మాదిరి ప్రశ్నలు
1. స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడెవరు?
జ: సాదతుల్లా ఖాన్
2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్
3. హైదర్ ఆలీ ఏ మైసూర్ యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో మైసూరు యుద్ధం
4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజుద్దౌలాను బంధించి, చంపిన వ్యక్తి ఎవరు?
జ: మిరాన్
5. బక్సర్ యుద్ధ హీరో ఎవరు?
జ: హెక్టార్ మన్రో
6. చీకటిగది ఉదంతంగా పేర్కొనే సంఘటన జరిగిన ప్రదేశం ఏది?
జ: కలకత్తా
7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్
8. పోర్టో నోవో యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1781
9. టిప్పు సుల్తాన్ మరణించిన సంవత్సరం?
జ: 1799
10. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు
11. ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైన సంవత్సరం?
జ: 1756
12. బక్సర్ యుద్ధంలో పాల్గొనని భారతీయ పాలకుడు ఎవరు?
ఎ) మీర్ ఖాసిం బి) షూజా ఉద్దౌలా సి) రెండో ఆలం షా డి) అన్వరుద్దీన్
జ: డి) అన్వరుద్దీన్
13. వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ ఎవరి చేతిలో ఓడిపోయాడు?
జ: సర్ ఐర్కుట్
14. ప్లాసీ యుద్ధంలో ప్రేక్షకపాత్ర వహించిన సిరాజుద్దౌలా సేనానులు?
ఎ) మీర్ జాఫర్ బి) యార్ లుతుఫ్ ఖాన్
సి) రాయ్ దుర్లబ్ డి) పై ముగ్గురూ
జ: డి (పై ముగ్గురూ)
15. బక్సర్ యుద్ధానికి ప్రధాన కారణం?
ఎ) 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం.
బి) నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం
సి) 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం, నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం
డి) ఏదీకాదు
జ: 1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం, నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం