• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర స్వాతంత్రోద్యమం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?

జ: గాజుల లక్ష్మీనరసు



2. మద్రాస్ రామమోహన్‌రాయ్ గా పేరొందిన వ్యక్తి-

జ: గాజుల లక్ష్మీనరసు



3. 1885లో ఆంధ్రప్రకాశిక అనే తొలి రాజకీయ వారపత్రికను ఎవరు ప్రారంభించారు?

జ: పార్థసారధి నాయుడు



4. దారితప్పి రాజకీయాల్లోకి వచ్చిన పండితుడు గా పేరొందిన భారతీయుడు ఎవరు?

జ: తిలక్



5. 1886 రెండో జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంత మంది ఆంధ్ర ప్రతినిధులు హాజరయ్యారు?

జ: 21


6. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు?

జ: పి. ఆనందాచార్యులు

7. ఆంధ్రదేశంలో ఏర్పడిన తొలి జిల్లా కాంగ్రెస్ సంఘం ఏది?

జ: కృష్ణా


8. కిందివారిలో భారత జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేసిన ఆంధ్రుడు ఎవరు?

1) కొండా వెంకటప్పయ్య             2) పి. ఆనందాచార్యులు

3) న్యాపతి సుబ్బారావు             4) భోగరాజు పట్టాభి సీతారామయ్యజ: 3 (న్యాపతి సుబ్బారావు)


9. 1905 మద్రాస్ బీచ్ సమావేశంలో దేశభక్తి గీతాలు పాడిన వ్యక్తి-

జ: సుబ్రహ్మణ్య భారతి



10. వందేమాతరం ఉద్యమ కాలంలో ఆంధ్ర యువకులను జపాన్ పంపడానికి కృషిచేసింది ఎవరు?

జ: వింజమూరి భావనాచారి



11. వందేమాతరం ఉద్యమ కాలంలో రాజమండ్రిలో జాతీయ ఉన్నత పాఠశాలను ఎవరు స్థాపించారు?

జ: న్యాపతి సుబ్బారావు



12. ఆంధ్రలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఎవరు ఏర్పాటు చేశారు?

జ: ముట్నూరి కృష్ణారావు


13. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్‌కు ఎవరు ఆతిథ్యం ఇచ్చారు?

జ: మాదెల్ల సారయ్య


 

14. పాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదిస్తూ 'భరతఖండంబు చక్కని పాడియావు' గీతాన్ని ఆలపించింది ఎవరు?

జ: చిలకమర్తి లక్ష్మీ నరసింహం



15. రాజమండ్రి పాల్ సభల్లో వందేమాతరం గీతాన్ని పాడినవారు-

జ: కౌతా శ్రీరామమూర్తి


16. మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్‌కు ఆతిథ్యం ఇచ్చింది ఎవరు?

జ: రామదాసు నాయుడు

17. వందేమాతర ఉద్యమకాలంలో ఏర్పడిన సంస్థలు, ప్రదేశాలను జతపరచండి.

1) స్వరాజ్య సమితి                        a) మచిలీపట్నం

2) బాలభారత సమితి                    b) కాకినాడ

3) మహిళాభారతి సంఘం              c) విశాఖపట్నం

4) రక్షణలీగ్                                  d) రాజమండ్రి

జ: 1-a, 2-d, 3-c, 4-b


18. బందరు జాతీయ కళాశాలకు తొలి ప్రిన్సిపల్ ఎవరు?

జ: కోపల్లె హనుమంతరావు

19. మీర్జాపురం జమీందారుపై రైతులు వేసిన కేసులో ఉచితంగా వాదించింది-

జ: వి. రామదాసు పంతులు



20. వందేమాతర ఉద్యమ కాలంలో జపాన్ చరిత్ర అనే గ్రంథాన్నిఎవరు రాశారు?

జ: ఆదిపూడి సోమనాథరావు



21. హిందూ దేశ దారిద్య్రం గ్రంథాన్ని ఎవరు రచించారు?

జ: అత్తిలి సూర్యనారాయణ



22. 'రాజమండ్రి కళాశాల సంఘటన విద్యార్థులు రాజకీయాల్లో చేరడానికి నాంది పలికింది' అని అన్నదెవరు?

జ: సరోజిని రేగాని

23. రాజమండ్రి కళాశాలలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఉద్యోగానికి పనికిరాడని టి.సి.పై రాసిన ప్రిన్సిపాల్ ఎవరు?

జ: మార్క్‌హంటర్


24. కాకినాడ కొట్లాట కేసులో నిందితుల తరఫున వాదించిన న్యాయవాది ఎవరు?

జ: న్యాపతి సుబ్బారావు



25. కాకినాడ కొట్లాట కేసుకు కారకుడైన ఆంగ్ల అధికారి ఎవరు?

జ: కెప్టెన్ కెంప్

26. కాకినాడ కొట్లాట కేసు అరెస్టులకు నిరసనగా జరిగిన సభకు అధ్యక్షత వహించినదెవరు?

జ: కె. పేర్రాజు



27. వందేమాతర ఉద్యమ కాలంలో అరెస్టయిన తొలి ఆంధ్ర రాజకీయ ఖైదీ ఎవరు?

జ: గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

28. కోటప్ప కొండ సంఘటన ఎప్పుడు జరిగింది?

జ: 1909, ఫిబ్రవరి 18

29. కోటప్ప కొండ సంఘటనలో ఉరితీసిన చిన్నపరెడ్డి స్వగ్రామం

జ: చేబ్రోలు

30. తెనాలి బాంబుకేసు ఏ ఉద్యమ కాలంలో జరిగింది

జ: వందేమాతర ఉద్యమం

Posted Date : 29-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌