1. ‘‘మడ్డీమాన్ కమిటీ - 1924’’కి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) ‘‘మాంటేగ్ - చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం - 1919’’ అమలు తీరును సమీక్షించేందుకు ఉద్దేశించింది.
బి) అలెగ్జాండర్ మడ్డీమాన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ కమిటీలో 9 మంది సభ్యులు ఉన్నారు.
సి) ఈ కమిటీ ద్వంద్వ పాలనను సమర్థించింది.
డి) ఏకాభిప్రాయంతో తన నివేదికను సమర్పించింది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
జ: ఎ, బి, సి
2. ‘‘సైమన్ కమిషన్ - 1927’’కి సంబంధించి సరైంది?
ఎ) సర్ జాన్ సైమన్ నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు.
బి) ఈ కమిషన్ను ఏర్పాటు చేసిన నాటి బ్రిటన్ ప్రధాని బాల్డ్విన్
సి) ఈ కమిషన్లో ఉన్న ఏకైక భారతీయుడు తేజ్బహదూర్ సప్రూ
డి) 1930లో ఇది నివేదికను సమర్పించింది
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
జ: ఎ, బి, డి
3. సైమన్ కమిషన్ నివేదికలోని అంశాలను గుర్తించండి.
ఎ) భారత్లో సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలి.
బి) భాషా ప్రాతిపదికన ఒడిశా, సింధూ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.
సి) భారతీయులకు సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రాథమిక హక్కుల నిరాకరణ సమంజసమే.
డి) హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను కల్పించాలి.
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
జ: పైవన్నీ
4. బ్రిటిష్ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాలు) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సిఫార్సు చేసేందుకు 1927లో ఏర్పాటైన ‘‘భారత రాజ్యాల కమిటీ’’కి ఎవరు నేతృత్వం వహించారు?
1) సర్ జాన్ సైమన్ 2) హార్కోర్ట్ బట్లర్ 3) హాల్ వర్త్ 4) పరంజపే
జ: హార్కోర్ట్ బట్లర్
5. సైమన్ కమిషన్ను బహిష్కరిస్తున్నామని 1927, నవంబరు 14న ప్రకటించిన అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
1) శ్రీనివాస అయ్యంగార్ 2) మోతీలాల్ నెహ్రూ
3) దాదాభాయ్ నౌరోజీ 4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
జ: శ్రీనివాస అయ్యంగార్
6. ‘‘భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసుకోగలరా?’’ అని 1927, నవంబరు 24న బ్రిటిష్ ఎగువసభలో సవాలు విసిరిన నాటి భారత రాజ్యకార్యదర్శి ఎవరు?
1) లార్డ్ మార్లే 2) జాన్ వెల్లింగ్టన్ 3) లార్డ్ బిర్కెన్హెడ్ 4) లార్డ్ టేలర్
జ: లార్డ్ బిర్కెన్హెడ్
7. 1928, మే 19న బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగ రచనకు ఎవరి అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు?
1) మోతీలాల్ నెహ్రూ 2) లాలా లజపతిరాయ్
3) సర్ తేజ్బహదూర్ సప్రూ 4) శ్రీనివాస అయ్యంగార్
జ: మోతీలాల్ నెహ్రూ
8. 1929, అక్టోబరు 31న దీపావళి ప్రకటనను ఎవరు వెలువరించారు?
1) లార్డ్ మన్రో 2) లార్డ్ ఇర్విన్ 3) చార్లెస్ మెట్కాఫ్ 4) లార్డ్ వెస్లీ
జ: లార్డ్ ఇర్విన్
9. లండన్లో రౌండ్టేబుల్ సమావేశాల నిర్వహణకు(1930-1932) శ్రీకారం చుట్టిన బ్రిటన్ ప్రధాని ఎవరు?
1) రాంసే మెక్డొనాల్డ్ 2) విన్స్టన్ చర్చిల్ 3) క్లెమెంట్ అట్లీ 4) బాల్డ్విన్
జ: రాంసే మెక్డొనాల్డ్
10. కింది వాటిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి సరైంది?
ఎ) 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు నిర్వహించారు.
బి) 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
సి) డా. బి.ఆర్.అంబేడ్కర్ హాజరయ్యారు.
డి) దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ (INC) బహిష్కరించింది.
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
జ: పైవన్నీ
11. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి సరైంది?
ఎ) 1931, సెప్టెంబరు 7 నుంచి 1931, డిసెంబరు 1 వరకు జరిగాయి.
బి) భారత జాతీయ కాంగ్రెస్ (INC) తరపున గాంధీజీ ప్రాతినిధ్యం వహించారు.
సి) అల్ప సంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ, మహ్మద్ అలీ జిన్నా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
డి) ఈ సమావేశాన్ని బహిష్కరించిన గాంధీజీని అరెస్ట్ చేసి ఎరవాడ జైలులో బంధించారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి 3) ఎ, సి, డి 4) పైవన్నీ
జ: ఎ, బి, డి
12. మైనార్టీ వర్గాల వారికిప్రాతినిధ్యం పెంచాలనే ఉద్దేశంతో 1932, ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డ్ను ప్రకటించిన బ్రిటన్ ప్రధాని ఎవరు?
1) రాంసే మెక్డొనాల్డ్ 2) విలియం థాంప్సన్ 3) క్లెమెంట్ అట్లీ 4) విన్స్టన్ చర్చిల్
జ: రాంసే మెక్డొనాల్డ్
13. 1932, సెప్టెంబరులో ‘‘పూనా ఒడంబడిక’’ ఎవరి మధ్య జరిగింది?
1) గాంధీజీ - అంబేడ్కర్ 2) క్లెమెంట్ అట్లీ - గాంధీజీ 3) గాంధీజీ - మహ్మద్ అలీ జిన్నా 4) గాంధీజీ - ఇర్విన్
జ: గాంధీజీ - అంబేడ్కర్
14. కింది వాటిలో మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి సరైంది?
ఎ) 1932, నవంబరు 17 నుంచి 1932, డిసెంబరు 24 వరకు జరిగింది.
బి) 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
సి) సరోజినీ నాయుడు పాల్గొన్నారు.
డి) భారత జాతీయ కాంగ్రెస్ (INC) పాల్గొనలేదు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
జ: ఎ, బి, డి
15. ‘‘భారత ప్రభుత్వ చట్టం - 1935’’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1935, ఏప్రిల్ 1 2) 1936, ఏప్రిల్ 1 3) 1937, ఏప్రిల్ 1 4) 1938, ఏప్రిల్ 1
జ: 1937, ఏప్రిల్ 1
16. ‘‘అమేరి - వేవెల్’’ ప్రణాళిక - 1945లోని అంశాన్ని గుర్తించండి.
ఎ) వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్ తాత్కాలిక జాతీయ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది.
బి) వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్లోని ముఖ్యమైన అధికారి పదవిని భారతీయుడికి కేటాయించారు.
సి) భారతదేశంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేశారు.
డి) అటార్నీ జనరల్ పదవిని నూతనంగా ఏర్పాటు చేశారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి 3) ఎ, సి, డి 4) పైవన్నీ
జ: ఎ, బి, సి
మరికొన్ని...
1. ‘‘భారత ప్రభుత్వ చట్టం - 1935’’కి సంబంధించి సరైంది?
ఎ) ఫెడరల్ జాబితాలో 59 అంశాలను పేర్కొన్నారు.
బి) రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి
సి) ఉమ్మడి జాబితాలో 36 అంశాలను పేర్కొన్నారు.
డి) అవశిష్ట జాబితాలో 22 అంశాలు ఉన్నాయి.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి 3) ఎ, సి, డి 4) పైవన్నీ
జ: ఎ, బి, డి
2. ‘‘భారత ప్రభుత్వ చట్టం - 1935’’కి సంబంధించి సరైంది?
ఎ) భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు.
బి) కొత్తగా ఒడిశా, సింధూ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
సి) రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్ పదవిని సృష్టించారు.
డి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ) ఏర్పాటు చేశారు.
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
జ: ఎ, సి, డి
3. ‘‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్ను బిగించడం మర్చిపోయారు’’ అని భారత ప్రభుత్వ చట్టం - 1935 గురించి ఎవరు వ్యాఖ్యానించారు?
1) మహమ్మద్ అలీ జిన్నా 2) జవహర్లాల్ నెహ్రూ 3) మహాత్మా గాంధీ 4) మోతీలాల్ నెహ్రూ
జ: జవహర్లాల్ నెహ్రూ
4. 1942, మార్చి 22న భారతదేశానికి క్రిప్స్ రాయబారాన్ని పంపిన బ్రిటన్ ప్రధాని ఎవరు?
1) విన్స్టన్ చర్చిల్ 2) రాంసే మెక్డొనాల్డ్ 3) క్లెమెంట్ అట్లీ 4) బాల్డ్విన్
జ: విన్స్టన్ చర్చిల్
5. క్రిప్స్ ప్రతిపాదనలు అనేవి ‘‘దివాళా తీస్తున్న బ్యాంకుపై ముందు తేదీ వేసిన చెక్కు లాంటిది’’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) జవహర్లాల్ నెహ్రూ 2) సుభాష్ చంద్రబోస్ 3) మహాత్మా గాంధీ 4) సర్ తేజ్ బహదూర్ సప్రూ
జ: మహాత్మా గాంధీ
6. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య సమన్వయాన్ని సాధించేందుకు 1944లో "The way out Pamphlet" అనే కరపత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) చక్రవర్తుల రాజగోపాలాచారి 2) శ్రీనివాస అయ్యంగార్ 3) మహ్మద్ అలీ జిన్నా 4) సర్ సయ్యద్ అహ్మద్ఖాన్
జ: చక్రవర్తుల రాజగోపాలాచారి
7. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య సమన్వయాన్ని సాధించేందుకు 1945, జులైలో సిమ్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు?
1) లార్డ్ వేవెల్ 2) లార్డ్ లిన్లిత్గో 3) లార్డ్ మౌంట్బాటన్ 4) లార్డ్ వెల్లింగ్టన్
జ: లార్డ్ వేవెల్