• facebook
  • whatsapp
  • telegram

శాసనోల్లంఘన ఉద్యమం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1929 లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
సమాధానం: జవహర్‌లాల్ నెహ్రూ

 

2. గాంధీజీ దండి యాత్రను ఏ రోజున ప్రారంభించారు?
సమాధానం: మార్చి 12, 1930

 

3. తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: సి. రాజగోపాలాచారి

 

4. ఈశాన్య రాష్ట్రాల్లో శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: రాణి గైడిన్ ల్యూ

 

5. ఖుదై ఖిద్మత్ గార్స్ దళాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
సమాధానం: ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్

 

6. ఢాకాలో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏయే వర్గాలు పాల్గొన్నాయి?
సమాధానం: ముస్లిం నాయకులు, బలహీనవర్గాలు

 

7. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నాయకుడు ఎవరు?
సమాధానం: తేజ్ బహదూర్ సప్రూ

 

8. గాంధీ - ఇర్విన్ ఒప్పందంలో భాగంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి?
సమాధానం: సుభాష్‌చంద్ర బోస్

 

9. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు?
సమాధానం: మెక్ డొనాల్డ్

 

10. గాంధీజీ, అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం జరగడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు?
సమాధానం: మదన్ మోహన్ మాలవీయ

 

11. గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఇచ్చింది ఎవరు?
సమాధానం: రవీంద్రనాథ్ ఠాగూర్

 

12. దండి సత్యాగ్రహంతో సంబంధం ఉన్న దండి గ్రామం గుజరాత్‌లోని ఏ జిల్లాలో ఉంది?
సమాధానం: నౌసారి

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌