1. భారతదేశంలో మిశ్రమ ఆర్థిక విధానాన్ని దేని ద్వారా ప్రవేశపెట్టారు?
1) 1948 నాటి పారిశ్రామిక తీర్మానం
2) 1956 నాటి పారిశ్రామిక తీర్మానం
3) 1977 నాటి పారిశ్రామిక తీర్మానం
4) 1991 నాటి పారిశ్రామిక తీర్మానం
2. న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతి ‘కొలీజియం’ సలహాను పొందాలని 1999లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య?
1) 7 2) 9 3) 11 4) 13
3. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తగినంత నష్టపరిహారం చెల్లించలేదనే కారణంతో సంబంధిత వ్యక్తులు న్యాయస్థానాలను ఆశ్రయించకూడదని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?
1) 3వ రాజ్యాంగ సవరణ చట్టం, 1952
2) 4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955
3) 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956
4) 16వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963
4. కిందివాటిలో ఆర్డినెన్స్ జారీకి సంబంధించి సరైంది ఏది?
1) ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేస్తారు.
2) ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ జారీ చేస్తారు.
3) ఆర్టికల్ 239(B) ప్రకారం కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేస్తారు.
4) పైవన్నీ
5. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ‘న్యాయసమీక్ష’ (Judicial review) పరిధి నుంచి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు?
1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
2) 25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971
3) 29వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975
4) 39వ రాజ్యాంగ సరవణ చట్టం, 1975
6. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా రాజ్యాంగంలో చేసిన మార్పులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.
1) రాజ్యాంగానికి IV(A) అనే భాగాన్ని చేర్చి, దానిలో ప్రాథమిక విధులను పొందుపరిచారు.
2) రాజ్యాంగానికి XIV(A) అనే భాగాన్ని చేర్చి, దానిలో పరిపాలనా ట్రైబ్యునల్స్ను పేర్కొన్నారు.
3) ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ చేసే రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్ చేయకూడదని నిర్దేశించారు.
4) పైవన్నీ
7. కేశవానంద భారతి జు( స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా రాజ్యాంగాన్ని సవరించకూడదు.
2) న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించకూడదు.
3) రాజ్యాంగమే సర్వోన్నతమైంది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు.
4) పైవన్నీ
8. 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978ని ఏ ప్రధాని కాలంలో చేశారు? (ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలంటే కేంద్ర కేబినెట్ లిఖితపూర్వక సలహా తప్పనిసరి అని అందులో పేర్కొన్నారు.)
1) ఇందిరాగాంధీ 2) మొరార్జీదేశాయ్
3) చరణ్సింగ్ 4) లాల్ బహదూర్ శాస్త్రి
9. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?
1) 50వ రాజ్యాంగ సవరణ చట్టం, 1984
2) 59వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988
3) 77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995
4) 78వ రాజ్యాంగ సవరణ చట్టం, 1996
10. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంటోంది?
1) ఆర్టికల్ 15(4)(A) 2) ఆర్టికల్ 16(4)(A)
3) ఆర్టికల్ 17(4)(A) 4) ఆర్టికల్ 14(4)(B)
11. 1984లో 50వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎవరి ప్రాథమిక హక్కులను నియంత్రించే అధికారం పార్లమెంట్కు కల్పించారు?
1) విదేశీ రాయబారులు
2) ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు
3) సాయుధ దళాలు
4) రాజకీయ పార్టీల నాయకులు
12. కిందివాటిలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978కి సంబంధించి సరైంది ఏది?
1) ఆర్టికల్స్ 19, 22, 30, 31(A), 31(C) లను సవరించారు.
2) ఆర్టికల్ 31లో పేర్కొన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
3) ఆర్టికల్ 300్బత్శిలో ఆస్తిహక్కును సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్చారు.
4) పైవన్నీ
13. 1977లో ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల్లో లేనివి?
1) మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్
2) పంజాబ్, బిహార్, హిమాచల్ప్రదేశ్
3) మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు
4) పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, హరియాణా
14. రాజ్మన్నార్ కమిటీని 1969లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? (కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం దీన్ని ఏర్పాటు చేశారు.)
1) తమిళనాడు 2) పశ్చిమ్ బెంగాల్
3) కేరళ 4) రాజస్థాన్
15. 1980లో ఆర్టికల్ 356 ద్వారా రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వాల్లో లేనివి?
1) తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్
2) కేరళ, బిహార్, అరుణాచల్ ప్రదేశ్
3) ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్
4) బిహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్
16. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను 100 సార్లకు పైగా దుర్వినియోగం చేశారని ఏ కమిషన్ తన నివేదికలో పేర్కొంది?
1) రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్
2) సర్కారియా కమిషన్
3) ఎల్.ఎం.సింఘ్వీ కమిషన్
4) బి.పి.మండల్ కమిషన్
17. ‘బిహార్ రాష్ట్రంలో అమలు చేసిన భూసంస్కరణలు చెల్లుబాటు కావు’ అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ప్రకటించింది?
1) రామేశ్వర్ ఠాకూర్ Vs స్టేట్ ఆఫ్ బిహార్
2) కామేశ్వరి సింగ్ Vs స్టేట్ ఆఫ్ బిహార్
3) రాజ్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ బిహార్
4) మేనకా గాంధీ Vs స్టేట్ ఆఫ్ బిహార్.
18. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కు లేదని, ఒకవేళ సవరించాలనుకుంటే నూతనంగా రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1) గోలక్నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
2) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
3) ఎస్.ఆర్.బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) రఘురాం దేశాయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు.
19. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన బ్యాంకుల జాతీయీకరణకు సంబంధించి కిందివాటిలో సరైంది?
1) 1969లో 14 ప్రైవేట్ వాణిజ్య బ్యాంక్లను జాతీయం చేశారు.
2) 1980లో 6 ప్రైవేట్్ వాణిజ్య బ్యాంక్లను జాతీయం చేశారు.
3) 1984లో 7 ప్రైవేట్ వాణిజ్య బ్యాంక్లను జాతీయం చేశారు.
4) 1, 2 సరైనవి
20. 1970లో మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఇస్తున్న రాజభరణాలను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ను జారీచేసిన అప్పటి భారత రాష్ట్రపతి ఎవరు?
1) జాకీర్ హుస్సేన్ 2) వి.వి.గిరి
3) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
4) జ్ఞానీ జైల్ సింగ్
21. ఆదేశిక సూత్రాల అమలు కోసం రాజ్యాంగానికి చేసే సవరణ చట్టాలను ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయకూదని, ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో ఎక్కడ నిర్దేశించింది?
1) ఆర్టికల్ 368, సెక్షన్ 4
2) ఆర్టికల్ 369, సెక్షన్ 4
3) ఆర్టికల్ 371, సెక్షన్ 4
4) ఆర్టికల్ 372, సెక్షన్ 4
22. 1998లో కొలీజియం వ్యవస్థపై ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరిన అప్పటి భారత రాష్ట్రపతి ఎవరు?
1) శంకర్దయాళ్ శర్మ 2) కేఆర్ నారాయణన్
3) జ్ఞానీ జైల్ సింగ్ 4) ఆర్ వెంకట్రామన్
23. పార్లమెంట్లో 121వ రాజ్యాంగ సవరణ బిల్లును దేనికోసం ప్రవేశపెట్టారు?
1) National judges appointment commission
2) Judjes appointment committe
3) Judiciary review commission
4) Judges action team
సమాధానాలు: 1-1; 2-2; 3-2; 4-4; 5-4; 6-4; 7-4; 8-2; 9-3; 10-2; 11-3; 12-4; 13-3; 14-1; 15-2; 16-1; 17-2; 18-1; 19-4; 20-2; 21-1; 22-2; 23-1.