మాదిరి ప్రశ్నలు
1. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవాడు?
జ: పోర్చుగల్
2. భారతదేశంలో డచ్వారి తొలి వర్తక స్థావరం?
జ: మచిలీపట్నం
3. అంబోయినా వధ ఏ దేశాల మధ్య జరిగిన సంఘర్షణ?
జ: డచ్, ఇంగ్లండ్
4. ఆంగ్లేయులు 'సెయింట్ డేవిడ్ కోట'ను ఎక్కడ నిర్మించారు?
జ: కడలూరు
5. ఫ్రెంచివారికి వ్యాపార అనుమతి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: ఔరంగజేబ్
6. పాండిచ్చేరి నగరాన్ని నిర్మించినవారు?
జ: ఫ్రాంకోయిస్ మార్టిన్
7. కింది అంశాలను జతపరచండి.
i) వాన్స్పెల్ట్ a) ఇంగ్లండ్
ii) విలియమ్ హాకిన్స్ b) ఫ్రాన్స్
iii) డి-ఆల్మడా c) నెదర్లాండ్స్
iv) ఫ్రాంకోయిస్ మార్టిన్ d) పోర్చుగల్
జ: i-c, ii-a, iii-d, iv-b
8. భారతదేశం నుంచి వెళ్లిన చివరి ఐరోపావాసులు?
జ: పోర్చుగల్
9. నీలి నీటి విధానాన్ని అమలు చేసింది ఎవరు?
జ: డి-ఆల్మడా
10. భారతదేశంలో మిరప, పొగాకు పంటలను ప్రవేశపెట్టినవారు?
జ: పోర్చుగీసులు
11. కాన్స్టంట్నోపుల్ను తురుష్కులు ఏ సంవత్సరంలో ఆక్రమించారు?
జ: క్రీ.శ.1453
12. నీలి నీటి విధానాన్ని అనుసరించిన పోర్చుగీసు వైస్రాయ్ ఎవరు?
జ: ఫ్రాన్సిస్ డి ఆల్మైడా
13. భారతదేశంలో డచ్చివారి మొదటి వర్తక స్థావరం ఏది?
జ: మచిలీపట్నం
14. భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి రాజధాని ఏది?
జ: కొచ్చిన్
15. భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసు వారు భారతీయ స్త్రీలను వివాహం చేసుకునేలా ప్రోత్సహించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
జ: అల్ఫోన్సో డి అల్బూకర్క్
16. విలియం హాకిన్స్ను జహంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపించిన ఇంగ్లండ్ పాలకుడు ఎవరు?
జ: మొదటి జేమ్స్
17. 1542లో గోవాను సందర్శించిన ప్రసిద్ధ క్రైస్తవ మతప్రచారకుడు ఎవరు?
జ: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్
18. ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజప్రతినిధి నుంచి మద్రాసును ఏ సంవత్సరంలో పొందాడు?
జ: క్రీ.శ.1639
19. ఆంగ్లేయులు సెయింట్ డేవిడ్ కోటను నిర్మించిన ప్రదేశం ఏది?
జ: కడలూరు
20. కిందివాటిలో ఫ్రెంచి వర్తక స్థావరం కానిది?
ఎ) సూరత్ బి) యానాం సి) చంద్రనగర్ డి) బొంబాయి
జ: డి (బొంబాయి)
రచయిత: బొత్స నాగరాజు