మాదిరి ప్రశ్నలు
1. ఐహోల్ శాసనాన్ని వేయించింది ఎవరు?
1) మొదటి పులకేశి 2) రెండో పులకేశి
3) మంగళేశుడు 4) కీర్తివర్మ
2. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ పశ్చిమ చాళుక్యులతో రాయబారాలు నడిపినట్లు తెలిపే గుహచిత్రాలు ఎక్కడ ఉన్నాయి?
1) అజంతా గుహలు 2) ఎల్లోరా గుహలు
3) బాగ్ గుహలు 4) ఎలిఫెంటా గుహలు
3. చైనా యాత్రికుడైన హుయాన్త్సాంగ్ ఏ చాళుక్య రాజు దర్బార్ను సందర్శించారు?
1) మొదటి పులకేశి 2) సత్యాశ్రయుడు
3) విక్రమాదిత్యుడు 4) రెండో పులకేశి
4. కల్యాణి చాళుక్యుల మొదటి రాజధాని?
1) మాన్యఖేటం 2) ప్రతిష్ఠానం
3) కల్యాణి 4) సరసాల
5. విక్రమశకాన్ని ప్రారంభించింది ఎవరు?
1) ఒకటో సోమేశ్వరుడు 2) రెండో సోమేశ్వరుడు
3) ఆరో విక్రమాదిత్యుడు 4) రెండో తైలపుడు
6. ఏ గ్రంథాన్ని మానసోల్లాసం అని పిలుస్తారు?
1) పంచతంత్రం 2) అభిలషిలూర్థ చింతామణి
3) ధర్మామృతం 4) చందోబుద్ధి
7. మేగుటి దేవాలయాన్ని ఏ శైలిలో నిర్మించారు?
1) చాళుక్య శైలి 2) ద్రావిడ శైలి
3) నగర శైలి 4) మధ్యభారత శైలి
8. నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి?
1) అలంపురం 2) బాదామి
3) పట్టడకల్ 4) ఐహోల్
9. ‘ఇరివబెందగ’ అనే బిరుదు ఎవరిది?
1) సత్యాశ్రయుడు 2) విమలాదిత్యుడు
3) విక్రమాదిత్యుడు 4) తైలపుడు
10. కల్యాణి చాళుక్య పాలకుల్లో చివరివారు?
1) జగదేక మల్లుడు 2) జయసింహుడు
3) విక్రమసింహుడు 4) రాజసింహుడు
11. అజిత పురాణాన్ని రచించింది ఎవరు?
1) పంప 2) పొన్న
3) రన్న 4) హేమచంద్రుడు
12. చందోబుద్ధి గ్రంథ రచయిత ఎవరు?
1) నాగవర్మ 2) దేవగుప్త
3) విష్ణుశర్మ 4) మయూరవర్మ
13. అభినవ పంపగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు?
1) హేమచంద్రుడు 2) నాగచంద్రుడు
3) రవిచంద్రుడు 4) దుర్గసింహుడు
14. కవి చక్రవర్తి బిరుదు ఎవరికి ఉంది?
1) పంప 2) పొన్న
3) రన్న 4) నాగసేనుడు
15. ధర్మామృతాన్ని రచించింది ఎవరు?
1) నాగచంద్రుడు 2) హేమచంద్రుడు
3) నయసేనుడు 4) నాగసేనుడు
16. వచనాలు అనే నీతి పద్యాలను రచించింది ఎవరు?
1) వీరశైవులు 2) వీరవైష్ణవులు
3) చాదాత్తవైష్ణవులు 4) భాగవతులు
17. కిందివాటిలో బిల్హణుడి రచన ఏది?
1) గాథాసప్తశతి 2) విక్రమాంకదేవ చరిత్ర
3) బృహత్కథ 4) అష్టాంగ సంగ్రహం
18. లాడ్ఖాన్ దేవాలయం ఎక్కడ ఉంది?
1) బాదామి 2) పట్టడకల్
3) ఐహోల్ 4) సంగమేశ్వరం
19. తుంగభద్రా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మొదటి సోమేశ్వరుడు ఏ వంశానికి చెందినవాడు?
1) బాదామి చాళుక్య 2) కల్యాణి చాళుక్య
3) తూర్పు చాళుక్య 4) వేములవాడ చాళుక్య
20. పాపనాథాలయం ఏ పట్టణంలో ఉంది?
1) అలంపురం 2) కూడలి సంగం
3) సంగమేశ్వరం 4) పట్టడకల్
21. బాదామి వద్ద ఏ మతానికి చెందిన గుహాలయాన్ని నిర్మించారు?
1) జైన 2) బౌద్ధ 3) శైవ 4) వైష్ణవ
22. కిందివాటిలో ఏ దేవాలయాల్ని ఔత్తరాహిక శైలిలో నిర్మించారు?
1) నవబ్రహ్మ దేవాలయాలు 2) సంగమేశ్వరాలయం
3) విరూపాక్షాలయం 4) పాపనాథాలయం
23. కల్యాణి దుర్గ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు?
1) జయసింహుడు 2) సోమేశ్వరుడు
3) విమలాదిత్యుడు 4) విక్రమాదిత్యుడు
24. హారితీపుత్ర అనే మాతృసంజ్ఞను వాడిన వంశం ఏది?
1) శాతవాహనులు 2) ఇక్ష్వాకులు
3) తూర్పు చాళుక్యులు 4) పశ్చిమ చాళుక్యులు
25. తెలుగు భాషలో మొదటి రాజకవిగా ఏ కవి పేరొందాడు?
1) నన్నయ 2) నన్నెచోడుడు 3)తిక్కన 4) శర్వవర్మ
26. దశకుమార చరిత్ర గ్రంథాన్ని రాసి, అభినవదండి బిరుదు పొందిన కవి...
1) కేతన 2) మంచన 3) తిక్కన 4) మనుమ సిద్ది
27. కవిగాయక కల్పతరువు బిరుదు పొందిన రాజు ఎవరు?
1) మొదటి అమ్మరాజు 2) రెండో యుద్ధమల్లుడు
3) రెండో అమ్మరాజు 4) మూడో విష్ణువర్థనుడు
28. వేంగి చాళుక్య, రాష్ట్రకూట సంఘర్షణలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి?
1) మొదటి జయసింహ వల్లభుడు
2) మొదటి విజయాదిత్యుడు
3) అమ్మరాజు - I 4) అమ్మరాజు - II
29. రాష్ట్రకూటరాజు ధ్రువుడు చేతిలో ఓడి, అతనికి తన కూతురు శీలమహాదేవిని ఇచ్చి వివాహం చేసిన రాజు...
1) విష్ణువర్థన - I 2) విష్ణువర్థన - II
3) విష్ణువర్థన - IV 4) ఎవరూ కాదు
30. 108 యుద్ధాలు చేసి, 108 శివాలయాలు నిర్మించిన చాళుక్య రాజు ఎవరు?
1) మొదటి విజయాదిత్యుడు 2) విజయాదిత్య -II
3) విజయాదిత్య - III 4) విజయాదిత్య - IV
సమాధానాలు: 1-2; 2-1; 3-4; 4-1; 5-3; 6-2; 7-2; 8-1; 9-1; 10-1; 11-3; 12-1; 13-2; 14-3; 15-3; 16-1; 17-2; 18-3; 19-2; 20-4; 21-1; 22-1; 23-1; 24-3; 25-2; 26-1; 27-3; 28-2; 29-3; 30-2.