1. భారతదేశంలో ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
జ: మింటో-మార్లే సంస్కరణల చట్టం - 1909
2. భారత్లో మత నియోజక వర్గాల పితామహుడని ఎవరిని పేర్కొంటారు?
జ: లార్డ్ మింటో
3. మన దేశంలో రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్-చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం - 1919
4. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే లక్ష్యమని ఏ చట్టంలో పేర్కొన్నారు?
జ: మాంటేగ్-చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం - 1919
5. కేంద్ర శాసనసభలో మొదటిసారి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్-చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం - 1919
6. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమితులైన తొలి భారతీయుడు?
జ: సత్యేంద్ర ప్రసాద్ సిన్హా
7. మాంటేగ్-చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం - 1919ను ‘సూర్యుడులేని ఉదయం’ అని ఎవరు అభివర్ణించారు?
జ: బాలగంగాధర్ తిలక్
8. మాంటేగ్-చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం - 1919కు సంబంధించి సరైంది?
1) కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరుచేశారు.
2) లండన్లో భారత హైకమిషనర్ పదవిని ఏర్పాటు చేశారు.
3) సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరుచేశారు.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
9. రాష్ట్రాల్లోని ‘ద్వంద్వ ప్రభుత్వ’ విధానాన్ని ఏ చట్టం రద్దు చేసింది?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935
10. భారత ప్రభుత్వ చట్టం - 1935కు సంబంధించి సరైంది.
1) కేంద్రం, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొటుంది.
2) రాష్ట్రస్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది.
3) దిల్లీలో ఫెడరల్ కోర్ట్ను ఏర్పాటు చేసింది.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)
రచయిత - బంగారు సత్యనారాయణ