• facebook
  • whatsapp
  • telegram

మధ్యయుగం - దక్షిణ భారత రాజ్యాలు

సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలకపాత్ర పోషించారు. క్రీ.శ.9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

నవీన చోళులు

*¤ విజయాలయుడు క్రీ.శ.846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి, కావేరి డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు.

*¤ ఒరైయూర్‌కు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశుంభసూదిని దేవాలయాన్ని నిర్మించాడు.

¤*¤ నవీన చోళుల రాజధాని తంజావూరు.

*¤ విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజిత వర్మను ఓడించి, పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు.

*¤ మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు (చోళులు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరు పొందారు).

ఉత్తర మేరూర్ శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది

*¤ మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి, మధురైకొండ అనే బిరుదు పొందాడు.

*¤ మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీ.శ.949 నాటి తక్కోలం యుద్ధంలో ఓడించాడు.

*¤ నవీన చోళ రాజుల్లో మొదటి గొప్ప పాలకుడు మొదటిరాజరాజు (క్రీ.శ.985 - 1014).

*¤ మొదటి రాజరాజు అసలు పేరు అరుమోలి వర్మ. తంజావూరు శాసనం ఇతడి విజయాలను వివరిస్తుంది.

*¤ బృహదీశ్వర ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.

*¤ మొదటి రాజరాజు పొలోన్నరావాలో (సింహళం) శివాలయాన్ని నిర్మించాడు.

*¤ తమిళ దేవాలయ వాస్తులో విమానాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ.

*¤ భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరొందాడు. (బిరుదులు జయంగొండ, చోళమార్తాండ, ముమ్మిడి చోళ)

*¤ ఇతడు సింహళంపై (శ్రీలంక) దండెత్తి ఉత్తర సింహళాన్ని ఆక్రమించాడు.

మాల్దీవులను ఆక్రమించాడు.

*¤ రాజరాజు తన కుమార్తె కుందవ్వను తూర్పు చాళుక్యరాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.

*¤ తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.

*¤ శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమార విజయోత్తుంగునకు నాగపట్నంలో చౌఢామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మొదటి రాజరాజే

*¤ మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్రచోళ అధికారంలోకి వచ్చాడు.

*¤ నవీన చోళుల్లో ప్రసిద్ధిచెందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు (1014 - 1044)

*¤ మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారంకొండ, పండితచోళ లాంటి బిరుదులను పొందాడు.

*¤ మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు.

*¤ గంగానది వరకు వెళ్లి పాలవంశ రాజు మహీపాలుడిని ఓడించి, ''గంగైకొండ'' అనే బిరుదు పొందాడు.

*¤ నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు.

*¤ శ్రీ విజయ రాజ్య రాజధాని కడారంను జయించి కడారంకొండ అనే బిరుదును పొందాడు.

*¤ మొదటి రాజేంద్ర చోళుడు 'గంగైకొండ చోళపురం' అనే నూతన రాజధానిని, 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించాడు.

*¤ తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను వివరిస్తాయి.

*¤ మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ్య రాజు శైవేంద్రుడిని, 1029లో సింహళ రాజు మహేంద్రుడిని ఓడించాడు.

*¤ సుమత్రా, మలయా, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవారు.

*¤ అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటిరాజేంద్రచోళుడు (చైనాకు వాణిజ్య రాయబారులను పంపించాడు.)

*¤ ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడు.

*¤ మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాధిరాజు ''విజయ రాజేంద్ర' బిరుదుతో రాజ్యపాలన చేశాడు.

*¤ కానీ మొదటి రాజాధిరాజు క్రీ.శ.1052 నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు.

*¤ రాజాధిరాజు అనంతరం అతడి సోదరుడు రెండో రాజేంద్రుడు పాలనకు వచ్చాడు.

*¤ రెండో రాజేంద్రుడు క్రీ.శ.1062 నాటి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.

*¤ అనంతరం వచ్చిన పాలకుడు వీర రాజేంద్రుడు, ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు.

*¤ రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు ''కులోత్తుంగ చోళుడు'' అనే బిరుదుతో అధిరాజేంద్రుడి అనంతరం చోళరాజ్య పాలన చేపట్టాడు.

*¤ కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన ఏడో విజయాదిత్యుడి మరణానంతరం 'చోళ చాళుక్య రాజ్యాల'ను కలిపి పాలన ప్రారంభించాడు.

*¤ విశాఖపట్నం నగరాన్ని నిర్మించింది కులోత్తుంగ చోళుడే.

*¤ కళింగట్టు సరణి గ్రంథాన్ని రాసిన జయంగొండార్ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు.

*¤ మూడో కులోత్తుంగ చోళుడు, మూడో రాజరాజు, నాలుగో రాజేంద్రుడు చివరి చోళ చక్రవర్తులు.

ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు

*¤ చోళులు వ్యవసాయ, వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

వ్యవసాయాభివృద్ధి కోసం పెద్దసంఖ్యలో చెరువులను తవ్వించారు.

*¤ చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టమైంది

*¤ నాటి భూస్వాములను మువ్వేందవేలన్, అరయ్యార్ అని పిలిచేవారు.

*¤ మువ్వేంద వేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామి

*¤ అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం.

*¤ చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని శెక్కిలార్ రచించిన పెరియ పురాణం గ్రంథం వివరిస్తుంది.

*¤ పెరియ పురాణం గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న పులయులు అనే నిమ్న కులం గురించి వివరించారు.

*¤ మొదటి రాజేంద్ర చోళుడు చైనా దేశానికి రెండు రాయబార బృందాలను పంపి రాజకీయ, వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు.

*¤ చోళుల కాలంలో ద్రవిడ/ దక్కన్ శైలి ఎంతో అభివృద్ధి చెందింది.

పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలు

¤* చోళుల ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి.

*¤ విజయాలయ చోళేశ్వరాలయం నార్థమలై

*¤ నాగేశ్వరస్వామి ఆలయం కుంభకోణం

*¤ కురంగనాథ ఆలయం శ్రీనివాస నల్లూరు

*¤ మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు.

*¤ చోళుల కాలంనాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది.

*¤ చోళుల అధికార మతం శైవం. (శివారాధకులు)

*¤ కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహారేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.

*¤ తంజావూరు జిల్లాలోని దారాసురాం వద్ద అయితేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.

*¤ సిబక చింతామణి, శివకాశీ నందమణి, కంబ రామాయణం లాంటి గ్రంథాలు ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి.

*¤ చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.

*¤ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యుడు ఈ యుగంలో ప్రాచుర్యం పొందారు.

*¤ కులోత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హొయసల రాజ్యానికి వెళ్లి, వైష్ణవ మతాన్ని, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు.

*¤ దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారు.

చోళుల కాలంలో దానం చేసిన భూములు  - పేర్లు

బ్రహ్మదేయ  - బ్రాహ్మణులకు దానం చేసిన భూమి

వెల్లన్ వాగై - బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి

దేవమేయ/ తిరునాముత్తక్కని - దేవాలయానికి దానం చేసిన భూమి

శాలభోగ - పాఠశాలలకు ఇచ్చిన భూమి

పళ్లిచ్చరిదం - జైన సంస్థలకు దానం చేసిన భూమి.

బృహదీశ్వర ఆలయం

తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమిళ వాస్తురీతిలో నిర్మితమైన బృహదీశ్వర ఆలయం మహోన్నతమైంది. ఈ దేవాలయ గోపురంపై అతి పెద్ద విమానాన్ని నిర్మించారు.

పరిపాలనా విశేషాలు

*¤ చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు - వలనాడులు - నాడులు - గ్రామాలుగా విభజించారు.

*¤ చోళుల పాలనలో అత్యంత విశిష్టమైంది గ్రామపాలన/ స్థానిక పాలన.

*¤ మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూర్ శాసనం నాటి స్థానిక పాలన విశేషాలను వివరిస్తుంది.

*¤ నాటి గ్రామాలను ''కుర్రం, కొట్టం'' అని కూడా పిలిచేవారు.

*¤ గ్రామాల సముదాయాన్ని 'నాడు' అనేవారు. ప్రతినాడులో సుమారు 50 గ్రామాలు ఉండేవి

*¤ నాడుల పాలన ధనవంతులైన 'వెల్లాలు' అనే రైతుల ఆధీనంలో ఉండేది.

*¤ గ్రామాన్ని కుటుంబాలు / కుడుంబాలు అనే వార్డులుగా విభజించేవారు.

*¤ గ్రామ కమిటీని వరియం / వారియం అనేవారు.

*¤ గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు నిర్ణయించారు.

అర్హతలు:

   1. సొంత ఇల్లు కలిగి ఉండాలి.

   2. శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి.

   3. 35 - 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

   4. వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి

   5. నిజాయతీపరుడై ఉండాలి.

అనర్హతలు:

   1. గతంలో వరుసగా మూడు సంవత్సరాలు గ్రామకమిటీ సభ్యుడిగా పని చేసి ఉండకూడదు.

   2. గతంలో పని చేసి లెక్కలు చూపనివారై ఉండకూడదు.

*¤ అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతలను / కమిటీని ప్రకటిస్తారు.

*¤ ఇలా ఎన్నుకున్న కమిటీని వారియం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు.

*¤ వారియం మళ్లీ ఆరు ఉపకమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది.

*¤ లాటరీద్వారా ఎన్నికైన సభ్యుడిని ఆలుముముక్కల్ అంటారు.

*¤ కుండలో వేసే పేర్ల చీటీలను 'కుడవోలై' అంటారు.

*¤ ఎన్నుకున్న గ్రామకమిటీ సభ్యుల పదవీకాలం సంవత్సరం మాత్రమే

*¤ చోళుల గ్రామపాలనలో ఉర్, సభ, నగరం/ నకరం అనే మూడు సభలు ప్రధాన పాత్ర పోషించేవి.

*¤ రైతు ప్రతినిధులతో కూడిన సభను ఉర్ అనేవారు.

*¤ బ్రాహ్మణ ప్రతినిధులు ఉండేది ''సభ''.

*¤ వ్యాపార/ వాణిజ్య/ వైశ్య ప్రతినిధులతో కూడిన సభను నగరం/ నకరం అనేవారు.

*¤ ఉన్నత అధికారులను ''ఉదంకుట్టమ్'' అని పిలిచేవారు

*¤ గ్రామసభ సాధారణంగా దేవాలయ ప్రాంగణంలో జరిగేది.

*¤ నాటి సైనిక పటలాలను కడియాలు అనేవారు.

*¤ నౌకాదళ అవసరాన్ని గుర్తించిన తొలి భారతీయ పాలకులు చోళులు.

*¤ పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలనా వ్యవస్థలను 'తాన్‌కుర్రమ్'' అనేవారు.

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌