కోరుకున్నాడు.
* ఈ విషయాలను అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఈ విధంగా పేర్కొన్నాడు ‘‘ఇకపై యుద్ధాలు చేయను, ఆటవికులతో సహా సమస్త ప్రజలతో సామరస్యంగా మెలుగుతాను, నా సామ్రాజ్యంలోనే కాదు ప్రపంచంలోని ప్రజలంతా ధర్మం, అహింస, సత్ప్రవర్తనలను పాటిస్తే సుఖాన్ని పొందుతారు.’’
* యుద్ధంలో ఘన విజయం సాధించాక యుద్ధాలు చేయనని ప్రకటించిన ఏకైక రాజు ‘అశోకుడు’.
* ఈ యుద్ధం తర్వాత అశోకుడు ‘ఉపగుప్తుడి’ బోధనలకు ప్రభావితుడై బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇతడు ధర్మవిధానాన్ని పాటించి, పరమత సహనాన్ని చాటి, లౌకిక చక్రవర్తిగా పేరొందాడు.