మాదిరి ప్రశ్నలు
1. ముసునూరి నాయకుల చరిత్రకు ఆధారం-
1) విలస తామ్రశాసనం 2) పోలవరం శాసనం 3) కలువ చెరువు శాసనం 4) అన్నీ సరైనవే
జ: 4(అన్నీ సరైనవే)
2. ముసునూరి వంశ స్థాపకుడు
జ: ప్రోలయనాయకుడు
3. ముసునూరి నాయక రాజ్య రాజధాని-
జ: రేఖపల్లి
4. 'ఆంధ్రసురత్రాణ' బిరుదాంకితుడు
జ: కాపయ
5. రేచర్ల పద్మనాయక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరు?
జ: మొదటి సింగమనాయక
6. దేవరకొండ రాజధానిగా పాలించిన రేచర్ల పద్మనాయక రాజు-
జ: మాదానీడు
7. రేచర్ల సింగమ నాయకుడి రాజధాని-
జ: పిల్లలమర్రి
8. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందినవాడు-
జ: రెండో సింగమనాయక
9. 1368 నాటి భీమవరం యుద్ధంలో కాపయనాయకుడిని వధించిన పద్మనాయక రాజు
జ: అనవోతానీడు
10. కాపయ నాయకుడి రాజధాని
జ: వరంగల్లు
11. కోరుకొండ దుర్గాన్ని నిర్మించిన ముసునూరి పాలకుడు
జ: కాపయనాయకుడు
12. కిందివాటిని జతపరచండి.
1) ఆంధ్ర సురత్రణ ఎ) అనవోతానీడు
2) సర్వజ్ఞ చక్రవర్తి బి) మొదటి సింగమనాయక
3) సర్వజ్ఞ సింగభూపాలుడు సి) రెండో సింగమనాయక
4) సోమకులపరశురామ డి) కాపనాయకుడు
జ: 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
13. చమత్కార చంద్రిక గ్రంథ రచయిత ఎవరు?
జ: విశ్వేశ్వరుడు
14. సంగీత సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: సర్వజ్ఞ సింగముడు
15. కాపయ నాయకుడి కాలంలో 'సకల నీతిసారం' అనే గ్రంథాన్ని రాసినదెవరు?
జ: మడికి సింగన
16. రెడ్డి రాజ్య స్థాపకుడు
జ: ప్రోలయ వేమారెడ్డి
17. ప్రోలయ వేమారెడ్డి ముసునూరి కాపయ ఆస్థానంలో ఉన్నట్లు తెలిపే ఆధారం
జ: కలువచేరు శాసనం
18. కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడు, రాజధాని
జ: ప్రోలయ వేమారెడ్డి, అద్దంకి
19. శ్రీశైలంలో పాతాళ గంగకు, అహోబిలం కొండకు మెట్లు కట్టించినవారు?
జ: ప్రోలయ వేమారెడ్డి
20. ప్రోలయ వేమారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించిన అతడి సోదరుడు
జ: మల్లారెడ్డి
21. ఎర్రాప్రగడ, శ్రీగిరి పండితులను పోషించిన రెడ్డిరాజు-
1) పెదకోమటి వేమారెడ్డి 2) అనవేమారెడ్డి 3) కుమారగిరి రెడ్డి 4) ఎవరూకాదు
జ: 4(ఎవరూకాదు)
22. రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చినదెవరు?
జ: అనపోతారెడ్డి
23. శ్రీశైల శిలాశాసనం ఏ రెడ్డి రాజు విజయాలను వివరిస్తుంది?
జ: అనవేమారెడ్డి
24. గొట్టివాడ గ్రామాన్ని సింహాచలేశుడికి దానం చేసినదెరు?
జ: చెన్నమ నాయకుడు
25. శ్రీశైలం, సింహాచలంలో వీరశిరోమండపాలు నిర్మించిన రెడ్డిరాజు-
జ: అనవేమారెడ్డి
26. కిందివాటిని జతపరచండి.
1) వసంతరాయలు ఎ) అనవేమారెడ్డి
2) కర్పూర వసంతరాయలు బి) కుమారగిరిరెడ్డి
3) ద్వీపజేత, జగనొబ్బగండ సి) ప్రోలయవేమారెడ్డి
4) మ్లేచోబ్ధి కుంభోద్భవ డి) అనవోతారెడ్డి
జ: 1-ఎ, 2-బి; 3-డి; 4-సి
27. కిందివాటిని జతపరచండి.
1) నవనాథ చరిత్రం ఎ) ఎర్రాప్రగడ
2) నృసింహపురాణం బి) శ్రీ గిరి దేవయ్య
3) విష్ణుపురాణం సి) కుమారిగిరి రెడ్డి
4) వసంతరాజీయం డి) వెన్నెలకంటి సూరన
జ: 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
28. లకుమాదేవి అనే నర్తకి ఎవరి ఆస్థానంలో ఉండేది?
జ: కుమారగిరి రెడ్డి
29. శ్రీనాథుడి 'హరివిలాసం' గ్రంథం ప్రకారం కుమారగిరి కాలంనాటి వసంతోత్సవాలను నిర్వహించింది?
జ: అవచి తిప్పయ్య శెట్టి
30. రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని స్థాపించినదెవరు?
జ: కాటయ వేమారెడ్డి
31. 1416లో మోటుపల్లిలో అభయశాసనం వేయించిన పాలకుడు ఎవరు?
జ: రెండో దేవరాయలు
32. శివలీలా విలాసం గ్రంథ రచయిత ఎవరు?
జ: శివలెంకకొమ్మన
33. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో నిర్వహించిన పదవి-
జ: ఆస్థాన విద్యాధికారి
34. 'సంగీత చింతామణి, సాహిత్య చింతామణి' లాంటి గ్రంథాలు రచించిన రెడ్డిరాజు-
జ: పెదకోమటి వేమారెడ్డి
35. ఫిరంగిపురం వద్ద సంతానసాగరం చెరువును తవ్వించినదెవరు?
జ: సూరాంబిక
36. శ్రీనాథుడు తన 'శృంగార నైషథం' గ్రంథాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
జ: మామిడి సింగన
37. పురిటి సుంకం విధించిన రెడ్డిరాజు
జ: రాచ వేమారెడ్డి
38. అద్దంకి వీధుల్లో సవరం ఎల్లయ్య అనే బలిజనాయకుడి చేతిలో హతమైన రెడ్డిరాజు-
జ: రాచవేమారెడ్డి
39. కుమారగిరి రాజీయం గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: కాటయవేమారెడ్డి
40. మూడో అనవోతారెడ్డి రాజధాని రాజమండ్రి అని వివరిస్తున్న శాసనం-
జ: కొమ్ముచిక్కాల
41. ధరణికోట యుద్ధంలో బహమనీ సుల్తాన్ హసన్ గంగూను ఓడించినదెవరు?
జ: మల్లారెడ్డి
42. గ్రామ అధికారులైన 12 మంది ఆయగాండ్రుల్లో 'ఆరెకుడు'గా ఎవరిని పిలుస్తారు?
జ: తలారి