• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత

¤ తొలి భారతీయ, మూలభారతీయ నాగరికతను, సింధు నాగరికత అంటారు.
¤ సింధు నాగరికతను నిర్మించింది - ద్రావిడులు.
¤ సింధు నాగరికత కాలం క్రీ.పూ.2500 - క్రీ.పూ.1750.
¤ 1921 - 22లో తొలిసారిగా సింధు నాగరికత అవశేషాలు వెలుగు చూశాయి.
¤ 1922లో హరప్పా వద్ద దయారాం సహాని, మొహెంజొదారో వద్ద ఆర్.డి.బెనర్జీ తవ్వకాలు జరిపారు.
¤ సింధు నాగరికత వెలికితీతకు కారకుడు - సర్ జాన్ మార్షల్.
¤ హరప్పా, మొహెంజొదారో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాయి.
¤ హరప్పా రావి నదీతీరంలో పంజాబ్ రాష్ట్రంలోని మౌంట్ గోమరి జిల్లాలో ఉంది.
¤ మొహెంజొదారో సింధు నది ఒడ్డున సింధు రాష్ట్రంలోని లార్ఖాన జిల్లాలో ఉంది.
¤ కాళీభంగన్ రాజస్థాన్‌లో ఉంది. ఎ.ఘోష్ ఇక్కడ తవ్వకాలు జరిపారు.
¤ కాళీభంగన్ అంటే కాలిన నల్లని గాజులు అని అర్థం.
¤ మొహెంజొదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం.
¤ లోథాల్ గుజరాత్‌లో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపించింది - ఎస్.ఆర్.రావు.
¤ సింధు తవ్వకాల్లో బయటపడిన తొలి పట్టణం - హరప్పా
¤ హరప్పాలో 6 చిన్న ధాన్యాగారాలు, రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ, కార్మికుల నివాస గృహాలు, ఎక్కాగా పిలిచే ఎడ్లబండి లభించాయి.
¤ మొహెంజొదారోలో మహాస్నానవాటిక, కంచుతో చేసిన నాట్యగత్తె విగ్రహం, అతిపెద్ద ధాన్యాగారం లభించాయి.
¤ సింధు నాగరికత కట్టడాలన్నింటిలోకి పెద్దదైన అనేక స్తంభాలున్న సమావేశపు హాలు బయటపడిన ప్రాంతం - మొహెంజొదారో
¤ నాగలిచాళ్ల ఆనవాళ్లు, కాలిన మసిగుడ్డ అవశేషాలు లభించిన ప్రాంతం - కాళీభంగన్
¤ రాతివాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం - ధోలవీర
¤ గుర్రపు ఎముకల అవశేషాలు లభించిన ప్రాంతం - సుర్కటోడా
¤ కోటలేని ఏకైక సింధు పట్టణం - చన్హుదారో
¤ సిరా సీసా (Ink - Well) కనిపించిన పట్టణం - చన్హుదారో
¤ పూసల పరిశ్రమ ఆనవాళ్లు లభించిన ప్రాంతాలు - లోథాల్, చన్హుదారో
¤ వరిపంట ఆనవాళ్లు లభించిన పట్టణాలు - రంగపూర్, లోథాల్
¤ సింధు ప్రజల ప్రధాన ఓడరేవు - లోథాల్
¤ రక్షణ కుడ్యంగా రాతిగోడ ఉన్న ఏకైక నగరం - సుర్కటోడ
¤ మధ్య పట్టణం ఉన్న ఏకైక నగరం - ధోలవీర
¤ సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత
¤ సింధు ప్రజల కుటుంబ అధిపతి - తల్లి (మాతృస్వామిక వ్యవస్థ)
¤ సింధు ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం
¤ ప్రధాన పంటలు - గోధుమ, బార్లీ
¤ ప్రధాన దైవం - అమ్మతల్లి, ప్రధాన పురుషదైవం - పశుపతి
¤ ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది - సింధు ప్రజలు
¤ తొలిసారిగా కాల్చిన ఇటుకలను వాడింది - సింధు ప్రజలు
¤ ప్రధాన వీధులు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉండేవి.
¤ తూర్పు ఎత్తైన ప్రాంతాల్లో ఉండే భవనాలు - ప్రభుత్వ భవనాలు
¤ పశ్చిమ ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవి - కోటలు, దుర్గాలు
¤ సామాన్యుల  గృహాలు తూర్పు పల్లపు ప్రాంతాల్లో ఉండేవి.
¤ సింధు పట్టణాల్లో రోడ్ల వెడల్పు (వీధుల వెడల్పు) 3 - 10 మీటర్లు.
¤ పెద్దవీధులు 34 అడుగుల వెడల్పుతో ఉంటే, చిన్నవీధులు 9 అడుగుల వెడల్పుతో ఉండేవి.
¤ సింధు ప్రజల లిపి - బొమ్మల లిపి
¤ సింధు లిపి రాసే విధానం - సర్పలేఖనం
¤ సింధు లిపిలో మొదటివరుస ఎడమ నుంచి కుడికి, రెండో వరుస కుడి నుంచి ఎడమకు ఉండేది (సర్పలేఖనం).
¤ సింధు ప్రజలు పూజించిన జంతువు - మూపురం ఉన్న ఎద్దు
¤ పూజించిన చెట్టు - రావిచెట్టు
¤ పూజించిన పక్షి - పావురం
¤ ఎక్కువగా ఉపయోగించిన లోహాలు - రాగి, వెండి
¤ సింధు ప్రజలకు తెలియని లోహం - ఇనుము
¤ భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఆర్యులు 1500 BC లో ఉపయోగించారు.
¤ సింధు ప్రజలకు తెలియని జంతువు - గుర్రం
¤ గుర్రం ఎముకలుగా భావిస్తున్న ఆనవాళ్లు సుర్కటోడాలో లభించాయి.
¤ వీరి కాలంనాటి ముద్రికలను బంకమన్ను, దంతం, స్టిటైట్‌రాయితో తయారుచేశారు.
¤ సింధు ప్రజలు ఎక్కువగా మెసపటోమియా (ఇరాక్)తో విదేశీ వ్యాపారం నిర్వహించారు.
¤ బంగారాన్ని కోలార్, అనంతపురం నుంచి దిగుమతి చేసుకునేవారు.
¤ రాగిని రాజస్థాన్, బెలుచిస్థాన్‌ల నుంచి దిగుమతి చేసుకునేవారు.
¤ వెండిని అఫ్గనిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
¤ తగరాన్ని బిహార్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
¤ పర్షియా (ఇరాన్) నుంచి పచ్చలు దిగుమతి చేసుకునేవారు.
¤ సింధు, మెసపటోమియా రాజ్యాల మధ్య ప్రధాన వాణిజ్య కేంద్రం - మెలూహ
¤ సింధు నాగరికత కాలం నాటి ఎద్దుబొమ్మ ముద్రిక గురించి 1875 లోనే వ్యాసం రాసిన చరిత్రకారుడు - అలెగ్జాండర్ కన్నింగ్‌హాం
¤ సింధు లిపి నుంచే తమిళ భాష పుట్టింది అన్నది - ఫాదర్ హీరాస్
¤ సింధు లిపి నుంచే బ్రాహ్మీ లిపి పుట్టింది అన్నది - కన్నింగ్ హాం
¤ ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైందనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించినవారు - వీలర్, గోర్డన్ చైల్డ్
¤ సింధు నాగరికతపై రోమిలా థాపర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు:
    1) సింధు నాగరికత మూడు దశలు/అంచెలు ఉన్నాయి.
    2) సింధు ప్రజలకు గుర్రం తెలియదు.
   3) సింధు ప్రజలు వరిని పండించేవారు.
¤ 'సింధు ప్రజల కాలంలో వరిసాగు లేదు' అన్నది - ఎ.ఎల్. భాషం.
¤ 'సింధు ప్రజలు యోని - లింగ పూజ చేసేవారు' అన్నది - సర్‌జాన్ మార్షల్.
¤ సర్ జాన్ మార్షల్ యోని - పూజ సిద్ధాంతాన్ని తిరస్కరించింది - ఎఫ్.డేల్స్.
¤ భారతదేశంలో అధిక సింధు నాగరికత పట్టణాలు బయటపడిన రాష్ట్రం - గుజరాత్.
¤ సింధు ముద్రికలపై (270) అధికంగా ముద్రించిన జంతువు - వృషభం.
¤ కాల్చిన మట్టి బొమ్మలను టెర్రాకోట బొమ్మలుగా పేర్కొంటారు.
¤ సతీసహగమన ఆచారాన్ని సూచించే ఆనవాళ్లు లభించిన ప్రాంతం లోథాల్.
¤ టెర్రాకోట బొమ్మలపై కనిపించని జంతువు ఆవు.
¤ సింధు కాలంనాటి కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉండేవి.
¤ చదరంగం ఆటకు సంబంధించిన ఆనవాళ్లు లభించిన ప్రాంతం - లోథాల్.
¤ నాటి ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి.
¤ నేసిన నూలు వస్త్రం ముక్క (మసిబట్ట) లభించిన ప్రాంతం కాళీభంగన్.
¤ ఇంగ్లిష్ బాండ్‌గా పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టింది సింధు ప్రజలు.
¤ స్త్రీలు పెదాలకు రంగులు (లిప్‌స్టిక్) వాడేవారని పేర్కొన్న చరిత్రకారుడు - ఆర్.సి.మజుందార్.
¤ సింధు ప్రజలు లాపిజ్‌లాజులి అనే ప్రత్యేక రాతిని ఉత్తర అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
¤ నటరాజ విగ్రహాన్ని పోలిన రాతి విగ్రహం లభించిన ప్రాంతం హరప్పా.
¤ స్త్రీల మర్మాంగాలను పోలిన రాళ్లు హరప్పా పట్టణంలో లభించాయి.
¤ ఏనుగును మచ్చిక చేసుకున్నట్లు గుజరాత్ ప్రాంతంలో ఆధారాలు లభించాయి.
¤ జంతు బలి అవశేషాలు లభించిన ప్రాంతం కాళీభంగన్.
¤ పులిబొమ్మను పోలిన జంతువు ఉన్న టెర్రాకోట ముద్రిక లభించిన ప్రాంతం బన్వాలి.
¤ సింధు నాగరికతను నిర్మూలించిన వారు ఆర్యులు.

 

ఆర్య నాగరికత
మలి వేదకాలం క్రీ.పూ. 1000 - 600

 

¤ మలి వేదకాలంలో ఆర్యులు గంగా - యమునా అంతర్వేదిలో నివసించేవారు.
¤ మలివేద ఆర్యుల వలసను బ్రాహ్మణాలు వివరిస్తాయి.
¤ మలివేద కాలంలో రాజును సామ్రాట్ అని పిలిచేవారు.
¤ రాజ్యాన్ని మహా జనపథం అనేవారు.
¤ రాజుకు పాలనలో సహాయపడే ఉద్యోగులను రత్నిన్‌లు అనేవారు.
¤ పన్ను వసూలు అధికారిని భాగదుషు అనేవారు.
¤ కోశాధికారిని సంగ్రహితగా పేర్కొనేవారు.
¤ గణకుడు / గణాంకాధ్యక్షుడిని అక్షవాస అనేవారు (జూద గృహంపై అధిపతి)
¤ పోలీసు విధులు నిర్వహించే వ్యక్తిని అధికృతగా పేర్కొనేవారు.
¤ రాజులు రాజసూయ, అశ్వమేధ, వాజపేయం లాంటి యజ్ఞ యాగాలను మలి వేదకాలంలోనే ప్రారంభించారు.
¤ మలి వేదకాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయంగా మారింది.
¤ వరి, గోధుమ, బార్లీ, పత్తి లాంటి పంటలను పండించేవారు.
¤ వడ్రంగం, లోహపు పని, చర్మాలను శుద్ధి చేయడం, నేత, కుండలు చేయడం లాంటి పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.
¤ మలి వేదకాలంలో దంతపు పని (ట్యానింగ్ పరిశ్రమ) లేదు.
¤ శతమాన, కర్షాపణ (కృష్ణాలు) లాంటి నాణేలు వాడేవారు.
¤ వర్ణ వ్యవస్థ క్లిష్టమైంది. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఆవిర్భవించాయి.
¤ వర్ణాశ్రమ ధర్మాలు నాలుగు మలి వేదకాలంలో అభివృద్ధి చెందాయి.
¤ వర్ణాశ్రమ ధర్మాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది ఐతరేయ బ్రాహ్మణం.
¤ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం ధర్మాలను ఛాందోగ్యోపనిషత్తు వివరించగా, సన్యాసంతో సహా నాలుగు ఆశ్రమ ధర్మాలను 'జాబాలోపనిషత్తు' వివరించింది.
¤ గోత్ర వ్యవస్థ మలి వేదకాలంలోనే (అధర్వణ వేదం) ఆవిర్భవించింది.
¤ స్త్రీ స్థానం దిగజారింది. వంటింటికే పరిమితమైంది. బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి.
¤ మలి వేదకాలంలో త్రిమూర్తుల ఆరాధన ప్రధానంగా ఉండేది.
¤ రుగ్వేదంలోనే 33 మంది దేవుళ్ల ప్రస్తావన కనిపిస్తుంది.
¤ అగ్ని దేవుడిని రెండో అతి ముఖ్యమైన దేవుడిగా పేర్కొన్నారు. 'అగ్ని'ని దేవతలకు, ప్రజలకు మధ్యవర్తిగా ప్రస్తావించారు.
¤ సోమ, సుర అనే మత్తు పానీయాలను ఆర్యులు సేవించేవారు.
¤ సోమను యజ్ఞ యాగాల సమయంలో, సురను అన్నివేళలా సేవించేవారు.
¤ వస, అధివస అనే దుస్తులను ఆర్యులు ధరించేవారు.
¤ వేదకాలంలో అతిథిని గోఘన అని పిలిచేవారు.
¤ ధాన్యాన్ని వృహి అని, ఇనుమును అయస్ అని పిలిచేవారు.
¤ ఆర్య నాగరికతను దక్షిణా పథంలో విస్తరింపజేసింది అగస్త్యుడు.
¤ 'యుద్ధం ఎల్లప్పుడూ మానవ హృదయాల్లో ప్రారంభమవుతుంది' అని అధర్వణ వేదం పేర్కొంది.
¤ మలివేద కాలం నాటికి రాజు అధికారాలు బలపడినట్లు శతపథ బ్రాహ్మణం వివరిస్తుంది.
¤ రుగ్వేద కాలంలో వర్ణం అంటే వర్గం అని అర్థం. కానీ మలి వేదకాలంలో వర్ణం అంటే కులం అని అర్థం.
¤ మలివేద కాలం నాటి శూద్రుల ప్రత్యేక దైవంగా పుషాన్‌ను పేర్కొంటారు.
¤ సీతను నాగలి దేవతగా పేర్కొంటారు.
¤ 'ఉపనయన' క్రతువు గురించి శతపథ బ్రాహ్మణం వివరించింది.
¤ హిందూ మతంలో 44 సంస్కారాలు ఉండేవి.
¤ మలి వేదకాలంలో రాజ్యాలు, భూముల ఆక్రమణల కోసం యుద్ధాలు జరిగేవి.
¤ ఉపనయన సంస్కారం పొందే అర్హత కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలను 'ద్విజులు' అని పిలిచారు.
¤ వడ్డీ వ్యాపారం గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొన్నారు.
¤ విధాత అనేది పురాతమైన గిరిజన/ ఆటవిక జాతుల సభ. మలివేద కాలంలో ఈ సభ అదృశ్యమైంది.

 

 

రచయిత: బొత్సనాగరాజు

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌