• facebook
  • whatsapp
  • telegram

సామాజిక అభివృద్ధి పథకాలు

* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సమాజ సమగ్ర ప్రగతిని సాధించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వాటిలో భాగంగా కింది ప్రయత్నాలు ప్రారంభించింది.

* భారత ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో గ్రోమోర్‌ఫుడ్ అనే నినాదంతో ఆహారధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించాలని భావించింది.

* మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి తగిన సిఫార్సులను సూచించమని వి.టి. కృష్ణమాచారి అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* ఈ కమిషన్ సిఫార్సుల మేరకు దేశంలోని 50 జిల్లాల్లో ఎంపిక చేసిన 55 బ్లాకుల్లో 1952, అక్టోబరు, 2న సమాజ అభివృద్ధి కార్యక్రమం (CDP - Community Development Programme)ను ప్రాంభించారు.

CDPలోని ముఖ్యాంశాలు

* Community Development అనే భావనను మనం అమెరికా నుంచి గ్రహించాం.

* భారతదేశ ప్రగతిలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేయడం దీని లక్ష్యం.

* దీనిలో ప్రజలే సంఘటితమై, తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

* అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ మనదేశంలోని CDP కార్యక్రమానికి 1971 సంవత్సరం నాటికి 104 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించింది.

* దేశాన్ని కొన్ని బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో సుమారు 100 గ్రామాలను చేర్చారు.

* ఈ పథకాన్ని ప్రారంభంలో 55 బ్లాకుల్లో ప్రారంభించినప్పటికీ, తర్వాత కాలంలో 5011 బ్లాకులకు విస్తరించారు. ఒక్కో బ్లాకులో 70,000 నుంచి 80,000 జనాభా ఉంటుంది.

* CDP ద్వారా వ్యవసాయం, ప్రాథమిక విద్య, సామాజిక సేవ, గ్రామీణ కుటీర పరిశ్రమలు, గృహవసతి, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన, గ్రామీణ సమాచార వ్యవస్థ లాంటి అంశాలపై దృష్టిసారించారు.

* గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, స్వయం స్వావలంబన, సాముదాయిక ధృక్పథం అలవరచుకోవడానికి ప్రభుత్వం ఈ పథకం ద్వారా సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించింది.

* ప్రతి బ్లాకులో ఒక బ్లాకు డెవలెప్‌మెంట్ అధికారి (BDO) బ్లాకు స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

* ఈ కార్యక్రమ అమలుకు కేంద్రప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది.

* ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామ్‌సేవక్ అనే అధికారిని నియమించారు.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం: (1953) (NESS - Nantional Extension Service Scheme)

* NESS పథకాన్ని మనదేశంలో 1953, అక్టోబరు, 2న ప్రారంభించారు.

* సమాజ అభివృద్ధి కార్యక్రమాని (CDP)కి కొనసాగింపుగా NESSను 1700 బ్లాకుల్లో ప్రారంభించారు.

* సమాజ అభివృద్ధి పథకాన్ని 3 సంవత్సరాల కాలానికి రూపొందించగా, జాతీయ విస్తరణ పథకాన్ని శాశ్వత ప్రాతిపదికపై ప్రారంభించారు.

NESS ముఖ్యాంశాలు

* గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగాలను తగ్గించడం.

* వ్యవసాయ విధానంలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తిని సాధించడం.

* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, బావులు, పాఠశాలలు, సమాజసేవా కేంద్రాలు, సామాజిక ప్రయోజనం ఉన్న పనులను చేపట్టడం ద్వారా సమాజ ప్రగతికి కృషిచేయడం.

* గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాలను కల్పించడం కోసం సహకార రంగాన్ని విస్తృత పరచడం.

NESS అమలుకు సంబంధించిన - పాలనా విభాగాలు

కేంద్రస్థాయి: కేంద్రస్థాయిలో సమాజాభివృద్ధి, సహకార మంత్రిత్వశాఖ నాయకత్వంలో నిర్వహిస్తారు.

రాష్ట్రస్థాయి: రాష్ట్రస్థాయిలో రాష్ట్రముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర అభివృద్ధి సంఘం ఉంటుంది. దీనిలో రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖా మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యదర్శిగా ఉంటారు.

జిల్లాస్థాయి: జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ పథకం నడుస్తుంది.

గ్రామస్థాయి: NESS అమలుకు గ్రామస్థాయిలో Village Level Workers (VLW) ను నియమించారు. వీరికి సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలపై శిక్షణ ఇచ్చారు. వీరిని Multipurpose Workersగా పిలిచేవారు.

* CDP, NESS ప్రాజెక్ట్ కేంద్ర అడ్మినిస్ట్రేటర్ ఎస్.కె. డే. ఇతడు NESS పథకాన్ని సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనంగా అభివర్ణించారు.

* జవహర్‌లాల్ నెహ్రూ NESS పథకాన్ని నిశబ్ద విప్లవంగా అభివర్ణించారు.

స్వాతంత్య్రానికి ముందు జరిగిన సమాజ వికాస ప్రయోగాలు

గుర్గావ్ ప్రయోగం: (1920)

* 1920లో పంజాబ్ రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో ఎఫ్.ఐ. బ్రేయన్ అనే డిప్యూటీ కమిషనర్ గుర్గావ్ ప్రయోగం ద్వారా గ్రామీణాభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు.

* వ్యవసాయోత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం ఈ ఉద్యమ లక్ష్యం.

* ఉత్సవాలు, వివాహాల్లో జరిగే వృథావ్యయాన్ని తగ్గించి, సమాజప్రగతికి దోహదపడటం.

* ఈ ఉద్యమ ప్రాముఖ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం కోటి రూపాయలను కేటాయించి ప్రోత్సహించింది.

మార్తాండం ప్రయోగం: (1921)

* తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న మార్తాండం ప్రాంతంలో అమెరికన్ వ్యవసాయ నిపుణుడైన స్పెన్సర్‌హాచ్ 70 గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఈయన YMCA (Young Mens Christian Association) సహకారంతో గ్రామీణ ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషించే మౌలికాంశాలపై శిక్షణ ఇస్తూ, తద్వారా ప్రజల్లో అభివృద్ధిపై చైతన్యం కలిగించడానికి ప్రయత్నించారు.

శ్రీనికేతన్ ప్రయోగం: (1921)

* రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలోని శాంతినికేతన్‌లో విద్యాబోధనలో భాగంగా, 1921లో ఆత్మగౌరవంతో స్వయంసమృద్ధిని సాధించడం గురించి ప్రయత్నించారు.

* చిన్నతరహా కుటీర పరిశ్రమల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ, వయోజన విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు.

బరోడా ప్రయోగం: (1932)

* బరోడా సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన వి.టి. కృష్ణమాచారి ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు.

* దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులను సమీకరించి, రహదారులు వేయడం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమాభివృద్ధి లాంటి రంగాల్లో వారిని చైతన్యవంతులను చేసి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు.

సేవాగ్రామ్: (1933)

* మహారాష్ట్రలోని వార్ధాలో ప్రయోగాత్మకంగా గాంధీజీ దీన్ని స్థాపించారు.

* సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలపై ఈ సంస్థను నిర్వహించారు.

* ఆచార్య వినోబా భావే, జయప్రకాష్ నారాయణ ఈ సిద్ధాంతానికి ఆకర్షితులై, అనేక సమాజ వికాస కార్యక్రమాలను నిర్వహించారు.

ఫిర్కా ప్రయోగం: (1946)

* 1946లో అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు తాలూకాలను కొన్ని ఫిర్కాలుగా విభజించి, ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కొన్ని ప్రయోగాలు చేశారు. దీన్ని ఫిర్కా ప్రయోగం అంటారు.

* 1952లో సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను బ్లాకుల్లో విలీనం చేశారు.

ఇటావా ప్రయోగం: (1948)

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోహతక్ జిల్లాలో ఇటావా అనే ప్రాంతంలో ఆల్బర్ట్ మేయర్ అనే ఇంజినీర్ 97 గ్రామాలను ఎంచుకుని ప్రయోగాత్మకంగా పౌరసౌకర్యాలను కల్పించడానికి ప్రయత్నం చేశారు.

* కళారూపాల ద్వారా సామాజిక చైతన్యం, సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలను, వ్యవసాయ, పాడిపరిశ్రమ, చేనేత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కృషి చేసింది.

నీలోఖరి ప్రయోగం: (1948)

* హర్యానలోని కర్నాల్ జిల్లాలోని నీలోఖరి అనే ప్రాంతంలో భారత విభజన సందర్భంగా, నిరాశ్రయులైన 7000 మందికి పునరావాసం కల్పించడం, స్వయంశక్తితో అభివృద్ధి చెందేలా ఎస్.కె.డే నాయకత్వంలో వ్యవసాయ పనిముట్లను తయారు చేయడం, ఇంజినీరింగ్ వర్క్స్ లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.

స్థానిక ప్రభుత్వాలు - ఇతర ముఖ్యాంశాలు

* 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 3 స్థాయుల్లోని సంస్థలకు గ్రామస్వరాజ్ పేరుతో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్

* స్థానిక సంస్థల పనివిధానంలో జవాబుదారీతనాన్ని నెలకొల్పడం కోసం నిఘా కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్

* స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% స్థానాలను రిజర్వ్ చేసిన తొలిరాష్ట్రం బీహార్

* స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పనిసరిచేస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రం గుజరాత్

* గ్రామసభ ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న రాష్ట్రం కేరళ

* స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణను ఇవ్వడం కోసం గ్రామ్‌శాట్ అనే ఉపగ్రహ ఛానెల్ ద్వారా శిక్షణ ఇస్తున్న రాష్ట్రం కర్ణాటక

* 1978 నుంచి నియమబద్ధంగా నేటివరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం పశ్చిమ్‌బంగ

* స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు సమర్థంగా పనిచేయనప్పుడు వారిని మధ్యలోనే తొలగించే రీకాల్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించినవారు మహాత్మాగాంధీ

* స్థానిక సంస్థల ప్రతినిధులను వెనక్కు పిలిచే పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్

* మధ్యప్రదేశ్‌లోని చాబ్రానగర పాలక సంస్థ అధ్యక్షుడు అనుప్సర్ చౌహాన్ రీకాల్ ద్వారా తొలగించిన మొదటి వ్యక్తి.

* Village Development Council పేరుతో గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసిన తొలిరాష్ట్రం హర్యానా

* ఎస్సీలు లేని కారణంగా స్థానిక సంస్థల్లో ఎస్సీల రిజర్వేషన్లు రద్దుచేసిన తొలిరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్

* దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా కేవలం 14 రాష్ట్రాల్లో మాత్రమే జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేశారు.

* కేంద్రంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను 2004లో ఏర్పాటు చేశారు.

* మనదేశంలో 4 అంచెల పంచాయతీరాజ్ సంస్థలను అమలు చేస్తున్న ఒకేఒక రాష్ట్రం - పశ్చిమ్ బంగ

* పీపుల్స్ ప్లాన్‌తో జిల్లా ప్రణాళికా బోర్డుల ద్వారా ప్రణాళికా వికేంద్రీకరణను సమర్థంగా అమలు చేస్తున్న రాష్ట్రం - కేరళ

PESA Act

* షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఏర్పాటు కోసం భారత పార్లమెంటు PESA (Panchayat Raj Extension in Scheduled Areas) చట్టాన్ని 1996లో ఏర్పాటు చేసింది.

దీనిలోని ముఖ్యాంశాలు

* గ్రామసభ ఆమోదం లేనిదే స్థానిక అటవీ ఉత్పత్తులపై నిర్ణయాలు తీసుకోరాదు.

* గ్రామసభ ఆమోదం లేనిదే ఆ ప్రాంత భూమిని ఎలాంటి అభివృద్ధి పనులకు వినియోగించరాదు.

* గ్రామసభ ఆమోదం లేనిదే ఎలాంటి తవ్వకాలు జరపరాదు.

* గ్రామసభ ఆమోదంతోనే గ్రామపంచాయతీ విధాన నిర్ణయాలను తీసుకోవాలి.

Posted Date : 06-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సామాజిక వికాస పథకాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. మన దేశంలో గ్రామ పంచాయతీల ఏర్పాటును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?
జ: ఆర్టికల్‌ 40

 

2. సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని (సీడీపీ) జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
జ: 1952, అక్టోబరు 2

 

3. సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదటిసారిగా ఎంపిక చేసిన 50 జిల్లాల్లో ఎన్ని బ్లాకుల్లో ప్రారంభించారు?
జ: 55

 

4. సమాజ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏయే రంగాల్లో సమగ్రాభివృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు?
1) వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, ప్రాథమిక విద్య     2) ప్రజారోగ్యం, ఆర్థికప్రగతి, గృహవసతి
3) సామాజిక సేవ, సాంఘిక సంక్షేమం            4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

5. సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామస్థాయిలో నియమించిన అధికారి ఎవరు?
జ: గ్రామ సేవక్‌

 

6. కిందివాటిలో సరికానిది.
1) NESS అంటే National Extension Service Scheme     
2) NESS ను 1953, అక్టోబరు 2న ప్రారంభించారు. 
3) NESSను శాశ్వత ప్రాతిపదికపై రూపొందించారు.
4) NESS ను మూడేళ్ల కాలపరిమితితో రూపొందించారు.
జ: 4 (NESS ను మూడేళ్ల కాలపరిమితితో రూపొందించారు.)


7. NESS పథకాన్ని సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: ఎస్‌.కె. డే

 

8. CDP, NESS లపై సమీక్షించేందుకు 1957లో ఏర్పాటైన కమిటీ?
జ: బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

 

9. మనదేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫారసు చేసిన కమిటీ?
జ: బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

 

10. మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని మొదటిసారిగా రాజస్థాన్‌లో ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1959, అక్టోబరు 2

 

11. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని 1959, నవంబరు 1న ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రారంభించారు?
జ: నీలం సంజీవరెడ్డి

 

12. 1977 డిసెంబరులో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం కోసం అశోక్‌మెహతా కమిటీని నియమించిన ప్రధాని ఎవరు?
జ: మొరార్జీ దేశాయ్‌

 

13. అశోక్‌మెహతా కమిటీ సిఫారసు చేసిన రెండంచెల పంచాయతీరాజ్‌ విధానంలో అత్యంత కీలకమైన అంచె?
జ: మండల పరిషత్‌

 

14. అశోక్‌మెహతా కమిటీ గ్రామ పంచాయతీలను రద్దుచేసి వాటి స్థానంలో వేటిని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది?
జ: గ్రామ కమిటీలు

 

15. కిందివాటిలో అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల్లో లేనిది?
1) స్థానిక సంస్థల పదవీకాలం నాలుగేళ్లు ఉండాలి.
2) పంచాయతీరాజ్‌ మంత్రిని ఏర్పాటుచేయాలి.
3) పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి.
4) పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయకూడదు.
జ: 4 (పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయకూడదు.)

 

16. అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల్లో కీలకమైన మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం?
జ: కర్ణాటక

 

17. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
జ: 1985

 

18. అశోక్‌మెహతా కమిటీ మొత్తం ఎన్ని సిఫారసులు చేసింది?
జ: 132

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగ సవరణా విధానం - కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ

    ఒకదేశ రాజ్యాంగం ఆ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతుంది. దేశంలో వస్తున్న విభిన్న కాల పరిస్థితులకు అనుగుణంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ సవాళ్లను పరిష్కరించే విధంగా రాజ్యాంగాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణా విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ - 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే 3 రకాల పద్ధతులను 22వ భాగంలో పొందుపరిచారు.
* రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా దాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగాలుగా పేర్కొనవచ్చు.

1. దృఢ రాజ్యాంగం:
* ప్రత్యేక మెజార్టీ ద్వారా అంటే 2/3 లేదా 3/4వ వంతు మెజారిటీతో సవరించేది. ఈ విధానంలో రాజ్యాంగ సవరణ కఠినంగా ఉంటుంది.
ఉదా: అమెరికా రాజ్యాంగం

2. అదృఢ రాజ్యాంగం:
* సాధారణ మెజార్టీ ద్వారా సవరించేది. దీనిలో హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది మద్ధతుతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు.
ఉదా: బ్రిటన్

భారత రాజ్యాంగం దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం
* 1967 నాటి గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
* 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ - 13, ఆర్టికల్ - 368లను సవరించడంతోపాటు రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పొందింది.
* 1973 నాటి కేశవానంద భారతి కేసులో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం ఉల్లంఘించకుండా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ - 368కి చేర్చిన క్లాజులు 4, 5లు రాజ్యాంగ విరుద్ధమని, అవి చెల్లవని 1980లో మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆర్టికల్ 368లోని సబ్ క్లాజులు
* ఆర్టికల్ - 368(1) - పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది.
* ఆర్టికల్ - 368(2) - పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో సవరించే అంశాలు.
* ఆర్టికల్ - 368(3) - ఆర్టికల్ 13లో పేర్కొన్న చట్టం నిర్వచన పరిధిలోని అంశాలు రాజ్యాంగ సవరణ నిర్వచనంలోకి రావు.
* ఆర్టికల్ - 368(4) - పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణను ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి వీల్లేదు.
* ఆర్టికల్ - 368(5) - రాజ్యాంగ సవరణ అధికారాల్లో మార్పులు, చేర్పులు రద్దుచేసే అంశంలో పార్లమెంటుకు ఏ విధమైన ఆంక్షలు వర్తించవు.

భారత రాజ్యాంగాన్ని సవరించే 3 పద్ధతులు

I. సాధారణ మెజార్టీ పద్ధతి:
* రాజ్యాంగంలోని కింద పేర్కొన్న 18 అంశాలను సవరించాలంటే పార్లమెంటుకు హాజరై ఓటువేసిన వారిలో సాధారణ మెజార్టీ ద్వారా సవరించవచ్చు.
అవి: 1) ఆర్టికల్ - 2 - కొత్తరాష్ట్రాల విలీనం లేదా ఏర్పాటు
2) ఆర్టికల్ - 3 - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
3) ఆర్టికల్ - 169 - రాష్ట్రాల్లో విధానపరిషత్‌ల ఏర్పాటు లేదా రద్దు
4) 2వ షెడ్యూల్ - రాజ్యాంగ ఉన్నతపదవులు, వారి జీతభత్యాలు
5) ఆర్టికల్ - 100(3) - పార్లమెంటులో కోరం నిర్ణయించడం
6) ఆర్టికల్ - 105 - సభాహక్కులు
7) ఆర్టికల్ - 106 - పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు
8) ఆర్టికల్ - 118(12) - పార్లమెంటులో ఉభయసభల నిర్వహణకు రూపొందించిన నియమాలు
9) ఆర్టికల్ - 120(2) - పార్లమెంటులో ఇంగ్లిష్ వాడకం
10) ఆర్టికల్ - 124(1) - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం
11) ఆర్టికల్ - 348 - అధికార భాషా విషయం
12) ఆర్టికల్ - 11 - పౌరసత్వం విధి విధానాలు
13) ఆర్టికల్ - 327 - పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం
14) ఆర్టికల్ - 81 - నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)
15) ఆర్టికల్ - 240 - కేంద్రపాలిత ప్రాంతాల విషయం
16) 5వ షెడ్యూల్ - ఎస్సీ, ఎస్టీల పరిపాలనాంశాలు
17) 6వ షెడ్యూల్ - అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఎస్టీల పాలన
18) ఆర్టికల్ - 135 - సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతపరచడం

II. ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని మరికొన్ని ఆర్టికల్స్‌ను సవరించాలంటే (సాధారణ మెజార్టీ పద్ధతి, ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతిలో సవరించేవి తప్ప) పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించగలదు. రాజ్యాంగంలోని అత్యధిక భాగాలను ఈ పద్ధతి ద్వారానే సవరిస్తారు.
ఉదా: రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ - 12 - 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు.

* రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ - 36 - 51 వరకు ఉన్న ఆదేశిక సూత్రాలు.
* రాజ్యాంగంలోని 4(A) భాగంలో ఆర్టికల్ - 51(A)లోని ప్రాథమిక విధులు.
* మొదటి, మూడో పద్ధతుల్లో పేర్కొనని ఇతర అంశాలు.

III. ద్విపక్ష మెజార్టీ పద్ధతి
* రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతోపాటు, భారతదేశంలో సగాని కంటే ఎక్కువ రాష్ట్రాల్లో (15 రాష్ట్రాలు) ప్రతి శాసనసభ సాధారణ మెజార్టీతో ఆమోదించాలి.
అవి: 1) ఆర్టికల్ - 54 - రాష్ట్రపతి ఎన్నిక
     2) ఆర్టికల్ - 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం
     3) ఆర్టికల్ - 73 - కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధికార పరిధిని విస్తృత పరచడం
     4) ఆర్టికల్ - 162 - రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అధికార పరిధిని విస్తృత పరచడం
     5) 5వ భాగంలోని ఆర్టికల్ - 124 - 147 - వరకు ఉన్న సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు.
     6) 6వ భాగంలోని ఆర్టికల్ - 214 - 232 - వరకు ఉన్న హైకోర్టుకు సంబంధించిన అంశాలు.
     7) 7వ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న అధికారాల విభజన.
     8) 4వ షెడ్యూల్‌లోని రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు.
     9) ఆర్టికల్ - 368కు సంబంధించిన రాజ్యాంగ సవరణా విధానం.
     10) ఆర్టికల్ - 246 - కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే శాసనపరమైన అధికారాల విభజన.
     11) ఆర్టికల్స్ - 80, 81 - రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం.

రాజ్యాంగ సవరణ - నియమాలు

* ఆర్టికల్ - 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. రాష్ట్ర శాసన సభలకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లేదు.
* రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.
* రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రి/ సాధారణ సభ్యుడు ప్రతిపాదించవచ్చు.
* సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలు సవరించడానికి సగానికి పైగా రాష్ట్ర శాసనసభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
* రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయసభలు, నిర్ణీత మెజార్టీ ప్రకారం వేర్వేరుగా ఆమోదించాలి.
* రాజ్యాంగ సవరణ బిల్లును ఒకసభ ఆమోదించి మరొకసభ తిరస్కరిస్తే, వాటిమధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
* 1971 నాటి 24వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలని నిర్ధేశించారు.
* రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేది స్వయం నిర్ధేశిత పద్ధతి.

రాజ్యాంగ సవరణ పద్ధతిపై ఉన్న విమర్శలు

* రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకే పరిమితం చేయడం.
* రాజ్యాంగ సవరణ కోసం ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు లేకపోవడం.
* రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ చట్టాన్ని సవరించే పద్ధతిలోనే సవరించవచ్చు. దీనివల్ల రాజ్యాంగ పవిత్రత దెబ్బతింటుంది.
* రాజ్యాంగంలోని అనేక అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా సవరించవచ్చు. రాష్ట్రాల భాగస్వామ్యం పరిమితంగా ఉంటుంది.
* అమెరికాలో మాదిరి మనదేశంలో కూడా రాష్ట్రాలకు రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించే అధికారం లేకపోవడం వికేంద్రీకరణ స్ఫూర్తికి విరుద్ధం.
* రాజ్యాంగ సవరణలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే, పరిష్కారానికి సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే వీల్లేదు.

రాజ్యాంగ సవరణ విధానంపై వ్యాఖ్యానాలు
''భారత రాజ్యాంగం కఠిన, శాశ్వతమైన పద్ధతి ఏర్పాటు చేయాలనుకున్నా, శాశ్వతత్వం అనేది రాజ్యాంగానికి ఉండదు. కొంత సరళత అవసరం, రాజ్యాంగం దృఢమైనదైతే దేశాభివృద్ధి మందగిస్తుంది" - జవహర్‌లాల్ నెహ్రూ
''భారత రాజ్యాంగ సవరణ పద్ధతి బయటకు సంక్లిష్టంగా కనిపించినా అది కేవలం విశిష్టతకు నిదర్శనం" - గాన్‌విల్ ఆస్టిన్
''రాజ్యాంగ సవరణ విధానం ఒక మూస విధానాన్ని ఎంచుకోలేదు. ఇదే అంతిమం, సవరణకు అతీతం అనే నియమాన్ని ఏర్పాటు చేయదలుచుకోలేదు. ఒక సరళ విధానాన్ని పొందుపరచడం జరిగింది." - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
''భారత రాజ్యాంగ సవరణ పద్ధతి దృఢ, అదృఢ లక్షణాల మధ్య మంచి సమతౌల్యాన్ని సాధించింది. సవరణ పద్ధతిలో వైవిధ్యం ఉంది. ఇది చాలా అరుదైంది, వివేకమైంది." - కె.సి. వేర్
''సవరించడానికి వీల్లేని నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా విప్లవాలు వచ్చే ప్రమాదం ఉంది." - విల్లీస్
''సవరించడానికి వీలుకాని రాజ్యాంగం అత్యంత హేయమైంది లేదా అత్యంత క్రూరమైన ప్రజాపీడన." - మల్‌ఫోర్డ్


 

సుప్రీంకోర్టు - వ్యాఖ్యానాలు
* 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో చేర్చిన ప్రకరణ 31(A), 31(B)లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు 368వ ప్రకరణ కింద జరిగే రాజ్యాంగ సవరణకు, సాధారణంగా పార్లమెంటు చేసే ఇతర శాసనాలకు తేడా ఉందని, రెండూ ఒకటి కాదని, రాజ్యాంగ సవరణ అనేది ఆర్టికల్ - 13 కిందకు రాదని, రాజ్యాంగ సవరణలన్నీ చెల్లుబాటు అవుతాయని తీర్పు ఇచ్చింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.
* 1965 నాటి సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణను ఆర్టికల్ - 13కు వ్యతిరేకం కాదని పేర్కొంది.
* 1967లో గోలక్‌నాథ్ కేసులో ఆర్టికల్ - 368 ద్వారా జరిగే రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్ - 13కు వ్యతిరేకంగా ఉంటే చెల్లవని, పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
* గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు పార్లమెంటు 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేసి, ఆర్టికల్స్ - 13, 368లను సవరించింది.
* 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ, ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంటు సవరించవచ్చునని తెలుపుతూ, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం ఉల్లంఘించరాదని పేర్కొంది.

భారత రాజ్యాంగ సవరణలు

1వ రాజ్యాంగ సవరణ చట్టం: 1951
* దీని ద్వారా భూసంస్కరణలు, ఇతర చట్టాలను రక్షించి, కొనసాగించుకునేందుకు 9వ షెడ్యూల్‌ను చేర్చారు. ఈ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు న్యాయసమీక్ష పరిధిలోకి రావు.
* వాక్ స్వాతంత్య్ర, భావప్రకటనా స్వేచ్ఛపైన ప్రజా సౌకర్యం, విదేశాలతో సత్ సంబంధాల ఆధారంగా నియంత్రణలను ప్రవేశపెట్టింది.
* ఈ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్స్ - 31(A), 31(B)లను చేర్చారు.

2వ రాజ్యాంగ సవరణ చట్టం: 1952
* దీని ద్వారా ఆర్టికల్ - 81ని సవరించి, పార్లమెంట్‌లో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పులు చేశారు.
* లోక్‌సభ ప్రాతినిధ్య పరిధిలో మార్పుచేసి, ఒక లోక్‌సభ సభ్యుడు 7,50,000 మందికి పైగా ప్రాతినిధ్యం వహించేలా సవరించడమైంది.

3వ రాజ్యాంగ సవరణ చట్టం: 1955
* దీని ద్వారా 7వ షెడ్యూల్‌కు సవరణ చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఆహార పదార్థాలు, పశువుల దాణా, ముడిపత్తి, ఇనుము ఉత్పత్తి, సరఫరా లాంటి వాటిని ఉమ్మడి జాబితాలోకి మార్చారు.

4వ రాజ్యాంగ సవరణ చట్టం: 1955
* దీని ద్వారా ఆర్టికల్స్ - 31, 31A, 305 లకు సవరణ చేశారు. 9వ షెడ్యూల్‌ను కూడా సవరించారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారం విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఏ వ్యాపారాన్నైనా జాతీయం చేసే అధికారం రాష్ట్రాలకు కల్పించడమైంది.

5వ రాజ్యాంగ సవరణ చట్టం: 1955
* దీని ద్వారా ఆర్టికల్ - 3ను సవరించారు. రాష్ట్రపతి రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను, రాష్ట్రాల పేర్లను మార్పుచేసే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రాల అభిప్రాయం కోసం పంపిస్తారు.
* దీనికి నిర్ణీత గడువులోగా రాష్ట్రాల శాసనసభలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి.

6వ రాజ్యాంగ సవరణ చట్టం: 1956
» దీని ద్వారా ఆర్టికల్స్ - 269, 286లను సవరించారు. అంతర్ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.


7వ రాజ్యాంగ సవరణ చట్టం: 1956
» దీని ద్వారా రాజ్యాంగానికి నూతనంగా చేర్చిన ఆర్టికల్స్ - 258(A), 290(A), 350(A), 350(B), 372(A), 378(A).
» దీని ద్వారా సవరించిన ఆర్టికల్స్ - 1, 49, 80, 81, 82, 131, 153, 158, 168, 170, 171, 216, 217, 220, 222, 224, 230, 231, 232, 371.
» ఈ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్విభజనను జరిపి, 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
» హైకోర్టుల న్యాయవిచారణ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించారు.
» హైకోర్టులో తాత్కాలిక, అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించారు.
» రెండు లేదా మూడు రాష్ట్రాలకు కలిపి, ఒక ఉమ్మడి హైకోర్టు ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
» ఒకే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల గవర్నరుగా నియమించవచ్చు.
» ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చారు.

 

8వ రాజ్యాంగ సవరణ చట్టం: 1960
» దీని ద్వారా ఆర్టికల్ - 334ను సవరించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్‌లకు చెందిన వారికి లోక్‌సభ, శాసనసభల్లో కేటాయించిన స్థానాలను పది సంవత్సరాలు అంటే 1970 వరకు పొడిగించారు.


9వ రాజ్యాంగ సవరణ చట్టం: 1960
» దీని ద్వారా మొదటి షెడ్యూల్‌కు సవరణ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బెరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు అప్పగించారు.


10వ రాజ్యాంగ సవరణ చట్టం: 1961
» దీని ద్వారా మొదటి షెడ్యూల్, ఆర్టికల్ - 240ను సవరించారు. దాద్రానగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారత సమాఖ్యలో విలీనం చేశారు.


11వ రాజ్యాంగ సవరణ చట్టం: 1961
» దీని ద్వారా ఆర్టికల్స్ - 66(1), 71(3) లను సవరించారు.
» రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎలక్టోరల్ కళాశాలల్లో ఖాళీలు ఉన్నాయనే కారణంతో వారి ఎన్నికను న్యాయస్థానంలో సవాల్ చేయరాదు.
» ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం జరపాలన్న విధానాన్ని తొలగించి, రెండు సభలు విడివిడిగా ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించారు.


12వ రాజ్యాంగ సవరణ చట్టం: 1961
» దీని ద్వారా మొదటి షెడ్యూల్, ఆర్టికల్ - 240ని సవరించారు.
» గోవా, డయ్యూ, డామన్‌లను భారతదేశంలో విలీనం చేశారు.


13వ రాజ్యాంగ సవరణ చట్టం: 1962
» దీని ద్వారా ఆర్టికల్ - 371(A) ను చేర్చారు. నాగాలాండ్‌కు రాష్ట్రహోదాను కల్పించడమే కాకుండా కొన్ని ప్రత్యేక నిబంధనలను రూపొందించారు.


14వ రాజ్యాంగ సవరణ చట్టం: 1962
» దీని ద్వారా ఆర్టికల్స్ - 239 (A), 241; 1, 4 షెడ్యూల్స్‌ను సవరించారు.
» పుదుచ్చేరిని భారత సమాఖ్యలో విలీనం చేశారు. హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, పుదుచ్చేరిలకు శాసనసభలు ఏర్పాటు చేశారు.


15వ రాజ్యాంగ సవరణ చట్టం: 1963
» దీని ద్వారా ఆర్టికల్స్ - 124, 128, 217, 222, 224, 226, 297, 311, 316 లను సవరించారు. ఆర్టికల్ - 224(A) ను కొత్తగా చేర్చారు.
» హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.
» హైకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను నియమించే అవకాశం కల్పించారు.
» హైకోర్టుకు ఉండే రిట్లు జారీ చేసే అధికార పరిధిని విస్తృతపరిచారు.


16వ రాజ్యాంగ సవరణ చట్టం: 1963
» దీని ద్వారా ఆర్టికల్స్ - 19, 84, 173లతోపాటు 3వ షెడ్యూల్‌ను సవరించారు.
» భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతల కోసం భావప్రకటన, వాక్ స్వాతంత్య్రపు హక్కు, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కులను నియంత్రణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
» చట్టసభలకు పోటీచేసే అభ్యర్థులు, చట్టసభల ఏర్పాటు, మంత్రులు, న్యాయమూర్తులు, కాగ్ (CAG) తాము భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతామని చేసే ప్రమాణాన్ని సవరించారు.


17వ రాజ్యాంగ సవరణ చట్టం: 1964
» దీని ద్వారా ఆర్టికల్ - 31(A), 9వ షెడ్యూల్‌ను సవరించారు. 9వ షెడ్యూల్‌లో మరో 44 చట్టాలను చేర్చారు.
» వ్యక్తుల సొంత వ్యవసాయ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆ భూమి మార్కెట్ విలువను పరిహారంగా సంబంధిత వ్యక్తికి ఇవ్వాలి.


18వ రాజ్యాంగ సవరణ చట్టం: 1966
» కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటు అధికారాలను స్పష్టం చేశారు.
» ఆర్టికల్ 3ను సవరించి రాష్ట్రం అనే మాటను పునర్ నిర్వచించారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లను పునర్ వ్యవస్థీకరించారు.


19వ రాజ్యాంగ సవరణ చట్టం: 1966
» దీని ద్వారా ఆర్టికల్ - 324ను సవరించారు. ఎన్నికల ట్రిబ్యునళ్లను రద్దుచేసి, ఎన్నికల ఫిర్యాదులను పరిష్కరించే అధికారాన్ని హైకోర్టులకు అప్పగించారు.


20వ రాజ్యాంగ సవరణ చట్టం: 1966
» దీని ద్వారా ఆర్టికల్ - 233(A) ను కొత్తగా చేర్చారు.
» ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొంతమంది జిల్లా జడ్జీల నియామకం చెల్లదన్న సుప్రీంకోర్టు తీర్పును ఈ సవరణ ద్వారా చెల్లుబాటు అయ్యేలా చేశారు.


21వ రాజ్యాంగ సవరణ చట్టం: 1967
» దీని ద్వారా 8వ షెడ్యూల్‌ను సవరించారు. సింధి భాషను 15వ భాషగా చేర్చారు.


22వ రాజ్యాంగ సవరణ చట్టం: 1969
» దీని ద్వారా ఆర్టికల్స్ - 244(A), 371(B), 275 (1)(A) లను చేర్చారు.
» అస్సాం నుంచి స్వయంప్రతిపత్తి ఉన్న రాష్ట్రంగా మేఘాలయ ఏర్పడింది.
» అస్సాం రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక ప్రాధాన్యాలను కల్పించారు.


23వ రాజ్యాంగ సవరణ చట్టం: 1969
» దీని ద్వారా ఆర్టికల్స్ - 330, 332, 333, 334లను సవరించారు.
» పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు; ఆంగ్లో ఇండియన్స్‌కు కల్పిస్తున్న రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలు అంటే 1980 వరకు పొడిగించారు.


24వ రాజ్యాంగ సవరణ చట్టం: 1971
» దీని ద్వారా ఆర్టికల్స్ - 13, 368లను సవరించారు.
» రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది.
» రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్ధేశించారు.


25వ రాజ్యాంగ సవరణ చట్టం: 1971
» దీని ద్వారా ఆర్టికల్ 31ను సవరించారు. ఆర్టికల్ - 31(C)ను కొత్తగా చేర్చారు.
» ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి చెల్లించే నష్టపరిహారం అనే పదం స్థానంలో కొంత మొత్తం అనే పదాన్ని చేర్చారు.
» ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ - 39 (B), (C) లను అమలుపరస్తూ చేసే చట్టాలను ఆర్టికల్స్ - 14, 19, 31 లకు వ్యతిరేకమని న్యాయస్థానాలు ప్రశ్నింపరాదు.


26వ రాజ్యాంగ సవరణ చట్టం: 1971
» దీని ద్వారా ఆర్టికల్ - 366 సవరించారు. ఆర్టికల్ - 363(A)ను నూతనంగా చేర్చారు.
» మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు ఉన్న రాజభరణాలను (privy purses) రద్దుచేశారు.


27వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీని ద్వారా ఆర్టికల్స్ - 239(A), 240 లను సవరించారు.
» ఈశాన్య రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించారు.
» ఆర్టికల్ - 371 ప్రకారం మణిపూర్‌కు మంత్రిమండలిని ఏర్పాటు చేశారు.
» కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులకు ఆర్డినెన్స్‌లు జారీచేసే అధికారం కల్పించారు.


28వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీని ద్వారా ఆర్టికల్ - 312(A) ను నూతనంగా చేర్చారు.
» మాజీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు ఉండే ప్రత్యేక హక్కులు, హోదాలను రద్దు చేశారు. వారి సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం పార్లమెంటుకు కల్పించారు.


29వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీని ద్వారా కేరళకు సంబంధించి, రెండు భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


30వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» సివిల్ కేసులకు సంబంధించి, సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లడానికి ఉన్న పరిమితి రూ.20,000 తొలగించారు. ఆర్టికల్ - 133ను సవరించారు.


31వ రాజ్యాంగ సవరణ చట్టం: 1972
» దీనిద్వారా ఆర్టికల్స్ - 81, 330, 332 లను సవరించారు.
» లోక్‌సభ సీట్ల సంఖ్యను 525 నుంచి 545 కు పెంచారు.
» కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్యను 25 నుంచి 20కి తగ్గించారు.


32వ రాజ్యాంగ సవరణ చట్టం: 1973
» దీనిద్వారా ఆర్టికల్ - 371(A) ను సవరించి, ఆర్టికల్స్ - 371 (D), 371 (E) లను కొత్తగా చేర్చారు.
» దీనిద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం వారికి విద్య, ఉద్యోగాల్లో 6 సూత్రాలు ఉన్న ముల్కీ నిబంధనల పథకం ద్వారా ప్రత్యేక రిజర్వేషన్లు నిర్దేశించారు.
» హైదరాబాద్‌లో విద్యాభివృద్ధికి సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.


33వ రాజ్యాంగ సవరణ చట్టం: 1974
» దీని ద్వారా ఆర్టికల్స్ - 101, 190 లను సవరించారు.
» పార్లమెంటు సభ్యులు లేదా శాసనసభల సభ్యులు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛంగా రాజీనామా చేస్తున్నారని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే స్పీకరు లేదా ఛైర్మన్ సదరు రాజీనామాలను ఆమోదించాలి.


34వ రాజ్యాంగ సవరణ చట్టం: 1974
» వివిధ రాష్ట్రాలకు చెందిన 20 భూసంస్కరణలు, భూమి కౌలు చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


35వ రాజ్యాంగ సవరణ చట్టం : 1975
» దీనిద్వారా ఆర్టికల్స్ 80, 81 లను సవరించారు. ఆర్టికల్ - 2(A) ను, 10వ షెడ్యూల్‌ను కొత్తగా చేర్చారు. సిక్కిం కు సహరాష్ట్ర హోదా కల్పిస్తూ 10వ షెడ్యూల్‌లో పొందుపరిచారు.


36వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» ఆర్టికల్ - 371(F)ను కొత్తగా చేర్చారు. ఆర్టికల్ - 2(A)ను తొలగించారు.
» 10వ షెడ్యూల్‌ను తొలగించి, సిక్కింను భారత్‌లో పూర్తిస్థాయిలో 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


37వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» దీనిద్వారా ఆర్టికల్స్ - 239(A), 240 లను కొత్తగా చేర్చారు.
» కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే అరుణాచల్‌ప్రదేశ్‌లో శాసనసభను, మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు.


38వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» దీని ద్వారా ఆర్టికల్స్ - 123, 213, 239(B), 352, 356, 359, 360 లను సవరించారు.
» రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని కోర్టుల అధికార పరిధి నుంచి మినహాయించారు.
» రాష్ట్రపతి, గవర్నరు, లెఫ్టినెంట్ గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్స్‌లను కోర్టుల అధికార పరిధి నుంచి మినహాయించారు.
» భిన్న ప్రాతిపదికన వివిధ రకాల జాతీయ అత్యవసర పరిస్థితులను ఏకకాలంలో ప్రకటించే అధికారం రాష్ట్రపతికి కల్పించారు.


39వ రాజ్యాంగ సవరణ చట్టం: 1975
» దీని ద్వారా ఆర్టికల్స్ - 71, 329 లతోపాటు 9వ షెడ్యూల్‌ను సవరించారు.
» రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలు న్యాయసమీక్ష పరిధి కిందకు రావు.


40వ రాజ్యాంగ సవరణ చట్టం: 1976
» దీని ద్వారా ఆర్టికల్స్ - 31(B), 297లతోపాటు; 9వ షెడ్యూల్‌ను కూడా సవరించారు.
» భారతదేశ అధికార పరిధి విస్తరించినంత వరకు ఉన్న ప్రాదేశిక జలాలు, ఖండాంతర భాగం, ప్రత్యేక ఆర్థిక మండలాలు, నావికా భూభాగం పరిధులను ఎప్పటికప్పుడు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది.
» కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన, 64 భూ సంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో పొందుపరిచారు.


41వ రాజ్యాంగ సవరణ చట్టం: 1976
» దీని ద్వారా ఆర్టికల్ 316ను సవరించారు.
» రాష్ట్రపబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.


42వ రాజ్యాంగ సవరణ చట్టం: 1976
» దీని ద్వారా 19(1), 31(C), 39, 55, 74, 77, 81, 82, 83, 100, 102, 103, 105, 118, 145, 150, 166, 170, 172, 189, 191, 192, 194, 208, 217, 225, 226, 227, 228, 311, 312, 330, 352, 353, 356, 357, 358, 359, 366, 368, 371(F) ఆర్టికల్స్‌ను సవరించారు.
» దీని ద్వారా కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ - 31(D), 32(A), 39(A), 43(A), 48(A), 51(A), 131(A), 139(A), 144(A), 226(A), 228(A), 257(A), 323(A), 323(B).
» రాజ్యాంగానికి IV(A), XIV అనే కొత్త భాగాలను చేర్చారు.
» స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సులను అనుసరించి, చేసిన 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు.


దీనిలోని ముఖ్యాంశాలు
» ప్రవేశికను సవరించి, సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.
» రష్యా నుంచి గ్రహించిన 10 ప్రాథమిక విధులను IV(A) భాగంలో చేర్చారు.
» పరిపాలనా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు.
» ఆర్టికల్ - 74(1) ప్రకారం కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
» 2001 వరకు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో మార్పులేకుండా నిర్దేశించారు.
» రాజ్యాంగ సవరణలను ఏ న్యాయ స్థానంలోనూ సవాల్ చేయరాదు.
» సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేశారు.
» లోక్‌సభ, రాష్ట్రశాసన సభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు.
» ఆదేశిక సూత్రాల అమలుకు చేసిన చట్టాలు, ప్రాథమిక హక్కులను ఉల్లఘింస్తున్నాయనే కారణంతో, కోర్టులు ఆ చట్టాలను రద్దు చేసే వీల్లేదు.
» ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను ఒకేసారి పొడిగించే కాలపరిమితిని 6 నెలల నుంచి సంవత్సరానికి పెంచారు.
» పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో కోరం అవసరాన్ని తొలగించారు.
» అఖిల భారత న్యాయసర్వీస్ ఏర్పాటుకు వీలు కల్పించారు.
» కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సాయుధ దళాలను ఏ రాష్ట్రానికైనా పంపించే అధికారంతోపాటుగా, రాష్ట్రాల శాంతి భద్రతలు పర్యవేక్షించడం, దళాల పర్యవేక్షణ అధికారం ఉంటుంది.
» రాష్ట్ర జాబితాలోని అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయపరిపాలన అనే అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
» ఆర్టికల్ - 352 ద్వారా విధించే అత్యవసర పరిస్థితిని ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పులు చేశారు.
» ఆర్టికల్ - 39(A) ఉచిత న్యాయసహాయం, ఆర్టికల్ - 48(A) పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ, ఆర్టికల్ - 43లో కుటీర పరిశ్రమల యాజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించడం అనే ఆదేశిక సూత్రాలను చేర్చారు.


43వ రాజ్యాంగ సవరణ చట్టం: 1977
» దీని ద్వారా ఆర్టికల్స్ - 145, 226, 228, 366 లను సవరించారు.
» సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉండే న్యాయ సమీక్షాధికారం, రిట్‌లను జారీ చేసే అధికారాలను పునరుద్ధరించారు.


44వ రాజ్యాంగ సవరణ చట్టం: 1978
» 42వ రాజ్యాంగ సవరణలోని వక్రీకరణలను సరిదిద్దడానికి, మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది.
» దీని ద్వారా ఆర్టికల్స్ - 19, 20, 21, 22, 30, 31(A), 31(C), 38, 71, 74, 77, 83, 103, 105, 123, 132, 133, 134, 139(A), 150, 166, 172, 192, 194, 213, 217, 225, 226, 227, 239(A), 329, 360, 371(F)లతోపాటు 9వ షెడ్యూల్‌ను కూడా సవరించారు.
» ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
» లోక్‌సభ, శాసనసభల పదవీ కాలాన్ని 6 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించారు.
» పార్లమెంట్, శాసనసభల కోరంను యధాతథస్థితికి తీసుకువచ్చారు.
» రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది.
» కేంద్రమంత్రి మండలి లిఖిత పూర్వక సలహాలేనిదే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించరాదు.
» పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించారు.
» రాష్ట్రపతికి కేంద్రమంత్రి మండలి ఇచ్చిన సిఫార్సును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు.
» ఆర్టికల్ - 352లోని ఆంతరంగిక అల్లకల్లోలాలు అనే పదాన్ని తొలగించి సాయుధ దళాల తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు.
» జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్స్ - 20, 21లను రద్దు చేయరాదు.
» పార్లమెంటు, శాసనసభల సభ్యుల ఎన్నికల వివాదాలను హైకోర్టు విచారిస్తుంది


45వ రాజ్యాంగ సవరణ చట్టం: 1980
» పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో - ఇండియన్లకు కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో 10 సంవత్పరాల వరకు అంటే 1990 వరకు పొడిగించారు.


46వ రాజ్యాంగ సవరణ చట్టం: 1982
» దీని ద్వారా ఆర్టికల్స్ - 269, 286, 366 లతోపాటు 7వ షెడ్యూల్‌ను సవరించారు.
» అంతర్‌రాష్ట్రాల మధ్య విధించే వాణిజ్య పన్నులు రాష్ట్రాలకు బదలాయించారు.


47వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» వివిధ రాష్ట్రాలకు చెందిన 14 భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


48వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్ - 356ను సవరించి, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించారు.


49వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్ - 244ను సవరించి త్రిపుర రాష్ట్ర శాసనసభకు త్రిపురలోని గిరిజన ప్రాంతాల పరిపాలనపై చట్టాలు చేసే అధికారం కల్పించారు.


50వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్ - 33ను సవరించి సాయుధ బలగాలకు ఉండే ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది.


51వ రాజ్యాంగ సవరణ చట్టం: 1984
» ఆర్టికల్‌ల్స్ - 330, 332 లను సవరించారు.
» మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం ప్రాంతాల్లోని ఎస్టీ వర్గాలకు లోక్‌సభలో సీట్లు రిజర్వు చేశారు.


52వ రాజ్యాంగ సవరణ చట్టం: 1985
» దీని ద్వారా ఆర్టికల్స్ - 101, 102, 190 లను సవరించారు. 10వ షెడ్యూల్‌ను కొత్తగా రాజ్యాంగంలో చేర్చారు.
» పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వం చట్టం చేసింది.


53వ రాజ్యాంగ సవరణ చట్టం: 1986
» దీని ద్వారా ఆర్టికల్ - 371(G) ను కొత్తగా ఏర్పాటు చేశారు.
» కేంద్రపాలిత ప్రాంతమైన మిజోరంను 23వ రాష్ట్రంగా చేర్చారు.


54వ రాజ్యాంగ సవరణ చట్టం: 1986
» దీని ద్వారా ఆర్టికల్స్ - 125, 221 లతోపాటు 2వ షెడ్యూల్‌ను సవరించారు.
» సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తుల వేతనాలను పెంచారు.


55వ రాజ్యాంగ సవరణ చట్టం: 1986
» దీని ద్వారా ఆర్టికల్ - 371(H) ను కొత్తగా చేర్చారు.
» అరుణాచల్ ప్రదేశ్‌ని 24వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


56వ రాజ్యాంగ సవరణ చట్టం: 1987
» గోవాను 25వ రాష్ట్రంగా, డామన్, డయ్యూలను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.


57వ రాజ్యాంగ సవరణ చట్టం: 1987
» దీని ద్వారా ఆర్టికల్ - 332ను సవరించి మిజోరం, నాగాలాండ్, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ తెగలకు లోక్‌సభ, శాసనసభల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.


58వ రాజ్యాంగ సవరణ చట్టం: 1987
» దీని ద్వారా ఆర్టికల్ - 394(A) ను నూతనంగా చేర్చి, రాజ్యాంగాన్ని హిందీ భాషలోకి అధికారికంగా తర్జుమా చేయడానికి చట్టం చేశారు.


59వ రాజ్యాంగ సవరణ చట్టం: 1988
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి, ఆర్టికల్ - 359(A)ను నూతనంగా చేర్చారు.
» పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను 3 సంవత్సరాలకు పెంచారు.


60వ రాజ్యాంగ సవరణ చట్టం: 1988
» దీని ద్వారా ఆర్టికల్ - 276ను సవరించారు. స్థానిక సంస్థలు విధించే వృత్తి పన్నును రూ.250 నుంచి రూ.2,500 కు పెంచారు.


61వ రాజ్యాంగ సవరణ చట్టం: 1988
» దీని ద్వారా ఆర్టికల్ - 326ను సవరించి, వయోజన హక్కు కనీస వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.


62వ రాజ్యాంగ సవరణ చట్టం: 1989
» పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్‌లకు కేటాయించిన రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరం వరకు పొడిగించారు.


63వ రాజ్యాంగ సవరణ చట్టం: 1989
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించారు. ఆర్టికల్ - 359(A)ను తొలగించారు.
» పంజాబ్‌కు సంబంధించి, 59వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన అంశాలను తొలగించారు. అంటే ఇతర రాష్ట్రాలకు విస్తరించే అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలే పంజాబ్‌కు కూడా వర్తిస్తాయి.


64వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలల పాటు పొడిగించారు.


65వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా ఆర్టికల్ - 338ని సవరించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ భద్రతను కల్పించారు.


66వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా 9వ షెడ్యూల్‌ను సవరించి భూసంస్కరణలకు సంబంధించి 55 చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.


67వ రాజ్యాంగ సవరణ చట్టం: 1990
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి, పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు (4 ఏళ్లు) పొడిగించారు.


68వ రాజ్యాంగ సవరణ చట్టం: 1991
» దీని ద్వారా ఆర్టికల్ - 356ను సవరించి పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా 5 సంవత్సరాలను పొడిగించారు.


69వ రాజ్యాంగ సవరణ చట్టం: 1991
» దీని ద్వారా ఆర్టికల్స్ - 239(AA), 239(AB)లను కొత్తగా చేర్చారు.
» దిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీగా పరిగణిస్తారు.
» దిల్లీకి 70 మంది శాసనసభ్యులతో కూడిన శాసనసభను ఏర్పాటు చేశారు.


70వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా ఆర్టికల్స్ - 54, 239(AA)లను సవరించారు.
» రాష్ట్రపతి ఎన్నికల్లో దిల్లీ, పుదుచ్చేరి శాసన సభ్యులకు భాగస్వామ్యం కల్పించారు.


71వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా 8వ షెడ్యూల్‌ను సవరించి కొంకణి, మణిపురి, నేపాలి భాషలను రాజ్యాంగం గుర్తించిన భాషల్లో చేర్చారు.


72వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా ఆర్టికల్ - 332ను సవరించి, త్రిపుర రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వేషన్లు కల్పించారు.


73వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా రాజ్యాంగానికి 9వ భాగం, 11వ షెడ్యూల్‌ను చేర్చారు.
» ఆర్టికల్స్ - 243, 243(A) నుంచి 243(O) వరకు ఉన్న 16 ఆర్టికల్స్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ భద్రతను నిర్ధేశించారు.


74వ రాజ్యాంగ సవరణ చట్టం: 1992
» దీని ద్వారా రాజ్యాంగానికి 9(A) భాగం, 12వ షెడ్యూల్‌ను చేర్చారు.
» ఆర్టికల్ - 243(P) నుంచి 243(G) వరకు ఉన్న 18 రకాల ఆర్టికల్స్‌లో పట్టణ, నగర పాలక వ్యవస్థకు సంబంధించి, రాజ్యాంగ భద్రతను నిర్ధేశించారు.


75వ రాజ్యాంగ సవరణ చట్టం: 1994
» దీని ద్వారా ఆర్టికల్ - 323(B) ను సవరించారు.
» గృహహక్కుదారులు, అద్దెకున్న వారికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.

 

76వ రాజ్యాంగ సవరణ చట్టం: 1994
» దీని ద్వారా 9వ షెడ్యూల్‌ను సవరించారు. న్యాయసమీక్షాధికారం పరిధి నుంచి తప్పించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర విద్యా, ఉద్యోగాల్లో కల్పిస్తున్న 69% రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో పొందుపరిచారు.


77వ రాజ్యాంగ సవరణ చట్టం: 1995
» దీని ద్వారా ఆర్టికల్ - 16(4A) ను రాజ్యాంగానికి చేర్చారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.


78వ రాజ్యాంగ సవరణ చట్టం: 1995
» దీని ద్వారా 9వ షెడ్యూల్‌ను సవరించి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 27 భూసంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీంతో ఈ షెడ్యూల్‌లోని భూసంస్కరణల చట్టాల సంఖ్య 282కు చేరింది.


79వ రాజ్యాంగ సవరణ చట్టం: 1999
» దీని ద్వారా పార్లమెంటు, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్‌లకు కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు అంటే 2010 వరకు పొడిగించారు.


80వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» దీని ద్వారా ఆర్టికల్స్ - 268, 269, 270 లను సవరించారు.
» 10వ ఆర్థికసంఘం సిఫారసుల ఆధారంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల రాబడిలో 29 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించారు.


81వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన ఖాళీలు ఆ సంవత్సరంలో భర్తీ కాకపోతే, వాటిని ప్రత్యేక ఖాళీలుగా పరిగణిస్తూ, ఆ వర్గాలతో మాత్రమే భర్తీ చేయాలని ఆర్టికల్ - 16 (4B)లో నిర్దేశించారు.


82వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» దీని ద్వారా ఆర్టికల్ - 335ను సంవరించి, విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అర్హత మార్కులను, ఇతర అర్హతలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తగ్గించవచ్చు.


83వ రాజ్యాంగ సవరణ చట్టం: 2000
» దీని ద్వారా ఆర్టికల్ - 243(M)ను సవరించి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఎస్టీలు మాత్రమే నివసిస్తున్న కారణంగా అక్కడ ఎస్సీ వర్గాల వారు లేకపోవడంతో, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎస్సీల రిజర్వేషన్లను రద్దు చేశారు.


84వ రాజ్యాంగ సవరణ చట్టం: 2001
» దీని ద్వారా ఆర్టికల్స్ - 55, 81, 82, 170, 330, 332 లను సవరించారు.
» లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్చరాదని నిర్దేశించారు.


85వ రాజ్యాంగ సవరణ చట్టం: 2002
» దీని ద్వారా ఆర్టికల్ - 16(A) ను సవరించి, ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సంబంధించిన మార్పులు చేశారు.


86వ రాజ్యాంగ సవరణ చట్టం: 2002
» దీని ద్వారా ఆర్టికల్ - 45ను సవరించారు. కొత్తగా ఆర్టికల్స్ - 21(A), 51 A(K) లను చేర్చారు.
» 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉండే బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి.
» ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ - 45లో 6 సంవత్సరాల లోపు ఉండే బాలలకు పూర్వ ప్రాథమిక విద్యను కల్పించడం.
» ప్రాథమిక విధుల్లో 11వ ప్రాథమిక విధిగా 6 - 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యత.


87వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్స్ - 81, 82, 170 లను సవరించారు.
» ప్రాదేశిక నియోజక వర్గాల పునర్విభజన కోసం 1991 సంవత్సర జనాభా లెక్కలకు బదులుగా, 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించారు.


88వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్ - 270ను సవరించారు.
» ఆర్టికల్ - 268(A) ను కొత్తగా చేర్చారు.
» సర్వీస్ టాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ టాక్స్‌ను కేంద్రం విధిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు వసూలు చేసి తీసుకుంటాయి.


89వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్ - 338ను సవరించారు. ఆర్టికల్ - 338(A) ను కొత్తగా చేర్చారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.


90వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్ - 332ను సవరించారు. అసోం రాష్ట్ర శాసనసభలో బోడోల్సాండ్ ప్రాంతానికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.


91వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» దీని ద్వారా ఆర్టికల్స్ - 75, 164 లను సవరించారు. ఆర్టికల్ - 361(B) కొత్తగా చేర్చారు.
» కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు.
» రాష్ట్రమంత్రిమండలి సభ్యుల సంఖ్య, రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. కానీ కనీస సభ్యుల సంఖ్య 12కు తగ్గరాదు.
» పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యులు 2 సంవత్సరాలు ఎలాంటి పదవులు చేపట్టరాదు.


92వ రాజ్యాంగ సవరణ చట్టం: 2003
» 8వ షెడ్యూల్‌ను సవరించి, బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనే 4 భాషలను చేర్చడంతో ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 24కు చేరింది.


93వ రాజ్యాంగ సవరణ చట్టం: 2005
» దీని ద్వారా ఆర్టికల్ - 15ను సవరించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు.


94వ రాజ్యాంగ సవరణ చట్టం: 2006
» దీని ద్వారా ఆర్టికల్ - 164(1) ను సవరించారు. బీహార్ మంత్రిమండలిలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా ఒక మంత్రి ఉండాలనే నిబంధనను తొలగించారు.
» ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మంత్రిమండలిలో ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించారు.


95వ రాజ్యాంగ సవరణ చట్టం: 2009
» పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్‌లకు కల్పిస్తున్న రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు అంటే 2020 వరకు పొడిగించాలని నిర్దేశించారు.


96వ రాజ్యాంగ సవరణ చట్టం: 2011
» దీని ద్వారా 8వ షెడ్యూల్‌ను సవరించి ఒరియా భాషను ఒడియాగా మార్చారు.


97వ రాజ్యాంగ సవరణ చట్టం: 2011
» దీని ద్వారా రాజ్యాంగానికి IX(B) అనే కొత్త భాగాన్ని చేర్చి, ఆర్టికల్స్ - 243(ZH) నుంచి 243(ZT) వరకు ఉన్న ఆర్టికల్స్‌ను కొత్తగా రాజ్యాంగానికి చేర్చి సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు.


98వ రాజ్యాంగ సవరణ చట్టం: 2012
» దీని ద్వారా ఆర్టికల్ - 371 (J) ను కొత్తగా చేర్చారు.
» కర్ణాటక రాష్ట్రంలోని హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు.


99వ రాజ్యాంగ సవరణ చట్టం: 2014
» దీనిద్వారా ఆర్టికల్స్ - 127, 128, 217, 222, 224(A) లను సవరించారు.
» ఆర్టికల్స్ - 124(A), 124(B), 124(C) లను కొత్తగా చేర్చారు.
» జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటైంది. దీన్ని 16 రాష్ట్రాల శాసన సభలు ఆమోదించడంతో ఇది అమల్లోకి వచ్చింది.


100వ రాజ్యాంగ సవరణ చట్టం: 2015
» దీని ద్వారా ఆర్టికల్ - 2 సవరించి భారత్-బంగ్లాదేశ్‌లు పరస్పర భూభాగ మార్పిడులను చేసుకున్నాయి.


రాజ్యాంగ సవరణ - బిల్లులు

101వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2004
» ప్రజాపంపిణీ ద్వారా పంపిణీ చేసే పంచదార లాంటి నిత్యావసర వస్తువులను కోర్టుల పరిధి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన బిల్లు.


102వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2004
» కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి సంబంధించి, పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం.


103 రాజ్యాంగ సవరణ బిల్లు: 2004
» జాతీయ మైనార్టీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించింది. కానీ, ఈ బిల్లు మురిగిపోయింది.


104వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2005
» ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రైవేటు, అన్ఎయిడేడ్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించింది.


105వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2006
» ఈ బిల్లులోని అంశాలు 94వ రాజ్యాంగ సవరణలోకి మార్చారు.


106వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2006
» దీన్ని 2006లో ప్రతిపాదించగా, 14వ లోక్‌సభ రద్దు కావడంతో మురిగిపోయింది. 2009లో మళ్లీ దీన్ని 111వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు. ఇది 97వ రాజ్యాంగ సవరణ చట్టం (2011) రూపంలో అమల్లోకి వచ్చింది.


107వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2007
» డార్జిలింగ్ గూర్ఖాహిల్ కౌన్సిల్ ఏర్పాటుకు ఉద్దేశించింది. కానీ ఈ బిల్లు మురిగిపోయింది.


108వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2010
» లోక్‌సభ, రాష్ట్రాల విధానసభల్లో మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించినప్పటికీ, లోక్‌సభ తిరస్కరించడంతో మురిగిపోయింది.


109వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» ఎస్సీ, ఎస్టీలకు, ఆంగ్లో ఇండియన్‌లకు లోక్‌సభ, రాష్ట్రాల విధానసభల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు మరో 10 సంవత్సరాలు పొడిగించడం. ఇది 95వ రాజ్యాంగ సవరణ చట్టం - 2009గా అమల్లోకి వచ్చింది.


110వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు రిజర్వు చేయడం. 15వ లోక్‌సభ రద్దుకావడంతో ఇది మురిగిపోయింది.


111వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» సహకార సంఘాల ఏర్పాటుకు ఉద్దేశించింది. ఇది 97వ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.


112వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2009
» మున్సిపల్ ఎన్నికల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్లను కల్పించేందుకు ఉద్దేశించింది.


113వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2010
» ఒరియా భాషను ఒడియాగా మార్చడానికి ఉద్దేశించింది. ఇది 96వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.


114వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2010
» హైకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచడానికి ఉద్దేశించింది. ఇది మురిగిపోయింది.


115వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2011
» వస్తుసేవల పన్నును విధించేందుకు కేంద్రానికి, రాష్ట్రాలకు ఉమ్మడి పన్ను అధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించింది. ఇదీ మురిగిపోయింది.


116వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2012
» లోక్‌పాల్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించారు.


117వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2012
» ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించింది.


118వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2012
» కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించింది.


119వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2013
» భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల పరస్పర మార్పిడికి ఉద్దేశించింది.


120వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2013
» ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (JAC) ఏర్పాటుకు సంబంధించింది.


121వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2014
» జాతీయ న్యాయ నియమకాల కమిషన్ బిల్లు. ఇది 99వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.


122వ రాజ్యాంగ సవరణ బిల్లు: 2014
» వస్తుసేవల పన్ను (GST) కు సంబంధించింది. ఇటీవల పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొంది చట్టంగా మారింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పంచాయతీరాజ్ వ్యవస్థ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో..... విద్యుక్త అంశాలు ఉన్నాయి.
జవాబు: 29

 

2. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎక్కడ స్థాపించారు?
జవాబు: మద్రాసు

 

3. భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో ఉన్న అంశాలు?
జవాబు: 18

 

4. 1992లో 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన కొత్త భాగం?
జవాబు: 9

 

5. రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ప్రదేశంలో ఎంత జనాభా ఉండాలి?
జవాబు: 10 లక్షల పైన

 

6. రాష్ట్రంలో పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతంగా మార్చేది...
జవాబు: నగర పంచాయత్

 

7. మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేది?
జవాబు: రాష్ట్ర ఎన్నికల సంఘం

 

8. మున్సిపాలిటీలో ప్రతి వార్డు జనాభా .... ఉండాలి.
జవాబు: 3 లక్షలు ఆపైన

 

9. గ్రామ పంచాయతీలోని పల్లెల్లో ఎలక్ట్రోరల్ రోల్స్‌లో ఉండేవారిని ఏమంటారు?
జవాబు: గ్రామ సభ

 

10. భారతదేశ స్థానిక స్వపరిపాలనా పితామహుడిగా పేరుగాంచింది ఎవరు?
జవాబు: లార్డ్ రిప్పన్

 

11. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన షెడ్యూల్ ఏది?
జవాబు: షెడ్యూల్ XII

 

12. పంచాయతీ వ్యవస్థాపనకు సంబంధించిన అధికరణ ఏది?
జవాబు: ఆర్టికల్ 243 B

 

13. రాజ్యాంగంలోని అధికరణ 243 D పంచాయతీలకు కల్పించేది...
జవాబు: సీట్ల రిజర్వేషన్

 

14. పంచాయతీ మెంబర్లను అనర్హులుగా ప్రకటించే అధికరణం ఏది?
జవాబు: ఆర్టికల్ 243 F

 

15. రాజ్యాంగంలోని 73వ సవరణ‌ను ఏ విభాగంలో పొందుప‌రిచారు?
జవాబు: IXవ భాగం

 

16. పంచాయతీలు అమలు పరచాల్సిన అధికారాలు ఏ షెడ్యూల్‌లో ఉన్నాయి?
జవాబు: XI

 

17. పంచాయతీలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించే అధికరణం ఏది?
జవాబు: ఆర్టికల్ 243 H

 

18. రాజ్యాంగంలో విభాగం IXA ని పొందుపరిచిన రాజ్యాంగ సవరణ ఏది?
జవాబు: 74వ సవరణ

 

19. మున్సిపాలిటీలో వార్డు కమిటీ ఏర్పాటును సూచించే అధికరణ ఏది?
జవాబు: ఆర్టికల్ 243 S

 

20. కిందివాటిలో ఏ నిబంధన దేశ రాజధాని ఢిల్లీకి వర్తించదు?
1) ఆర్టికల్ 243 ZD     2) ఆర్టికల్ 243 ZC        3) ఆర్టికల్ 243 ZB     4) ఆర్టికల్ 243 ZA
జవాబు: ఆర్టికల్ 243 ZD

 

21. 74వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు?
జవాబు: 1992

 

22. స్థానిక స్వపరిపాలనా సంస్థల స్థాపన VII షెడ్యూల్‌లోని ఏ జాబితా కిందికి వస్తుంది?
జవాబు: జాబితా II

 

23. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రథమంగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జవాబు: రాజస్థాన్

 

24. కిందివాటిలో గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలిపే అధికరణం ఏది?
1) ఆర్టికల్ 39 A          2) ఆర్టికల్ 40          3) ఆర్టికల్ 41         4) ఆర్టికల్ 42
జవాబు: ఆర్టికల్ 40

 

25. గ్రామ పంచాయతీ ఏర్పాటు ఒక ఆదేశ సూత్రం. దీనికి సంబంధించి కిందివాటిలో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ ఏది?
1) 73, 74 రాజ్యాంగ సవరణలు                2) 62, 64 రాజ్యాంగ సవరణలు
3) 60, 61 రాజ్యాంగ సవరణలు                4) పైవన్నీ
జవాబు: 73, 74 రాజ్యాంగ సవరణలు

 

26. పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణంలో పొందుపరిచారు?
జవాబు: 243వ అధికరణ

 

27. 73వ రాజ్యాంగ సవరణ ఎన్ని అంచెల పంచాయతీ విధాన ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది?
జవాబు: 3

 

28. కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వహణాధికారిని ఎవరు నియమిస్తారు?
జవాబు: భారత రాష్ట్రపతి

 

29. జిల్లా ప్రణాళికా కమిటీలు మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీల నియామకానికి సంబంధించిన అధికారం వరుసగా కింది ఏ రాజ్యాంగ ప్రకరణల్లో ఉంది?
1) 243 ZA ప్రకరణం, 243 ZC ప్రకరణం           2) 243 ZD ప్రకరణం, 243 ZE ప్రకరణం
3) 243 ZA ప్రకరణం, 243 K ప్రకరణం             4) 243 ZG ప్రకరణం, 243 ZC ప్రకరణం
జవాబు: 243 ZD ప్రకరణం, 243 ZE ప్రకరణం

30. 1996 పెసా (PESA) చట్టం ఏర్పాటును సిఫారసు చేసిన కమిషన్ ఛైర్మన్ ఎవరు?
జవాబు: దిలీప్‌సింగ్ బూరియా

 

31. పంచాయతీ ఖాతాల నిర్వహణ తనిఖీలకు సంబంధించిన నిబంధనలను రూపొందించేది ఏది?
జవాబు: రాష్ట్ర శాసనసభ

 

32. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణలో ఏ స్థానిక సంస్థకు పార్టీరహితంగా ఎన్నికలు నిర్వహిస్తారు?
జవాబు: గ్రామ పంచాయతీ

 

33. చట్ట ప్రకారం క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీల ఆడిట్ నిర్వహించేది ఎవరు?
జవాబు: స్టేట్ ఆడిట్ సంచాలకులు

 

34. కిందివాటిలో పంచాయతీరాజ్ సంస్థ కానిదేది?
1) గ్రామసభ        2) గ్రామ పంచాయతీ       3) జిల్లాపరిషత్        4) గ్రామ సహకారసంస్థ
జవాబు: గ్రామ సహకారసంస్థ

 

35. గ్రామ పంచాయతీలు విధించే, వసూలు చేసే పన్ను ఏది?
జవాబు: ఇంటి పన్ను

 

36. కిందివాటిలో గ్రామ పంచాయతీల ప్రధాన విధుల్లో లేనిది ఏది?
1) తాగునీటి సరఫరా                  2) పారిశుద్ధ్య నిర్వహణ
3) తక్కువ వడ్డీకి రుణాలు       4) వీధి దీపాల నిర్వహణ
జవాబు: తక్కువ వడ్డీకి రుణాలు

 

37. గ్రామసభ నిర్వహించాలంటే కోరం ఎంత ఉండాలి?
జవాబు: కోరం నిర్దేశించలేదు

 

38. గ్రామంలో వీధికుక్కలను నివారించే బాధ్యత ఎవరిది?
జవాబు: గ్రామ పంచాయతీ

 

39. పంచాయతీరాజ్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
జవాబు: ప్రజలను అభివృద్ధి పాలనలో భాగస్వాములను చేయడం

 

40. పంచాయతీరాజ్ సంస్థల ఉనికి లేని రాష్ట్రం ఏది?
జవాబు: నాగాలాండ్

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పంచాయతీరాజ్ వ్యవస్థ

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 అక్టోబరు 11న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మొదటి పంచాయతీ సమితిని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది. ఆ తర్వాత అశోక్ మెహతా సిఫారసులను అనుసరించి 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు పంచాయతీ వ్యవస్థను రద్దుచేసి, మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మండల పరిషత్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత కొన్ని కమిటీలు చేసిన సిఫారసులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఆధారంగా 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా 1986లో సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. 1995 మే 30 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా పదవిలో కొనసాగడానికి అనర్హులు. మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించడానికి, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సూత్రానికి వ్యతిరేకం కాదని సుప్రీం కోర్టు అబ్దుల్ అజీజ్ అసాద్ Vs ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేసులో పేర్కొంది. ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని బి.పి.ఆర్. విఠల్ కమిటీ సూచనల ప్రకారం ఏర్పాటు చేశారు.
 

గ్రామసభ
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పారదర్శకతను, బాధ్యతాయుతమైన పరిపాలనను ఇనుమడింపజేసేదే గ్రామసభ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామసభకు సర్పంచ్, సర్పంచ్ లేనప్పుడు ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీ సరిహద్దు లోపల సభ్యులకు అనుగుణంగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయంలోపు గ్రామసభ సమావేశాన్ని ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామసభను సంవత్సరానికి నాలుగుసార్లు (జనవరి 2, ఏప్రిల్ 14, జులై 1, అక్టోబరు 3) తప్పనిసరిగా నిర్వహించాలి. అయితే అవసరాన్ని బట్టి గ్రామసభను ఎన్నిసార్లయినా సమావేశపరచవచ్చు. కనీసం 50 మంది లేదా కనీసం 10% మంది సభ్యులు (ఏది ఎక్కువైతే అది) సభను ఏర్పాటు చేయమని లిఖితపూర్వకంగా కోరినట్లయితే సర్పంచ్ తప్పనిసరిగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామసభ నిర్వహణకు కోరం నిర్ణయించలేదు.

రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్
పన్నెండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా 2013 మార్చి 7న కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ (RGPSA) పథకాన్ని ప్రారంభించింది. గ్రామసభను మరింత సమర్థంగా నిర్వహించడం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సమర్థ సేవల నిర్వహణ (Transparency, accountability and efficient delivery services) ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో సమాచార సేకరణ వ్యవస్థ ఏర్పాటు, సాంకేతిక సామర్థ్యం పెంపు, బాధ్యతతో వ్యవహరించడం మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.

గమనిక: రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ (RGPSA) పథకానికి అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 నవంబరు 7న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అనుసరించి సంవత్సరంలో నాలుగుసార్లు గ్రామసభను నిర్వహించాలి.
 

ఈ - పంచాయత్
2004లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో సమాచార సాంకేతికతను స్థానిక ప్రభుత్వాల ద్వారా గ్రామీణాభివృద్ధికి ఉపయోగించాలని తీర్మానించింది. పంచాయతీరాజ్‌లో సాంకేతికతతో కూడిన పాలననే ఈ - పంచాయత్ అంటారు. నేషనల్ ఈ - పంచాయత్ 2006లో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక భాగంగా ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 2013లో ప్రవేశపెట్టిన రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొంది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

74వ రాజ్యాంగ సవరణ చట్టం

* పట్టణ, నగరపాలక సంస్థలను మున్సిపల్ సంస్థలుగా పేర్కొనవచ్చు. మున్సిపల్ అనే పదం మున్సిపియం అనే రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. మున్సిపియం అంటే సంఘటితత్వం అని అర్థం.
* భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి పట్టణ, నగరపాలక సంస్థలు వర్ధిల్లుతున్నాయి. ప్రాచీన కాలంలో సింధునాగరికత మనదేశంలో అత్యున్నత పట్టణ నాగరికతకు నిదర్శనం.
* క్రీ.పూ. 2750 - 1750 మధ్య మనదేశంలో సింధునాగరికత వర్థిల్లింది.ఈ కాలంలో...
 అద్భుతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ
 నిర్ణీత కొలతల ప్రకారం భవనాల నిర్మాణం
 ప్రధాన రహదారులను ఉత్తర-దక్షిణ దిక్కులను కలిపే విధంగా నిర్మించడం
 మహాస్నాన వాటిక నిర్మాణాలు
   ఇలా ప్రతి ఒక్కటిని అద్భుతంగా నిర్మించారు. అంతేకాకుండా శాంతికాముక పరిపాలనా విధానాలను అనుసరించారు.

* మనదేశంలో గ్రామీణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం చోళులు కాగా, పట్టణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం మౌర్యులు.
* మౌర్యుల రాజధాని నగరం పాటలీపుత్రం. ఈ నగర పాలనను అయిదుగురేసి సభ్యుల చొప్పున, ఆరు బృందాలు (30 మంది) సమర్థంగా పౌరపాలనను నిర్వహించేవని, చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన గ్రంథమైన ఇండికాలో వివరించారు.
* మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు, మొగలుల పరిపాలనా కాలంలో పట్టణ, నగరాల శాంతిభద్రతల పరిరక్షణలో కొత్వాల్ అనే అధికారి కీలకపాత్ర వహించేవారు.
* ఆంగ్లేయులు మనదేశంలో తొలి మున్సిపల్ కార్పొరేషన్‌ను 1687లో మద్రాస్‌లో నెలకొల్పారు.
* 1726లో బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లను నెలకొల్పారు.
* 1793 ఛార్టర్ చట్టం ద్వారా పట్టణ ప్రభుత్వాలకు చట్టబద్ధత కల్పించడానికి ఆంగ్లేయులు తొలిసారిగా ప్రయత్నించారు.
* 1870లో లార్డ్‌మేయో తీర్మానం భారతదేశంలో పట్టణ, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో, భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రయత్నించింది.
* 1882లో లార్డ్‌రిప్పన్ తీర్మానం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలను ఎక్కువగా కల్పిస్తూ, వాటి నిర్వహణలో అధికారుల సంఖ్యను 3వ వంతు తగ్గించేందుకు ప్రయత్నించింది.

1907 రాయల్ కమిషన్ సిఫారసులు
* 1907లో ఛార్లెస్ హాబ్‌హౌస్ నాయకత్వంలోని రాయల్ కమిషన్ అధికారాల వికేంద్రీకరణ కోసం కింది సిఫార్సులను చేసింది.
    A. పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణలో అధికారుల సంఖ్యను తగ్గించడం.
    B. ఓటు హక్కుపై ఉండే పరిమితిని తొలగించి, విస్తృత పరచడం.
    C. ఆర్థిక వనరులను అధికంగా కేటాయించడం.

* 1919లో మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా రాష్ట్రస్థాయిలో ద్వంద్వపాలనను ప్రవేశపెట్టారు.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తిని కల్పించారు.
 భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోని నిర్దేశిక నియమాల్లోని ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక పాలన కోసం స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలి.
 పట్టణంలో/ నగరంలో నివసించే పౌరులు ఆమోదించి, ఎన్నుకున్న వ్యక్తులతో స్థానిక పరిపాలనా ప్రయోజనాల కోసం ఏర్పాటైన సంస్థను పురపాలక సంస్థ/ నగరపాలక సంస్థ అంటారు.
 క్రీ.పూ. 500 సంవత్సరాల నాటికి భారతదేశంలో 16 నగర రాజ్యాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
 ఎల్. ఎం. సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభలో చర్చిస్తున్న కాలంలోనే సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.
 పునర్వ్యవస్థీకరించిన నగరపాలక బిల్లును వి.పి. సింగ్ ప్రభుత్వం 1990, సెప్టెంబరులో లోక్‌సభలో ప్రవేశపెట్టి విఫలమైంది.
 పి.వి. నరసింహారావు ప్రభుత్వం పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును పార్లమెంట్ 1992, డిసెంబరు 22న ఆమోదించింది.
 పార్లమెంట్ ఆమోదం పొందిన 74వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993, ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం పొంది 1993, జూన్ 1 నుంచి 74వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.
 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ రాజ్యాంగానికి IX(A) అనే నూతన భాగాన్ని ఏర్పాటు చేసి దానిలో ఆర్టికల్ 243(P) నుంచి 243(ZG) వరకు ఉండే మొత్తం 18 ప్రకరణల్లో పట్టణ ప్రభుత్వాల గురించి పొందుపరిచారు.
 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారానే రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌ను చేర్చి పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను పొందుపరిచారు.

74వ రాజ్యాంగ సవరణ చట్టం - విశేషాలు
 

ఆర్టికల్ 243(P): పట్టణ ప్రభుత్వాల నిర్వచనాన్ని తెలియజేస్తుంది.
* స్థానిక సంస్థల్లోని మున్సిపల్ సంస్థల నిర్వచనాలను గవర్నరు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.
* రాష్ట్రప్రభుత్వం గవర్నరు నోటిఫికేషన్‌ను అనుసరించి, కింది అంశాలపై చట్టాల ద్వారా నిర్వచనాలను రూపొందిస్తుంది.
1. జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా.
2. పంచాయతీ: ఆర్టికల్, 243(B) ప్రకారం పంచాయతీగా ఏర్పాటు చేసిన ప్రాంతం.
3. జిల్లా: ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
4. కమిటీ: ఆర్టికల్ 243(S) ప్రకారం ఏర్పాటైన కమిటీ.
5. మున్సిపల్ ప్రాంతం: గవర్నరు నోటిఫై చేసిన ఒక మున్సిపాలిటీలోని ప్రాదేశిక ప్రాంతం.
6. మున్సిపాలిటీ: ఆర్టికల్, 243(Q) ప్రకారం ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
7. మెట్రోపాలిటన్ ప్రాంతం: 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం.

ఆర్టికల్ 243(Q): మున్సిపల్ సంస్థల వ్యవస్థాపన
1. మెట్రోపాలిటన్ నగరాలు: 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
2. నగరపాలక సంస్థలు: 3 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు.
3. మున్సిపల్ కౌన్సిల్: 20 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను మున్సిపల్ కౌన్సిల్‌గా ఏర్పాటు చేస్తారు.
4. నగర పంచాయతీలు: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారు. వీటి కనీస జనాభా 11 వేల పైన, 20 వేల లోపు ఉంటుంది.
5. టౌన్‌షిప్‌లు: భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజల పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేసే సంస్థలు.

 

ఆర్టికల్ 243(R) మున్సిపల్ వ్యవస్థల నిర్మాణం
* మున్సిపల్ ఛైర్‌పర్సన్, నగర కార్పొరేషన్ మేయర్, మెట్రోపాలిటన్ నగర మేయర్‌లు అంటే ఆయా సంస్థల అధిపతులు. వీరిని ఆయా సంస్థలకు చెందిన సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.
* నగర పంచాయతీల అధ్యక్షుల ఎన్నిక ప్రత్యక్షమా? పరోక్షమా? అనే అంశాన్ని రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగర పంచాయతీ అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్నారు. పట్టణ, నగరపాలక సంస్థలు ఏ పార్లమెంటు నియోజక వర్గ పరిధి కిందకు వస్తాయో, సంబంధిత పార్లమెంటు సభ్యులు, శాసనసభల సభ్యులు ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.
* పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, విధాన పరిషత్‌ల సభ్యులు కూడా ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.
* ఎక్స్అఫీషియో సభ్యులకు ఓటుహక్కు కల్పించే అంశంపై రాష్ట్రప్రభుత్వం చట్టం చేయవచ్చు.
* 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటుహక్కు కల్పించింది.

ఆర్టికల్, 243(S): వార్డులు, వార్డు కమిటీల ఏర్పాటు
* పట్టణ, నగరపాలక సంస్థలను కొన్ని వార్డులు/ డివిజన్లుగా విభజిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహుళ సభ్య వార్డుల ఏర్పాటును సుప్రీంకోర్టు సమర్థించింది.

మెట్రోపాలిటన్ నగరాలు:
* మెట్రోపాలిటన్ నగరాలను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. వీటిలో 100 - 200 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికైనవారిని కార్పొరేటర్లు అంటారు.
* గ్రేటర్ ముంబై కార్పొరేషన్‌లో 228 డివిజన్లు ఉన్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్:
* మున్సిపల్ కార్పొరేషన్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. కార్పొరేష‌న్‌లో 50 - 100 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికయ్యే సభ్యులను కార్పొరేటర్లు అంటారు.

మున్సిపాలిటీ

* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను కౌన్సిలర్లు అంటారు. మున్సిపాలిటీలో వార్డు సభ్యుల సంఖ్య 23 - 50 వరకు ఉంటుంది.

నగర పంచాయతీ
* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను వార్డు సభ్యులు అంటారు. నగర పంచాయతీలో వార్డు సభ్యుల సంఖ్య 15 - 21 వరకు ఉంటుంది.
* 3 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌లు, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.
* రెండు లేదా అంత కంటే ఎక్కువ వార్డులు/ డివిజన్‌లు కలిసి వార్డు కమిటీగా ఏర్పాటైనప్పుడు ఆ వార్డులు/ డివిజన్‌ల సభ్యులు తమలో నుంచి ఒకరిని వార్డు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
* ఈ వార్డు కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తాయి.

ఆర్టికల్ 243 (T)
* పట్టణ, నగరపాలక సంస్థల్లో కొన్ని స్థానాలను జనాభా ప్రాతిపదికపై ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కేటాయించిన స్థానాల్లో 1/3వ వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి.
* వెనుకబడిన వర్గాలకు (OBC) రిజర్వేషన్లు కల్పించే అంశంపై 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా, ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాలవారికి 34% స్థానాలను రిజర్వ్ చేస్తున్నారు.
* మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని మున్సిపాలిటీలో, ముగ్గురిని మున్సిపల్ కార్పొరేషన్‌లో కో ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసుకునే వీలుంది.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా ప్రస్తుతం మనదేశంలో 11 రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల్లో మొత్తం స్థానాల్లో 50% స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు.
* వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేసిన స్థానాల్లో వెనుకబడిన తరగతుల్లో జన్మించినవారు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని వివాహం చేసుకున్న అగ్ర కుల స్త్రీలు వెనుకబడిన తరగతులకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీచేయడానికి అర్హులు కాదని 2005లో సుప్రీంకోర్టు పేర్కొంది.

ర్టికల్ 243 (U): పదవీకాలం
* అన్ని స్థాయుల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం 5 సంవత్సరాలు.
* పట్టణ, నగరపాలక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలు.
* పదవీకాలం ముగియకముందే ఈ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు.
* ఏ కారణం వల్లనైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల పదవీకాలం ముగియకముందే మధ్యలోనే రద్దుచేసినట్లయితే, రద్దయిన 6 నెలల్లోగా తప్పనిసరిగా ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.
* ఏవైనా స్థానాలకు ఖాళీలు ఏర్పడినప్పుడు ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకునే సభ్యుల పదవీకాలం మిగిలిన పదవీకాలం వరకే వర్తిస్తుంది. అయితే సంస్థ మొత్తం ఎన్నికలు కాలయాపన ద్వారా ఆలస్యం జరిగితే పూర్తి పదవీకాలం కొనసాగవచ్చు. సంస్థ పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఉపఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదు.

ఆర్టికల్ 243 (V): అర్హతలు, అనర్హతలు
* పట్టణ, నగరపాలక సంస్థల్లోని అన్ని స్థాయుల్లో అధ్యక్షులు, వారి అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది.
* పార్లమెంటు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
* స్థానిక సంస్థలకు పోటీచేసేవారి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి.
* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు.

ఆర్టికల్ 243 (W): అధికారాలు, విధులు
* 12వ షెడ్యూల్ ప్రకారం పట్టణ, నగరపాలక సంస్థలకు 18 రకాల అధికారాలు, విధులను బదిలీ చేయాలని నిర్దేశించారు.
* వీటిలో 11 విద్యుక్త (తప్పనిసరి) అంశాలు కాగా, 7 ఐచ్ఛిక అంశాలు. ఈ అధికారాల బదిలీ విషయం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టారు.

పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులు:
    1. నగర ప్రణాళిక
    2. మురికివాడల నిర్మూలన, అభివృద్ధి
    3. భూమి సమర్థవంత వినియోగం, భవన నిర్మాణాలపై నియంత్రణలు
    4. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు
    5. రహదారులు, వంతెనలు
    6. పట్టణ అడవులు, పర్యావరణ పరిరక్షణ
    7. అగ్నిమాపక వ్యవస్థ
    8. ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల, చెత్త నియంత్రణ
    9. పరిశ్రమలకు, గృహాలకు నీటివసతి
    10. వీధి దీపాలు, బస్‌స్టాండ్‌ల నిర్వహణ
    11. బలహీనవర్గాల సంరక్షణలు, వికలాంగులకు వసతి
    12. నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు
    13. కబేళాలపై నియంత్రణ
    14. జంతువుల సంరక్షణ
    15. విద్య, సాంస్కృతిక అభివృద్ధికి చర్యలు
    16. జనన మరణాల నమోదు
    17. స్మశాన వాటికల నిర్వహణ
    18. ఆటస్థలాలు, ఉద్యానవనాల నిర్వహణ


ఆర్టికల్ 243 (X): ఆదాయ వనరులు, పన్నులు
» పట్టణ, నగరపాలక సంస్థలు శాసనసభ నిర్ణయించిన మేరకు పన్నులను విధించి, వసూలు చేసుకోవచ్చు.
పన్నులు
» తాగునీరుపై పన్ను
» వినోదపు పన్ను
» ఇంటి పన్ను
» ఆక్ట్రాయ్ పన్ను
» అడ్వర్టైజ్‌మెంట్‌లపై పన్ను
» మార్కెట్లు, సంతలపై పన్ను
» ఖాళీస్థలాలపై పన్ను
» నిర్మాణాలకు ఇచ్చే అనుమతులపై పన్ను
» మున్సిపల్ సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 2/3వ వంతు స్థానిక పన్నుల ద్వారానే సమకూర్చుకుంటాయి.
» దేశంలోని మొత్తం స్థానిక సంస్థల పన్నుల ఆదాయంలో 1/4వ వంతు ఆక్ట్రాయ్ పన్ను ద్వారానే సమకూరుతుంది.
ఆక్ట్రాయ్ పన్ను అంటే: సరిహద్దులను మూసివేసి, చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వసూలు చేసే పన్ను.


ఇతర ఆదాయ వనరులు
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులు
» విరాళాలు
» అద్దెలు, అమ్మకాల ద్వారా లభించే ఆదాయం.


ఆర్టికల్ 243 (Y) రాష్ట్ర ఆర్థిక సంఘం:
» 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 243 (I)లో నిర్దేశించిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్, 243 (Y)కు కూడా వర్తిస్తుంది.
» కేంద్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఫైనాన్స్ కమిషన్‌కు రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రతిపాదనలను పంపుతుంది.
» రాష్ట్రంలోని పట్టణ, నగరపాలక సంస్థలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చాలి.
» రాష్ట్రాలు ఆర్థిక వనరులను రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు అందిస్తాయి.
» రాష్ట్ర ఆర్థిక సంఘం అదనపు ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్థిక సంఘం 1994లో ఏర్పడింది. దీని మొదటి ఛైర్మన్ లక్ష్మణస్వామి.
» రాష్ట్ర ఆర్థిక సంఘం సూచనలను, వాటిపై ప్రభుత్వం తీసుకునే చర్యలతో కూడిన రిపోర్టును గవర్నరు శాసనసభకు సమర్పించాలి.


ఆర్టికల్ 243 (Z) అకౌంటింగ్, ఆడిటింగ్
» మున్సిపల్ వ్యవస్థల జమా ఖర్చుల ఖాతాల నిర్వహణ, వాటి ఆడిటింగ్‌కు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర శాసనసభ ఒక శాసనం ద్వారా రూపొందిస్తుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానిక సంస్థల ఆడిట్‌లను రాష్ట్ర ఆడిట్ సంచాలకుడు నిర్వహిస్తారు.
     ఎ. లోకల్ ఫండ్ ఆడిట్
     బి. శాఖాపరమైన ఆడిట్
     సి. సాధారణ ఆడిట్
» స్థానిక సంస్థల ఆడిట్‌ను CAG పరిధిలోకి తీసుకురావాలని CAGగా పదవీ విరమణ చేసిన వినోద్‌రాయ్ సూచించారు.


ఆర్టికల్ 243 (ZA): రాష్ట్ర ఎన్నికల సంఘం
» రాష్ట్రస్థాయిలో గవర్నరు నియమించే రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.
» పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర శాసనసభ రూపొందించిన ఎన్నికల చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన విధులను నిర్వహిస్తుంది.
» రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమించినప్పటికీ రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు.
» మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలను ఆర్టికల్ 243 (K)లో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుంది.


ఆర్టికల్, 243 (ZB): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం?
» కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టణ, నగరపాలక సంస్థల అమలుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
» కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలపై కేంద్ర హోంశాఖ నియంత్రణ కలిగి ఉంటుంది.
» శాసనసభలు ఉన్న దిల్లీ, పాండిచ్చేరి ప్రత్యేక చట్టాలను రూపొందించుకోవచ్చు. కానీ ఆ చట్టం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కొంతభాగానికి వర్తింపజేస్తూ రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేయవచ్చు.


ఆర్టికల్ 243 (ZC) మినహాయించిన ప్రాంతాలు
» ఆర్టికల్ 244 (1)లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలకు, ఆర్టికల్ 244 (2)లో పేర్కొన్న ఆదివాసీ ప్రాంతాలకు 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.
» మనదేశంలో ట్రైబల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఏర్పాటు విషయమై మినహాయింపు ఉంది.
» పశ్చిమ్ బంగలోని డార్జిలింగ్ జిల్లాలోని గూర్ఖాలాండ్ ప్రాంతం కూడా మినహాయింపు పొందింది.
» పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి, ఈ ప్రాంతాల్లో కూడా సంస్థలను ఏర్పాటు చేయవచ్చు. సంస్థల ఏర్పాటు; మార్పులు, చేర్పులు చేయడంలోనూ పార్లమెంటు పూర్తి అధికారాన్ని కలిగి ఉంటుంది.


ఆర్టికల్ 243 (ZD) జిల్లా ప్రణాళికా బోర్డు ఏర్పాటు
» జిల్లాలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను జిల్లా ప్రణాళిక బోర్డు రూపొందిస్తుంది.
» జిల్లా ప్రణాళికా బోర్డు‌కు సంబంధించిన విధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర శాసనసభ మార్గదర్శక సూత్రాలను రూపొందించవచ్చు.
» జిల్లా ప్రణాళికా బోర్డులోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు మందికి తక్కువ కాకుండా సంబంధిత జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఎన్నికైన సభ్యుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా,

పట్టణ ప్రాంత జనాభాల నిష్పత్తిపైన ఆధారపడి ఉంటుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రణాళికా బోర్డుకు ఎక్స్అఫీషియో ఛైర్మన్‌గా జిల్లా పరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు. జిల్లా ప్రణాళికా బోర్డుకు మెంబర్ సెక్రెటరీగా కలెక్టరు వ్యవహరిస్తారు.
» జిల్లా ప్రణాళికా బోర్డులో మొత్తం సభ్యులు 30 మంది. వీరిలో 24 మంది సభ్యులు ఎన్నికవుతారు. సంబంధిత అంశాలపై ముగ్గురు నిపుణులు నామినేట్ అవుతారు. అల్ప సంఖ్యాక వర్గాల నుంచి ఒక్కరు నామినేట్ అవుతారు.
» జిల్లా పరిషత్ ఛైర్మన్ + జిల్లా కలెక్టరు
» జిల్లా ప్రణాళికా కమిటీ రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను జిల్లా ప్రణాళికా కమిటీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాడు.


ఆర్టికల్ 243 (ZE) మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం
» మెట్రోపాలిటన్ నగరాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించడానికి దీన్ని ఏర్పాటు చేస్తారు.
» మెట్రోపాలిటన్ నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం నిర్మాణపరమైన, నిర్వహణపరమైన అభివృద్ధి విషయాలే కాకుండా సాధారణ అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాల్సి ఉంది.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘంలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3వ వంతు సభ్యులను మెట్రోపాలిటన్ ప్రాంత పరిధి నుంచి ఎన్నికైన మున్సిపాలిటీల సభ్యులు, కార్పొరేషన్‌ల సభ్యులు, పంచాయతీ సభ్యులు ఎన్నుకుంటారు.
» ఈ సభ్యుల్లో పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలి, మున్సిపల్ వ్యవస్థకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది వాటి జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 24. వీరిలో 18 మందిని ఎన్నుకుంటారు. నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
» దీనికి ఛైర్మన్‌గా నగర మేయర్, మెంబర్ సెక్రెటరీగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తారు.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు తన నివేదికను రాష్ట్ర గవర్నరుకు సమర్పిస్తుంది. మరొక నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిస్తుంది.
» మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు ప్రణాళిక రూపకల్పన చేసే సందర్భంలో గవర్నరు నిర్దేశించిన సంస్థలను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండే భౌతిక వనరులను ఆధారం చేసుకుని మౌలిక వసతుల కల్పనపై ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది.
» 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ నగరాలు వర్థిల్లుతాయి.
» ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మాదిరి దిల్లీలో కూడా మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం ఉండాలి. కానీ, దాని స్థానంలో దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వం మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం కార్యకలాపాలను నిర్వరిస్తుంది.
» 1964లో దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను దిల్లీలో నెలకొల్పారు.


ఆర్టికల్ 243 (ZF): పాత శాసనాల కొనసాగింపు
» 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు అంటే 1994, మే 31 వరకు పాత శాసనాలు కొనసాగుతాయి.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధం కాని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు స్వంత చట్టాలు రూపొందించి, అమలుపరచుకోవచ్చు.


ఆర్టికల్ 243 (ZG): మున్సిపల్ ఎన్నికల విషయంలో కోర్టుల జోక్యం నిషేధం
» మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నియోజక వర్గాల పరిధులను నిర్ణయించడం, సీట్ల కేటాయింపులను న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదు.
» పట్టణ, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిపే సందర్భంలో తలెత్తే వివాదాలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా సాధికారిక (స్వయం ప్రతిపత్తి) సంస్థలను ఏర్పాటు చేయవచ్చు.
» దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉన్నందున ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల వివాదాలను జిల్లా సెషన్స్ కోర్టులకు అప్పగించారు.
» జిల్లా సెషన్స్ కోర్టులు ఎన్నికల వివాదాలను విచారించే సందర్భంలో సాధారణ కోర్టుల మాదిరి కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్స్‌గా వ్యవహరిస్తాయి.


పట్టణ స్థానిక ప్రభుత్వాలు - వర్గీకరణ
1. నగరపాలక సంస్థలు (Municipal Corporations)
» రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని పెద్ద పట్టణాలను మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ శాసనసభలో చట్టం చేయడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాయి.
» 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.
» మనదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ 1687లో మద్రాస్‌లో ఏర్పాటు చేశారు. 1726లో బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి.
» 1950లో హైదరాబాద్ కార్పొరేషన్ చట్టం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.
» 1955 నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం 1960, ఆగస్టు 3న హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లను ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసి ఏర్పాటు చేశారు.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994లో సవరణకు గురైంది.


మున్సిపల్ కార్పొరేషన్ - ప్రధాన అంగాలు

నగరపాలక మండలి
» మున్సిపల్ కార్పొరేషన్ చర్చా సంబంధమైన అంగ(భాగ)మే నగరపాలక మండలి. నగరపాలక సంస్థలోని రిజిస్టరైన ఓటర్లు డివిజన్ల నుంచి కార్పొరేటర్లను ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
» కార్పొరేటర్ల పదవి కాలం 5 సంవత్సరాలు.
» నగరపాలక సంస్థ పరిధిలోని శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, నగరపాలక సంస్థ కమిషనర్ పదవిరీత్యా నగరపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. నగరపాలక మండలికి మేయర్ అధ్యక్షత వహిస్తారు.


మేయర్, డిప్యూటీ మేయర్
» డివిజన్ల నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు తమలో నుంచి ఒకరిని మేయర్‌గా, మరొకరిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు.
» మేయర్ నగరపాలక సంస్థకు ప్రథమ పౌరుడు.
» మేయర్ నగరపాలక సంస్థకు రాజకీయ అధిపతి. ఇతడి పదవీకాలం 5 సంవత్సరాలు.
» ఆంధ్రప్రదేశ్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌లు పరోక్షంగా ఎన్నికవుతున్నారు.


స్థాయీసంఘాలు
» నగరపాలక సంస్థలకు కళ్లు, చెవులు, చేతులుగా స్థాయీసంఘాలను పేర్కొంటారు. ఇవి నగరపాలక సంస్థకు సలహా సంస్థలుగా వ్యవహరిస్తాయి.
స్థాయీ సంఘాల విధులు
» నగరపాలక సంస్థ కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం.
» నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్‌ను పరిశీలించడం.
» అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని, రికార్డులను పొందడం.
కమిషనర్
» ఇతడు నగరపాలక సంస్థకు పరిపాలనా అధిపతి. రాష్ట్రప్రభుత్వం ఇతడిని నియమిస్తుంది. ఇతడు సాధారణంగా ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన వ్యక్తి అయి ఉంటారు. నగరపాలక సంస్థకు సంబంధించిన పరిపాలన, నియంత్రణాధికారాన్ని కలిగి ఉంటారు. మేయర్‌ను సంప్రదించి నగరపాలక సంస్థ సమావేశాల తేదీలు, కార్యక్రమాల అజెండాను రూపొందిస్తారు.
మనదేశంలో వివిధ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య:
    మహారాష్ట్ర - 26
    ఉత్తర్‌ప్రదేశ్ - 14
    మధ్యప్రదేశ్ - 14
    ఆంధ్రప్రదేశ్ - 13
    తమిళనాడు - 12
    కర్ణాటక - 11
    తెలంగాణ - 6
    జమ్మూకశ్మీర్ - 2


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు - 13
    1) గ్రేటర్ విశాఖపట్నం
    2) కాకినాడ
    3) రాజమండ్రి
    4) ఏలూరు
    5) విజయవాడ
    6) గుంటూరు
    7) ఒంగోలు
    8) నెల్లూరు
    9) కడప
    10) కర్నూలు
    11) తిరుపతి
    12) చిత్తూరు
    13) అనంతపురం
» విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ - 1989
» విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ - 1991
» మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లను - 1994 నాటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు.
» కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పర్వీన్‌భాను అనే హిజ్రా ఎన్నికయ్యారు.


2. పురపాలక సంఘాలు: (Municipalities)
» ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం - 1965 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ చట్టం 1965, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
» 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టాన్ని 1994లో సవరించారు.
» నగరపాలక సంస్థకు దిగువన గ్రామపంచాయతీ, నగర పంచాయతీలకు ఎగువన ఏర్పాటు చేసిన పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంఘాలు. 20,001 లేదా అంతకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో పురపాలక సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను వాటి ఆదాయం ప్రాతిపదికగా 5 గ్రేడులుగా వర్గీకరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాల వర్గీకరణ - వివరాలు

పురపాలక సంఘం గ్రేడ్  వార్షిక ఆదాయం (రూ. కోట్లలో) సంఖ్య
1. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ 8 కోట్లపైన 4
2. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ 6 - 8 7
3. ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ 4 - 6 13
4. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ 2 - 4 25
5. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ 1 - 2 18
మొత్తం మున్సిపాలిటీల సంఖ్య   67

పురపాలక సంఘాలు - ప్రధాన అంగాలు

పురపాలక మండలి
» పురపాలక సంఘం చర్చావేదికే పురపాలక మండలి. ఇది సాధారణంగా నెలకొకసారి సమావేశమవుతుంది. దీనిలో కింద పేర్కొన్న సభ్యులుంటారు.
ఎన్నికైన సభ్యులు: పురపాలక మండలి ఎన్నిక కోసం దాన్ని వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి కౌన్సిలర్‌లను ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
ఎక్స్అఫీషియో సభ్యులు: రాష్ట్రాల విధాన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు పదవీరీత్యా పురపాలక మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరికి ఓటువేసే అధికారం ఉంటుంది.
» జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు కూడా ఓటువేసే అధికారం లేకుండా పురపాలక మండలి సభ్యులుగా పదవిరీత్యా వ్యవహరిస్తారు.
» మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని పురపాలక సంఘానికి కో-ఆప్టెడ్ సభ్యుడిగా నియమిస్తారు.
» పురపాలక మండలి సభ్యులు, ఛైర్మన్‌ల పదవీకాలం 5 సంవత్సరాలు.
» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వ్యక్తులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.


మున్సిపల్ ఛైర్మన్
» పురపాలక సంస్థకు ఎన్నికైన కౌన్సిలర్‌లు తమలో నుంచి ఒకరిని మున్సిపల్ ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.
» మున్సిపల్ ఛైర్మన్ పురపాలక సంస్థకు ప్రథమ పౌరుడు.
» ఛైర్మన్ ఎన్నిక పరోక్షం.
» ఛైర్మన్ పురపాలక మండలిలోని కొన్ని స్థాయీ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.


కమిషనర్
» మున్సిపల్ కమిషనర్ పురపాలక సంస్థకు పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు.
» ఛైర్మన్‌ను సంప్రదించి, సమావేశాల అజెండాను రూపొందిస్తారు.
» మండలి సమావేశాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో పాల్గొంటారు.
» పురపాలక మండలికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.
» పురపాలక మండలి తీర్మానాలను జిల్లా కలెక్టరుకు, పురపాలక పాలన ప్రాంతీయ డైరెక్టరుకు పంపుతారు.
» సంస్థకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, కార్యకలాపాలపై నియంత్రణ కలిగి ఉంటారు. సంస్థ వార్షిక బడ్జెట్‌ను రూపొందిస్తారు.


పురపాలక సంస్థ - విధులు
ఇవి 2 రకాలు
ఆవశ్యక విధులు (Compulsory Functions)
» ప్రజారోగ్యం, పరిశుభ్రతలను నిర్వహించడం
» జనన, మరణ రికార్డులను నిర్వహించడం
» ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ పాఠశాలలను నిర్వహించడం.
» పౌరులకు పరిశుభ్రమైన నీరు, వీధి దీపాలను ఏర్పాటు చేయడం.
» పురపాలక సంస్థ పరిధిలోని రహదారులు, భవనాల నిర్మాణం, నిర్వహణ.
వివేచనాత్మక విధులు (Discriminary Functions)
» మాతా, శిశు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం.
» పార్కులు, మ్యూజియం, విశ్రాంతి గృహాలు, గ్రంథాలయాలను నిర్వహించడం.
» మహిళల కోసం ప్రసూతి కేంద్రాలను నిర్వహించడం.


స్థాయీ సంఘాలు
» వీటిని పురపాలక సంస్థకు కళ్లు, చెవులు, చేతులుగా అభివర్ణిస్తారు.
    1) విత్తం
    2) ఆరోగ్యం
    3) పన్నులు
    4) మహిళా సంక్షేమం
    5) వెనకబడిన వర్గాల సంక్షేమం
    6) విద్య
పై అంశాలకు సంబంధించిన స్థాయీ సంఘాలు ఉంటాయి.


ఆర్థిక వనరులు
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు.
» వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.
» విరాళాలు, స్థిర ఆస్తుల ద్వారా సమకూరే ఆదాయం.


3. నగర పంచాయతీలు
» గ్రామీణ ప్రాంతం క్రమంగా పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంటే దాన్ని నగర పంచాయతీగా మారుస్తారు. నగర పంచాయతీ జనాభా 11000 కంటే ఎక్కువగా 25000 కంటే తక్కువగా ఉంటుంది. నగర పంచాయతీ పరిపాలన నగర పంచాయతీ కమిటీ ద్వారా జరుగుతుంది.
» పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి నగర పంచాయతీ కొన్ని వార్డులుగా విభజన చెంది ఉంటుంది. ప్రతివార్డు నుంచి ఒక వార్డు మెంబరు చొప్పున 5 సంవత్సరాల కాలానికి వయోజన ఓటర్ల ద్వారా ఎన్నికవుతారు. నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నికైన వార్డు మెంబర్లు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ పరిధిలో ఉండే ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సీలు పదవీరిత్యా సభ్యులుగా ఉంటారు.
» నగర పంచాయతీ సభ్యులు తమలో నుంచి ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. వీరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.


ఆదాయ వనరులు
» వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు వసూలుచేసే ఫీజు, భవన నిర్మాణం, నీటి సరఫరాపై వసూలు చేసే పన్ను.
» ఆస్తులపై అద్దె, అమ్మకం వ్యవహారాలపై వసూలు చేసే రుసుములు.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లు
» ఆస్తిపన్ను, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు వసూలు చేసే పన్ను.
» ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 26 నగర పంచాయతీలు ఉన్నాయి.


4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
» 'సెమీ మున్సిపల్ అథారిటీ పద్ధతిలో చిన్నపట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర శాసనసభ చేసే చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో పూర్తిగా ఎన్నికైన లేదా నామినేట్ చేసిన లేదా కొందరు నామినేట్ విధానం ద్వారా, మరొకొందరు ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రజలకు అవసరమైన పౌర సదుపాయాలను కల్పించడానికి ఇవి పనిచేస్తాయి.


5. నోటిఫైడ్ ఏరియా కమిటీలు
» అతివేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మున్సిపాలిటీలను ఏర్పాటుచేయడానికి అనువైన పరిస్థితులు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తుంది. అందుకే వీటిని నోటిఫైడ్ ఏరియా కమిటీలు అంటారు.
» వీటి విధులు మున్సిపాలిటీలతో సమానంగా ఉంటాయి. ఇందులోని సభ్యులందరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కాబట్టి ఇవి ఎన్నికైన సంస్థలు కావు.


6. టౌన్ షిప్‌లు (Townships)
» ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, ఆ ప్రాంతంలో నివసించేవారికి పౌరసదుపాయాలు కల్పించడానికి సంబంధిత పారిశ్రామిక సంస్థలు టౌన్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తాయి.
» టౌన్‌షిప్‌ల నిర్వహణ అధికారిని, ఇతర సిబ్బందిని సంబంధిత పరిశ్రమ యాజమాన్యమే నియమిస్తుంది. దీనిలో ఎన్నికైన సభ్యులుండరు. పౌరసదుపాయాల కల్పనలో వీటిని అత్యున్నత శ్రేణి సంస్థలుగా అభివర్ణిస్తారు. ఉదా: విశాఖ స్టీల్


7. పోర్ట్‌ట్రస్ట్ (Port Trust)
» నౌకాశ్రయాలు ఉన్నచోట పోర్ట్‌ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నం లాంటి కీలక ఓడరేవులు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు.
» పోర్టు పరిరక్షణ, నిర్వహణ, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు పౌరసదుపాయాలు కల్పించడానికి పోర్ట్ ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. వీటి విధులు మున్సిపాలిటీలతో సమానంగా ఉంటాయి. 1963 నాటి మేజర్ పోర్ట్స్ చట్టం ప్రకారం ప్రస్తుతం 13 పోర్ట్ ట్రస్టులు ఉన్నాయి.


8. కంటోన్మెంట్ బోర్డు (Cantonment Board)
» కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో పౌరసదుపాయాలను కల్పించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. దీనిలో పాక్షికంగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. సంబంధిత ప్రాంత మిలటరీ కమాండింగ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డుకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏడుగురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ఉపాధ్యక్షుడిని బోర్డు సభ్యులు ఎన్నికుంటారు. కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వాహక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు.
» కంటోన్మెంట్ బోర్డు చట్టం - 1924 ప్రకారం దేశంలో ప్రస్తుతం 62 కంటోన్మెంట్ బోర్డులున్నాయి. 2006లో ఈ చట్టానికి సవరణ చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలో ఒక కంటోన్మెంట్ బోర్డు ఉంది.


ప్రత్యేక ప్రయోజన సంస్థలు (Special Purpose Agencies)
» బహుళ ప్రయోజనార్థం పట్టణాల్లో వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన సంస్థలను ఏర్పాటు చేస్తుంది. వీటిని విధుల ప్రాతిపదికపై ఏర్పాటు చేస్తారు. వీటి అధిపతులను రాష్ట్రప్రభుత్వమే నియమిస్తుంది. ఇవి స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లతోనూ కలిసి పనిచేస్తాయి.
ఉదా: 1. పట్టణాభివృద్ధి సంస్థలు HUDA, TUDA, VUDA
         2. హౌసింగ్ బోర్డులు
         3. పొల్యుషన్ కంట్రోల్ బోర్డులు
         4. ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డులు
పట్టణ, నగర పాలక సంస్థలకు సంబంధించి 2వ పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు
» స్థానిక సంస్థల్లో ఎంఎల్ఏ, ఎంపీలకు ప్రాతినిథ్యం కల్పించకూడదు.
» అన్ని రాష్ట్రాలకు విధానపరిషత్‌లను ఏర్పాటుచేసి, వాటిలో స్థానిక సంస్థల సభ్యులకు స్థానం కల్పించాలి.
» రిజర్వ్ చేసిన నియోజన వర్గాలు కనీసం 10 సంవత్సరాలపాటు కొనసాగాలి.
» పరిపాలనా పారదర్శకతకు జిల్లాస్థాయిలో నిఘా కమిటీని ఏర్పాటు చేయాలి.
» స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను రద్దుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండకూడదు.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షరతులు లేని గ్రాంట్లను అందజేయాలి.
» మేయర్ లేదా ఛైర్మన్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.
» నగరాల్లో మెట్రోపాలిటన్ పోలీస్ అథారిటీని ఏర్పాటు చేయాలి.
» రాష్ట్ర శాసనసభల్లో స్థానిక సంస్థల విషయాలను పరిశీలించడానికి స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)

73వ రాజ్యాంగ సవరణ కంటే పూర్వచరిత్ర

* గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని గాంధీజీ పేర్కొన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలుచేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. ఈ అధికార వికేంద్రీకరణలో భాగమే స్థానిక స్వపరిపాలనా సంస్థలు.

స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏం చేస్తాయంటే...
* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.
* ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి.
* ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాయి.
* స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన పరిపాలనా భారాన్ని తగ్గిస్తాయి.
* మన దేశంలోని ప్రాచీన కాలం నాటి గ్రామ పంచాయతీలను Little Republics గా ఛార్లెస్ మెట్‌కాఫ్ అభివర్ణించారు.

స్థానిక సంస్థల చరిత్ర
* రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థలు కవలలుగా పేరొందాయి. ఇవి గ్రామస్థాయిలో అనేక పరిపాలన, రాజకీయ విధులను నిర్వర్తించాయి.
* ఆది కావ్యమైన రామాయణంలో జనపదం అనే పేరును అనేక గ్రామాల సమాఖ్యగా అభివర్ణించారు.
* మహాభారతంలోని శాంతిపర్వంలో గ్రామసంఘాలు అనే పేరుతో పరిపాలన సాగించారు.
* శుక్రాచార్యుడు తన నీతిశాస్త్రంలో గ్రామాల కామన్వెల్త్ ఉన్నట్లు పేర్కొన్నాడు.
* మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పాలన గురించి వివరించాడు.
* చంద్రగుప్త ప్రధాని కౌటిల్యుడు తన అర్థశాస్త్రం గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పాలనను వివరించారు. ఈ గ్రంథంలో గ్రామపరిపాలనాధికారిని గ్రామణి అని, పది గ్రామాల అధిపతిని దశగ్రామణి అని పేర్కొన్నారు.
* డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం బౌద్ధం విలసిల్లిన కాలంలోనే భారత్‌లో స్థానిక పాలన విలసిల్లింది.
* గాంధీజీ అభిప్రాయం ప్రకారం ప్రాచీన భారత గ్రామాలు స్వయంసమృద్ధితో వర్థిల్లుతూ, వాటికి అవసరమైన అంశాలన్నింటినీ అవే సమకూర్చుకునేవి.
* మనదేశంలో చోళులు గ్రామీణ పాలనకు ప్రణాళిక బద్ధమైన పునాదులు వేసి వాటిని అభివృద్ధి పరిచారు. చోళరాజైన మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం చోళులు రంధ్రం చేసిన కుండలను బ్యాలెట్ బాక్స్‌లుగా, తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా ఉపయోగించి, ఎన్నికల ప్రక్రియను నిర్వహించేవారు.
* చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారం కోసం పంచాస్ అనే ఒక మండలి ఉండేది. దీనిలో అయిదుగురు సభ్యులుండేవారు. పంచాస్ అనే పదమే తర్వాత కాలంలో పంచాయతీగా అవతరించింది.
* షేర్షా కాలంలో గ్రామస్థాయిలో స్థానిక సంస్థలు పనిచేసేవి.
* దిల్లీ సుల్తానుల కాలంలో గ్రామస్థాయిలో గ్రామపంచాయతీలు ఉన్నప్పటికీ, అవి స్వయంపోషకత్వాన్ని కలిగిలేవు.
* మనదేశంపైకి మహ్మదీయుల దండయాత్రలు ప్రారంభం కావడంతో మధ్యయుగంలో స్థానిక సంస్థల పరిస్థితి తగ్గిపోయింది.
* దిల్లీ సుల్తానులు, మొగలుల కాలంలో కొత్వాల్ అనే పదవిని ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు, శిస్తు వసూలు, పట్టణ పరిపాలన కోసం ఈ పదవిని ఏర్పాటు చేశారు. గ్రామీణ పాలనను విస్మరించారు.

ఆంగ్లేయుల కాలంలో స్థానిక సంస్థలు

* క్రీ.శ. 1687లో రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్ చట్టం ద్వారా పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మద్రాస్‌లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను నెలకొల్పారు. దీంతో మనదేశంలో ఆధునిక స్థానిక చరిత్ర ప్రారంభమైంది.
* క్రీ.శ. 1726లో ఆంగ్లేయులు బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లను ప్రారంభించారు.
* ఆంగ్లేయులు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్‌గా తీసుకుని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు.
* 1793 చార్టర్ చట్టం ద్వారా మద్రాస్, కలకత్తా, బొంబాయి పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధతను కల్పించారు.

* 1813లో చార్టర్ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించారు
* 1861 నాటి భారత కౌన్సిల్ చట్టం ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించారు.
* 1870లో లార్డ్‌మేయో ఆర్థిక వికేంద్రీకరణలో భాగంగా, మనదేశంలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రారంభించారు.
* 1882, మే, 18న లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక, పరిపాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ కీలక తీర్మానాన్ని చేశారు. ఈ తీర్మానం భారత్‌లో స్థానిక ప్రభుత్వాలకు మాగ్నాకార్టాగా పేరొందింది. స్థానిక సంస్థలకు ఒక నిర్దిష్ట రూపాన్ని ఇచ్చిన లార్డ్ రిప్పన్‌ను మనదేశంలో స్థానిక స్వపరిపాలనా పితామహుడిగా పేర్కొంటారు.

1882 స్థానిక స్వపరిపాలనా చట్టం ప్రకారం

రాయల్ కమిషన్:
* మనదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడానికి 1907లో చార్లెస్ హాబ్‌హౌస్ అధ్యక్షతన ఒక వికేంద్రీకరణ సంఘం ఏర్పడింది. రాయల్ కమిషన్‌గా పేరొందిన ఈ కమిషన్ తన నివేదిను 1909లో సమర్పించింది.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలు
* సమర్థవంతంగా పరిపాలనా వికేంద్రీకరణను అమలు పరచాలి.
* ప్రతిగ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి.
* జనాభా ఆధారంగా మున్సిపల్ సంస్థలను ఏర్పాటు చేయాలి.
* స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యాన్ని పెంచాలి.
* రాయల్ కమిషన్ సిఫారసుల మేరకు 1909లో మింటో - మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు.
* 1919 మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని స్థానిక స్వపరిపాలనను రాష్ట్రజాబితాలోకి బదిలీ చేశారు. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలుకా బోర్డుల సంఖ్య 584గా ఉంది.
* 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు స్వయం ప్రతిపత్తి అధికారాలను కల్పించారు. అధికారులు నామినేట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. స్థానిక సంస్థల పాలన మంత్రుల పరిధిలోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జిల్లాబోర్డుల్లో రాష్ట్రాలకు పూర్తిస్థాయి స్వాతంత్య్రం కల్పించడం వల్ల స్థానిక సంస్థల ప్రాతినిధ్యం పెరిగింది.
* 1935 భారత ప్రభుత్వచట్టం ప్రకారం 1937లో రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1939లో రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమవడం, రాష్ట్రప్రభుత్వాలు రాజీనామా చేయడంతో స్థానిక సంస్థల పరిస్థితి అయోమయంగా మారింది.
* 1947లో స్వాతంత్య్రానంతరం దేశపరిపాలనకు అవసరమైన రాజ్యాంగ రచన సందర్భంగా శ్రీమన్నారాయణ్ అగర్వాల్ రాజ్యాంగ పరిషత్‌లో గ్రామస్థాయి మొదలుకుని, జాతీయస్థాయి వరకు పంచాయతీ వ్యవస్థ ఏర్పాటును తెలియజేస్తూ గాంధీ ప్లాన్‌ను ప్రతిపాదించారు.
* భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ - 40లో గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసే బాధ్యతను రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించారు.
* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లోని అధికారాల విభజనకు సంబంధించి, స్థానిక స్వపరిపాలనను రాష్ట్రజాబితాలో నిర్దేశించారు.

73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)

       భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ - 40లో స్థానిక స్వపరిపాలనా సంస్థలను పొందుపరిచారు. రాష్ట్రజాబితాలోని పంచాయతీరాజ్ సంస్థలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉన్నప్పటికీ, రాష్ట్రప్రభుత్వాలు వీటిని అమలు చేయడానికి అవసరమైన చట్టాలను రూపొందిచలేకపోవడంతో స్థానిక ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయలేదు.
* ప్రజాస్వామ్య ఆర్థికాభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అనే అంశంపై అధ్యయనానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్.ఎం. సింఘ్వి కమిటీని నియమించింది. ఈ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ బద్ధతను కల్పించాలని సిఫార్సు చేసింది.
* ఎల్.ఎం. సింఘ్వి కమిటీ సిఫార్సులపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1987లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పి.కె. తుంగన్ నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
* సింఘ్వి కమిటీ సూచనల ఆధారంగా, తుంగన్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను రూపొందించింది.
* పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
* 64వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువ కావడంతో ఆ బిల్లు వీగిపోయింది.

* వి.పి. సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పంచాయతీలు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబరు 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం పడిపోవడం వల్ల అది కార్యరూపం దాల్చలేదు.
*1991లో అధికారానికి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న 73వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఆ తర్వాత దేశంలోని 17 రాష్ట్రాల శాసనసభల ఆమోదం పొందింది. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1993, ఏప్రిల్ 20న సంతకం చేయడంతో, 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992), 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
* పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తారు.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం - కర్ణాటక.
* 1993, మే 10 నుంచి కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోని పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం - కర్ణాటక
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా భారత రాజ్యాంగంలో IXవ భాగాన్ని చేర్చి, దానిలో 243, 243(A) నుంచి 243(O) వరకు ఉన్న మొత్తం 16 ఆర్టికల్స్‌లో పంచాయతీరాజ్ చట్టం విధివిధానాలను నిర్దేశించారు.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా భారత రాజ్యాంగానికి XIవ షెడ్యూల్ చేర్చారు. దీనిలో పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పొందుపరిచారు.

ఆర్టికల్ - 243: పంచాయతీరాజ్ - నిర్వచనాలు
* పంచాయతీరాజ్ సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నందున వీటిపై రాష్ట్ర శాసనసభ చట్టం చేసి, నిర్వచిస్తుంది. గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్వచనాలను తెలియజేస్తారు.
a) జిల్లా అంటే - ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
b) గ్రామసభ అంటే - గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలోని రిజిస్టర్ అయిన వ్యక్తుల సముదాయం.
c) మాధ్యమిక స్థాయి అంటే - జిల్లాస్థాయికి, గ్రామస్థాయికి మధ్య ఉండే స్థాయి.
d) పంచాయతీ అంటే - ఆర్టికల్ 243(B) ద్వారా ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
e) పంచాయతీ ఏరియా అంటే - ఒక పంచాయతీ యొక్క ప్రాదేశిక ప్రాంతం.
f) జనాభా అంటే - జనాభా లెక్కల సేకరణ తర్వాత ప్రచురించిన జాబితాలోని జనాభా అని అర్థం.
g) గ్రామం అంటే - గవర్నరు గ్రామంగా నోటిఫై చేసిన ప్రాంతం.

ఆర్టికల్ - 243(A): గ్రామ సభ
* గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు.
* గ్రామ పంచాయతీకి గ్రామసభ ప్రాతిపదికగా పనిచేస్తుంది.
* గ్రామసభ గ్రామ పంచాయతీకి శాసన శాఖగా పనిచేస్తుంది.
* ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామసభను ప్రాతిపదికగా పేర్కొనవచ్చు.
* గ్రామ పంచాయతీ గ్రామసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.
* గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను గ్రామసభ రూపొందిస్తుంది.
* మన గ్రామసభను పోలిన స్థానిక ప్రభుత్వ సంస్థ స్విట్జర్లాండ్‌లో ఉంది. దాన్ని ల్యాండ్స్ గెమెండ్ అంటారు.
* గ్రామ సభ సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్యకాలం 6 నెలలు మించకూడదు.
* ఒకవేళ సంవత్సరానికి రెండుసార్లు గ్రామసభను ఏర్పాటు చేయకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు.
* గ్రామసభ సమావేశాలు సమర్థవంతంగా జరగలేదని రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన సాధిక్ అలీ కమిటీ తన నివేదికలో పేర్కొంది.
* గ్రామ సభ పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన సూచనల కోసం రాజస్థాన్ ప్రభుత్వం గిరిధర్‌లాల్ వ్యాస్ కమిటీని ఏర్పాటు చేసింది.


 

ఆర్టికల్ - 243(B): పంచాయతీరాజ్ వ్యవస్థాపన

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం, (1992) ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను 3 స్థాయుల్లో నెలకొల్పాలి.
అవి:
    1. కింది స్థాయిలో - గ్రామ స్థాయిలో - గ్రామ పంచాయతీ
    2. మధ్య స్థాయిలో - తాలూకా/బ్లాకు స్థాయిలో - పంచాయతీ సమితి
    3. ఉన్నత స్థాయిలో - జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్

* ఒక రాష్ట్ర జనాభా 20 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ రాష్ట్రంలో మాధ్యమిక సంస్థలను ఏర్పాటు చేసుకునే విచక్షణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది.              

ఆర్టికల్ - 243(C): పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం, సభ్యులు, అధ్యక్షుల ఎన్నిక
» 3 స్థాయుల్లోని (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) సభ్యులందరినీ ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
» జిల్లా పరిషత్, మాధ్యమిక స్థాయుల్లోని అధ్యక్షుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.
» గ్రామ పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆ రాష్ట్ర శాసనసభ నిర్మాణ శాఖ చట్టం ప్రకారం నిర్ణయించవచ్చు.
» గ్రామ పంచాయతీ అధ్యక్షులు మాధ్యమిక వ్యవస్థలో, మాధ్యమిక వ్యవస్థకు చెందిన అధ్యక్షులు జిల్లా పరిషత్‌లో సభ్యులుగా కొనసాగవచ్చు.
» జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యులు, విధానసభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గాల పరిధిలోని మాధ్యమిక వ్యవస్థల్లో, జిల్లా పరిషత్‌లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగవచ్చు.
» జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు తాము ఓటరుగా నమోదైన జిల్లాలో, మాధ్యమిక వ్యవస్థలో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగవచ్చు.
» రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, జిల్లా పరిషత్‌లో సభ్యులుగా కొనసాగవచ్చు.


ఆర్టికల్ - 243(D): స్థానిక సంస్థల్లో సీట్లు - రిజర్వేషన్
» పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని స్థాయుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వ్ చేయాలి.
» ఈవిధంగా రిజర్వ్ చేసిన స్థానాల్లో 1/3వ వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేయాలి.
» బీసీ వర్గాల వారికి రిజర్వేషన్లు కేటాయించే అధికారం సంబంధిత రాష్ట్ర శాసన సభల విచక్షణకే 73వ రాజ్యాంగ సవరణ చట్టం విడిచిపెట్టింది.
» పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు 1/3 నుంచి 1/2వ వంతు వరకు (50%) పెంచడానికి ఉద్దేశించిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ముందు ఉంది.


అబ్దుల్ అజీజ్ అసాద్ Vs ఆంధ్రప్రదేశ్ కేసు
» స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లను రిజర్వు చేయడం అనేది రిజర్వేషన్లు 50% మించరాదు అనే సూత్రానికి వ్యతిరేకం కాదని అబ్దుల్ అజీజ్ అసాద్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
» ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, మహిళలకు కేటాయించిన స్థానాలు రొటేషన్ పద్ధతిలో జరగాలి.


ఆర్టికల్ - 243 (E): పంచాయతీరాజ్ సంస్థల కాలపరిమితి
» స్థానిక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలుగా నిర్దేశించారు. అయితే ఈ పదవీకాలం ముగియకముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దుచేయవచ్చు.
» ఏదైనా కారణం వల్ల పదవీకాలం ముగియకముందే మధ్యలోనే రద్దుచేస్తే 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి.
» ఖాళీలు ఏర్పడినప్పుడు జరిగే ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రతినిధులు మిగిలిన పదవీకాలానికి మాత్రమే అధికారంలో కొనసాగుతారు.
» సంస్థ మొత్తానికి ఎన్నికలు కాలయాపన ద్వారా జరిగితే మాత్రం పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగవచ్చు. అయితే సంస్థ పదవీకాలం ముగియడానికి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఉప ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదు.


ఆర్టికల్ - 243(F): అర్హతలు - అనర్హతలు
» స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు.
» పార్లమెంటు, శాసన సభలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలన్నీ స్థానిక సంస్థల్లో పోటీచేసే అభ్యర్థులకు వర్తిస్తాయి.
» ఏ స్థానిక సంస్థకు పోటీ చేస్తున్నారో దాని పరిధిలో ఓటరై ఉండాలి.
» రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే డిపాజిట్‌ను చెల్లించాలి.
» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదు.


మహ్మద్ షరీఫ్ Vs స్టేట్ ఆఫ్ హర్యానా కేసు:
» సమాజం, దేశ ప్రయోజనాల దృష్ట్యా, 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీచేయరాదని నిర్దేశించడం సమర్థనీయమేనని మహ్మద్ షరీఫ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
» పంచాయతీ సభ్యుల అనర్హతను విచారించే అధికారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మున్సిఫ్ కోర్టులకు ఉందని నిర్దేశించారు.


ఆర్టికల్ - 243 (G): అధికారాలు - విధులు
» పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 అంశాలను XIవ షెడ్యూల్‌లో పొందుపరిచారు. వీటిని స్థానిక స్వపరిపాలనా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయాలి.
గమనిక: ఈ 29 అంశాలు ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని చాప్టరులో పొందుపరిచారు.


ఆర్టికల్ - 243 (H): ఆర్థిక వనరులు
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులు
» ఇంటిపన్ను, నీటి పన్ను, అడ్వర్టైజ్ పన్ను, సంతలు, మార్కెట్‌లపై పన్ను
» అద్దెలు, అమ్మకాల ద్వారా లభించే ఆర్థిక వనరులు
» రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన కొన్ని పన్నులను పంచాయతీలకు జమ చేయవచ్చు.
» రాష్ట్ర శాసన సభ ప్రత్యేక శాసనం ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి, పన్నులు విధించి, వసూలు చేసే అధికారాన్ని పంచాయతీలకు బదలాయించవచ్చు.
» దాతలు సమకూర్చే విరాళాలు


ఆర్టికల్ - 243(I): రాష్ట్ర ఆర్థిక సంఘం
» గవర్నరు ప్రతి 5 సంవత్సరాలకొకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
» స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తగిన సూచనలు, సలహాలను ఆర్థిక సంఘం రూపొందిస్తుంది.
» రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధులకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ఆర్థిక సంఘం అందిస్తుంది.
» కేంద్రం నుంచి నిధుల మంజూరు కోసం గవర్నరు ద్వారా కేంద్ర ఆర్థిక సంఘానికి, రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది.
» పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి సంబంధించి, గవర్నరు సూచించిన అంశాలపై తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది.
» ఆర్థిక సంఘం ప్రతి సంవత్సరం తన నివేదికను గవర్నరుకు సమర్పిస్తుంది.
» ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఆర్థిక సంఘం 1994, జూన్ 24న ఏర్పాటైంది. దీని తొలి అధ్యక్షులు - లక్ష్మణస్వామి.


ఆర్టికల్ - 243(J): అకౌంట్స్ అండ్ ఆడిటింగ్
» స్థానిక సంస్థలు వివిధ అంశాలపై చేసిన ఖర్చులు, ఖాతాలను ఆడిట్ చేసే విధానాన్ని ఆర్టికల్ - 243(J) తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర శాసన సభలే నిర్దేశిస్తాయి.
» ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఖాతాల ఆడిట్‌ను రాష్ట్ర ఆడిట్ సంచాలకులు (Director of State Audit) నిర్వహిస్తారు.
» ప్రస్తుతం మన రాష్ట్రంలో కింది విధంగా ఆడిట్‌ను నిర్వహిస్తున్నారు.
    1. లోకల్ ఫండ్ ఆడిట్
    2. శాఖాపరమైన ఆడిట్
    3. జనరల్ ఆడిట్


ఆర్టికల్ - 243(K): రాష్ట్ర ఎన్నికల సంఘం
» స్థానిక సంస్థలకు చెందిన ఓటర్ల జాబితాను రూపొందించడం, సవరించడం, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ లాంటి అధికారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కలిగి ఉంటుంది.
» రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను గవర్నరు నియమిస్తారు. కానీ తొలగించేది మాత్రం రాష్ట్రపతి.
» హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే రాష్ట్రపతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తారు.
» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994, సెప్టెంబరులో ఏర్పడింది.
» దీని మొదటి కమిషనర్ - ఎస్. కాశీ పాండ్యన్
» ప్రస్తుత కమిషనర్ - రమేష్‌ కుమార్
» రాష్ట్ర ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నెంబరు - 1950.


ఆర్టికల్ - 243(L): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం
» రాష్ట్రపతి నిర్దేశం ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి, పంచాయతీరాజ్ విధానాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా? లేదా? అనేది నిర్ణయిస్తారు.
» దిల్లీ, పాండిచ్చేరిల్లో వాటి శాసన సభలు అక్కడి స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలు చేసినప్పటికీ, అవి కేంద్రం ఉత్తర్వులకు లోబడి ఉండాలి.


ఆర్టికల్ - 243(M): మినహాయించిన ప్రాంతాలు
  73వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి కింద పేర్కొన్న ప్రాంతాలను మినహాయించారు.
» ఆర్టికల్ - 244(1)లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలు.
» ఆర్టికల్ - 244(2)లో పేర్కొన్న ఆటవిక జాతుల ప్రాంతాలు.
» నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలు.
» మణిపూర్ రాష్ట్రంలోని జిల్లా కౌన్సిల్ ప్రాంతాలు.
» పశ్చిమ్ బంగాలోని డార్జిలింగ్ జిల్లాలోని గూర్ఖాహిల్ కౌన్సిల్ ప్రాంతం.


ఆర్టికల్ - 243(N): పూర్వ శాసనాల కొనసాగింపు
» 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు అంటే 1993, ఏప్రిల్ 24 నుంచి 1994, ఏప్రిల్ 23 వరకు సంబంధిత రాష్ట్రాల్లో పూర్వశాసనాలు కొనసాగుతాయి.
» ఈ చట్టంలోని అంశాలను రాష్ట్ర శాసన సభ 2/3వ ప్రత్యేక మెజార్టీ ద్వారా 73వ సవరణ చట్టం మౌలిక స్వరూపం దెబ్బతినకుండా సవరించుకోవచ్చు.


ఆర్టికల్ - 243(O): కోర్టుల జోక్యంపై పరిమితులు - ప్రత్యేక ట్రిబ్యునళ్లు
» పంచాయతీరాజ్ వ్యవస్థలోని నియోజక వర్గాల ఏర్పాటు, నియోజక వర్గాల సీట్ల కేటాయింపునకు సంబంధించిన అంశాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.
» పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించే నిమిత్తం సంబంధిత రాష్ట్ర శాసన సభ ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు.
» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Muncif Courtలను ఈ అధికారం కింద ప్రత్యేక Authorityగా ప్రకటించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి Muncif Courtలు ఎన్నికల వివాదాలను Muncif Court హోదాలో కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్ హోదాలో విచారిస్తాయి.

 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ

    బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను అనుసరించి 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం - రాజస్థాన్, రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్.
» ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ల చట్టాన్ని 1959లో చేశారు. దీని ప్రకారం 1959, నవంబరు నాటికి పంచాయతీ సమితులు; 1959, డిసెంబరు నాటికి జిల్లాపరిషత్‌లు అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటయ్యాయి.
» ఆంధ్రప్రదేశ్‌లో 1959 చివరి నాటికి 235 పంచాయతీ సమితులను ఏర్పాటు చేశారు.
» 1959 డిసెంబరు నాటికి రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని జిల్లా బోర్డులను రద్దుచేసి, జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేశారు.
» జిల్లా బోర్డుల అధికారాలు, విధులు, విధానాలు మొత్తం పంచాయతీ సమితులు, జిల్లాపరిషత్‌లకు అప్పగించారు.
» 1963 నాటికి రాష్ట్రంలో 448 సమితి బ్లాకులు ఏర్పాటు చేశారు.


పురుషోత్తమ్ పాయ్ కమిటీ
» పంచాయతీ సంస్థల సామాజిక విధులు, ఆర్థిక అధికారాలపై తగిన సిఫార్సులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 1963లో పురుషోత్తం పాయ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ సిఫార్సులు:
» బ్లాకుల పరిమాణం పెద్దదిగా ఉండాలి. అప్పుడే స్వతంత్ర ప్రణాళికలను ఏర్పరచుకుంటాయి.
» బ్లాకులను ఉన్నతస్థాయి, సాధారణ, వెనుకబడిన, గిరిజన బ్లాకులుగా విభజించాలి.
» పురుషోత్తమ్ పాయ్ సిఫార్సుల మేరకు 1959 నాటి చట్టానికి 1964లో సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం బ్లాకుల పరిధులను మార్చేందుకు, సమితులను పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించారు. దీని ఫలితంగా 1964, జులై నాటికి బ్లాకుల సంఖ్య 448 నుంచి 321కి తగ్గించడమైంది.
» గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ ప్రజలతో కూడిన మౌలిక వ్యవస్థ.
» 10 వేల మంది లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామం ఒక పంచాయతీని కలిగి ఉండాలి.
» పంచాయతీ సభ్యులను గ్రామంలోని ఓటర్లు ఎన్నుకోవాలి.
» పంచాయతీ సభ్యుల సంఖ్య 5 - 17 వరకు ఉండాలి.
» మొత్తం పంచాయతీ సభ్యుల సంఖ్య 7 కంటే తక్కువ ఉంటే ఒక సీటును, 9 కంటే ఎక్కువ ఉంటే 2 సీట్లను మహిళలకు కేటాయించాలి.
» ఎస్సీ, ఎస్టీలకు ఒక సీటును కేటాయించాలి.
» సర్పంచ్ / ఉపసర్పంచ్‌ను పంచాయతీ సభ్యులు పరోక్షంగా ఎన్నుకోవాలి.
» 1965 వరకు ప్రతీ పంచాయతీ సమితిలో, దాని పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండేవారు.
» 1964 నాటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చట్టం ప్రకారం ఎమ్మెల్యే / ఎమ్మెల్సీ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా లేదా ఉపాధ్యక్షుడిగా పనిచేయడాన్ని నిషేధించారు.
» పంచాయతీ సమితి కనీసం 3 నెలలకొకసారి సమావేశం కావాలి.
» పంచాయతీ సమితికి BDO ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తారు.


జిల్లా పరిషత్
» దీనిలో కింద పేర్కొన్నవారు సభ్యులుగా ఉంటారు.
    1. జిల్లాలోని అన్ని పంచాయతీ సమితుల అధ్యక్షులు
    2. జిల్లా కలెక్టరు
    3. జిల్లాలోని మొత్తం ఎంపీలు
    4. జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
» జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు జిల్లాపరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
» 1959 నాటి చట్టానికి 1963లో చేసిన సవరణ ప్రకారం జిల్లా కలెక్టరు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసేందుకు అనర్హుడు.


ఎం.టి. రాజు కమిటీ
» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో ఎం.టి. రాజు కమిటీని నియమించింది.
» జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది.


జలగం వెంగళరావు కమిటీ:
» పంచాయతీరాజ్ సంస్థలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడంతో 1968, మార్చిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ పంచాయతీరాజ్‌కు సంబంధించిన అంశాలపై సిఫార్సులు చేసేందుకు జలగం వెంగళరావు అధ్యక్షతన 12 మంది శాసన సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ సిఫార్సులు
» పంచాయతీరాజ్ సంస్థలపై విమర్శలకు ప్రధాన కారణం నిధుల లేమి, కార్యాచరణలో స్వాతంత్య్రం లేకపోవడం.
» District Development Boardలను రద్దుచేయాలి.
» సర్పంచ్, పంచాయతీ సమితి అధ్యక్షుడు లేదా జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వతంత్ర అధికారాలు కలిగి ఉండరాదు.
» స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ఎన్నికల గుర్తులను ఉపయోగించరాదు.
» జిల్లా పరిషత్‌కు సాలీనా తలసరి నిధులను 25 పైసల నుంచి ఒక రూపాయికి పెంచాలి.
» పంచాయతీలు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా వాటికి తగినంత వనరులను కల్పించాలి.


సి. నరసింహం కమిటీ:
» పంచాయతీ సంస్థలు మెరుగైన పనితీరును కనబరిచేందుకు అవసరమైన సిఫార్సుల కోసం రాష్ట్రప్రభుత్వం
1971లో సి. నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది.
» ఈ కమిటీ తన నివేదికను 1972లో సమర్పించింది.
కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలు:
» గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.
» ఉపసర్పంచ్‌ను సర్పంచ్, గ్రామపంచాయతీ సభ్యులు ఎన్నుకోవాలి.
» గ్రామ సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులతో కూడిన ఒక ఎన్నికల గణం ప్రత్యక్ష పద్ధతిలో పంచాయతీ సమితి సభ్యులను ఎన్నుకోవాలి.
» పంచాయతీ సమితి సభ్యుల సంఖ్య జిల్లా పరిషత్ సభ్యుల సంఖ్యకు 12 రెట్లు ఉండాలి.
» పంచాయతీ సమితి సభ్యులు తమలో నుంచి ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా వారే ఎన్నుకోవాలి.    
» గ్రామ పంచాయతీలో వారి సంఖ్యను బట్టి మహిళలకు 1 నుంచి 3 సీట్లను రిజర్వు చేయాలి.
» పంచాయతీ సమితిలో, జిల్లాపరిషత్‌లో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు.
» జిల్లాపరిషత్ స్థాయీ సంఘం అధ్యక్షుడిగా, ఎక్స్అఫీషియో సభ్యుడిగా జిల్లా కలెక్టరును కొనసాగించే విధానాన్ని రద్దుచేయాలి.
» గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ప్రత్యక్షంగా (నేరుగా) ఎన్నుకుంటారు. కాబట్టి అతడిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి వీల్లేదు.
» ఉపసర్పంచ్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.
» గ్రామ పంచాయతీ ఓటర్లలో కనీసం 10 మంది ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలవారు ఉంటే గ్రామపంచాయతీ సీట్లలో వారికి కనీసం ఒక సీటును రిజర్వు చేయాలి.
» జిల్లా పరిషత్, పంచాయతీ సమితులకు శాసన సభ్యులను ఎక్స్అఫీషియో సభ్యులుగా చేయాల్సిన అవసరం లేదు.
» జాతీయ ఆర్థిక సంఘం మాదిరిగా ఒక స్థానిక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
» పంచాయతీ సమితి లేదా జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వాలి.
» గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా ఉపసర్పంచ్‌ను పంచాయతీ సభ్యులను తొలగించే అధికారం పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇవ్వాలి.


అశోక్ మెహతా కమిటీ సిఫార్సులపై అధ్యయనం కోసం ఏర్పడిన సి. నరసింహం కమిటీ సిఫార్సులు (1979)
» పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి.
» పంచాయతీరాజ్ సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.
» రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలి.
» ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సర్పంచ్, పంచాయతీ సమితి, జిల్లాపరిషత్ అధ్యక్ష పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి.


ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సమీక్షా మండళ్ల చట్టం (1986)
» ఈ చట్టం ద్వారా ఎన్.టి. రామారావు ప్రభుత్వం 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవి:
    1. గ్రామపంచాయతీ
    2. మండల ప్రజాపరిషత్
    3. జిల్లా ప్రజాపరిషత్
    4. జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్షామండలి
» పై వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికాభివృద్ధి సమీక్షామండళ్ల చట్టం 1986ను చేసింది.
» ఈ చట్టం 1986, జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
» 330 పంచాయతీ సమితులు రద్దుచేసి వాటిస్థానంలో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేశారు.
» ప్రతి పంచాయతీ సమితిని 3 లేదా 4 మండల ప్రజాపరిషత్‌లుగా విభజించారు.
» 35,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న గ్రామాల సముదాయాన్ని కలిపి, మండల ప్రజాపరిషత్‌గా ఏర్పాటు చేశారు.
» జిల్లా పరిషత్‌ను జిల్లా ప్రజాపరిషత్‌గా మార్చారు.


బి.పి.ఆర్. విఠల్ కమిటీ (1991)
» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ కోసం అధ్యయనం చేసేందుకు 1991లో బి.పి.ఆర్. విఠల్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. బి.పి.ఆర్. విఠల్ కమిటీ సిఫార్సులపై అప్పటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి డీకే సమరసింహా రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పరిచి అధ్యయనం చేయమని కోరింది.
ఈ కమిటీ సిఫారసులు:
» ఆంధ్రప్రదేశ్‌లోని 1104 మండలాల స్థానంలో 500 నుంచి 550 వరకు తాలూకాలను ఏర్పాటు చేయాలి.
» ప్రతి 80 వేల నుంచి లక్ష జనాభాకు ఒక తాలూకా పంచాయతీ సమితిని ఏర్పాటు చేయాలి.
» వ్యతిరేక ఓటు విధానాన్ని అమలు చేయాలి
» ఎన్నికల్లో 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే ఎన్నికైనట్లు ప్రకటించాలి.
» పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుల వినియోగాన్ని నిషేధించాలి.
» పంచాయతీ ఎన్నికల్లో పార్టీరహిత పోటీ విధానాన్ని అమలు చేయాలి.
» జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలి.
» జిల్లా ప్రజా పరిషత్ అనే పదం నుంచి ప్రజా అనే పదాన్ని తీసివేసి జిల్లా పరిషత్‌గా నిర్దేశించాలని సూచించింది.
» ప్రతి తాలూకా పంచాయతీ సమితిలో ఒక తాలూకా అభివృద్ధి అధికారిని నియమించాలి.
» ఇతడికి విధి నిర్వహణలో సహాయం అందించేందుకు విస్తరణాధికారులు ఉండాలి.
» వివిధ రకాల ఏజెన్సీలు నిర్వర్తిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ తాలూకా పంచాయతీ సమితికి అప్పగించాలి.
» వివిధ రంగాల సమగ్రాభివృద్ధికి మొత్తం 6 రకాల స్థాయీ సంఘాలను ఏర్పాటు చేయాలి. అవి:
      1. ప్రణాళికా స్థాయీ సంఘం
      2. ఆర్థిక వ్యవస్థ స్థాయీ సంఘం
      3. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం
      4. విద్యాస్థాయీ సంఘం
      5. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం
      6. మహిళాభివృద్ధి స్థాయీ సంఘం


ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టం - 1994
» ఈ చట్టం 3 అంచెల వ్యవస్థను కింది విధంగా పేర్కొంది.
    1. కింది స్థాయిలో - గ్రామ పంచాయతీ
    2. మధ్యస్థాయిలో - మండల పరిషత్
    3. జిల్లాస్థాయిలో - జిల్లా పరిషత్


PESA Act - 1996
» దిలీప్‌ సింగ్ భూరియా కమిటీ సిఫార్సుల మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరిస్తూ చేసిన చట్టమే పెసా చట్టం
» PESA అంటే Panchayat Raj Extention to Scheduled Areas
» భారత ప్రభుత్వం 1996, డిసెంబరు 24 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PESA చట్టానికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి, షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించింది. దీని ప్రకారం....
1. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామసభ ఆమోదంతోనే గ్రామ పంచాయతీలు ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రణాళికల రూపకల్పన అమలు చేయాలి.
2. గ్రామసభ ద్వారానే దారిద్య్ర నిర్మూలన, ఇతర కార్యక్రమాల్లో లబ్దిదారుల ఎంపిక కూడా జరగాలి.
3. గ్రామ పంచాయతీ ద్వారా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు, నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువపత్రాలు గ్రామసభ ఆమోదం పొందాలి.
4. గ్రామసభ, గ్రామ పంచాయతీలు చేసిన సిఫార్సులు చట్టబద్ధమైనవిగా పరిగణిస్తారు.
5. గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకానికి వేలంపాట ద్వారా ఖనిజ సంపద వినియోగానికి లైసెన్సులు మంజూరు చేసే అధికారం గ్రామసభ, గ్రామ పంచాయతీలకు ఉంటుంది.
6. ప్రతిగ్రామానికి గ్రామసభ ఉంటుంది. ఆ సభ గిరిజన ప్రజల సంప్రదాయాలను పరిరక్షించేదిగా ఉండాలి.
7. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రతి పంచాయతీలో వివిధ వర్గాల జనాభా ప్రాతిపదికగా సీట్లను రిజర్వు చేయాలి.
8. అన్ని స్థాయుల్లోని పంచాయతీల ఛైర్మన్ పదవులన్నింటినీ షెడ్యూల్డ్ తెగలకు తప్పకుండా రిజర్వు చేయాలి.
9. పంచాయతీలకు, గ్రామసభకు రాష్ట్ర శాసనసభ కింది అధికారాలను బదలాయించాలి.

» మద్యపాన నిషేధాన్ని అమలు చేసే, నియంత్రించే అధికారం ఉండాలి.
» గ్రామ మార్కెట్‌లను నిర్వహించే అధికారం.
» గిరిజనులకు పరపతి సౌకర్యం కల్పించే వడ్డీ వ్యాపారులను నియంత్రించే అధికారం.
» స్థానిక ప్రణాళికలు, వనరులను నియంత్రించే అధికారం.


షెడ్యూల్ ప్రాంతాల్లో స్థానిక పాలన - ఆంధ్రప్రదేశ్
» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రత్యేక నియమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది.
» గిరిజన ప్రాంతాల పరిరక్షణకు, అక్కడి ప్రజల ప్రత్యేక అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టం 1998, జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.
చట్టంలోని ముఖ్యాంశాలు
» గిరిజన గ్రామంలోని ప్రజల ఆచార సంప్రదాయాలను, సాంస్కృతిక పరమైన ప్రత్యేకతను పరిరక్షించుకునే హక్కు ఆ గ్రామసభకే ఉంటుంది.
» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని మొత్తం గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాల్లో కనీసం సగం స్థానాలను ఎస్టీ వర్గాలకు రిజర్వు చేయాలి.
» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని అన్ని గ్రామ సర్పంచ్ పదవులు, అన్ని మండల పరిషత్ అధ్యక్ష పదవులు తప్పనిసరిగా ఎస్టీ వారికి రిజర్వు చేయాలి.
» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఖనిజ నిక్షేపాలను వెలికితీయడానికి అవసరమైన లైసెన్స్‌లను ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత గ్రామ పంచాయతీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
» అభివృద్ధి పనులను చేపట్టడానికి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తే, సంబంధిత మండల పరిషత్‌ను సంప్రదించాలి.
» మండల పరిషత్‌లో ఏదైనా తెగకు ప్రాతినిధ్యం లేనట్లయితే ఆ తెగలకు చెందినవారిని మండల పరిషత్ సభ్యులుగా ప్రభుత్వం నామినేట్ చేయవచ్చు.


ఆర్టికల్ 243 (A) గ్రామసభ
» రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(A) ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది.
» గ్రామసభలో గ్రామ పంచాయతీకి చెందిన రిజిస్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు.
» గ్రామసభ పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలాధారం.
» గ్రామసభ సమావేశాలను సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయంలోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.
గ్రామసభ - విధులు
» గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలనను పరిశీలించడం.
» ఆడిట్ నివేదికలను పరిశీలించడం, ఆమోదించడం.
» కొత్తగా పన్నులు విధించడానికి లేదా ప్రస్తుతం ఉన్న పన్నులను పెంచడానికి ప్రతిపాదనలు చేయడం.
» ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం
» గ్రామసభలో చేసిన తీర్మానాలకు గ్రామపంచాయతీ సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పేర్కొంది.


గ్రామసభ సమావేశాలకు కోరం
» సభాసమావేశాలు నిర్వహించడానికి కావాల్సిన కనీస సభ్యుల హాజరునే కోరం అంటారు. ఇది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అవి:
    1) మధ్యప్రదేశ్ - 1/3
    2) హిమాచల్ ప్రదేశ్ - 1/5
    3) మహారాష్ట్ర - 1/15
    4) ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బంగా - 1/20
    5) తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, బిహార్ - 1/10
» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామసభకు కోరం నిర్ణయించలేదు.
గ్రామసభ సమావేశాలు - సంవత్సరానికి ఎన్నిసార్లు జరపాలి?
» ఆర్టికల్, 243 (A) ప్రకారం గ్రామసభ సమావేశాలను 6 నెలల వ్యవధి మించకుండా సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి.
     1) ఏప్రిల్ 14
     2) అక్టోబరు 3
వివిధ రాష్ట్రాల్లో గ్రామసభ సమావేశాలను కింది విధంగా నిర్వహిస్తున్నారు.
     1) మధ్యప్రదేశ్, పశ్చిమ్ బంగా - సంవత్సరానికి ఒకసారి
     2) గుజరాత్, కేరళ - సంవత్సరానికి 2 సార్లు
     3) తమిళనాడు - సంవత్సరానికి 3 సార్లు
     4) మహారాష్ట్ర - సంవత్సరానికి 6 సార్లు
» 2009 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామసభ సంవత్సరానికి 4 సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని నిర్దేశించారు. అవి:
    1) ఏప్రిల్ 14
    2) అక్టోబరు 3
    3) జనవరి 2
    4) జులై 1
» గ్రామసభను సంవత్సరానికి 2 సార్లు సమావేశపరచడంలో సర్పంచ్ విఫలమైతే అతడు తన పదవిని కోల్పోతాడు.
» ఈ విధంగా పదవిని కోల్పోయిన సర్పంచ్ తొలగించిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హతను కోల్పోతాడు.
» గ్రామసభ సభ్యుల్లో కనీసం 50 మంది లేదా 10% సభ్యులు లిఖిత పూర్వకంగా కోరినట్లయితే గ్రామసభ సమావేశాలను సర్పంచ్ ఏర్పాటు చేయాలి.
» భారత ప్రభుత్వం 2009 - 2010 సంవత్సరాన్ని గ్రామసభల సంవత్సరంగా ప్రకటించింది


గ్రామ పంచాయతీ
» గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1964ను ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించారు.
» ఆంధ్రప్రదేశ్‌లో 1964లో మొదటిసారిగా పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సిఫార్సు చేసిన కమిటీలు
    1. జలగం వెంగళరావు కమిటీ
    2. నరసింహం కమిటీ
    3. దంత్‌వాలా కమిటీ
» 1981 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
» ఎన్.టి. రామారావు ప్రభుత్వం పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి గ్రామ పరిపాలనాధికారులను నియమించింది.
» గ్రామ పంచాయతీ గ్రామస్థాయిలోని పరిపాలనా విభాగం.
» గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏర్పాటు చేస్తారు.
గ్రామ పంచాయతీలు 2 రకాలు
     1. నోటిఫైడ్ పంచాయతీ: (మేజర్ గ్రామ పంచాయతీ)
        » దీని వార్షికాదాయం రూ.60,000/- కంటే ఎక్కువ.
     2. నాన్ - నోటిఫైడ్ పంచాయతీ: (మైనర్‌ గ్రామ పంచాయితీ)
        » దీని వార్షికాదాయం రూ.60,000/- కంటే తక్కువ.
» 250 కంటే జనాభా ఎక్కువ ఉన్న గ్రామంలో గ్రామపంచాయతీని ఏర్పాటు చేయవచ్చు.
» గ్రామ జనాభాను బట్టి గ్రామపంచాయతీలో కనిష్ఠంగా 5, గరిష్ఠంగా 21 మంది వార్డు సభ్యులు ఉండవచ్చు.
» గ్రామపంచాయతీ సర్పంచ్‌ను, వార్డు సభ్యులను గ్రామంలోని ఓటర్లు పార్టీరహితంగా ప్రత్యక్ష పద్ధతిలో రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
» గ్రామాన్ని ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డులుగా విభజించి ప్రతి వార్డుకు ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు.
» గ్రామపంచాయతీలో ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నవారే గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలి.

 

వార్డులు - విభజన

జనాభా వార్డు సభ్యుల సంఖ్య
300 వరకు 5 మంది
301 నుంచి 500 వరకు 7 మంది
501 నుంచి 1500 వరకు 9 మంది
1501 నుంచి 3000 వరకు 11 మంది
3001 నుంచి 5000 వరకు 13 మంది
5001 నుంచి 10,000 వరకు 15 మంది
10001 నుంచి 15,000 వరకు 17 మంది
15001 కంటే ఎక్కువ జనాభా ఉంటే 19 మంది నుంచి 21 మంది

గ్రామపంచాయతీకి పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు
» గ్రామ పంచాయతీలో రిజిస్టరైన ఓటరుగా ఉండాలి.
» 21 సంవత్సరాల వయసు నిండాలి.
» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు.
» శాసనసభకు పోటీచేయడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి.
» మహ్మద్ షరీఫ్ Vs హర్యానా రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీ చేయరాదనే నియమం దేశం శ్రేయస్సు దృష్ట్యా సమర్థనీయమేనని పేర్కొంది.


ఇతర అనర్హతలు
» అంధులు, మూగవారై ఉండరాదు.
» దివాలా కోరై ఉండరాదు.
» కుష్టురోగై ఉండరాదు.
గ్రామపంచాయతీ - సమావేశాలు
» గ్రామపంచాయతీ సమావేశాల కోరం గ్రామపంచాయతీ మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు.
» గ్రామపంచాయతీ నెలకొకసారి తప్పనిసరిగా సమావేశం కావాలి.
» పంచాయతీ సమావేశాల్లో చర్చకు వచ్చిన ప్రతి విషయంపైన ఓటింగ్ జరుగుతుంది.
» ఏదైనా తీర్మానంపై అనుకూలంగా, వ్యతిరేకంగా సమానంగా ఓట్లు వచ్చినప్పుడు సర్పంచ్ తన నిర్ణాయక ఓటును వినియోగిస్తారు.
» పంచాయతీ సభ్యుల్లో కనీసం 3వ వంతు సభ్యులు లిఖితపూర్వకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరితే సర్పంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
» ఒక వ్యక్తి ఒకే సమయంలో గ్రామపంచాయతీలోని ఒకటికంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీచేయరాదు.
» గ్రామపంచాయతీలను రద్దుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికే ఉంది. రద్దు అయిన గ్రామపంచాయతీలకు 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.
» ఒక గ్రామపంచాయతీ రద్దయ్యే సమయానికి దాని కాలపరిమితి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు.
» స్థానిక సంస్థల ప్రతినిధులను తొలగించే అధికారం జిల్లా కలెక్టరుకు ఉంది.
» వరుసగా 3 సమావేశాలకు హాజరుకాని సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు, అయితే 30 రోజుల లోపల తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరితే తప్పనిసరిగా పునరుద్ధస్తారు. అయితే రెండోసారి ఇలా జరిగితే పునరుద్ధరించరు.
» ఏవైనా కారణాల వల్ల సభ్యుడు లేదా సర్పంచ్ స్థానాలు ఖాళీ అయితే వాటిని 4 నెలల లోపు భర్తీచేయాలి.
» గ్రామ సర్పంచ్/ ఉపసర్పంచ్/ పంచాయతీ సభ్యుడు... వీరిలో ఎవరైనా గ్రామ పంచాయతీ నిర్వహణకు సంబంధించిన రాష్ట్రప్రభుత్వ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలుచేయడంలేదని జిల్లా కలెక్టరు భావించినట్లయితే వారిని 3 నెలల వరకు కలెక్టరు సస్పెండ్ చేయవచ్చు. ఈ సస్పెండ్‌ను 6 నెలల వరకు పొడిగించే అధికారం ప్రభుత్వానికే ఉంది.


శాశ్వత ఆహ్వానితులు
» మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (MPTC) తన ప్రాదేశిక పరిధిలోని గ్రామ పంచాయతీల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా హాజరు కావచ్చు. కానీ ఓటు హక్కు మాత్రం ఉండదు.
కోఆప్టెడ్ సభ్యులు
» స్వయంసహాయక బృందాల నుంచి సర్పంచ్ అధ్యక్షతన ఒక సంఘం ప్రతి బృందం నుంచి ఒక్కో సభ్యుడిని ఎంపిక చేస్తుంది. ఆ సభ్యులను పంచాయతీ సమితికి కో-ఆప్ట్ చేస్తారు.


రిజర్వేషన్లు ఆర్టికల్ - 243(D)
» గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
» ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 1/3వ వంతు సీట్లను ఈ వర్గాల మహిళలకు కేటాయించాలి.


వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు
» 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు నిర్దేశించలేదు. అయితే ఆయా రాష్ట్రాల శాసనసభలు బీసీలకు ఎంతశాతం రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయించవచ్చు.
» ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల వారికి 34% సీట్లు రిజర్వ్ చేశారు.
» బీసీలకు కేటాయించిన సీట్లలో 1/3వ వంతు మహిళలకు కేటాయించాలి.
» 73వ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లు నిర్దేశించాలి.
» ప్రస్తుతం మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌తో సహా 13 రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేశారు.
» గ్రామపంచాయతీల్లోని రిజర్వ్ చేసిన సీట్లు రొటేషన్ పద్ధతిపై వివిధ వార్డులకు కేటాయిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో
» ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 2013, జూన్ 1న జీవో 279ను విడుదల చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లను రిజర్వు చేసింది.
» 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో బీసీ వర్గాల జనాభా 39.18% గా ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్ (ధరావత్తు) వివరాలు

కేటగిరి వార్డు మెంబరు సర్పంచ్ అభ్యర్థి MPTC అభ్యరి ZPTC అభ్యర్థి
జనరల్ రూ.500 రూ.2,000 రూ.2,500 రూ.5,000
ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 రూ.1,000 రూ.1,250 రూ.2,500


స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి
» జనాభా పదివేల కంటే ఎక్కువ ఉంటే సర్పంచ్ అభ్యర్థి రూ.80,000/, వార్డు మెంబరు రూ. 10,000/- వరకు ఖర్చు చేసుకోవచ్చు.
» జనాభా పదివేల కంటే తక్కువ ఉంటే సర్పంచ్ అభ్యర్థి రూ.40,000/, వార్డు మెంబరు రూ.6,000/ వరకు ఖర్చు చేసుకోవచ్చు.
» MPTC అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితి లక్ష రూపాయలు.
» ZPTC అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితి 2 లక్షల రూపాయలు.


ఏకగ్రీవ పంచాయతీలకు - ప్రోత్సాహకాలు
» 15,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే రూ.20 లక్షలు.
» 15,000 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే రూ.7 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకం కింద అందిస్తోంది.


సర్పంచ్‌ల రిజర్వేషన్‌లు
» 2013, జులైలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్ల కోసం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నారు.
» బీసీ వర్గాల రిజర్వేషన్ల కోసం జిల్లాను యూనిట్‌గా తీసుకున్నారు.
» మొత్తం సర్పంచ్ పదవుల్లో 50% స్త్రీలకు రిజర్వు చేయాలి.


గ్రామపంచాయతీ అధికారాలు - విధులు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994లోని వివరాల ప్రకారం
» సెక్షన్ 45 - 59 వరకు గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన విధులు, దానికి సంబంధించిన ఆస్తుల విషయాలను నిర్దేశించడమైంది.
» సెక్షన్ 60 - 79 వరకు గ్రామ పంచాయతీ ఆర్థిక విషయాలకు సంబంధించిన అధికారాలు.
» సెక్షన్ 80 - 125 వరకు ప్రజాభద్రత సౌకర్యం, ఆరోగ్యం గురించి చేయాల్సిన పనులు.
» సెక్షన్ 126 - 142 వరకు గ్రామ పంచాయతీకి చెందిన ఇతర విషయాలను పేర్కొంటుంది.


గ్రామ పంచాయతీ తప్పనిసరిగా నిర్వహించాల్సిన విధులు
» సెక్షన్ 45 ప్రకారం గ్రామ పంచాయతీ కింద పేర్కొన్న విధులను తప్పనిసరిగా నిర్వహించాలి. అవి:
    1. గ్రామస్థాయిలో ఆర్థిక వనరులను సమీకరించడం.
    2. జనన, మరణాలను నమోదు చేయడం.
    3. తన అధికార పరిధిలోని భవనాలు, రహదారులు, వంతెనల నిర్మాణం, నిర్వహణ.
    4. ప్రజా మరుగుదొడ్లు నిర్మాణం, నిర్వహణ.
    5. వీధిదీపాల ఏర్పాటు.
    6. మురుగునీరు కాలువల నిర్మాణం.
    7. పంచాయతీ పరిధిలోని బజార్లు, వీధుల్లో చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలను తొలగించడం.
    8. శ్మశాన వాటికల ఏర్పాటు, నిర్వహణ.
    9. అంటు వ్యాధుల నివారణ.
    10. రక్షిత మంచినీటి సరఫరా.
    11. కంపోస్టు ఎరువుల తయారీ.
    12. బందెలదొడ్లు ఏర్పాటు, నిర్వహణ.


సెక్షన్, 46 ప్రకారం వివేచనాత్మక విధులు
» గ్రామ పంచాయతీకి ఉన్న ఆర్థిక వనరుల లభ్యతను బట్టి కింది విధులను నిర్వహించాల్సి ఉంటుంది.  అవి:
    1. గ్రంథాలయాల ఏర్పాటు - నిర్వహణ.
    2. ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం.
    3. రోడ్ల పక్కన, ఇతర పబ్లిక్ స్థలాల్లో చెట్లు నాటించడం.
    4. వైద్యశాలల ఏర్పాటు, నిర్వహణ.
    5. ఆటస్థలాలు, వ్యాయామశాలల ఏర్పాటు.
    6. పార్కుల నిర్మాణం, నిర్వహణ.
    7. వికలాంగులు, రోగులకు సహాయ కార్యక్రమాలు.
    8. గ్రంథాలయాలు, పఠన మందిరాల ఏర్పాటు.
    9. గిడ్డంగులు, ధాన్యాగారాల ఏర్పాటు, నిర్వహణ.
    10. మేలిరకం వ్యవసాయ పద్ధతులను అనుసరించడం.
    11. వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రదర్శనల నిర్వహణ.
    12. గ్రామ నివేశన స్థలాల విస్తరణ.
    13. సహకార సంఘాలకు చేయూతనివ్వడం.
    14. ప్రసూతి, శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన, నిర్వహణ.
    15. మార్కెట్లు, జాతరలు, ఉత్సవాల నిర్వహణ.
    16. పశువుల కొట్టాల స్థాపన, నిర్వహణ.
    17. పబ్లిక్ కబేళాలు తెరవడం, నిర్వహించడం.
    18. నిరుద్యోగ గణాంకాల తయారీ.
    19. విపత్తుల సమయంలో సహాయక చర్యలు.
    20. ఊర కుక్కలను నియంత్రించడం.
    21. కమతాల ఏకీకరణ, భూసంస్కరణ చర్యలు.
    22. గ్రామ ప్రజల నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించడం.
    23. అవినీతి, అస్పృశ్యతల నివారణకు కృషి.
    24. పబ్లిక్ మార్కెట్‌ల ఏర్పాటు, నిర్వహణ.
    25. పశుసమృద్ధి, వైద్యసహాయం.


ఇతర విధులు
» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్, 67 ప్రకారం అనుమతులు లేని ప్రకటనలు తొలగించడం.
» సెక్షన్ - 92 ప్రకారం లైసెన్స్ లేని పందులను, కుక్కలను నిర్మూలించడం.
» సెక్షన్ - 98 ప్రకారం దురాక్రమణలను తొలగించడం.
» సెక్షన్ - 101 ప్రకారం రోడ్లపై ఆటంకాలు, గుంతలను తవ్వడం నిషేధించడం.
» సెక్షన్ - 102 ప్రకారం అనుమతి లేకుండా పబ్లిక్ రోడ్లపై చెట్లు నాటడం లేదా కొట్టివేయడం.
» సెక్షన్ - 111 ప్రకారం పబ్లిక్ రోడ్లపై విక్రయం నిషేధించడం.
» సెక్షన్ - 121 ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం.
» సెక్షన్ - 105 ప్రకారం ప్రైవేటు మార్కెట్లకు లైసెన్స్ ఇవ్వడం.
» సెక్షన్ - 122 ప్రకారం వివిధ యంత్రాల వల్ల కలిగే శబ్దాలను తొలగించడానికి ఆదేశాలు జారీచేయడం.


ఆర్టికల్, 243 (G)
» 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా XIవ షెడ్యూల్‌లో పొందుపరచిన పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు. అవి:
     1. చిన్ననీటిపారుదల, నీటి నిర్వహణ, వాటర్‌షెడ్‌ల అభివృద్ధి
     2. వ్యవసాయం, సంబంధిత రంగాలు
     3. భూ సంస్కరణలు
     4. గృహ నిర్మాణం
     5. చేపల పెంపకం
     6. సామాజిక పర్యావరణ
     7. ఖాదీ, చేనేత పరిశ్రమ
     8. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు
     9. తాగునీరు
     10. రోడ్లు, కల్వర్టుల నిర్మాణం
     11. ప్రాథమిక, మాధ్యమిక విద్య
     12. వయోజన విద్య
     13. గ్రంథాలయాలు
     14. సాంస్కృతిక కార్యక్రమాలు
     15. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి
     16. పశు సంవర్థకం
     17. ప్రజాపంపిణీ వ్యవస్థ
     18. గ్రామీణ విద్యుద్దీకరణ
     19. అటవీ ఉత్పత్తులు
     20. ఇంధనం, పశుగ్రాసం
     21. ఆరోగ్యం, పరిశుభ్రత
     22. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు
     23. సాంకేతిక శిక్షణ, వృత్తివిద్య
     24. బలహీన వర్గాల సంక్షేమం
     25. కుటుంబ సంక్షేమం
   

 26. సామాజిక సంక్షేమం
     27. చిన్నతరహా పరిశ్రమలు
     28. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ
     29. సంతలు, మార్కెట్ల నిర్వహణ


గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు
1. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం
    » ఇంటిపన్ను
    » వృత్తి పన్ను
    » ఆస్తుల బదిలీపై పన్ను
    » దుకాణాలపై పన్ను
    » భూమిశిస్తు
    » వాహనాలపై పన్ను
    » ఖాళీస్థలాలపై పన్ను
    » జంతువులపై పన్ను
2. ఆదాయాన్నిచ్చే ఆస్తులు
3. ఫీజులు, రుసుములు
4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లు
5. పంచాయతీ పరిధిలో పండించే వ్యవసాయోత్పత్తులపై పన్ను
6. గ్రామంలో సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత కంపెనీ రూ.1000 దరఖాస్తు ఫీజును గ్రామ పంచాయతీకి చెల్లించాలి.
7. గ్రామ పంచాయతీ జనాభా ఆధారంగా ప్రతి ఒక్కరికి 4 రూపాయల చొప్పున ప్రభుత్వం తలసరి గ్రాంటును పంచాయతీ ఖాతాకు జమచేస్తుంది.
8. తన మూలధనంపై వచ్చే ఆదాయం, విశ్రాంతి భవనాలు, ఖాళీస్థలాలు, మార్కెట్లపై వచ్చే అద్దె లాంటివి.


ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేసిన అంశాలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా
» నీటి పరీక్షల నివేదికలను సమీక్షించి తాగునీటి నాణ్యతను పర్యవేక్షించడం
» వాటర్‌షెడ్ కార్యక్రమాల అమలు
» జాతీయ ఉపాధి హామీ చట్టం
» గ్రామీణ నీటిసరఫరా పథకాల నిర్వహణ
» సంపూర్ణ పారిశుద్ధ్యం ప్రణాళికల తయారీ, అమలు, పర్యవేక్షణ
» కొత్త తాగునీటి పథకాల ప్రణాళికలను తయారుచేయడంలో పాల్గొనడం


వ్యవసాయ, సహకార శాఖల ద్వారా
» విపత్తు యాజమాన్యం, ప్రకృతి వైపరీత్యాలు
» వాటర్‌షెడ్ అభివృద్ధి పథకాల ద్వారా భూమి, నీటి సంరక్షణ
» ప్రోత్సాహక బహుమతులు


పాఠశాల విద్యాశాఖ ద్వారా
» గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అధ్యక్షుడిగా, ఒక మహిళా వార్డు సభ్యురాలు; ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతులకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులతో విద్యకు సంబంధించిన ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలి.
» విద్యా ఉప కమిటీ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరుని పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుంది.
» పాఠశాల సిబ్బంది రోజువారీ హాజరు, పాఠశాలలో బోధించే విద్యా ప్రమాణాలు, పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించడం లాంటి అధికారాలు.
» గ్రామ పంచాయతీలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల, పాఠశాలలో ఒకరు లేదా ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులతో ప్రతి శనివారం ఈ విద్యా ఉప కమిటీ సమావేశం నిర్వహించి, పాఠశాల పనితీరుపై పర్యవేక్షిస్తుంది.
» ఈ ఉప కమిటీ పాఠశాల అభివృద్ధికి సంబంధించి ఏవైనా మరమ్మతులు, అదనపు గదుల కొత్త నిర్మాణాలు, ఫర్నిచర్ సరఫరా లాంటి పనులను తనిఖీచేసి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవీ, లేనివీ సరి చూసుకుని ఏవైనా లోపాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.
» ఈ విద్యా ఉప కమిటీ ఇతర అధికారలు
    ఎ. ఉపాధ్యాయుల హాజరును తనిఖీ చేయడం
    బి. పాఠ్యపుస్తకాల పంపిణీని పరిశీలించడం
    సి. విద్యార్థినీ, విద్యార్థుల నమోదు, హాజరు, డ్రాపవుట్స్‌ను పరిశీలించడం.
పశుసంవర్థక శాఖ డైరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖ
» పశువైద్య సంబంధిత సేవల ఏర్పాటు
» జంతువధశాలలు
» ప్రకృతి వైపరీత్యాల్లో పునరావాస చర్యలు
» పశుగణ బీమా
» పశుగ్రాస అభివృద్ధి
» మత్స్యకారుల సంక్షేమ పథకాలు
చెరువులు, రిజర్వాయర్లలో చేపలు పట్టే హక్కుల వేలంలో వచ్చిన ఆదాయాన్ని కింది విధంగా విభజించారు.
» గ్రామ పంచాయతీలకు - 30%
» నీటి వినియోగదారుల సంఘాలకు - 50%
» మత్స్యశాఖకు - 20%


వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
» మందుల సరఫరా, ఉపయోగాన్ని సమీక్షించడం.
» అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకున్న చర్యలను సమీక్షించడం, పర్యవేక్షించడం.
» జాతీయ ఆరోగ్యమిషన్, ఇతర కార్యక్రమాల కింద వచ్చే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించడం, పర్యవేక్షించడం.
» రక్షిత తాగునీరు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి కార్యకలాపాల అమలును నిర్వహించడం, పర్యవేక్షించడం.
» గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షించడం.


వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ
» వసతి గృహాలకు మరమ్మతులు
» హాస్టల్ పిల్లలకు యూనిఫాం దుస్తులు
» కులాంతర వివాహం చేసుకునేవారికి ప్రోత్సాహం
» వసతిగృహంలో విద్యార్థులను చేర్పించడం


సాంఘిక సంక్షేమశాఖ
» కమ్యూనిటీ భవనాలు, అంబేడ్కర్ విగ్రహాల నిర్మాణం.
» వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించడం.
» వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలను సమీక్షించి, పర్యవేక్షించడం.
» పాఠశాల యూనిఫాం, పుస్తకాలు, ఇతర సామాగ్రిని పర్యవేక్షించడం.
» కులాంతర వివాహాలను ప్రోత్సహించడం.


మహిళా శిశుసంక్షేమ, వికలాంగుల సంక్షేమ శాఖ
» మహిళలు, శిశుసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనపరచడం.
» ICDS, బాలికా శిశు సంరక్షణ పథకం, కిశోరశక్తి యోజన లాంటి పథకాల అమలును పర్యవేక్షించడం.
» 73వ సవరణ చట్టం ప్రకారం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేసిన రాష్ట్రాలు - కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ్ బంగా.
» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 29 అంశాలకు, కేవలం 10 అంశాలను మాత్రమే పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేసింది.

సర్పంచ్ అధికారాలు - విధులు
» సర్పంచ్ గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి.
» గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
» గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు.
» నెలకొకసారి గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
» 6 నెలలకొకసారి గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
» గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తారు.
» గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేస్తారు.
» పంచాయతీ సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేస్తారు.
» గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా ఎలాంటి సమాచారాన్నైనా సర్పంచ్ పొందగలరు.
» పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనా పరమైన నియంత్రణ ఉంటుంది.


సర్పంచ్ - పదవీకాలం
» సర్పంచ్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు.
» గ్రామ సభను సకాలంలో నిర్వహించని సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. ఈవిధంగా పదవిని కోల్పోయినట్లయితే, పదవిని కోల్పోయిన తేదీ నుంచి ఒక సంవత్సరంపాటు ఏవిధమైన ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హతలకు గురవుతారు.
» సర్పంచ్, ఉప సర్పంచ్‌లు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిని పదవి నుంచి తొలగిస్తుంది. వీరు 2 సంవత్సరాల వరకు తిరిగి ఆ పదవులకు పోటీచేయరాదు.
» గ్రామ పంచాయతీ అకౌంట్లను ఆడిట్ చేయించని సర్పంచ్ తన పదవిని కోల్పోతారు.
» సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వీల్లేదు.
» ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు ఎవరైనా శిక్షకు గురైతే, శిక్ష విధించిన రోజు నుంచి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ - 233 ప్రకారం 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచేయరాదు.
» సర్పంచ్ తన రాజీనామాను గ్రామ పంచాయతీకి పంపాలి.
» ఏదైనా కారణం వల్ల గ్రామ పంచాయతీకి పంపే వీలు లేకపోతే సర్పంచ్ తన రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారికి పంపాలి.


గ్రామ పంచాయతీ ఎన్నికల వివాదాలు
» గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని 1994 నాటి ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టంలో నిర్దేశించారు.
» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి (మున్సిఫ్ కోర్టులు) కోర్టులను ప్రత్యేక ట్రిబ్యునల్‌గా ప్రకటించింది.
» సివిల్ కోర్టు న్యాయమూర్తే ఎన్నికల వివాదాలకు సంబంధించిన ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు.
» రెండు నెలల ముందస్తు నోటీసుతో గ్రామ పంచాయతీలపై కేసులను District Munsif Courtల్లో మాత్రమే దాఖలు చేయాలి.
» ఎన్నికల్లో పోటీ చేయడానికి, పదవుల్లో కొనసాగడానికి సంబంధించిన వివాదాలను ఆ గ్రామ పంచాయతీ ఏ జిల్లాలో ఉంటే, ఆ జిల్లాలో ఉండే జిల్లా కోర్టులోనే కేసును దాఖలు చేయాలి.
» ఒకసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికల ప్రక్రియ నిలిపివేసే అధికారం ఎవరికీ లేదు.


ఉప సర్పంచ్
» గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అదే రోజు లేదా మరొక రోజు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.
» ఉప సర్పంచ్ ఎన్నిక జరిపే సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన ద్వారా అధికారం పొందిన వ్యక్తి అధ్యక్షత వహిస్తారు.
» గ్రామ పంచాయతీకి ఎన్నికైన వార్డు సభ్యులు, సర్పంచ్ చేయి ఎత్తడం ద్వారా ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
» సర్పంచ్ లేని సమయంలో ఆయన బాధ్యతలను ఉపసర్పంచ్ నిర్వహిస్తారు.
» సాధారణంగా ఉపసర్పంచ్ పదవీకాలం 5 సంవత్సరాలు.
» ఏదైనా కారణాల వల్ల ఉపసర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోపు ఉప ఎన్నిక ద్వారా కొత్త ఉపసర్పంచ్‌ను ఎన్నుకోవాలి.
» ఉపసర్పంచ్ తన రాజీనామాను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి (MPDO) పంపాలి.
» MPDOకు పంపలేకపోతే డివిజనల్ పంచాయతీ అధికారికి (DPO) పంపాలి.
» 2009 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
» ఉపసర్పంచ్‌గా పదవి చేపట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
» అవిశ్వాస తీర్మానం 2/3వ వంతు సభ్యుల ఆమోదం పొందితే పంచాయతీరాజ్ కమిషనర్ ఉపసర్పంచ్‌ను పదవి నుంచి తొలగిస్తారు.
» ఉపసర్పంచ్‌ను తొలగించే అవిశ్వాస తీర్మానంలో సస్పెండ్ అయిన వార్డు సభ్యుడు కూడా పాల్గొని ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.


ఇతర ముఖ్యాంశాలు
» కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం కోసం IGNOU (Indira Gandhi National Open University)తో ఒప్పందం కుదుర్చుకుంది.
» పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, సమర్థంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తి కిరణ్ అభియాన్ పథకం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అమల్లోకి వచ్చింది.
» మనదేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థల పనివిధానంపై శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సంస్థ - NIRD (National Institute of Rural Development). ఇది హైదరాబాద్‌లో ఉంది.
» ఒడిశాలోని గంజాం జిల్లాలోని ధుంకపరా గ్రామ సర్పంచ్ ఆరతీదేవికి అమెరికాలో జరిగే International Visitors Leadership Programme సదస్సులో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2016 మార్చిలో ప్రజా ప్రతినిధులకు పెరిగిన వేతనాల వివరాలు

హోదా పెరిగిన జీతం (రూపాయల్లో) (నెలకు)
జిల్లా పరిషత్ ఛైర్మన్ 40,000
ZPTC సభ్యులు 6,000
మండల పరిషత్ అధ్యక్షులు 6,000
MPTC సభ్యులు 3,000
సర్పంచ్ 3,000
మేయర్ 25,000
డిప్యూటీ మేయర్ 15,000
మున్సిపల్ ఛైర్మన్ (Special Grade) 15,000
మున్సిపల్ ఛైర్మన్ (ఇతర గ్రేడ్) 12,000
కార్పొరేటర్ 6,000
కౌన్సిలర్ (Special Grade) 3,500
కౌన్సిలర్ (ఇతర గ్రేడ్) 3,000

» మనదేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డులను ప్రవేశపెట్టింది.
     A. ఉత్తమ గ్రామపంచాయతీ - 7 లక్షల రూపాయలు
     B. ఉత్తమ మాధ్యమిక వ్యవస్థ - 15 లక్షల రూపాయలు
     C. ఉత్తమ జిల్లాపరిషత్ - 25 లక్షల రూపాయలు
» ఈ పారితోషికాలను ఆ సంస్థల అభివృద్ధికి వినియోగించాలి.
గ్రామ పంచాయతీలను వాటి వార్షిక ఆదాయం ఆధారంగా కిందివిధంగా వర్గీకరణ చేయవచ్చు.
     1. గ్రేడ్ - 1 గ్రామపంచాయతీ - 4 లక్షల కంటే ఎక్కువ ఆదాయం
     2. గ్రేడ్ - 2 గ్రామ పంచాయతీ - 3 నుంచి 4 లక్షల మధ్య ఆదాయం
     3. గ్రేడ్ - 3 గ్రామపంచాయతీ - 2 నుంచి 3 లక్షల మధ్య ఆదాయం
     4. గ్రేడ్ - 4 గ్రామపంచాయతీ - 2 లక్షల కంటే తక్కువ ఆదాయం


గ్రామపంచాయతీ - సాధారణ ముద్ర
» గ్రామ పంచాయతీ సాధారణ ముద్ర రాష్ట్ర చిహ్నాన్ని పోలి ఉంటుంది.
» సాధారణ ముద్రలోని మాటలు తెలుగుభాషలో మాత్రమే ఉండాలి.
» సాధారణ ముద్రకు సర్పంచ్/పంచాయతీ కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యుడు అవుతాడు.
» సాధారణ ముద్రకు గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శి రక్షకులుగా వ్యవహరించాలి.
» సాధారణ ముద్ర తమవద్ద భద్రంగా ఉందని కార్యదర్శి/సర్పంచ్ ప్రతి సంవత్సరం డిసెంబరు 31 నాటికి ఒక ధ్రువపత్రాన్ని జిల్లా కలెక్టరుకు పంపాలి.
» ఈ ముద్రను చట్టపరంగా అవసరమైనచోట సర్పంచ్ లేదా కార్యదర్శి సమక్షంలోనే వేయాలి.
» 1994, ఆగస్టు 6న విడుదల చేసిన జీవో నెం.508 ప్రకారం పంచాయతీ తనిఖీ అధికారులు తమ పరిశీలనా సమయంలో అలాంటి ముద్ర సంబంధిత అధికారి రక్షణలో ఉన్నట్లు ధ్రువీకరించాలి.
» జీవో నంబరు - 434 ప్రకారం గ్రామపంచాయతీలు తయారుచేసుకునే బై - లా (ByLaw) కలెక్టర్ ఆమోదం పొందాలి.
» కలెక్టర్ ఆమోదం పొందిన నెల రోజుల తర్వాత పథకం అమల్లోకి వస్తుంది.
» వార్డు సభ్యుల రిజర్వేషన్లు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉంటాయి.
» వార్డు సభ్యులు స్టేజ్ - 2 అధికారి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.
» వార్డు సభ్యులు తమ రాజీనామాను MPDOకు సమర్పించాలి.
» 50 వేల రూపాయల ఆదాయం మించిన గ్రామపంచాయతీలు ప్రధాన విధులకు ఖర్చు చేయగా మిగిలిన నిధులను ఎస్సీ (15%), ఎస్టీ (3%) సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు.
» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994, సెక్షన్ - 28లో గ్రామ పంచాయతీ సభ్యుల బాధ్యతలు, విధులను తెలియజేస్తుంది.
» సెక్షన్ - 40 ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తారు.
» గ్రామ కమిటీలకు అధ్యక్షుడిగా సర్పంచ్ ఉంటారు. సర్పంచ్‌లేని సమయంలో ఉపసర్పంచ్ ఉంటారు.
» గ్రామ కమిటీల్లో కనీస సభ్యుల సంఖ్య - 7, గరిష్ఠ సభ్యుల సంఖ్య - 21.
» సర్పంచ్ మినహా మిగిలిన సభ్యులెవరూ ఒకటికంటే ఎక్కువ కార్యాచరణ కమిటీల్లో సభ్యులుగా ఉండరాదు.
» జూన్, 2003లో 5 కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేశారు.
     1. సహజ వనరుల నిర్వహణ కార్యాచరణ కమిటీ
     2. మానవ వనరుల అభివృద్ధి కార్యాచరణ కమిటీ
     3. ఉపాధికల్పన, స్వయం ఉపాధి సహాయ బృందాల కార్యాచరణ కమిటీ
     4. ఆర్థిక, ప్రణాళిక కార్యాచరణ కమిటీ
     5. పనులు, మౌలిక వసతుల కార్యాచరణ కమిటీ
» ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఇంటిపన్నును 2000 - 2001 పన్ను ప్రాతిపదికగా ప్రతి సంవత్సరం 5% పెంచాలి.
» లైసెన్స్ పొందని పందుల యజమానుల నుంచి పందికి ఒక రూపాయి, కుక్కల యజమానుల నుంచి కుక్కకు 5 రూపాయల చొప్పున గ్రామపంచాయతీ జరిమానా విధించవచ్చు.
» గ్రామపంచాయతీకి బాకీపడిన వ్యక్తులు నోటీసు అందిన 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలి.
» గ్రామ పంచాయతీలో జరిగే ఆస్తుల విక్రయాలపై విధించే స్టాంపు డ్యూటీపై విధించే సర్‌ఛార్జ్‌ను 3 : 1 : 1 నిష్పత్తిలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు ప్రతి 3 నెలలకొకసారి చొప్పున పంచుకుంటాయి.
» సెక్షన్ - 4(3) ప్రకారం గ్రామపంచాయతీ పరిపాలనా సౌలభ్యం కోసం కాంట్రాక్టులు కుదుర్చుకోగలదు.
» సెక్షన్ - 257 ప్రకారం గ్రామ ప్రజల ప్రయోజనాల కోసం గ్రామపంచాయతీ చట్ట పరిధిలో సదుద్దేశంతో తీసుకునే చర్యలకు చట్టపరమైన రక్షణ ఉంటుంది.
» గ్రామసభ నిర్వహణ నోటీసు నిమిత్తం ఒక బౌండు రిజిస్టరు, హాజరైన సభ్యుల సంతకాల కోసం మరొకటి, తీర్మానాలు రాసేందుకు ఇంకోటి ఇలా....మొత్తం 3 రిజిస్టర్లను కార్యదర్శి నిర్వహించాలి.


మండల పరిషత్
» బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల్లోని 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయి అంచెను పంచాయతీ సమితి అంటారు.
» 1959లో ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని ప్రవేశపెట్టారు.
» జనతా ప్రభుత్వం నియమించిన అశోక్‌మెహతా కమిటీ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.
» 2 అంచెల వ్యవస్థలో కీలకమైంది రెండో అంచె అయిన మండల పరిషత్.
» మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటక.
» కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 1985, అక్టోబరు 2న మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
» మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (1986)
» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్షా మండలాల చట్టం, 1986ను రూపొందించింది.
» ఈ చట్టం 1987, జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది.
» ఈ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 330 పంచాయతీ సమితులను రద్దుచేసి, వాటిస్థానంలో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేశారు.
» ఆంధ్రప్రదేశ్‌లో 'నూతన పంచాయతీరాజ్ చట్టం 1994', మే 30 నుంచి అమల్లోకి వచ్చింది.
» 1994, జూన్ 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఒక ఉత్తర్వు ప్రకారం మండల పరిషత్తులకు సంబంధించిన ఏదైనా ఒక అంశం మీద కొత్త చట్టం చేసేవరకు ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ చట్టం, 1986లోని నియమాలే అమల్లో ఉంటాయని పేర్కొంది.


మండల పరిషత్ - పాలన
» ప్రతి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని మండలాలుగా విభజిస్తారు.
» ప్రతి మండల పరిషత్ నుంచి 20 - 30 గ్రామపంచాయతీల్లో 35,000 - 50,000 వరకు జనాభా ఉంటుంది.
» ప్రతి మండలాన్ని జనాభాను బట్టి మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు (MPTC)గా విభజిస్తారు.
» ప్రతి MPTC పరిధిలో 3500 జనాభా ఉంటుంది.
» మండల పరిషత్‌లో కనీస MPTCల సంఖ్య - 7
» మండల పరిషత్‌లో గరిష్ఠ MPTCల సంఖ్య - 23
» MPTC సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
» మండల పరిషత్‌కు ఎన్నికైన MPTCలు తమలో నుంచి ఒకరిని MPPగా, మరొకరిని Vice MPP గా ఎన్నుకుంటారు.
» MPP, Vice MPPల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.
» మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో - ఆప్టెడ్ సభ్యుడిగా నామినేట్ చేస్తారు.


అర్హతలు
» ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి ఆ మండల పరిషత్‌లోని ఏ ప్రాదేశిక నియోజక వర్గం నుంచైనా పోటీ చేయవచ్చు.
» ఆ వ్యక్తికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదు.
» దివాళాకోరై ఉండరాదు.
» స్థానిక సంస్థలకు ఎలాంటి బకాయిపడి ఉండరాదు.
» మిగిలినవన్నీ శాసనసభ్యుల ఎన్నికకు ఉండాల్సిన అర్హతలే.


పదవీకాలం
» మండల పరిషత్ పదవీ కాలం - 5 సంవత్సరాలు.
» MPTC, Vice MPP, MPPల పదవీకాలం 5 సంవత్సరాలు.
» ఏదైనా కారణం వల్ల పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా ఉప ఎన్నికను నిర్వహించి భర్తీ చేయాలి.
రాజీనామా
» MPTC, Vice MPP, MPPలు తమ రాజీనామా పత్రాలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి అందజేయాలి.
రిజర్వేషన్లు
» మొత్తం మండల పరిషత్‌లోని MPTC స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా సీట్లు రిజర్వు చేయాలి. ఈవిధంగా రిజర్వ్ చేసిన సీట్లలో 50% సీట్లను ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలకు నిర్దేశించాలి.
» వెనుకబడిన వర్గాల వారికి 34% సీట్లు నిర్దేశించాలి.
» అన్నిరకాల రిజర్వేషన్లు కలిపి కనీసం 1/2వ వంతు సీట్లు మహిళలకు నిర్దేశించాలి.
» రాష్ట్రంలోని మండలాధ్యక్ష పదవులకు కూడా పైన పేర్కొన్న రిజర్వేషన్ విధానమే వర్తిస్తుంది.


మండల పరిషత్ నిర్మాణం
» మండల పరిషత్ పరిధిలోని MPTC సభ్యులు.
» మండల పరిషత్ పరిధిలోని ఎమ్మెల్యే.
» మండలంలోని ఓటర్ల జాబితాలోని ఎమ్మెల్సీ.
» మండల పరిషత్ పరిధిలోని లోక్‌సభ సభ్యుడు.
» మండలంలోని ఓటర్ల జాబితాలో పేరు నమోదైన రాజ్యసభ సభ్యుడు.
» మైనార్టీ వర్గం నుంచి నామినేట్ అయిన కో - ఆప్ట్‌డ్‌ సభ్యుడు.


మండల పరిషత్‌లో శాశ్వత ఆహ్వానితులు
1. జిల్లా కలెక్టరు.
2. మండల పరిషత్ పరిధిలోని గ్రామ సర్పంచ్‌లు.
3. మండల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్.
4. మండల పరిషత్ నుంచి ఎన్నికైన ZPTC సభ్యుడు.
5. జిల్లా పరిషత్ ఛైర్మన్.


మండల పరిషత్ అధికారాలు - విధులు
» గ్రామ పంచాయతీ సాధారణ విధులపై పర్యవేక్షణ.
» మెరుగైన వ్యవసాయోత్పత్తుల సాధన కోసం కృషి.
» పాడిపరిశ్రమ, మత్స్య సంపదను పెంపొందించడం.
» పంచాయతీలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో సమాజ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ.
» వైద్య, ఆరోగ్య సేవలను పెంపొందించడం.
» మండల పరిషత్ పరిధిలో రవాణా సదుపాయాలను మెరుగుపరచడం.
» స్వయం సహాయక పథకాలను అమలుపరచడం.
» మహిళా, శిశు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేయడం.
» రైతు కేంద్రాలు, గ్రంథాలయాలు, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడం.
» సహకార పరపతి సొసైటీలు, వ్యవసాయ సొసైటీలను ఏర్పాటు చేయడం.
» ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవంతంగా అమలుచేయడం.
» అగ్ని ప్రమాదాలు, అంటువ్యాధులు, వరదలు లాంటివి సంభవించినప్పుడు సహాయక కార్యక్రమాలను నిర్వహించడం.
» ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి కృషి చేయడం.
» రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సేకరించడం.
» గ్రామీణ, కుటీర, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం.

 

మండల పరిషత్ అధ్యక్షులు - అధికారాలు, విధులు
» మండల పరిషత్ అధ్యక్షుడు మండల పరిషత్‌ల రాజకీయ అధిపతిగా వ్యవహరిస్తారు.
» మండల విద్యా కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
» మండల పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
» మండల పరిషత్ తీర్మానాల అమల్లో మండల అభివృద్ధి అధికారిపై నియంత్రణ కలిగి ఉంటారు.
» ప్రజా సంక్షేమంకోసం చేపట్టాల్సిన పనులను MPDOతో చర్చించి, పనులను చేపట్టాల్సిందిగా ఆదేశించవచ్చు.
» మండల పరిషత్ అధ్యక్షులు సమావేశాలకు హాజరుకాకపోతే ఉపాధ్యక్షులు ఆ బాధ్యతలను నిర్వహిస్తారు.
» మండలాధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.


మండల పరిషత్ - అభివృద్ధి అధికారి
» ఇతడు మండల పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.
» రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పరిపాలనాధిపతి.
» మండల పరిషత్ తీర్మానాలను అమలు చేస్తారు.
» మండలంలోని గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణాధికారాలు కలిగి ఉంటారు.
» రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తారు.
» మండలాధ్యక్షుడిని సంప్రదించి, మండల పరిషత్, మండల మహాసభ సమావేశాలను ఏర్పాటు చేస్తారు.
» మండల పరిషత్‌లోని ఉద్యోగులపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు కలిగి ఉంటారు.
» మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొంటారు.
» నెలకొకసారి మండల పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
» మండల పరిషత్ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజల్లోపు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే MPDOపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.


మండల పరిషత్ - ఆర్థిక వనరులు
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరుచేసే గ్రాంట్లు
» గ్రామ పంచాయతీలు, ప్రజల నుంచి లభించే విరాళాలు
» మండల పరిషత్ విధించే సెస్సు
» సాముదాయక అభివృద్ధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు
» ఖాదీ బోర్డు, గ్రామీణ కుటీర పరిశ్రమల బోర్డులు మంజూరుచేసే నిధులు
» జిల్లా పరిషత్ ఆదాయం నుంచి మండల పరిషత్‌కు లభించే వాటా
» మండల పరిషత్‌లోని జన సంఖ్యను బట్టి ఒక్కో వ్యక్తికి రూ.5 చొప్పున వార్షిక గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి విడుదల చేస్తుంది
» మండల పరిషత్ స్వీకరించే సొమ్మును మండల పరిషత్ నిధి అనే ఖాతాలో జమ చేస్తారు.


2014 నాటి మండల పరిషత్ ఎన్నికలు
» మండల పరిషత్ ఎన్నికలు పార్టీ చిహ్నాల ప్రాతిపదికన జరుగుతాయి.
» 1096 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఉన్నాయి.
» 16,589 MPTC స్థానాలు ఉన్నాయి.
» మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.
» MPTC స్థానాలకు రిజర్వేషన్ల కోసం మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.
» 1096 మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 49 స్థానాలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. PESA చట్టం ప్రకారం 49 అధ్యక్ష స్థానాలను పూర్తిగా ఎస్టీలకు కేటాయించారు.
» MPTC సభ్యుల బ్యాలెట్ పేపర్ - ఊదారంగులో ఉంటుంది.


మండల పరిషత్‌లకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పేర్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - మండల పరిషత్
మధ్యప్రదేశ్ - జనపథ్ పంచాయతీ
అరుణాచల్‌ప్రదేశ్ - అంచల్ కమిటీ
జమ్మూకశ్మీర్ - బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్
ఉత్తర్‌ప్రదేశ్ - క్షేత్ర పంచాయతీ
బిహార్, పశ్చిమ్ బంగా, పంజాబ్, హరియాణ - పంచాయతీ సమితి


జిల్లా పరిషత్
» మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలోని అత్యున్నత అంచె జిల్లా పరిషత్.
» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994, ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేసింది.
» ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం జిల్లా పరిషత్‌ల సంఖ్య 537.
» ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా పరిషత్‌ల సంఖ్య 13
» తెలంగాణలోని జిల్లా పరిషత్‌ల సంఖ్య 9
» హైదరాబాద్‌కు జిల్లా పరిషత్ లేదు
» ప్రతి జిల్లా పరిషత్ అధికార ముద్రను (SEAL), ఆస్తులను కలిగి ఉంటుంది.
» వ్యక్తులు, సంస్థలపైన కేసు వేసే అధికారాన్ని జిల్లా పరిషత్ కలిగి ఉంటుంది.


జిల్లా పరిషత్ - నిర్మాణం
» జిల్లాలోని ప్రతి మండలాన్ని ఒక జిల్లా ప్రాదేశిక నియోజకవర్గంగా (ZPTC) పరిగణిస్తారు.
» జిల్లా పరిషత్ జిల్లాలోని ZPTCలతో ఏర్పడుతుంది.
» ZPTC స్థానాలకు ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన జరుగుతాయి.
» ZPTC స్థానాలకు రిజర్వేషన్లను రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్ణయిస్తారు.
» ZPTC సభ్యుల ఎన్నికల బ్యాలెట్ పత్రం - తెలుపు రంగులో ఉంటుంది.


జిల్లా పరిషత్‌లోని వివిధ రకాల సభ్యులు
» ఎక్స్ అఫీషియో సభ్యులు
» జిల్లాలోని విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు)
» జిల్లాలో ఓటరుగా నమోదైన ఎమ్మెల్సీలు
» జిల్లాలోని లోక్‌సభ సభ్యులు
» జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు
» పై సభ్యులందరూ జిల్లా పరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. కానీ, వీరికి ఓటు హక్కు ఉండదు.


జిల్లా పరిషత్ - ఎన్నికలు
» ఒక జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల నుంచి ఒక్కో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడి (ZPTC)ని ప్రజలు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
» ఎన్నికైన ZPTC సభ్యులు తమలో నుంచి ఒకరిని జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకుంటారు.
» జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.
» జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సమయంలో రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీచేస్తూ, ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తాయి.
» ఎవరైనా సభ్యుడు పార్టీ ఆదేశాలను ధిక్కరించినట్లయితే అతడి సభ్యత్వం రద్దు అవుతుంది.


జిల్లా పరిషత్ - రిజర్వేషన్లు
» ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా సీట్లను రిజర్వు చేస్తారు.
» ఈవిధంగా రిజర్వ్ చేసిన స్థానాల్లో 1/2వ వంతు మహిళలకు కేటాయిస్తారు.
» బీసీ వర్గాల వారికి 34% సీట్లు రిజర్వు చేస్తారు.
» ఈవిధంగా రిజర్వు చేసిన సీట్లలో 1/2వ వంతు సీట్లను బీసీ మహిళలకు కేటాయిస్తారు.
» అన్నిరకాల రిజర్వేషన్లు కలిపి మహిళలకు 1/2వ వంతు నిర్ణయిస్తారు.
» ZPTC స్థానాలకు రిజర్వేషన్లు జిల్లాను యూనిట్‌గా తీసుకోగా, Z.P. ఛైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లను నిర్ణయించినప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.


పదవీ కాలం
» జిల్లా పరిషత్ సభ్యులు, ఛైర్మన్, వైస్-ఛైర్మన్‌ల పదవీకాలం అయిదు సంవత్సరాలు.
» 21 సంవత్సరాల వయసు నిండినవారు పోటీ చేయవచ్చు.
అనర్హతలు
» గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ల సభ్యులకు వర్తించేవే.
కోఆప్టెడ్ సభ్యులు
» జిల్లా పరిషత్‌కు మైనార్టీ వర్గం నుంచి ఇద్దరు (2) సభ్యులను కోఆప్ట్ చేసుకుంటారు. ఈ సభ్యులు సంబంధిత జిల్లాలో ఓటర్లుగా నమోదు కావడంతోపాటు 21 ఏళ్లు నిండి ఉండాలి. వీరికి జిల్లా పరిషత్ సభ్యులతో సమానంగా ఓటు హక్కు ఉంటుంది.


ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల తొలగింపు విధానం
» జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ - ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం కింది కారణాలతో పదవుల నుంచి తొలగించగలదు.
» అధికార దుర్వినియోగానికి పాల్పడటం.
» ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.
» పంచాయతీరాజ్ చట్టం ద్వారా లభించిన అధికారాలను నిర్వర్తించడంలో పలుసార్లు విఫలమవడం.
» అధికార విధులను స్వార్ధానికి వినియోగించడం.


అవిశ్వాస తీర్మానం
» 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం
» మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు
» జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ - ఛైర్మన్‌లపై వారి పదవీ కాలంలో ఒకసారి మాత్రమే వారిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
» అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే పదవిలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి.
» MPTCలు MPP, Vice MPPని, ZPTCలు జడ్పీ ఛైర్మన్, వైస్ - ఛైర్మన్‌లను సాధారణ మెజార్టీ ద్వారా తొలగించగలరు.


జిల్లా పరిషత్‌కు శాశ్వత ఆహ్వానితులు
» జిల్లా కలెక్టరు
» జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు
» జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్
» జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్
» జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్


స్థాయీ సంఘాలు
» ప్రతి జిల్లాపరిషత్‌లో 7 స్థాయీసంఘాలు ఉంటాయి. అవి:
    1. ప్రణాళిక, ఆర్థిక స్థాయీ సంఘం
    2. వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘం
    3. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం
    4. విద్య, వైద్య స్థాయీ సంఘం
    5. సాంఘిక, సంక్షేమ స్థాయీ సంఘం
    6. స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం
    7. అభివృద్ధి పనుల స్థాయీ సంఘం
» స్థాయీ సంఘాల సమావేశాలు 2 నెలల కొకసారి చొప్పున తప్పనిసరిగా జరగాలి.
» స్థాయీ సంఘాల సమావేశాలకు కోరం - 1/3వ వంతు.
» జిల్లా పరిషత్ ఛైర్మన్ అన్ని స్థాయీ సంఘాల్లో పదవీ రీత్యా సభ్యుడిగా ఉంటారు.
» స్థాయీ సంఘాల సభ్యులను ZPTCలు ఎన్నుకుంటారు.
» వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘానికి అధ్యక్షుడిగా జడ్పీ వైస్ ఛైర్మన్ వ్యవహరిస్తారు.
» ఏవైనా రెండు స్థాయీ సంఘాలకు అధ్యక్షులుగా మహిళా ZPTCలను జడ్పీ ఛైర్మన్ నామినేట్ చేస్తారు.
» మిగిలిన 4 స్థాయీ సంఘాలకు అధ్యక్షుడిగా జడ్పీ ఛైర్మన్ వ్యవహరిస్తారు.


జిల్లా పరిషత్ అధికారాలు - విధులు
» జిల్లా పరిషత్ పరిధిలోని బడ్జెట్‌లను రూపొందించి, ఆమోదించడం.
» మండల పరిషత్‌ల పనితీరును పర్యవేక్షించడం.
» కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడం.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేయడం.
» కొన్ని మండల పరిషత్‌ల విజ్ఞప్తిపై ఉమ్మడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం.
» గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌ల మధ్య వనరుల పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలను ఇవ్వడం.
» మండలాల ప్రణాళికా కార్యక్రమాలను సమన్వయపరచి క్రమబద్ధీకరించడం.
» జిల్లాకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిచడం.
» ప్రాథమికోన్నత, వృత్తి, విద్య, పారిశ్రామిక విద్యాలయాలను నిర్వహించడం.
» స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించిన గణాంక సమాచారాన్ని ప్రచురించడం.
» వివిధ ట్రస్టుల కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడం.
» రుణాలను మంజూరు చేయడం.
» రాష్ట్ర ప్రభుత్వ అనుమతిలో మండల పరిషత్ నిధులపై లెవీని విధించడం.


జడ్పీ ఛైర్మన్ అధికారాలు - విధులు
» జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
» జిల్లా పరిషత్ తీర్మానాల అమలు విషయంలో సీఈవోపై పాలనా పరమైన నియంత్రణను కలిగి ఉంటారు.
» జిల్లా పరిషత్ రికార్డులను తనిఖీచేసే అధికారాలను కలిగి ఉంటారు.
» ఛైర్మన్ ప్రతి 90 రోజులకు కనీసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
» 90 రోజుల తర్వాత నుంచి 30 రోజుల లోపు కూడా జిల్లా పరిషత్ సమావేశం ఏర్పాటు చేయలేకపోతే ఛైర్మన్ తన పదవిని కోల్పోతారు.
» ఈ విధంగా పదవిని కోల్పోయిన వ్యక్తి ఒక సంవత్సరం వరకు ఎన్నికల్లో పోటిచేయడానికి అనర్హుడవుతాడు.


ముఖ్య కార్యనిర్వహణాధికారి (Chief Executive Officer -CEO)
» రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)ని నియమిస్తుంది.
CEO అధికారాలు - విధులు
» జిల్లా పరిషత్ ఛైర్మన్‌ను సంప్రదించి జిల్లా పరిషత్ సమావేశాలను ఏర్పాటు చేస్తారు.
» జిల్లా పరిషత్, స్టాండింగ్ కమిటీ మండల పరిషత్ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొంటారు.
» ఈ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టే హక్కు లేదా ఓటువేసే హక్కు లేదు.
» జిల్లా పరిషత్, ఇతర అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పాలనా పరమైన నియంత్రణను కలిగి ఉంటారు.
» జిల్లా పరిషత్, స్టాండింగ్ కమిటీ తీర్మానాలను అమలు చేస్తారు.
» జిల్లా పరిషత్‌కు చెందిన అభివృద్ధి పథకాలను అమలు చేస్తారు.
» జిల్లా పరిషత్ తరఫున ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
» జిల్లా పరిషత్ ఆదేశాలను అమలు చేస్తారు.
» రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా పరిషత్‌కు తెలియజేస్తారు.


జిల్లాపరిషత్ - ఆదాయ వనరులు
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదలచేసే నిధులు.
» జిల్లా పరిషత్ విధించే పన్నులు లేదా ఫీజులు.
» గ్రామీణ, కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం అఖిలభారత సంస్థలు విడుదల చేసే గ్రాంట్లు.
» రాష్ట్ర ప్రభుత్వ పన్నుల నుంచి జిల్లా పరిషత్‌కు లభించే వాటా
» మండల పరిషత్‌లు, ప్రజల ద్వారా వచ్చే విరాళాలు
» జిల్లా పరిషత్ నిర్వహించే దేవదాయ, ధర్మదాయ సంస్థల ద్వారా లభించే ఆదాయం.
» రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్‌లపై జిల్లా పరిషత్ విధించి వసూలు చేసే లెవీ ద్వారా లభించే ఆదాయం.
» జిల్లాలోని ఒక్కో పౌరుడికి రూ.2 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులను జిల్లా పరిషత్‌కు విడుదల చేస్తుంది.
» 24-04-2016న కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం. వెంకయ్య నాయుడు వెల్లడించిన వివరాలు:


   తాజా నివేదిక ప్రకారం దేశంలోని ప్రజాభాగస్వామ్యం పరిపాలనలో కింది విధంగా ఉంది.
» మొత్తం గ్రామ పంచాయతీ సభ్యులు - 27,75,858 మంది.
» మధ్యస్థ వ్యవస్థలైన సమితి/ మండలాల సభ్యులు - 1,44,491 మంది.
» జిల్లా పరిషత్ సభ్యులు - 15,067 మంది.
» ప్రపంచంలో ఇంతటి విస్తృత భాగస్వామ్యం ఏ దేశంలోనూ లేదు.
» దేశంలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు - 2,48,255.
» దేశంలో ప్రస్తుతం ఉన్న మధ్యస్థ సమితి/ మండల పరిషత్‌లు - 6,618.
» దేశంలో ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్‌లు - 618.
» ఈ వ్యవస్థలన్నీ దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో పరిపుష్టమై వర్ధిలుతున్న ప్రజాస్వామిక వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.
» ఈ సంస్థలకు ఎన్నికైన 29.17 లక్షల ప్రజాప్రతినిధుల్లో సుమారు 13.54 లక్షల మంది మహిళలే. అంటే పాలనలో మహిళ భాగస్వామ్యం 45.15 శాతంగా ఉంది.
» మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.


పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆర్థిక పరిపుష్టి
» గ్రామపంచాయతీలకు 2015 -2020 మధ్య కాలంలో నేరుగా రూ.2,00,292.20 కోట్ల మేరకు గ్రాంట్లు ఇవ్వాలంటూ 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను నరేంద్ర మోదీ ప్రభుత్వం యథాతదంగా ఆమోదించింది.
» గ్రామపంచాయతీ స్థాయిలో వచ్చే 5 సంవత్సరాల్లో తలసరి నిధుల లభ్యత రూ.2,404గా ఉంటుంది.
» ఒక్కోగ్రామ పంచాయతీకి సగటున ఏటా రూ.17 లక్షలు (అయిదేళ్లలో రూ.85 లక్షలు) అందజేస్తారు.
» ఈ నిధులతో పంచాయతీల్లో పారిశుద్ద్యం, తాగునీరు, సామాజిక ఆస్తుల నిర్వహణ లాంటి మౌలిక వసతుల కోసం ఉపయోగించుకోవాలి.
» కేంద్రనికర పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 14వ ఆర్థిక సంఘం ఇప్పటి 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో అధికంగా అందుబాటులోకి వచ్చే నిధులను ఉపయోగించుకోవడం రాష్ట్రప్రభుత్వాల బాధ్యత అయ్యింది.
» అట్టడుగు స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణం రంగంలోకి దిగేలా సుమారు 10 లక్షల మంది ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులను కేంద్రప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వీరు వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాల రూపకల్పనలో గ్రామపంచాయతీలకు ఉపయోగపడేలా శిక్షణ పొందుతున్నారు.
» 300 సమూహాలను రూర్బన్ క్లస్టర్లు (Rurban Clusters)గా అభివృద్ధి పరచనున్నారు.
» ఒక్కో రూర్బన్ క్లస్టర్‌లో 30 గ్రామాలు, 50,000 జనాభా ఉంటుంది.


రాష్ట్రాల పనితీరు
» పంచాయతీరాజ్‌కు అధికారాల బదిలీ ఏవిధంగా ఉందన్న దానిపై పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ
2014 - 2015లో ఒక అధ్యయనం నిర్వహించి, సూచీని రూపొందించింది.
» నిధులు, విధులు, కార్యనిర్వాహకులను ప్రాతిపదికగా తీసుకుని సూచీని రూపొందించారు.
» ఈ సూచీ ఆధారంగా నిధులను మినహాయిస్తే ఈ అంశాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంటుంది.
» పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల బదలాయింపు విషయంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది.
» విధుల బదలాయింపులో సిక్కిం బ్రహ్మాండం అనిపించుకున్నా మిగిలిన విభాగాల్లో వెనుకబడి ఉంది.
» గ్రామస్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు.
» గాంధీజీ భావనకు అనుగుణంగా రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ - 40లో గ్రామ పంచాయతీల ఏర్పాటును నిర్దేశించారు.
» ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన కార్యక్రమం గ్రామ ఉదయ్ సే భారత్ ఉదయ్ అనే గ్రామ స్వరాజ్య లక్ష్యాన్ని సాధించడానికి ప్రారంభించారు.


జిల్లాపాలనలో కలెక్టరు పాత్ర
» మన దేశంలో 1772, మే 11న వారన్ హేస్టింగ్స్ జిల్లా కలెక్టరు పదవిని ఏర్పరిచారు.
» ఫ్రాన్స్‌లో ఉండే Prefect అనే అధికారితో భారత్‌లో ఉండే జిల్లా కలెక్టరు పదవిని పోల్చవచ్చు.
» విలియం బెంటింక్ గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో మెజిస్ట్రేట్ కార్యనిర్వాహక విధులను జిల్లా న్యాయాధిపతి నుంచి వేరుచేసి, ఆ అధికారాలను జిల్లాకలెక్టరుకు బదలాయించి, జిల్లా కలెక్టరు హోదాను జిల్లామెజిస్ట్రేట్, కలెక్టరుగా మార్చడమే కాకుండా అతడికి సహాయంగా డిప్యూటీ కలెక్టరు అనే పదవిని ఏర్పాటు చేశారు.
» ప్రస్తుతం ప్రభుత్వం 6 సంవత్సరాల కనీస పాలనానుభవం ఉన్న IAS అధికారులను కలెక్టరుగా నియమించడంతోపాటు రాష్ట్రసివిల్ సర్వీస్‌కు చెందిన సీనియర్ అధికారులను కూడా IAS స్థాయి పదోన్నతిని కల్పించి వారిని కూడా జిల్లా కలెక్టర్లుగా నియమిస్తోంది.
» రాష్ట్రాల్లో జిల్లాను పరిపాలనా యూనిట్‌గా తీసుకుంటారు.
» జిల్లా పాలనాధిపతి జిల్లా కలెక్టరు.
» జిల్లాలో భూమిశిస్తు వసూలు చేసే బాధ్యత కలెక్టరుకు ఉంటుంది.
» రాజ్యాంగంలోని ఆర్టికల్ - 50 ప్రకారం కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయవిధులను వేరు చేశారు. దీని ఫలితంగా నేడు జిల్లాస్థాయిలో న్యాయవిధుల కోసం న్యాయమూర్తులను నియామకం చేస్తున్నారు.


జిల్లాకలెక్టరు - అధికారాలు - విధులు
     1. రెవెన్యూ అధికారాలు.
     2. కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ అధికారాలు.
     3. జిల్లాస్థాయిలో ముఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం.
     4. జిల్లాలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం.
     5. స్థానిక సంస్థలపై పర్యవేక్షణా అధికారాలు.
     6. జిల్లా అభివృద్ధి అధికారిగా వ్యవహరించడం.
     7. జిల్లాస్థాయిలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా వ్యవహరించడం.
     8. జిల్లా పాలనా యంత్రాంగాన్ని సమన్వయ పరచడం.
» కలెక్టరు సామర్థ్యంపైన జిల్లా ప్రగతి ఆధారపడుతుంది.

                                     

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బల్వంత్‌రాయ్ మెహతా, ఇతర కమిటీలు

బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ
* జాతీయాభివృద్ధి మండలి 1957, జనవరి, 16న బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1952, అక్టోబరు 2న ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి కారక్రమం (CDP - Community Development Programme), 1953, అక్టోబరు, 2న ప్రవేశపెట్టిన జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (NESS - National Extension Service Scheme) పథకాలు ఎంతవరకు విజయవంతమయ్యాయో సమీక్షిస్తుంది. అంతేకాకుండా గ్రామ పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమయ్యే సంస్థాగత ఏర్పాటును సూచిస్తుంది.
* బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేస్తూ, తన నివేదికను 1957, నవంబరు 24న జాతీయాభివృద్ధి మండలికి సమర్పించింది.
* కమిటీ నివేదికను జాతీయాభివృద్ధి మండలి 1958, జనవరిలో ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల అమలు కోసం వివిధ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు ప్రయత్నించాయి.
* మనదేశంలో 1959, అక్టోబరు 2న మూడు అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం - రాజస్థాన్.
* రాజస్థాన్‌లోని, నాగోర్ జిల్లాలోని, సికార్ అనే ప్రాంతంలో ఈ విధానాన్ని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభిస్తూ, కింది విధంగా పేర్కొన్నారు.
* ''నేడు ప్రారంభమవుతున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి".
* మూడు అంచెల విధానాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్. 1959, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జల్లాలోని శంషాబాద్ వద్ద నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ ప్రారంభించారు.

ముఖ్యమైన సిఫార్సులు
* దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ విధానం ఏర్పాటు చేయాలి.
     1) జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్
     2) బ్లాకు స్థాయిలో - పంచాయతీ సమితి
     3) గ్రామ స్థాయిలో - గ్రామ పంచాయతీ

* ప్రభుత్వ అభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయాలంటే అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి.
* ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పాలి.
* గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహంచాలి.
* ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన కాకుండా, స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలి.
* స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు జరపాలి.
* స్థానిక సంస్థలకు తగిన అధికారాలను, ఆర్థిక వనరులను సమకూర్చాలి.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లా పరిషత్‌కు సలహా పర్యవేక్షణ అధికారాలను కల్పించాలి.
* భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.
* స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టరు కీలకపాత్ర పోషించాలి.
* కింది స్థాయిలో మినహాయించి, మాధ్యమిక, ఉన్నత స్థాయుల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి.

వికేంద్రీకరణ

అశోక్ మెహతా కమిటీ

     కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 1977లో అధికారం కోల్పోయింది. కొత్తగా మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా ప్రభుత్వం పాలనా అధికారాలు చేపట్టింది. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా 1977, డిసెంబరులో 18 మంది సభ్యులతో అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 132 సిఫార్సులతో ఉన్న తన నివేదికను 1978, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

 

ముఖ్యమైన సిఫార్సులు
* పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానానికి బదులుగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలి.
అవి: 1) కింది స్థాయిలో - మండల పరిషత్
    2) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్
పైన పేర్కొన్న రెండు అంచెల్లో అతి ప్రధానమైంది - మండల పరిషత్
* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పంచాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి.
* పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ మంత్రిని నియమించాలి.
* ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
* పంచాయతీరాజ్ సంస్థలోని అన్ని పదవులకు కాల వ్యవధిని 4 సంవత్సరాలుగా నిర్ణయించాలి.
* పంచయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి.
* 15000 - 20,000 జనాభా ఉండే గ్రామాలను ఒక మండలంగా ఏర్పాటు చేయాలి.
* సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేసే విధానంపై సామాజిక తనిఖీ జరగాలి.
* స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రాతిపదికపై కాకుండా పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు జరపాలి.
* పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాలి.
* జిల్లా పరిషత్ అధ్యక్షుడు పరోక్షంగా ఎన్నిక కావాలి. పంచాయతీ సమితి/ మండల పరిషత్ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా/పరోక్షంగా ఎన్నుకోవచ్చు.
* స్థానిక సంస్థలకు తగిన అధికారాలను బదిలీ చేయాలి.
* అశోక్ మెహతా కమిటీ సిఫార్సులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి, కొన్ని మార్పులతో ఆమోదించారు.
* అశోక్ మెహతా కమిటీ సూచించిన మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం - కర్ణాటక
* 1985, అక్టోబరు 2న రామకృష్ణ హెగ్డే కర్ణాటకలో మండల పరిషత్‌ను ప్రవేశపెట్టారు.
* మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్. 1986, జనవరి 13న ఎన్.టి. రామారావు ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే రెవెన్యూ మండలాలను మాత్రం 1985లోనే ఆయన ప్రవేశపెట్టారు.
* బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని పేర్కొంటారు.
* అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని పేర్కొంటారు.

దంత్‌వాలా కమిటీ (1978)

* బ్లాకు స్థాయీ ప్రణాళికీకరణపై అధ్యయనం చేయడానికి దంత్‌వాలా కమిటీని ఏర్పాటు చేశారు.

ముఖ్యమైన - సిఫార్సులు
* బ్లాకుస్థాయి (మధ్యస్థ వ్యవస్థ)కి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి.
* గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి.
* బ్లాకును ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికలు రూపొందించాలి.
* జిల్లా ప్రణాళికలో కలెక్టరు కీలక పాత్రను పోషించాలి.

సి.హెచ్. హనుమంతరావు కమిటీ (1984)

* జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.
* జిల్లా పరిషత్ అభివృద్ధిలో కలెక్టరు కీలకపాత్రను పోషించాలి.
* బ్లాకు అభివృద్ధి అధికారి పోస్ట్‌ను రద్దుచేయాలి.

జి.వి.కె. రావు కమిటీ

* గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనా పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి జి.వి.కె. రావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం 1985లో ఒక కమిటీని నియమించింది.
* భారత్‌లో పరిపాలనాస్ఫూర్తి క్రమంగా బలహీనపడి ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీన పరుస్తుందని, దీని ఫలితంగా ప్రజాస్వామ్యం వేర్లులేని వ్యవస్థగా మారిందని విమర్శించింది.

ముఖ్యమైన సిఫార్సులు
* జిల్లా పరిషత్‌లను పటిష్టపరచాలి.
* బ్లాకు వ్యవస్థను రద్దు చేయాలి.
* జిల్లా పరిషత్‌కు కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించాలి.
* క్రమం తప్పకుండా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలి.
* జిల్లాస్థాయీ యూనిట్‌లకు ప్రణాళికా విధులను బదలాయించాలి.
* జిల్లా అభివృద్ధి అధికారి పేరుతో ఒక పదవిని ఏర్పాటు చేసి, అతడికి జిల్లా పరిషత్‌కు సంబంధించిన అతిముఖ్య కార్యనిర్వాహక బాధ్యతలను అప్పగించాలి.
* కలెక్టర్‌కు పనిభారం ఎక్కువైతే CEO (Chief Executive Officer), DDO (District Development Officer)ను అదనంగా నియమించాలి.

ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ (1986)

* ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అనే అంశంపై అధ్యయనానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్.ఎం. సింఘ్వి కమిటీని నియమించింది

ముఖ్యమైన సిఫార్సులు
* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ బద్ధతను కల్పించాలి.
* స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి.
* గ్రామీణ న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
* గ్రామీణ పాలనలో గ్రామసభల ప్రాధాన్యాన్ని పెంపొందించాలి.
* స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయాలి.
* రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
* రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలి.

రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్ - సిఫార్సులు (1988)

* పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ట్రాలకు అప్పగించాలి.
* దేశమంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలి
* స్థానిక సంస్థలను ఆర్థికంగా, విధుల పరంగా పటిష్టపరచాలి.
* స్థానిక సంస్థలను రద్దుచేయడానకి సంబంధించి, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయాలి.

పి.కె. తుంగన్ కమిటీ (1988)

* 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పి.కె. తుంగన్ నాయకత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ముఖ్యమైన - సిఫార్సులు
* స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధతను కల్పించాలి.
* జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సామాజిక వికాస పథకాలు

 భారతదేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, వాటి ప్రగతిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని జాతిపిత మహాత్మా గాంధీ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి దృష్ట్యా రాజ్యాంగంలో దీనికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఆర్టికల్‌ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచిస్తుంది.
 

సామాజిక వికాస పథకాల ఆవశ్యకత
* 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశం ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
* భారత ప్రభుత్వం ‘గ్రో మోర్‌ ఫుడ్‌’ అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సంకల్పించింది.
* మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామీణాభివృద్ధికి అవసరమైన సిఫారసులను సూచించాలని వి.టి. కృష్ణమాచారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటుచేశారు. 
* వి.టి. కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకు దేశంలో ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 సమితుల్లో (బ్లాక్స్‌) 1952, అక్టోబరు 2న ‘సమాజ అభివృద్ధి కార్యక్రమం’ (CDP - Community Development Programme)ను ప్రారంభించారు.

సమాజ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) 
భారతదేశ అభివృద్ధికి నమూనాగా అమెరికాలో అమల్లో ఉన్న బ్లాక్‌ వ్యవస్థను తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాకు చెందిన ‘ఫోర్డ్‌ ఫౌండేషన్‌’ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు.
* సమాజ అభివృద్ధి కార్యక్రమం అమలుకు అప్పటి అమెరికా రాయబారి చెస్టర్‌ బౌల్స్‌ ద్వారా ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అయిదు మిలియన్‌ డాలర్ల ఆర్థిక తోడ్పాటును అందించింది. ఈ ఫౌండేషన్‌ నుంచి సీడీపీ 1971 నాటికి సుమారు 104 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని పొందింది.

లక్ష్యాలు:
* సమాజ వనరుల ఆధారంగా వివిధ ప్రణాళికల రూపకల్పన.
* దేశ సమగ్రాభివృద్ధిలో గ్రామీణ ప్రజలందరినీ భాగస్వాములను చేయడం.
* ప్రజలే సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం.
* వ్యక్తి సంక్షేమాన్ని సాధించడం ద్వారా సమాజ సంక్షేమానికి కృషి చేయడం. 
* ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన సహాయాన్ని అందించడం.

ముఖ్యాంశాలు:
* సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని మొదటిసారిగా ఎంపికచేసిన 50 జిల్లాలోని 55 బ్లాకుల్లో ప్రారంభించారు. తర్వాతి కాలంలో సీడీపీ 5011 బ్లాకులకు విస్తరించింది. ప్రతి బ్లాకులో 100 గ్రామాలు, సుమారు 70,000 జనాభా ఉంటుంది. 
* ప్రతి బ్లాకుకు బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (బీడీవో) కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. బ్లాకును ఒక యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తారు.

సీడీపీ ద్వారా సమగ్రాభివృద్ధికి ఎంపిక చేసిన అంశాలు

* వ్యవసాయం, కుటీర పరిశ్రమలు
* ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం
* ఆర్థిక ప్రగతి, గృహవసతి
* సామాజిక సేవ, సాంఘిక సంక్షేమం
* గ్రామీణ సమాచార వ్యవస్థ
* పేదరిక, నిరుద్యోగ నిర్మూలన
* గ్రామీణ ప్రాంతాల ప్రజలు స్వయం స్వావలంబన, సాముదాయక దృక్పథం, పరస్పర సహకారం అలవరచుకోవడానికి ఈ పథకం ద్వారా సాంకేతిక, ఆర్థిక సహకారం లభించింది. దీనికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది.
* సీడీపీని ప్రచారం చేయడానికి గ్రామ స్థాయిలో ‘గ్రామసేవక్‌’ అనే అధికారిని నియమించారు.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service Scheme - NESS)
* సీడీపీకి కొనసాగింపుగా దేశంలోని 1700 బ్లాకుల్లో జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని 1953, అక్టోబరు 2న ప్రారంభించారు.
* సీడీపీని ముందుగా మూడేళ్ల కాలపరిమితికి, ఎన్‌ఈఎస్‌ఎస్‌ను శాశ్వత ప్రాతిపదికపై రూపొందించారు.
* ఈ పథకం ద్వారా వ్యవసాయం, విద్య, గ్రామీణ పరిశ్రమలను సమగ్రాభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 
* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం లాంటిదని ఎస్‌.కె.డే పేర్కొన్నారు. ఈయన సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌లకు ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారు.
* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం భారత్‌లో ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిదని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌లపై వి.టి. కృష్ణమాచారి తెలిపిన వివరాలు
* సహకార సిద్ధాంతాలను సాధ్యమైనంతవరకు విస్తృతం చేసి, గ్రామీణ కుటుంబాలకు రుణ సౌకర్యాలను కల్పించడం.
* గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, బావులు, పాఠశాలలు, సమాజసేవా కార్యక్రమాలను చేపట్టడం; నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయడం.
* శాస్త్రీయ విద్య, విధానాలను అనుసరించడం ద్వారా గణనీయమైన ఉత్పత్తులను సాధించడం.



ఎన్‌ఈఎస్‌ఎస్‌ వివిధ స్థాయిల్లో అమలు
i) కేంద్రస్థాయి:
* కేంద్ర స్థాయిలో ఈ పథకం సమాజ అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. ఇది కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన విధానాలను అమలు చేస్తుంది.


ii) రాష్ట్రస్థాయి:
* రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘రాష్ట్ర అభివృద్ధి సంఘం’ దీన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంఘంలో రాష్ట్ర సమాజాభివృద్ధి శాఖా మంత్రి సభ్యుడిగా, అభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యదర్శిగా ఉంటారు.


iii) జిల్లాస్థాయి:
* జిల్లా స్థాయిలో ఈ పథకం అమలు జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఉంటుంది.


iv) బ్లాకుస్థాయి:
* బ్లాకు స్థాయిలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఈ పథకం అమలును పర్యవేక్షిస్తాడు.


v) గ్రామస్థాయి:
* గ్రామ స్థాయిలో ఈ పథకం అమలుకు విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌ (VLW) ను నియమిస్తారు. వీరికి సమగ్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలపై శిక్షణ ఇస్తారు కాబట్టి వీరిని మల్టీ పర్పస్‌ వర్కర్స్‌గా పేర్కొంటారు.

బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

* సమాజ అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు, వాటి లక్ష్యాలను అవి ఎంతమేరకు సాధించాయో సమీక్షించేందుకు జాతీయాభివృద్ధి మండలి (NDC) 1957, జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని నియమించింది. 
* బల్వంతరాయ్‌ మెహతా కమిటీ ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం’ అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫారసు చేస్తూ 1957, నవంబరు 24న నివేదికను సమర్పించింది. ఈ నివేదికను జాతీయాభివృద్ధి మండలి 1958 జనవరిలో ఆమోదించింది.

ప్రధాన సిఫారసులు:
* దేశం సమగ్రాభివృద్ధి సాధించాలంటే ‘మూడంచెల పంచాయతీరాజ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది కింది విధంగా ఉండాలి.
1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ
2) మధ్య/బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి
3) ఉన్నత/జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌
* ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
* ప్రభుత్వం అభివృద్ధి పథకాలను సమర్థంగా నిర్వహించాలంటే వాటిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి.
* స్థానిక సంస్థలకు ప్రతి అయిదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ ప్రాతిపదికన కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు జరగాలి. 
* స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టర్‌ కీలకపాత్ర పోషించాలి. భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.
* స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు, అధికారాలు కల్పించాలి.
* దిగువ స్థాయిలో మినహాయించి మాధ్యమిక, ఉన్నతస్థాయిలో అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా జరగాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి.
* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లా పరిషత్‌కు సలహా పర్యవేక్షక అధికారాలను కల్పించాలి.
* మొదటిసారిగా మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఉన్న సికార్‌ ప్రాంతంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూ ‘నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తూ, జాతి నిర్మాణంలో కీలకపాత్రను పోషిస్తూ, భవిష్యత్‌ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి’ అని వ్యాఖ్యానించారు.
* మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. ఈ విధానాన్ని 1959, నవంబరు 1న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.

అశోక్‌ మెహతా కమిటీ
  1977లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం దేశంలో సమగ్ర పంచాయతీరాజ్‌ వ్యవస్థను సిఫారసు చేయడానికి 1977 డిసెంబరులో అశోక్‌ మెహతా కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 1978 ఆగస్టులో 132 సిఫారసులతో నివేదికను సమర్పించింది.

 

ప్రధాన సిఫారసులు:
* దేశంలో రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలి.
అవి: 1) బ్లాకు స్థాయిలో - మండల పరిషత్‌
     2) జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్‌
* వీటిలో మండల పరిషత్‌ అతికీలకమైన అంచె. 15,000 నుంచి 20,000 జనాభా కలిగిన గ్రామాలను ఒక మండలంగా ఏర్పాటుచేయాలి. గ్రామ పంచాయతీలను రద్దు చేసి వాటిస్థానంలో గ్రామ కమిటీలను ఏర్పరచాలి. 
* అభివృద్ధి పథకాల విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా సబ్‌ యూనిట్‌గా ఏర్పాటుచేయాలి.
* పంచాయతీరాజ్‌ వ్యవస్థల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ మంత్రిని నియమించాలి.
* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పంచాయతీ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి.
* స్థానిక సంస్థల పదవీకాలం నాలుగేళ్లు ఉండాలి.
* పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలి.
* షెడ్యూల్డు కులాలు, తెగలవారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.
* స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించి తగిన అధికారాలు, ఆర్థిక వనరులను కల్పించాలి.
* సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఖర్చుచేసే విధానంపై సామాజిక తనిఖీ జరగాలి.
* స్థానిక ప్రభుత్వాలను బలమైన కారణం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాలి.
* స్థానిక సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే అవకాశాన్ని కల్పించాలి.
* మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక పరోక్షంగా జరగాలి.
* 1979లో నిర్వహించిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అశోక్‌ మెహతా కమిటీ సిఫారసులను చర్చించారు. వీటిని కొన్ని రాష్ట్రాలు స్వల్ప మార్పులతో అమలుచేశాయి. 
* మొదటిసారిగా మండల పరిషత్‌ విధానాన్ని 1985, అక్టోబరు 2న కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ప్రారంభించారు. 
* మండల పరిషత్‌ విధానాన్ని అమలుచేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1986, జనవరి 13న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఈ విధానాన్ని ప్రారంభించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను 1985లో ఎన్‌.టి. రామారావు ప్రభుత్వం ప్రారంభించింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలన: వివిధ కమిటీలు - సిఫారసులు

ప్రజలే పాలకులై.. స్థానిక నాయకులై!


ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు స్థానిక సంస్థలు అత్యంత కీలకమని అనేక కమిటీలు పేర్కొంటున్నాయి. అవసరమైన అధికారాలు, విధులు, నిధులు సమకూరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష వేదికలైన గ్రామాల్లో సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని చెబుతున్నాయి. దాంతోపాటు అధికార వికేంద్రీకరణకు అనేక సూచనలు చేశాయి. ఆ కమిటీలు, అవి చేసిన సిఫారసుల గురించి పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

బల్వంతరాయ్‌ మెహతా కమిటీ (1957): సమాజ అభివృద్ధి పథకం (సీడీపీ), జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (ఎన్‌ఈఎస్‌ఎస్‌) పథకాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు 1957, జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం’ అనే మౌలికాంశాలతో మూడంచెల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేస్తూ 1957, నవంబరు 24న ఒక నివేదిక సమర్పించింది. 1958, జనవరిలో ఎన్‌డీసీ దాన్ని ఆమోదించింది.

సిఫారసులు: *మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ 2) బ్లాకు/మధ్య స్థాయి - పంచాయతీ సమితి 3) ఉన్నత/జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌.

* గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు.

* బ్లాకు/మధ్యస్థాయి సభ్యులను వివిధ గ్రామ పంచాయతీల సభ్యులు ఎన్నుకోవాలి.

* జిల్లా/ఉన్నత స్థాయిలో సభ్యులను బ్లాకు స్థాయి సభ్యులు ఎన్నుకోవాలి. 

* స్థానిక సంస్థలకు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు.

* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలు, జిల్లా పరిషత్‌కు సలహా, పర్యవేక్షక అధికారాలు.  

* స్థానిక సంస్థలకు అయిదేళ్లకోసారి క్రమం తప్పకుండా ఎన్నికలు.

* జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా కలెక్టర్‌.

* భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.

* స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, అధికారాలను కల్పించాలి.

మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌. 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లా సికార్‌ ప్రాంతంలో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ విధానాన్ని ప్రారంభించారు. ‘‘నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తాయి. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తు నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి’’ అని ఆ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

* మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1959, నవంబరు 1న ‘శంషాబాద్‌’ గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దాన్ని ప్రారంభించారు.

అశోక్‌ మెహతా కమిటీ (1977): స్థానిక స్వపరిపాలనను మరింత పటిష్ఠపరిచేందుకు, అవసరమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జనతా ప్రభుత్వం 1977, డిసెంబరు 12న అశోక్‌ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో నంబూద్రిపాద్, ఎం.జి.రామచంద్రన్‌ సభ్యులు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ విధానాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ 1978, ఆగస్టు 21న 132 సిఫారసులతో నివేదిక సమర్పించింది.

సిఫారసులు: * రెండంచెల పంచాయతీరాజ్‌ విధానం. 1) బ్లాకు స్థాయి - మండల పరిషత్‌ 2) జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌

* మండల పరిషత్‌ అతికీలకమైన అంచెగా కొనసాగాలి. దీనిలో 15,000-20,000 వరకు జనాభా ఉండాలి.

* గ్రామ పంచాయతీలను రద్దు చేసి, వాటి స్థానంలో ‘గ్రామ కమిటీ’లను ఏర్పాటు చేయాలి.

* అభివృద్ధి పథకాల అమలు విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా సబ్‌ యూనిట్‌గా ఏర్పాటు చేయాలి.  

* స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలి. స్థానిక సంస్థల పదవీ కాలం నాలుగేళ్లు.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ మంత్రి నియామకం.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. షెడ్యూల్డు కులాలు, తెగ (ఎస్సీ, ఎస్టీ)లకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు.

* బలమైన కారణం లేకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

* మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరగాలి. జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక మాత్రం పరోక్షంగానే ఉండాలి.

* స్థానిక సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి, స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలి.

* స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల కమిషన్‌ ఉండాలి.

* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన ‘న్యాయ పంచాయతీ సంస్థల’ను ఏర్పాటుచేసి, వాటిని గ్రామ పంచాయతీల నుంచి వేరు చేయాలి.

* సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేసిన విధానంపై సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) ఉండాలి.

* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మండల పరిషత్‌లు కల్పించాలి.

‘‘స్థానిక స్వపరిపాలనా సంస్థలు విఫలమైన భగవంతుడు కాదు, వాటికి సరైన నిధులు, విధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయి’’ అని అశోక్‌ మెహతా కమిటీ పేర్కొంది. ఈ కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం పతనం కావడంతో మొత్తం సిఫారసులు అమల్లోకి రాలేదు. కొన్ని రాష్ట్రాలు మార్పులు, చేర్పులతో కొన్నింటిని అమలు చేశాయి.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. 1985, అక్టోబరు 2న అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1986, జనవరి 13న నాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు  ప్రారంభించారు.

దంతెవాలా కమిటీ (1978): ‘బ్లాకు’ స్థాయి ప్రణాళికీకరణపై అధ్యయనం కోసం దంతెవాలా కమిటీని 1978లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * ‘బ్లాకు’ను ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికా రచన చేయాలి.

* మాధ్యమిక స్థాయిలో ‘బ్లాకు’ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* జిల్లా స్థాయి ప్రణాళికా రూపకల్పనలో కలెక్టర్‌దే కీలకపాత్ర.

* గ్రామస్థాయిలో సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక.

సీహెచ్‌ హనుమంతరావు కమిటీ (1984): ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ‘జిల్లా స్థాయి’ ప్రణాళికీకరణపై అధ్యయనం చేసేందుకు 1984లో సీహెచ్‌ హనుమంతరావు కమిటీని ఏర్పాటు చేశారు.

సిఫారసులు: * జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.

* జిల్లా ప్రణాళికా సంఘానికి కలెక్టర్‌ లేదా మంత్రి అధ్యక్షత వహించాలి.

* జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సమన్వయకర్త కలెక్టర్‌.

జి.వి.కె.రావు కమిటీ (1985): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రణాళికా సంఘం ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను అధ్యయనం చేసేందుకు 1985లో జి.వి.కె.రావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * బ్లాకు వ్యవస్థ, బీడీఓ పదవుల రద్దు.

* జిల్లా అభివృద్ధి అధికారి (డీడీఓ) పదవి ఏర్పాటు.

* జిల్లా స్థాయి యూనిట్‌లకు ప్రణాళిక విధుల బదిలీ.

* జిల్లా స్థాయిలో నైష్పత్తిక ప్రాతినిధ్యంతో కూడిన ఉప కమిటీల ఏర్పాటు.

* స్థానిక సంస్థలకు నిర్ణీత పదవీకాలం ప్రకారం ఎన్నికలు.

‘‘భారతదేశంలో ఉద్యోగస్వామ్యం కారణంగా పరిపాలనా స్ఫూర్తి దెబ్బతింటోంది. ఇది పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలహీనపరచింది. దీంతో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్న వ్యవస్థగా కాకుండా, వేర్లు లేని వ్యవస్థగా మారింది’’ అని జి.వి.కె.రావు కమిటీ ఆక్షేపించింది.

ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ (1986):  ‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి సాధనకు పంచాయతీరాజ్‌ సంస్థల పునర్నిర్మాణం’ అనే అంశంపై అధ్యయనం చేయడానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలి. 

* గ్రామీణ పరిపాలనలో ‘గ్రామసభ’కు ప్రాధాన్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా గుర్తింపు ఇవ్వాలి.

* కొన్ని గ్రామాల సమూహాన్ని కలిపి న్యాయ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికల వివాదాల పరిష్కారం కోసం న్యాయ ట్రైబ్యునల్స్‌ ఉండాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకోసం స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను, అధికారాలను, విధులను కేటాయించాలి. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

పి.కె.తుంగన్‌ కమిటీ (1988):  స్థానిక స్వపరిపాలనను పటిష్ఠ పరిచేందుకు అవసరమైన సిఫారసులు చేసేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1988లో అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పి.కె.తుంగన్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా, దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

* జిల్లా పరిషత్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా కలెక్టర్‌ ఉండాలి.

* స్థానిక సంస్థల పదవీకాలం నిర్దిష్టంగా అయిదేళ్లు.

* జనాభా ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలి.

* జిల్లా ప్రణాళికా అభివృద్ధికి ఏజెన్సీగా జిల్లా పరిషత్‌ ఉండాలి.

వి.ఎన్‌.గాడ్గిల్‌ కమిటీ (1988): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో స్థానిక స్వపరిపాలనపై అధ్యయనం కోసం 1988లో వి.ఎన్‌.గాడ్గిల్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.

సిఫారసులు: * స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలి. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 
 

Posted Date : 11-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

అధికార వికేంద్రీకరణకు రాజముద్ర! 

  ఒక మారుమూల ఊరికి నీరు కావాలి. పక్క గ్రామానికి వెళ్లేందుకు పక్కా రోడ్డు అవసరం. విస్తరించిన పల్లెకు విద్యుత్తు లైను వేయాలి. విద్య, వైద్యాలకు సంబంధించి ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి చేర్చాలి. ఇలాంటి వాటి కోసం పార్లమెంటు నుంచి ప్రత్యక్ష పాలన సాగించడం సాధ్యమయ్యే పనికాదు. అందు కే పంచాయతీ రాజ్‌ వంటి స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానిక సమస్యలను స్థానికులే గుర్తించి, స్థానికంగా నిధులు సమీకరించి, ప్రణాళికలు రూపొందించి, అమలు చేసి పరిష్కరిస్తారు. ఇదంతా సక్రమంగా సాగేందుకు, అధికార వికేంద్రీకరణకు వీలు కల్పిస్తూ కొన్ని ప్రత్యేక సవరణ చట్టాలను చేసి రాజ్యాంగ భద్రత కల్పించారు. వాటిపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

  

కేంద్రంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టంతో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత ఏర్పడింది. ఆ చట్టాన్ని సమర్థంగా అమలుచేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం వదిలిపెట్టింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల సంఘాన్ని, నిధుల పంపకానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ చట్టం వల్ల రాజ్యాంగంలో రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటిది రాజ్యాంగానికి తొమ్మిదో భాగాన్ని చేర్చారు. అందులో ఆర్టికల్‌ 243, 243 (A) నుంచి 243 (O) వరకు మొత్తం 16 ఆర్టికల్స్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధి విధానాలను వివరించారు. రెండో మార్పు పదకొండో షెడ్యూల్‌ను చేర్చడం. అందులో పంచాయతీ రాజ్‌కు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు. ఈ చట్టం 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్‌ 243 (E): పదవీకాలం: * పంచాయతీ సంస్థల పదవీ కాలం అవి ఏర్పడిన తేదీ నుంచి అయిదేళ్లు. అయితే పదవీకాలం కంటే ముందే పంచాయతీ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఆ విధంగా రద్దు చేస్తే ఆరు నెలల్లోగా తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి.

* పంచాయతీ సంస్థల సభ్యుల పదవులకు ఖాళీ ఏర్పడినప్పుడు వాటి భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు మిగిలిన పదవీకాలం వరకు మాత్రమే కొనసాగుతారు. కానీ పంచాయతీ సంస్థ మొత్తానికి ఎన్నికలు ఆలస్యంగా జరిగితే మాత్రం పూర్తి కాలం అధికారంలో కొనసాగుతారు.

ఆర్టికల్‌ (E) : అర్హతలు, అనర్హతలు: * పంచాయతీ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంబంధిత స్థానిక సంస్థలోని ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. * 21 ఏళ్లు నిండి ఉండాలి.* దివాలా తీసి ఉండకూడదు.* 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు.* ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన దేశ ప్రయోజనాల రీత్యా సమంజసమేనని ‘మహ్మద్‌ షరీఫ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హరియాణా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఆర్టికల్‌ 243 (G): పంచాయతీ సంస్థల అధికారాలు, విధులు: పంచాయతీరాజ్‌ సంస్థలు స్వయంసమృద్ధి సాధించి సమర్థంగా పనిచేయాలంటే వాటికి నిర్దిష్టమైన అధికారాలు, విధులు కల్పించాలి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు. ఆ విధంగా విధులను పంచాయతీరాజ్‌ సంస్థలకు బదిలీ చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (6+1): 1) కేరళ   2) కర్ణాటక   3) తమిళనాడు  4) రాజస్థాన్‌  5) సిక్కిం   6) పశ్చిమ బెంగాల్‌   7) డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలి.

ఆర్టికల్‌ 243 (H): రాష్ట్ర శాసన సభ రూపొందించే చట్టం ఆధారంగా పంచాయతీ సంస్థలు పన్నులు విధించి వసూలు చేస్తాయి.

పంచాయతీరాజ్‌ సంస్థలకు ఆదాయ వనరులు: * కేంద్ర ప్రభుత్వం అందించే సహాయక గ్రాంట్లు * రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు, రాష్ట్రాల పన్నుల్లో వాటా * స్థానిక సంస్థలకు కింది పన్నుల ద్వారా ఆర్థిక వనరులు లభిస్తాయి.అవి  ఇంటిపన్ను, నీటిపన్ను, ఆస్తుల బదిలీపై పన్ను, దుకాణాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, సంతలు, మార్కెట్ల నుంచి లభించే ఆదాయం, జరిమానాలు, విరాళాలు, స్థిరాస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా లభించే ఆదాయం, వృత్తిపన్ను, మూలధనం నుంచి వచ్చే ఆదాయం. 

ఆర్టికల్‌ 243 (I): రాష్ట్ర ఆర్థిక సంఘం: పంచాయతీరాజ్‌ సంస్థలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవసరమైన విధానాల అధ్యయనం, సిఫార్సులు చేయడంలో ‘రాష్ట్ర ఆర్థిక సంఘం’ కీలక భూమిక పోషిస్తుంది. ఈ సంఘాన్ని గవర్నర్‌ అయిదు సంవత్సరాలకోసారి ఏర్పాటు చేస్తారు.

విధులు: * రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధులు, రాష్ట్ర పన్నుల్లో వాటా గురించి సిఫార్సు చేస్తుంది.

* పంచాయతీ సంస్థలు వసూలు చేసుకునేందుకు అవకాశం ఉన్న పన్నులు, ఇతర సుంకాలను నిర్ధారించి సిఫార్సు చేస్తుంది.

* కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక వనరుల కోసం కేంద్ర ఆర్థిక సంఘానికి గవర్నర్‌ ద్వారా నివేదికలు సమర్పిస్తుంది.

* రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను గవర్నర్‌కు నివేదిస్తుంది. గవర్నర్‌ ఆ నివేదికను రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తారు.

* రాష్ట్ర ఆర్థిక సంఘం నిర్మాణం, సభ్యుల నియామకం, వారి అర్హతలకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.

ఆర్టికల్‌ 243 (J): అకౌంట్స్, ఆడిటింగ్‌: * పంచాయతీ సంస్థలకు వివిధ మార్గాల ద్వారా లభించిన నిధులు, వాటిని ఖర్చు చేసిన విధానాలపై ఆడిట్‌ నిర్వహించాలి. ఈ ఆడిట్‌ విధానం ఎలా ఉండాలనేది రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్దేశిస్తుంది. * రాష్ట్ర స్థాయిలో పంచాయతీ సంస్థల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేయడంలో ‘రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌’ కీలకపాత్ర పోషిస్తారు. * ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పంచాయతీ సంస్థల్లో 3 రకాల ‘ఆడిట్‌’ విధానాలను నిర్వహిస్తున్నారు. అవి 1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ 2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌ 3) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌.

ఆర్టికల్‌ 243 (K): రాష్ట్ర ఎన్నికల సంఘం: * పంచాయతీ సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు స్వయంప్రతిపత్తి ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరం.* రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్‌ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమిస్తారు. * రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కాలపరిమితి, ఉద్యోగ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని నిబంధనలకు లోబడి గవర్నర్‌ నిర్ణయిస్తారు.* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిని పోలి ఉంటుంది. అనగా రాష్ట్రపతి తొలగిస్తారు.

విధులు:  * పంచాయతీ సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా రూపకల్పన.* పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ. * గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడం. * పంచాయతీ సమితి/ మండల పరిషత్‌ స్థాయిలో ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఎంపీటీసీ పదవులకు ఎన్నికల నిర్వహణ. * జిల్లా పరిషత్‌ స్థాయిలో జడ్పీ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, జడ్పీటీసీ పదవులకు ఎన్నికల నిర్వహణ.

సుప్రీంకోర్టు తీర్పు- కిషన్‌ సింగ్‌ థోమర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు:  ‘‘ఆర్టికల్‌ 243 ్బర్శీ ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘం మాదిరిగా రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది. అందువల్ల స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయ్యే సందర్భంలో, స్వయం ప్రతిపత్తితో పనిచేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది’’ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆర్టికల్‌ 243 (L): కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయింపు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992లోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా, వద్దా అనే విషయాన్ని రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటిస్తారు.* శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరిలో ప్రభుత్వాలు అక్కడి స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలను రూపొందించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడే అవి కొనసాగుతాయి.

ఆర్టికల్‌ 243 (M): మినహాయించిన ప్రాంతాలు:  * 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. ఆర్టికల్‌ 244 (1)లో పేర్కొన్న ‘షెడ్యూల్డు  ప్రాంతాలు’, ఆర్టికల్‌ 244 (2) లో పేర్కొన్న ‘ఆదివాసీ ప్రాంతాల’ను ఈ చట్టం నుంచి మినహాయించారు. వాటిలో * నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ పరిధిలో ఉన్న ప్రాంతాలు. * మణిపుర్‌లోని కొండ ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ ప్రాంతంలోని ‘గూర్ఖాహిల్‌ కౌన్సిల్‌’ ఉన్నాయి.

ఆర్టికల్‌ 243 (N): పూర్వ శాసనాల కొనసాగింపు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అమల్లోకి వచ్చినప్పటికీ ఆ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అంటే 1993, ఏప్రిల్‌ 24 నుంచి ఒక సంవత్సరం వరకు అంటే 1994, ఏప్రిల్‌ 23 వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పటికే అమల్లో ఉన్న పూర్వశాసనాలు కొనసాగుతాయి.* ఈ సంవత్సర కాలం గడువు ముగియక ముందే 73వ రాజ్యాంగ సవరణ (1992) లోని మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను రూపొందించుకోవాలి. .

ఆర్టికల్‌ 243 (O): ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల ఏర్పాటు: * 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాల కోసం నియోజకవర్గాల ఏర్పాటు, నియోజకవర్గాల రిజర్వేషన్లు మొదలైన వాటికి సంబంధించి వివాదాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం ఎన్నికలను సవాలు చేస్తూ న్యాయస్థానాల్లో కేసులు వేయకూడదు. * పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించడానికి అన్ని రాష్ట్రాలు ‘ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్స్‌’ ఏర్పాటు చేయాలి. * ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల వివాదాలను ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్‌ హోదాలో జిల్లా మున్సిఫ్‌ కోర్టులు విచారిస్తున్నాయి.

పెసా(PESA)చట్టం: గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు పార్లమెంటు సభ్యుడైన ‘దిలీప్‌ సింగ్‌ భూరియా’ అధ్యక్షతన 1994, జూన్‌లో భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. భూరియా కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ‘గిరిజన ప్రాంతాల్లో స్థానిక/పంచాయతీరాజ్‌ విధానం అమలు చట్టం’ (Panchayatraj Extension to Scheduled Areas Act) రూపొందించింది. ఈ చట్టం 1996, డిసెంబరు 24 నుంచి అమల్లోకి వచ్చింది.

పెసా చట్టం - 1996 ముఖ్యాంశాలు:  * ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి ఎన్నికైన గ్రామసభ ఉండాలి. ఈ సభ గిరిజన సంప్రదాయాలను పరిరక్షించాలి.* ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఎంపికచేసే అధికారం గ్రామసభకు ఉండాలి. * గ్రామసభ అమోదముద్ర ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికలను, పథకాలను అమలు చేయాలి.* గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకానికి, వేలంపాట ద్వారా ఖనిజ సంపద వినియోగానికి లైసెన్సులు మంజూరు చేసే అధికారం గ్రామసభ, గ్రామ పంచాయతీలకు ఉంటుంది.* వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను గ్రామసభ నుంచి గ్రామ పంచాయతీ పొందాలి.* గ్రామసభ, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను చట్టబద్ధమైనవిగా పరిగణించాలి. పెసా చట్టం ప్రకాకం గ్రామసభ కీలకపాత్ర వహిస్తుంది. * పంచాయతీ సంస్థలోని అన్ని స్థాయుల్లో అధ్యక్ష పదవులను షెడ్యూల్డు తెగల వారికే కేటాయించాలి.

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 26-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్థానిక స్వపరిపాలన సంస్థలు

కరణాలు పోయి.. కార్యదర్శులు వచ్చి!

  భారత ప్రజాస్వామ్యాన్ని పునాదుల నుంచి బలోపేతం చేస్తున్నది స్థానిక స్వపరిపాలన వ్యవస్థే. ఇందులో మొదటి, కీలక అంచె అయిన గ్రామ పంచాయతీల పరిపాలనకు అమిత ప్రాధాన్యం ఉంది. బ్రిటిష్‌ హయాంలో కరణం, మునసబుల పేరిట పెత్తందారీ వ్యవస్థ అమలులో ఉండగా, స్వాతంత్య్రానంతరం మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ రూపొంది విజయవంతంగా కొనసాగుతోంది. కరణాల వ్యవస్థ పోయి, గ్రామ కార్యదర్శుల పాలన వచ్చింది. ఆధునిక కాలంలో స్థానిక పాలనా వ్యవస్థ పరిణామక్రమం గురించి పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ స్థాయిల్లోని స్థానిక స్వపరిపాలనా సంస్థల నిర్మాణం, అధికారాలు, విధులు, పాలకవర్గం ఎన్నిక విధానాలను తెలుసుకోవాలి.

  

  స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారా స్థానిక సమస్యలకు సత్వర పరిష్కార మార్గం లభిస్తుంది. ప్రజలకు స్థానిక పాలనలో భాగస్వామ్యం లభిస్తుంది.

వర్గీకరణ: స్థానిక స్వపరిపాలనా సంస్థలు రెండు రకాలు. 

1) గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు 

2) పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు.

గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు: ఇవి మూడు స్థాయుల్లో ఉంటాయి. 

1) గ్రామ పంచాయతీ 

2) మండల పరిషత్‌ 

3) జిల్లా పరిషత్‌

గ్రామ పంచాయతీ

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ స్థాయిలో ఉండే అత్యంత కీలక వ్యవస్థ గ్రామ పంచాయతీ. 

* 1802లో ఆంగ్లేయుల పాలనా కాలంలో రూపొందించిన రెగ్యులేషన్‌ చట్టంలోని సీరియల్‌ నెంబరు 29 ద్వారా మన దేశంలో పంచాయతీ విధానం ప్రారంభమైంది. దీని ఫలితంగానే కరణం వ్యవస్థ వచ్చింది. 

* 1816లో రూపొందించిన రెగ్యులేషన్‌ నియమాల ఫలితంగా గ్రామపెద్ద ‘గ్రామ మునసబు’గా అవతరించాడు. 

* లార్డ్‌ రిప్పన్‌ పాలనా కాలంలో 1884లో రూపొందించిన స్థానిక బోర్డుల చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ సంఘాల ఏర్పాటుకు కృషి జరిగింది. 

* 1884 నాటి స్థానిక బోర్డుల చట్టంలోని అంశాలను తగ్గించేందుకు 1915లో మద్రాసు ప్రభుత్వం సంకల్పించింది. 

* 1915లో మద్రాసు ప్రభుత్వం ‘ఇన్‌ఫార్మల్‌ పంచాయతీ’లను ఏర్పాటు చేసింది. ఈ పంచాయతీలు గ్రామీణ పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరా, సాగు నీటిపారుదల లాంటి పనులు నిర్వహించేవి.

మద్రాసు పంచాయతీల చట్టం - 1920:  * పంచాయతీల తనిఖీ కోసం రిజిస్ట్రార్‌ జనరల్‌ నియమితులవుతారు.

* పురుషులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు.

* ఓటుహక్కు పురుషులకు మాత్రమే లభిస్తుంది.

* ప్రత్యక్ష పద్ధతి ద్వారా పంచాయతీ సభ్యుల ఎన్నిక జరగాలి.

* పంచాయతీలకు ఇతర పన్నులు విధించే అధికారం ఉంది.

మద్రాసు స్థానిక బోర్డుల చట్టం - 1930: * దీని ప్రకారం 1920 నాటి మద్రాసు పంచాయతీల చట్టాన్ని రద్దు చేశారు.

* పంచాయతీలు స్థానిక బోర్డుల చట్టంలో అంతర్భాగమయ్యాయి.

* పంచాయతీలపై పర్యవేక్షణ, నిర్వహణాపరమైన అధికారాలను స్థానిక బోర్డులకు అప్పగించారు.

* తాలుకా బోర్డుల రద్దు అనంతరం పంచాయతీలపై అధికారాన్ని జిల్లా బోర్డులకు అప్పగించారు.

మద్రాసు పంచాయతీ చట్టం-1946: * సాధారణ పాలన నిర్వహణ కోసం రెవెన్యూ బోర్డులను ఏర్పాటు చేశారు.

* మేజర్‌ పంచాయతీల పరిపాలనకు సంబంధించిన అంశాలను పూర్తి కాలం పనిచేసే అధికారులకు, మైనర్‌ పంచాయతీల పరిపాలనకు సంబంధించిన అంశాలను పార్ట్‌ టైం అధికారులకు అప్పగించారు.

* పంచాయతీలకు సంబంధించిన కీలక అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ల నియంత్రణలో ఉంచారు.

మద్రాసులో కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు- 1946: మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు కీలక విధానాలను ప్రకటించింది. అవి: * పంచాయతీల నియంత్రణ, నిర్వహణ అధికారాన్ని ఇన్‌స్పెక్టర్ల పరిధిలోకి తీసుకొచ్చారు.

* ప్రత్యేక పరిస్థితుల్లో మినహా పంచాయతీలపై కలెక్టర్లకు పరిమిత అధికారం ఉంటుంది.

మద్రాసు పంచాయతీల చట్టం-1950: * ఈ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఒక నిర్దిష్ట రూపం వచ్చింది. 

* 1950 తర్వాత జరిగిన అన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధుల ఎన్నిక ప్రక్రియను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా ఎన్నుకునే విధానం ప్రారంభమైంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్మాణం

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959లో ‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం’ రూపొందింది.

* 1983లో అధికారం చేపట్టిన ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం మునసబ్, కరణం వ్యవస్థను రద్దు చేసింది.

* 1986లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది. దీనిద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘మండల పరిషత్‌’ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

* చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2002, జనవరి 1 నుంచి గ్రామ కార్యదర్శి వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959 నుంచి 1986 వరకు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం 

1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 

2) మధ్య స్థాయిలో - పంచాయతీ సమితి 

3) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986 నుంచి 1994 వరకు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానం: 1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 2) మధ్య స్థాయిలో - మండల ప్రజా పరిషత్‌ 3) ఉన్నత స్థాయిలో - జిల్లా ప్రజా పరిషత్‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ఏర్పాటైన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం: దీని ప్రకారం మూడంచెల పంచాయతీ రాజ్‌ విధానం వచ్చింది. 1) దిగువ స్థాయిలో - గ్రామ పంచాయతీ 2) మధ్య స్థాయిలో - మండల పరిషత్‌ 3) ఉన్నత స్థాయిలో - జిల్లా పరిషత్‌.

తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018: తెలంగాణ రాష్ట్రంలో 2018, ఏప్రిల్‌ 18 నుంచి తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని మొత్తం సెక్షన్లు 297. ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఉన్న అన్ని స్థాయుల్లోని పదవులకు ఇదివరకు ఉన్న ఎన్నిక విధానమే కొనసాగుతుంది.

* తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018లోని సెక్షన్‌ 3 గ్రామసభ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. దీని ప్రకారం ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభ సమావేశాలను  నిర్వహించాలి.

* గ్రామ సభ సమావేశాలకు సర్పంచి అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీలో ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యులు ఉంటారు. వీరు 1) పదవీవిరమణ ఉద్యోగి లేదా గ్రామ అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన సీనియర్‌ సిటిజన్‌ 2) గ్రామ సమాఖ్య అధ్యక్షులు 3) గ్రామ పంచాయతీ అభివృద్ధికి విరాళం అందించిన దాత.

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం-2020: ఈ చట్టం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. అవి: 

* సర్పంచులు తప్పనిసరిగా స్థానికంగా నివసించాలి. 

* గ్రామ సభ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించకపోతే సర్పంచి పదవిని కోల్పోతారు. 

* పంచాయతీ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ లాంటి అనైతిక చర్యలకు పాల్పడితే సదరు వ్యక్తులు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగేందుకు అర్హులు కారు. * పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 14 రోజుల్లో పూర్తిచేయాలి.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి, ఓటర్లను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం లాంటి అభియోగాలు ధ్రువీకరణ అయితే అతడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తారు.

* నాన్‌-షెడ్యూల్‌ ఏరియాలో 100% గిరిజన జనాభా ఉన్న గిరిజన గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నీ గిరిజనులకే రిజర్వు చేశారు.

* ప్రకృతి వైపరీత్యాలు లేదా నీటి కొరత విషయంలో సర్పంచిలకు నిర్ణయాధికారం ఇచ్చారు.

* గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం లాంటి అంశాల్లో సర్పంచ్‌కు మరిన్ని అధికారాలు కల్పించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ నిర్మాణం:  సాధారణంగా 300 మంది జనాభా ఉన్న గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నారు. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో పంచాయతీ పరిధిలో ఉండే 18 ఏళ్లు నిండిన వయోజన ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు.

* జనాభా తక్కువ ఉన్న కొన్ని గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేస్తారు.

* గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలోని పరిపాలనా విభాగం. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు.

వార్డుల విభజన: ప్రతి గ్రామ పంచాయతీని పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా వార్డులుగా విభజిస్తారు. కనీస వార్డుల సంఖ్య 5 కాగా, గరిష్ఠ వార్డుల సంఖ్య 21.

గ్రామ పంచాయతీ - ఎన్నిక విధానం: * ఆర్టికల్, 243(K) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది.

* గ్రామ ఓటర్ల జాబితాలో పేరు నమోదైన వారు మాత్రమే ఓటు వేసేందుకు, పోటీ చేసేందుకు అర్హులు.

* ఈ ఎన్నికల్లో ప్రతి ఓటరు రెండు ఓట్లను వినియోగించుకుంటారు. ఒక ఓటును వార్డు సభ్యుడిని, రెండో ఓటును సర్పంచిని ఎన్నుకోవడానికి వినియోగిస్తారు.

పోటీకి అర్హతలు: * గ్రామ ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి. 

* 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

* దివాళాతీసి ఉండకూడదు.* అస్పృశ్యత నేర నిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురై ఉండకూడదు.

రిజర్వేషన్లు: ఆర్టికల్‌ 243(D): * గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ రిజర్వేషన్లలో ఈ వర్గాల మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* ఓబీసీ (వెనుకబడిన వర్గాల) వారికి 34% రిజర్వేషన్లు కల్పించారు.

* మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 50% నిర్దేశించారు.

పదవీకాలం: * గ్రామ పంచాయతీ మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి అయిదేళ్లు పదవీకాలం కొనసాగుతుంది. 

* గ్రామ పంచాయతీని పదవీకాలం కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

సమావేశాలు: * గ్రామ పంచాయతీ సమావేశాలు సర్పంచి అధ్యక్షతన నెలకోసారి జరుగుతాయి. గత సమావేశపు నివేదికతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి.

* గత నెలలో జరిగిన పనులు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సర్పంచి వివరిస్తారు.

* మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు/సభ్యురాలు (ఎంపీటీసీ) తన ప్రాదేశిక పరిధిలోని గ్రామ పంచాయతీల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు. వీరు సమావేశాల చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ఓటు హక్కు ఉండదు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గ్రామ పంచాయతీ - అధికారాలు, విధులు

స్వయంపాలనలో పల్లె ప్రగతి!

  పక్క పట్టణానికి పల్లెని కలిపే రోడ్డు, ఇంటికి దగ్గర్లో పాఠశాల, చిన్న చిన్న అనారోగ్యాలకు వైద్యశాల, దృఢమైన యువత కోసం వ్యాయామశాల, ప్రభుత్వ పథకాల ప్రత్యక్ష అమలు, క్షేత్రస్థాయిలో అన్ని రకాల గణాంకాల సేకరణ, మార్కెట్లకు ఏర్పాట్లు, ప్రకటనలకు అనుమతుల వంటి ఎన్నో రకాల స్థానిక పాలనా నిర్ణయాలను గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మొదటిది, ముఖ్యమైనది అయిన ఈ గ్రామ పంచాయతీ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తున్న వ్యవస్థాగత నిర్మాణం. గ్రామీణ ప్రగతికి అదే పునాది. ప్రాథమిక పాలనా సంస్థగా, రాజకీయ వేదికగా నిలిచే ఈ పంచాయతీల అధికారాలు, విధుల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి.

  మూడంచెల పంచాయతీరాజ్‌ విధానంలో మొదటి అంచె ‘గ్రామ పంచాయతీ’. దీనికి సర్పంచ్‌ రాజకీయ అధిపతి. సర్పంచ్‌కు పరిపాలనలో సహకరించేందుకు ‘పంచాయతీ కార్యదర్శి’ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరి సమన్వయంతో గ్రామ పంచాయతీ తన అధికారాలు, విధులు నిర్వహిస్తుంది.

సర్పంచ్‌:  సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతి ద్వారా రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని జలగం వెంగళరావు కమిటీ, నరసింహం కమిటీ, దంత్‌వాలా కమిటీలు సిఫార్సు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1981 నుంచి సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో, రహస్య ఓటింగ్‌ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సర్పంచ్‌ పదవికి ఇదే తరహాలో ఎన్నిక జరుగుతోంది. గ్రామ పంచాయతీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండి, నమోదైన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు.

అధికారాలు, విధులు: * గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 

* పంచాయతీ ప్రథమ పౌరులుగా వ్యవహరిస్తారు.

* పంచాయతీ స్థాయిలో రాజకీయ అధిపతిగా ఉంటారు.

* పంచాయతీకి సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తారు.

* పంచాయతీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సమాచారం కోరవచ్చు.

* పంచాయతీ వార్షిక ఖాతాలను ఏటా క్రమం తప్పకుండా ఆడిట్‌ చేయించాలి.

* పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటారు. 

* పంచాయతీ చేసిన తీర్మానాల అమలుకు కృషి చేస్తారు.

* తన పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మొదలైన కార్యాలయాలను సందర్శించి, పనితీరును పరిశీలిస్తారు.

* గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దృష్టికి తీసుకెళ్తారు.

తొలగింపు: సర్పంచ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, ప్రభుత్వ చర్యలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగిస్తుంది. ఇలా పదవి కోల్పోయిన వారు రెండేళ్ల వరకు సంబంధిత పదవులకు తిరిగి పోటీ చేసే అవకాశం ఉండదు. 

* సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వీల్లేదు. దీనికి కారణం ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో సర్పంచ్‌ని ఎన్నుకోవడం.

* సర్పంచ్‌ పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం కంటే ముందే తన పదవికి రాజీనామా చేయవచ్చు.

* సర్పంచ్‌ తన రాజీనామాను పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. అది వీలు కానప్పుడు డీపీఓకి ఇవ్వాలి.

* ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో సర్పంచ్‌ గ్రామ సభ సమావేశాలను నిర్వహించడంలో విఫలమైతే పదవి కోల్పోతారు. ఆ విధంగా పదవి కోల్పోయినవారు ఏడాది పాటు సంబంధిత పదవులకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. 

ఉపసర్పంచ్‌: పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అదే రోజు లేదా మరో రోజు ఉప సర్పంచ్‌ పదవికి ఎన్నిక జరుగుతుంది. వార్డు సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు చేతులు పైకి ఎత్తి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఉపసర్పంచ్‌ ఎన్నిక విధానం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరోక్షంగానే ఉంటుంది. సర్పంచ్‌ అందుబాటులో లేని సమయంలో ఉపసర్పంచ్‌ గ్రామ సభ, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఉపసర్పంచ్‌ పదవీకాలం అయిదేళ్లు. పదవీ కాలం కంటే ముందే రాజీనామా చేయవచ్చు. రాజీనామా పత్రాన్ని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కి సమర్పించాలి. ఎంపీడీఓ అందుబాటులో లేకపోతే డివిజినల్‌ పంచాయతీ ఆఫీసర్‌ (డీఎల్‌పీఓ)కి ఇవ్వాలి.

అవిశ్వాస తీర్మానం: * సర్పంచ్, వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా ఉపసర్పంచ్‌ను తొలగించవచ్చు.

* ఏపీలో ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే పదవి చేపట్టిన తేదీ నుంచి నాలుగేళ్ల తర్వాతే సాధ్యం. అంటే పదవీకాలంలో ఒక్కసారి మాత్రమే ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. తెలంగాణలో పదవి చేపట్టిన తేదీ నుంచి 2 సంవత్సరాల అనంతరం ఈ తీర్మానాన్ని ప్రయోగించవచ్చు.

* మొత్తం సభ్యుల్లో 2/3 వంతు ఆమోదం తెలిపితే, ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం అమలవుతుంది.

* అనంతరం ఉపసర్పంచ్‌ను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ పదవి నుంచి తొలగిస్తారు.

* సస్పెండ్‌ అయిన వార్డు సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

* ఏదైనా కారణం వల్ల ఉపసర్పంచ్‌ పదవికి ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోపు ఉపఎన్నిక ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయాలి.

* సర్పంచ్, ఉప సర్పంచ్‌ పదవులు రెండూ ఏకకాలంలో ఖాళీ అయితే వార్డు సభ్యుల్లో ఒకరిని సర్పంచ్‌గా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నియమిస్తారు.

* గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి.

పంచాయతీ కార్యదర్శి: సర్పంచ్‌కు పరిపాలనా వ్యవహారాలలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి. ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే మేజర్‌ గ్రామ పంచాయతీలో అయితే కార్యనిర్వహణాధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో జనవరి 1, 2002న గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని సృష్టించారు.

అధికారాలు - విధులు: * పంచాయతీ పరిపాలనలో సర్పంచ్‌కు సహకరించడం. 

* పంచాయతీ తీర్మానాలు, కమిటీల తీర్మానాలు అమలు.

* సర్పంచ్‌ ఆదేశంతో గ్రామ పంచాయతీ సమావేశాల ఏర్పాటు.

* పంచాయతీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనడం. 

* పంచాయతీ ఆస్తులు, భూములు పరిరక్షించడం. 

* పంచాయతీలో పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయడం.

* సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి పంచాయతీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించడం. 

* జనన, మరణాల నమోదు, రికార్డుల నిర్వహణ.

* పంచాయతీలో పనిచేసే ఉద్యోగులపై నియంత్రణ.

* నిధులు దుర్వినియోగం కాకుండా నియంత్రించడం.

* మండల స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరుకావడం.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నుంచి పాలనకు సంబంధించిన సమాచారం పొందడం.

పంచాయతీ అధికారాలు - విధులు

గ్రామ పంచాయతీ అధికారాలు, విధులు రెండు రకాలుగా ఉంటాయి. అవి 

1) ఆవశ్యక విధులు (తప్పనిసరిగా నిర్వహించేవి) 

2) వివేచనాత్మక విధులు (ఆర్థిక వనరుల లభ్యత ఆధారంగా నిర్వహించేవి)

ఆవశ్యక విధులు: * ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ 

* కంపోస్టు ఎరువుల తయారీ 

* బందెలదొడ్ల ఏర్పాటు, నిర్వహణ 

* పంచాయతీ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ 

* కలరా, మలేరియా, డయేరియా లాంటి అంటువ్యాధుల నివారణ 

* శ్మశానవాటికల నిర్మాణం, నిర్వహణ 

* మంచినీటి బావులు, చెరువుల ఏర్పాటు, నిర్వహణ, రక్షిత తాగునీటి సరఫరా 

* పంచాయతీ పరిధిలోని వీధులు, బజార్లలో చెత్త తొలగింపు 

* డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, నిర్వహణ 

* వీధిదీపాల ఏర్పాటు 

* గ్రామ పంచాయతీ పరిధిలో భవనాలు, వంతెనలు, కట్టడాల నిర్మాణం

వివేచనాత్మక విధులు: * రోడ్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం.

* వైద్యశాలల నిర్మాణం, నిర్వహణ 

* ఆటస్థలాలు, వ్యాయామశాలల నిర్మాణం, నిర్వహణ 

* వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమాలు. 

* గ్రంథాలయాలు, ఇతర పఠన మందిరాల నిర్మాణం, నిర్వహణ 

* ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం, నిర్వహణ 

* పూర్వప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య అభివృద్ధికి కృషి 

* కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ 

* గ్రామ ప్రజల నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించడం 

* కమతాల ఏకీకరణ, భూసంస్కరణల అమలు 

* పబ్లిక్‌ మార్కెట్ల ఏర్పాటు, నిర్వహణ 

* ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం 

* నిరుద్యోగ గణాంకాల తయారీ 

* ప్రసూతి, శిశుసంక్షేమ పథకాల ఏర్పాటు, నిర్వహణ 

* గ్రామ నివేశన స్థలాల విస్తరణ 

* వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రదర్శనల నిర్వహణ 

* సహకార సంఘాల ఏర్పాటు, అభివృద్ధి 

* పశువుల కొట్టాల ఏర్పాటు, నిర్వహణ 

* కుక్కలు, పందుల సంచారాన్ని నియంత్రించడం 

* గిడ్డంగులు, ధాన్యాగారాల ఏర్పాటు, నిర్వహణ 

* మెరుగైన వ్యవసాయ పద్ధతుల అభివృద్ధి 

* సామాజిక సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి 

* మద్యపానం, మత్తుపదార్థాల సేవనం నియంత్రణ 

* అస్పృశ్యత నివారణకు కృషి 

* సంతలు, జాతరలు, ఉత్సవాల నిర్వహణ

ఇతర విధులు: * పంచాయతీ పరిధిలో దురాక్రమణల తొలగింపు. 

* రోడ్లపై ఆటంకాలు, గుంతల తవ్వకం నియంత్రించడం. 

* ఇళ్ల నిర్మాణానికి అనుమతుల మంజూరు 

* పబ్లిక్‌ రోడ్లపై విక్రయాల నిషేధం.

* అనుమతులు లేని ప్రకటనలు తొలగించడం. 

* ప్రైవేట్‌ మార్కెట్లు, సెల్‌టవర్ల ఏర్పాటుకు అనుమతుల మంజూరు. 

* పంచాయతీ నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాల విధింపు. 

* వివిధ యంత్రాల వల్ల కలిగే శబ్దాలు నియంత్రించడం. 

* అనుమతి లేకుండా రోడ్లపై చెట్లు నాటడం లేదా కొట్టివేయడాన్ని నియంత్రించడం.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మండల పరిషత్‌

 సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!

మండల స్థాయిలో నిర్వహించాల్సిన అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి చర్చించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన పంచాయతీరాజ్‌ సంస్థే మండల పరిషత్‌. స్థానిక స్వపరిపాలనలో ఇది కీలక అంచె. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలులో గ్రామాల మధ్య సమన్వయానికి కృషి చేస్తుంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ, ఎగువ సంస్థలైన పంచాయతీలు, జిల్లా పరిషత్‌కు అనుసంధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికతో పాటు మండల పాలన జరిగే విధానాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో రెండో అంచె మండల పరిషత్‌. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీకి మధ్య ఉన్న ‘మాధ్యమిక వ్యవస్థ’ ఇది.

నేపథ్యం: 1978లో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేసిన అశోక్‌ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. అవి మండల పరిషత్, జిల్లా పరిషత్‌. దీనిలో మండల పరిషత్‌ అత్యంత కీలకమైన అంచె.

* మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక (1985, అక్టోబరు 2).

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం 1986లో ‘ఏపీ మండల పరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం’ రూపొందించింది. అది 1987, జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న 330 పంచాయతీ సమితులను రద్దు చేసి వాటి స్థానంలో 1104 మండల పరిషత్‌లు ఏర్పాటు చేశారు.

వివరణ: ప్రతి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండలాలుగా విభజిస్తారు. మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్‌.  ప్రతి మండల పరిషత్‌లో సుమారు 35 వేల నుంచి 50 వేల జనాభా, 25 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి.

ఎంపీటీసీ: 

* ప్రతి మండల పరిషత్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా మండల ప్రాదేశిక నియోజకవర్గంగా (ఎంపీటీసీ) విభజిస్తారు.

* ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

* ప్రతి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలు సుమారు 3,500 మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

* మండల పరిషత్‌లో ఉండాల్సిన కనీస ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సంఖ్య 23.

* మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో ఆప్టెడ్‌ సభ్యుడిగా (ఎంపీటీసీ) నామినేట్‌ చేస్తారు.

* ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి ఆ మండల పరిషత్‌లోని ఏ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి వేరే మండల పరిషత్‌ నుంచి పోటీ చేయకూడదు.

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక: ఎంపీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా (ఎంపీపీ), మరొకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్‌ ఎంపీపీ) పరోక్ష పద్ధతిలో చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి.

రిజర్వేషన్లు: 

* ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు నిర్దేశించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గం మహిళలకు 1/3వ వంతు కల్పించాలి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

* వెనుకబడిన వర్గాల వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ఆధారంగా నిర్ణయిస్తారు.

* ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీ వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

ఎన్నికలు: 

* ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది.

* ఎంపీటీసీ ఎన్నికల బ్యాలట్‌ పత్రం రంగు - గులాబీ.

అర్హతలు-అనర్హతలు:

 * ఎంపీటీసీగా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

* సంబంధిత మండల పరిషత్‌ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.

* దివాలా తీసి ఉండకూడదు.

* స్థానిక సంస్థలకు బకాయిపడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.

* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన దంపతులు పోటీకి అనర్హులు.

కాలపరిమితి: 

మండల పరిషత్‌ కాలపరిమితి 5 సంవత్సరాలు. 

* ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల కాలపరిమితి 5 సంవత్సరాలు. 
* ఏదైనా కారణంతో ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించి, సంబంధిత ఖాళీలను భర్తీ చేయాలి.

రాజీనామా: ఎంపీటీసీలు, కో-ఆప్టెడ్‌ సభ్యుడు, మండల అధ్యక్షుడు (ఎంపీపీ), మండల ఉపాధ్యక్షుడు (వైస్‌ ఎంపీపీ) తమ రాజీనామాలను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)కి సమర్పించాలి.

మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు:

* మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు)

* మండల పరిషత్‌ పరిధిలోని శాసనసభ్యుడు (ఎమ్మెల్యే)

* మండల పరిషత్‌ పరిధిలోని లోక్‌సభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)


మండల పరిషత్‌ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు:

1) జిల్లా కలెక్టర్‌

2) మండల పరిషత్‌ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు

3) మండల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌

4) మండల పరిషత్‌ పరిధిలోని సర్పంచ్‌లు.

మండల పరిషత్‌ - అధికారాలు - విధులు:

* గ్రామ పంచాయతీల సాధారణ విధుల నియంత్రణ

* పశు సంపద అభివృద్ధి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం

* వ్యవసాయోత్పత్తుల గణనీయ పెంపుదలకు కృషి

* ప్రజల సహకారంతో వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల అమలు

* మండల పరిషత్‌ నిధులతో వివిధ రకాల ట్రస్టులను నిర్వహించడం

* రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సమర్పించడం

* గ్రామీణ పారిశుద్ధ్య వసతుల పెంపుదలకు కృషి

* వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం

* మండల పరిషత్‌ పరిధిలో రవాణా సౌకర్యాల అభివృద్ధికి కృషి

* స్వయంసహాయక పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు

* ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, పర్యవేక్షణ

* అగ్నిప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణ

* సమాచార కేంద్రాలు, రైతు కేంద్రాలు, గ్రంథాలయాల ఏర్పాటు

* సహకార రంగ పటిష్టతకు కృషి

* సహకార పరపతి సంఘాలు, నీటిపారుదల సొసైటీలు, వ్యవసాయ సొసైటీల ఏర్పాటు

* మహిళా, శిశు సంక్షేమ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* అంటరానితనం నిర్మూలన, సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి

* సాంఘిక సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు పథకాలు అమలు పరచడం

మండల పరిషత్‌ అధ్యక్షుడు-అధికారాలు-విధులు

* మండల పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* ఈయన మండల పరిషత్‌కు ప్రథమ పౌరుడు, రాజకీయ అధిపతి.

* మండల పరిషత్‌ రికార్డుల తనిఖీ, పర్యవేక్షణకు సంపూర్ణ అధికారం ఉంటుంది.

* మండల పరిషత్‌ తీర్మానాల అమలులో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)పై నియంత్రణ ఉంటుంది.

* ప్రజాసంక్షేమం దృష్ట్యా అత్యవసర పనులు చేపట్టాలని ఎంపీడీఓను ఆదేశిస్తారు.

మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు-అధికారాలు-విధులు:

* అధ్యక్షుడు మండల పరిషత్‌కు హాజరుకానప్పుడు ఆ బాధ్యతలను నిర్వహించడం.

* మండలాధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యేంత వరకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం.

* అధ్యక్షుడు లిఖితపూర్వకంగా బదిలీ చేసిన అధికార విధులు నిర్వహించడం.

అవిశ్వాస తీర్మానం, తొలగింపు:  

* ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా అవిశ్వాస తీర్మానంతో తొలగించొచ్చు.

* మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది. ఇలా వైదొలిగినవారు రెండేళ్ల వరకు తిరిగి ఆ పదవులకు పోటీ చేయలేరు.

మండల పరిషత్‌ - ఆర్థిక వనరులు:

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు.

* భూమి శిస్తు, వినోదపు పన్ను.

* ఖాదీ బోర్డు, గ్రామీణ కుటీర పరిశ్రమల బోర్డు మొదలైన సంస్థలు సమకూర్చే గ్రాంట్లు.

* సాముదాయక అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం నుంచి లభించే గ్రాంట్లు.

* మండల పరిషత్‌ విధించే ఫీజులు, సెస్సులు.

* గ్రామ పంచాయతీల నుంచి మండల పరిషత్‌ వసూలు చేసే మొత్తం.

* మండల పరిషత్‌లోని జనాభా సంఖ్య లెక్కన ఒక్కో వ్యక్తికి రూ.5 చొప్పున వార్షిక గ్రాంటుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

* జిల్లా పరిషత్‌ ఆదాయం నుంచి మండల పరిషత్‌కు లభించే వాటా.

* మండల పరిషత్‌ విధించే పన్నులు, సర్‌ఛార్జీలు.

* వివిధ వర్గాల నుంచి లభించే విరాళాలు.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)

* ఎంపీడీఓ మండల పరిషత్‌కు పరిపాలనా అధిపతి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రూప్‌-1 స్థాయి అధికారి.

* మండల పరిషత్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

* మండల పరిషత్‌ తీర్మానాలను అమలు చేస్తారు.

* రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వుల అమలు కోసం కృషి చేస్తారు.

* నెలకోసారి మండల పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

* మండలంలోని గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణాధికారాలు ఉంటాయి.

* మండలాధ్యక్షుడిని సంప్రదించి మండల పరిషత్, మండల మహాసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

* మండల పరిషత్‌లోని ఉద్యోగులపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు కలిగి ఉంటారు.

* మండల పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. కానీ తీర్మానాల విషయంలో ఓటు హక్కు ఉండదు.

* మండల పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే ఎంపీడీవోపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జిల్లా పరిషత్‌

 వృద్ధి పథంలో.. వ్యూహ రచనలో! 

  స్థానిక స్వపరిపాలన వ్యవస్థలో కిందిస్థాయిలో పంచాయతీలు ఉంటే, ఉన్నత స్థాయిలో జిల్లా పరిషత్‌లు ఉంటాయి. మండల పరిషత్‌లను తద్వారా పంచాయతీలను సమన్వయ పరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల వ్యూహాలను రూపొందించి, అమలు చేస్తుంటాయి. సంక్షేమ పాలన అందించడంలో స్థానికులను భాగస్వాములను చేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుంటాయి. చిన్న నీటిపారుదల, గ్రామీణ పరిశ్రమలు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, పాఠశాలల నిర్వహణ తదితర కీలక బాధ్యతలు జెడ్పీ పరిధిలోనే ఉంటాయి. అధికార వికేంద్రీకరణ, సమ్మిళిత వృద్ధి సాధన లక్ష్యంగా జవాబుదారీతనం, పారదర్శకత ప్రధానంగా కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ నిర్మాణం, ఎన్నికలు, అధికారాలు, విధులు, అది ఏర్పాటు చేసే స్థాయీ సంఘాల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

  మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ‘జిల్లా పరిషత్‌’ ఉన్నత స్థాయి పరిపాలనా విభాగం. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల సమగ్రాభివృద్ధికి అవసరమైన వ్యూహాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది.

జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు: జిల్లాలోని ‘ప్రతి మండల పరిషత్‌’ను ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం’ (జడ్పీటీసీ)గా పరిగణిస్తారు. ఒక జిల్లాలో ఎన్ని మండల పరిషత్‌లుంటే అన్ని ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు’గా పరిగణిస్తారు. ‘జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల (జడ్పీటీసీ)ను ఓటర్లు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు.

అర్హతలు, అనర్హతలు: * 21 ఏళ్లు నిండి ఉండాలి. * జిల్లా పరిషత్‌ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. * దివాళా తీసి ఉండకూడదు.* 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు.

రిజర్వేషన్లు: * ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ వర్గాలకు రిజర్వు చేసిన స్థానాల్లో ఆ వర్గాల మహిళలకు 1/3వ వంతు రిజర్వు చేయాలి.* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. ఈ రాష్ట్రాల్లో ఓబీసీ వర్గాల వారికి 34% స్థానాలు రిజర్వు చేశారు.

ఎన్నికలు: * ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఏర్పడిన ‘రాష్ట్ర ఎన్నికల సంఘం’ జిల్లా పరిషత్‌కు ఎన్నికలు నిర్వహిస్తుంది. జడ్పీటీసీ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి. జిల్లా పరిషత్‌లో అల్పసంఖ్యాక వర్గాల వారికి (మైనారిటీస్‌) తగిన ప్రాతినిధ్యం లేకపోతే ఆ వర్గం నుంచి ఇద్దరు సభ్యులను ‘కో-ఆప్టెడ్‌ మెంబర్స్‌’గా జిల్లా పరిషత్‌కు నామినేట్‌ చేస్తారు.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక, పదవీకాలం: * జిల్లా పరిషత్‌కు ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా, మరొకరిని వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. * జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ సభ్యుల పదవీకాలం అయిదేళ్లు. పదవీకాలం కంటే ముందే ఏదైనా పదవికి ఖాళీ ఏర్పడితే ఆరు నెలల్లోగా ఎన్నిక ద్వారా భర్తీ చేయాలి.

తొలగింపు:  జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌లను నిర్దిష్ట కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది.* అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడినట్లు ధ్రువీకరణ జరిగినప్పుడు.* రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించినట్లు ధ్రువీకరణ జరిగినప్పుడు.* పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా తమకు సంక్రమించిన అధికార విధులను నిర్వహించడంలో అనేకసార్లు విఫలమైనప్పుడు.

అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగింపు:  * జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌లను తొలగించే అవిశ్వాస తీర్మానంపై 2/3వ వంతు జడ్పీటీసీ సభ్యులు సంతకాలు చేసి ఆ నోటీసును జడ్పీ సీఈఓకి అందజేయాలి. * జిల్లా పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ పదవులు కోల్పోతారు.

జిల్లా పరిషత్‌లోని సభ్యులు: * జిల్లాలోని మొత్తం శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) * జిల్లాలోని మొత్తం లోక్‌సభ సభ్యులు (ఎంపీలు) * జిల్లాలో ఓటరుగా నమోదైన శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) * జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు (ఎంపీలు).

శాశ్వత ఆహ్వానితులు:  * కలెక్టర్‌ * జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ * జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ * జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ * జిల్లాలోని మండల పరిషత్‌ల అధ్యక్షులు.  వీరంతా జిల్లా పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొనవచ్చు. కానీ, ఏదైనా తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు ఓటుహక్కు మాత్రం ఉండదు.

స్థాయీ సంఘాలు: ప్రతి జిల్లా పరిషత్‌ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏడు స్థాయీ సంఘాలు ఉంటాయి. అవి 

1) ప్రణాళిక, ఆర్థిక స్థాయీ సంఘం 

2) గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం 

3) వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘం 

4) సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం 

5) విద్య, వైద్య స్థాయీ సంఘం 

6) స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం

 7) అభివృద్ధి పనుల స్థాయీ సంఘం. వీటిలో జడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు. స్థాయీ సంఘాల సమావేశాలు రెండు నెలలకోసారి జరుగుతాయి. ఇందుకు ఉండాల్సిన కోరం 1/3వ వంతు. 

* వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘానికి జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

* కనీసం రెండు స్థాయీ సంఘాలకు అధ్యక్షులుగా మహిళలు ఉంటారు.

* మిగిలిన నాలుగు స్థాయీ సంఘాలకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

* స్థాయీ సంఘాలు జిల్లా పరిషత్‌ పనులను, కార్యక్రమాలను రంగాల వారీగా వర్గీకరించి, వాటి పనితీరును అధ్యయనం చేస్తాయి. వివిధ అభివృద్ధి పథకాల అమలుతీరును సమీక్షించి, పర్యవేక్షించి, అవసరమైన సూచనలు, సలహాలను జిల్లా పరిషత్‌కు ఇస్తాయి. ఈ సూచనలను జిల్లా పరిషత్‌ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. స్థాయీ సంఘాల సమావేశాలకు కలెక్టర్‌ హాజరుకావచ్చు. 

జిల్లా పరిషత్‌ అధికారాలు - విధులు: * జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పన.* జిల్లాలోని మండల పరిషత్‌ల పనితీరును సమీక్షించడం. * జిల్లాకు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను రూపొందించి, ఆమోదించడం. * మండలాల వారీగా రూపొందించిన ప్రణాళిక కార్యక్రమాలను సమన్వయపరచి క్రమబద్ధీకరించడం. * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను అమలుచేయడం. * ప్రాథమికోన్నత పాఠశాలలు, వృత్తి విద్యాసంస్థలను నిర్వహించడం. * వయోజన విద్యా కార్యక్రమాల నిర్వహణ. * జీవ వైవిధ్య కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం. * స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించిన గణాంక సమాచారాన్ని ప్రచురించడం. * రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్‌ నిధులపై ‘లెవీ’ విధించడం. * గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ మధ్య వనరుల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం. * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేయడం. * క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మత సామరస్యం సాధనకు కృషి చేయడం. * పార్కులు, ఆటస్థలాలు, స్టేడియంల నిర్మాణం, నిర్వహణ. * ఉపాధిహామీ పనులను మండల పరిషత్‌లకు కేటాయించడం, పర్యవేక్షించడం.

ఆదాయ వనరులు:  జిల్లా పరిషత్‌కు విస్తృతమైన ఆదాయ వనరులుంటాయి. అవి 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు, అఖిలభారత సంస్థలు మంజూరు చేసే నిధులు. 

* జిల్లా పరిషత్‌ ఆధీనంలోని ఎండోమెంట్స్, ట్రస్టుల ఆదాయం. 

* కుటీర, చిన్నతరహా పరిశ్రమల నుంచి వసూలయ్యే పన్నులు. 

* భూమి సెస్సు, ఫీజులు, పన్నులు. 

* రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, ఫీజుల్లో వాటా. 

* ఇసుక క్వారీలకు సంబంధించిన సీనరేజీ ఫీజు. 

* జిల్లా పరిషత్‌ స్థిరాస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం.

* ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే నిధులు. 

* వివిధ వర్గాల వారు ఇచ్చే విరాళాలు. 

* జిల్లా పరిషత్‌కు లభించే ఆదాయ వనరులన్నింటినీ ‘జిల్లా పరిషత్‌ నిధి’గా పరిగణిస్తారు. ఈ నిధిని సమీపంలోని ‘ప్రభుత్వ ట్రెజరీ’లో జమ చేయాల్సి ఉంటుంది.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ - అధికారాలు, విధులు: * జిల్లా పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం. * జిల్లా పరిషత్‌ ఆమోదించిన తీర్మానాల అమలు కోసం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)కి ఆదేశాలు జారీ చేయడం.* జిల్లా పరిషత్‌ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల రికార్డులను తనిఖీ చేయడం.

* జిల్లా పరిషత్‌ సమావేశాలను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించడం.* వివిధ స్థాయీ సంఘాల నివేదికలపై సమీక్ష జరపడం, వాటి అమలు కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం.* హోదారీత్యా జిల్లా విద్యా కమిటీ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా గ్రామీణ ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన మిషన్‌కు  అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి: * జిల్లా పరిషత్‌ పరిపాలనలో సహకరించేందుకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. సీఈఓ జీతభత్యాలు, పింఛన్లు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.* జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ను సంప్రదించి జిల్లా పరిషత్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తారు. * జిల్లా పరిషత్, స్థాయీ సంఘాల సమావేశాలకు సంబంధించిన రికార్డులను భద్రపరుస్తారు. * జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందగలరు.* జిల్లా పరిషత్‌ ఆమోదించిన తీర్మానాల అమలు కోసం కృషి చేస్తారు. జిల్లా పరిషత్‌ చేపట్టే వివిధ అభివృద్ధి పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తారు.* జిల్లా పరిషత్, మండల పరిషత్‌ సమావేశాల్లో పాల్గొనవచ్చు. కానీ ఏదైనా తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు ఓటు హక్కు ఉండదు.* జిల్లా పరిషత్‌ అధికార పరిధిలోని కార్యాలయ సిబ్బంది, అకౌంట్స్‌ వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉంటారు.* జిల్లా పరిషత్‌ పరిధిలోని వివిధ కార్యాలయాలు, పథకాల అమలు తీరును తనిఖీ చేస్తారు.* జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘం సూచనల మేరకు మండల పరిషత్‌ పరిధిలోని పనులు, పథకాలు, సంస్థలను తనిఖీ చేస్తారు. 

* జిల్లా పరిషత్‌కు సంబంధించిన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వానికి నివేదిస్తారు.* జిల్లా పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వం జడ్పీ సీఈఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 24-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా

పట్టణ పాలనకు పట్టాభిషేకం!

   పట్టణాలు, నగరాల్లో పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు కీలక భూమిక పోషిస్తాయి. అందుకే అవి రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తూనే పాలనా వ్యవహారాల్లో ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రంగా వ్యవహరించగలగాలి. అధికార వికేంద్రీకరణకు ప్రతిరూపాలుగా నిలిచేందుకు అవసరమైన సంస్థాగత నిర్మాణం వాటికి ఉండాలి. ఈ లక్ష్యాలు 74వ రాజ్యాంగ సవరణ చట్టంతో నెరవేరాయి. ఆ చట్టం పట్టణ స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు రాజ్యాంగ గుర్తింపును ఇచ్చింది. పట్టణ ప్రభుత్వాలు విజయవంతంగా పనిచేసేందుకు దోహదపడింది. ఈ మౌలికాంశాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్రమైన అవగాహన ఉండాలి. 

  ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు ప్రభుత్వం 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది. ఇది 1993, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ద్వారా రాజ్యాంగానికి ఖిశ్బ్రీత్శి అనే కొత్త భాగాన్ని చేర్చారు. ఇందులో ఆర్టికల్‌ 243్బశ్శి నుంచి  243్బ్ట్రబ్శి వరకు మొత్తం 18 రకాల ఆర్టికల్స్‌లో పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల పరిపాలనా విధానాన్ని వివరించారు.

ఆర్టికల్‌ 243(P): పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన నిర్వచనాలు.

మున్సిపల్‌ ఏరియా: గవర్నర్‌ నోటిఫై చేసిన ఒక మున్సిపాలిటీలోని ప్రాదేశిక ప్రాంతం అని అర్థం.

మున్సిపాలిటీ: ఆర్టికల్‌ 243్బశ్శీ ప్రకారం ఏర్పాటైన పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

వార్డు కమిటీ: ఆర్టికల్‌ 243్బళ్శీ ప్రకారం ఏర్పాటైన కమిటీ అని అర్థం.

మెట్రోపాలిటన్‌ ప్రాంతం: పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరం.


జిల్లా: ఒక రాష్ట్రంలోని జిల్లా.


జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా. (ప్రస్తుతం 2011 జనాభా గణాంకాలను ఆధారంగా పరిగణిస్తున్నారు.)


ఆర్టికల్‌ 243(Q): పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థాపన: దేశంలో మూడు రకాల పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటును నిర్దేశించారు.


1) నగర పంచాయతీ: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతూ, వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాన్ని నగర పంచాయతీగా గుర్తిస్తారు. దీని జనాభా 20,000-40,000.


2) మున్సిపాలిటీ: 40 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాలను మున్సిపాలిటీ/మున్సిపల్‌ కౌన్సిల్‌గా ఏర్పాటు చేస్తారు.


3) మున్సిపల్‌ కార్పొరేషన్‌: 3 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను మున్సిపల్‌ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాన్ని మెట్రోపాలిటన్‌ మహానగరంగా పేర్కొంటారు.

ఆర్టికల్‌ 243(R): మున్సిపల్‌ వ్యవస్థల సభ్యులు, అధ్యక్షుల ఎన్నిక విధానం: నగర పంచాయతీలోని వార్డు సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిల్‌లోని కౌన్సిలర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్, మెట్రోపాలిటన్‌ మహానగరాల్లోని కార్పొరేటర్లు ఓటర్ల ద్వారా ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్‌ పద్ధతిలో ఎన్నికవుతారు.

* మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్, డిప్యూటీ మేయర్, మెట్రోపాలిటన్‌ మహానగర మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది.

* నగర పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించవచ్చు. ఏ విధంగా నిర్వహించాలనేది రాష్ట్ర శాసనసభ రూపొందించే చట్టం నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

* లోక్‌సభ సభ్యులు, శాసనసభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పరిధిలోని పట్టణ, నగరపాలక సంస్థల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

* రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు వారు ఏ పట్టణ/నగరపాలక సంస్థలో ఓటరుగా నమోదై ఉంటారో ఆ సంస్థల్లో పదవిరీత్యా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

* ఎక్స్‌ అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ఓటు హక్కు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయవచ్చు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎక్స్‌ అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటు హక్కు కల్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ విధానం కొనసాగుతోంది.

ఆర్టికల్‌ 243(S): వార్డు కమిటీల ఏర్పాటు:  పట్టణ, నగరపాలక సంస్థలను పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులు/డివిజన్లుగా విభజిస్తారు. 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపల్‌ సంస్థల్లో వార్డు/డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ వార్డులు/డివిజన్లు కలిసి వార్డు కమిటీ లేదా డివిజన్‌ కమిటీగా ఏర్పాటైనప్పుడు వాటిలోని సభ్యులు తమలో నుంచి ఒకరిని వార్డు/డివిజన్‌ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఈ వార్డు/డివిజన్‌ కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు ఇస్తాయి. గుజరాత్‌లో ఏర్పాటుచేసిన బహుళ సభ్య వార్డు కమిటీలను సుప్రీంకోర్టు సమర్థించింది.

ఆర్టికల్‌ 243(T): రిజర్వేషన్లు:  పట్టణ, నగరపాలక సంస్థలకు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి, వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. వీరికి నిర్దేశించిన రిజర్వేషన్లలో 1/3వ వంతు స్థానాలను ఈ వర్గాల మహిళలకు కేటాయించాలి. మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3వ వంతు ఇవ్వాలి. వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టారు. మైనార్టీ వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం లేకపోతే మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఇద్దరిని, మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముగ్గురిని కో-ఆప్టెడ్‌ సభ్యులుగా నామినేట్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 243(U): పదవీకాలం: పట్టణ, నగరపాలక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీకాలం ముగియక ముందే వీటిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఈ విధంగా రద్దయిన వాటికి తప్పనిసరిగా 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. అన్ని స్థాయుల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీ కాలం 5 సంవత్సరాలు.

ఆర్టికల్‌ 243(V): అర్హతలు, అనర్హతలు: 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. 1995, మే 30 తర్వాత వివాహమైన దంపతులకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండకూడదు. దివాళాతీసి ఉండకూడదు.


ఆర్టికల్‌ 243(W): అధికారాలు - విధులు:  74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ, నగర పాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. 

ఆర్టికల్‌ 243(X): ఆర్థిక వనరులు, పన్నులు:  రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు పట్టణ, నగరపాలక సంస్థలు పన్నులు విధించి, వసూలు చేసుకోవచ్చు. మున్సిపల్‌ సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 2/3వ వంతు స్థానిక పన్నుల ద్వారానే సమకూర్చుకుంటాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల పన్నుల ఆదాయంలో 1/4వ వంతు ఆక్ట్రాయ్‌ పన్ను ద్వారానే సమకూర్చుకుంటాయి.

పన్నులు: ఇంటి పన్ను, తాగునీటి పన్ను, వినోదపు పన్ను, మార్కెట్లు, సంతలపై పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, ప్రకటనలపై పన్ను, విరాళాలు, జరిమానాలు, సెల్‌ఫోన్‌ టవర్లపై లభించే ఆదాయం, ఆస్తుల బదిలీపై పన్ను, భవన నిర్మాణ అనుమతులపై పన్ను.


ఆర్టికల్‌ 243(Y): రాష్ట్ర ఆర్థిక సంఘం: ఆర్టికల్‌ 243్బఖ్శి లో పేర్కొన్న రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్‌ 243్బ్త్శ్ర కు కూడా వర్తిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను మంజూరు చేస్తుంది. అదనపు ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తుంది. గవర్నర్‌ ద్వారా కేంద్ర ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు పంపుతుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు సమర్పించగా, గవర్నర్‌ సంబంధిత నివేదికను శాసనసభకు సమర్పిస్తారు.

ఆర్టికల్‌ 243(Z): అకౌంటింగ్‌ అండ్‌ ఆడిటింగ్‌:  పట్టణ, నగరపాలక సంస్థల ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ ఒక శాసనం ద్వారా రూపొందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని స్థానిక సంస్థల ఆడిట్‌లను రాష్ట్ర ఆడిట్‌ సంచాలకుడు నిర్వహిస్తారు.

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రకాల ఆడిట్‌ను నిర్వహిస్తున్నారు. అవి 1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ 2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌ 3) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌

ఆర్టికల్‌ 243(ZA): రాష్ట్ర ఎన్నికల సంఘం: ఆర్టికల్‌ 243్బర్శీ ద్వారా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్‌ 243్బ్ట్రత్శి కు కూడా వర్తిస్తుంది. ఇది పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. మున్సిపల్‌ వ్యవస్థలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమిస్తారు. తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికే ఉంటుంది.

ఆర్టికల్‌ 243(ZB): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు: 


  74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని అంశాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా, లేదా అనేది రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నిర్ణయిస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ స్థానిక పాలనపై కేంద్ర హోంశాఖ నియంత్రణ కలిగి ఉంటుంది. శాసనసభలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి ప్రత్యేక చట్టాలను రూపొందించుకోవచ్చు. అయితే ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి.

ఆర్టికల్‌ 243(ZC): మినహాయించిన ప్రాంతాలు: 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి కొన్ని ప్రాంతాలను మినహాయించారు. అవి * ఆర్టికల్‌ 244(1) లో పేర్కొన్న షెడ్యూల్డ్‌ ప్రాంతాలు * ఆర్టికల్‌ 244(2) లో పేర్కొన్న ఆదివాసీ ప్రాంతాలు * నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ప్రాంతాలు. మణిపుర్‌లోని కొండప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ ప్రాంతంలోని గూర్ఖాహిల్‌ కౌన్సిల్‌ ప్రాంతం.

ఆర్టికల్‌ 243(ZD): జిల్లా ప్రణాళికా బోర్డు: జిల్లాలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను జిల్లా ప్రణాళికా బోర్డు రూపొందిస్తుంది. ఈ బోర్డుకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ రూపొందిస్తుంది.

* జిల్లా ప్రణాళికా బోర్డులోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు మందికి తక్కువ కాకుండా సంబంధిత జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికయ్యే సభ్యుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది ఆ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంత జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లా ప్రణాళికా బోర్డుకు ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌గా జిల్లా పరిషత్‌ ఛైర్మన్, మెంబర్‌ సెక్రటరీగా కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారు.

* జిల్లా ప్రణాళికా బోర్డులో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో 24 మంది సభ్యులు ఎన్నికవుతారు. నలుగురు నామినేట్‌ అవుతారు. మిగిలినవారు కలెక్టర్, జడ్పీ ఛైర్మన్‌.

* జిల్లా ప్రణాళికా బోర్డు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను బోర్డు ఛైర్మన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు.


ఆర్టికల్‌ 243(ZE): మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘం: మెట్రోపాలిటన్‌ మహానగరాల సమగ్ర అభివృద్ధికి మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటుచేయాలి. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 24. వీరిలో 18 మంది ఎన్నిక ద్వారా, 4 మంది నామినేషన్‌ విధానం ద్వారా వస్తారు. ఛైర్మన్‌గా మెట్రోపాలిటన్‌ మహానగర మేయర్, మెంబర్‌ సెక్రటరీగా మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహరిస్తారు. మెట్రోపాలిటన్‌ ప్రణాళికా సంఘం తన నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తుంది. మరో నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపుతుంది. 1964లో మన దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను దిల్లీలో ఏర్పాటుచేశారు.

ఆర్టికల్‌ 243 (ZF): పూర్వ శాసనాల కొనసాగింపు: 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) 1993, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు అంటే 1994, మే 31 వరకు వివిధ రాష్ట్రాల్లో అప్పటికే అమల్లో ఉన్న పూర్వశాసనాలు కొనసాగుతాయి.

* 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని మౌలికాంశాలకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చట్టాలు రూపొందించి, అమలు చేసుకోవచ్చు.

ఆర్టికల్‌ 243(ZG): ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల ఏర్పాటు: పట్టణ, నగరపాలక సంస్థలకు జరిగే ఎన్నికల సంబంధిత వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉండటంతో ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటుచేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థలో జరిగే ఎన్నికల వివాదాల పరిష్కార బాధ్యతలను జిల్లా సెషన్స్‌ కోర్టులకు అప్పగించారు.

* జిల్లా సెషన్స్‌ కోర్టులు ఎన్నికల వివాదాలను విచారించే సందర్భంలో సాధారణ న్యాయస్థానాలుగా కాకుండా ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల హోదాలో విచారిస్తాయి.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 15-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు

పౌర సేవలకు ప్రత్యేక వ్యవస్థలు!

  పట్టణాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి, పౌరులకు అవసరమైన సేవలను అందించడానికి, సదుపాయాలను కల్పించడానికి ప్రత్యేక స్వపరి పాలనా సంస్థలు ఉన్నాయి. అవి సమర్థ పాలనతో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహిస్తాయి. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడతాయి. రాజ్యాంగ హోదాను కలిగి, ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తున్న ఆ పట్టణ స్థానిక పరిపాలన సంస్థల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


  భారతదేశంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న పౌరులకు పౌర సదుపాయాలను కల్పించేందుకు మున్సిపల్‌ వ్యవస్థలు కృషి చేస్తున్నాయి. వీటికి పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు. దేశంలో మూడంచెల పట్టణ స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు.


నగర పంచాయతీ: ఒక గ్రామం పట్టణంగా అభివృద్ధి చెందుతుంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తుంది. అక్కడ జనాభా 20 వేల నుంచి 40 వేల వరకు ఉంటుంది. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 400పైన నమోదవుతుంది. నివసిస్తున్న వారిలో 75% పైగా పురుషులు వ్యవసాయేతర పనులు చేస్తుంటారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నగర పంచాయతీని పరిపాలన సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డు సభ్యులను ఓటర్లు  ప్రత్యక్ష పద్ధతిలో రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. వార్డు సభ్యుల్లో ఎన్నికైనవారు పదిమంది, నామినేటెడ్‌ ముగ్గురు ఉంటారు.


* వార్డు సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. నగర పంచాయతీకి రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా అధ్యక్షుడు వ్యవహరిస్తారు. ఈ అధ్యక్ష, ఉపాధ్యక్షులను అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చు.


* స్థానిక లోక్‌సభ సభ్యుడు (ఎంపీ), శాసనసభ్యుడు (ఎమ్మెల్యే), నగర పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉన్న రాజ్య సభ సభ్యుడు (ఎంపీ), శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) నగర పంచాయతీ సమావేశాలకు హోదా రీత్యా సభ్యులుగా హాజరవుతారు. ఇక్కడి పరిపాలన కమిటీల ద్వారా జరుగుతుంది.


కార్యనిర్వహణాధికారి: నగర పంచాయతీ పాలనలో అధ్యక్షుడికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఉంటారు. తీర్మానాల అమలు, బడ్జెట్‌ రూపకల్పనలో ఈ అధికారి కీలకపాత్ర పోషిస్తారు.


పురపాలక సంఘం: నగర పాలక సంస్థ (మున్సిపల్‌ కార్పొరేషన్‌)కు దిగువన, నగర పంచాయతీకి ఎగువన ఏర్పాటయ్యే పట్టణ స్థానిక సంస్థే పురపాలక సంఘం (మున్సిపాలిటీ). దీని పరిధిలో జనాభా 40 వేలకుపైన, 3 లక్షల్లోపు ఉంటుంది. మున్సిపాలిటీని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డుల నుంచి ఓటర్లు రహస్య ఓటింగ్‌తో కౌన్సిలర్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో-ఆప్టెడ్‌ సభ్యుడిగా నామినేట్‌ చేస్తారు. కౌన్సిలర్లు తమలో నుంచి ఒకరిని పురపాలక సంఘానికి ఛైర్మన్‌గా, మరొకరిని వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. అవసరమైనప్పుడు ఆ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌లను అవిశ్వాస తీర్మానం ద్వారా కౌన్సిలర్లు తొలగించవచ్చు. 


* పురపాలక సంస్థలను వాటి వార్షికాదాయం ఆధారంగా అయిదు రకాలుగా వర్గీకరించారు. 1) గ్రేడ్‌ - 3 మున్సిపాలిటీ రూ.2 కోట్ల లోపు 2) గ్రేడ్‌ - 2 మున్సిపాలిటీ కోట్ల నుంచి రూ.4 కోట్లు 3) గ్రేడ్‌ - 1 మున్సిపాలిటీ రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు 4) స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లు 5) సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రూ.8 కోట్ల పైన.


* ‘ఆంధ్రప్రదేశ్‌ పురపాలక సంఘాల చట్టం 1965’ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏపీలో పురపాలక సంఘాలు 77 ఉన్నాయి. 


* ‘తెలంగాణ పురపాలక సంస్థల చట్టం 2019’ ప్రకారం  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు (పురపాలక సంస్థలు) కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని పురపాలక సంఘాలు 128.


పురపాలక సంస్థ ఛైర్మన్‌:  ఈ ఛైర్మన్‌ మున్సిపాలిటీకి రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు. సమావేశాలకు, కొన్ని స్థాయీ సంఘాలకు అధ్యక్షత వహిస్తారు.


మున్సిపల్‌ కమిషనర్‌: రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉద్యోగి. పురపాలక సంస్థ చేసిన తీర్మానాలను అమలు చేస్తారు. రికార్డులు నిర్వహిస్తారు. సిబ్బంది, ఆస్తులపై కమిషనర్‌కి పర్యవేక్షణాధికారం ఉంటుంది.


నగర పాలక సంస్థ: రాష్ట్రంలోని పెద్ద పట్టణాలను నగరపాలక సంస్థలు (మున్సిపల్‌ కార్పొరేషన్‌లు)గా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చట్టం చేయవచ్చు. జనాభా 3 లక్షల కంటే ఎక్కువ ఉండే నగరాలను ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌’గా ప్రకటిస్తారు. మన దేశంలో మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను 1687లో మద్రాసులో ఏర్పాటు చేశారు.


* హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1950 ప్రకారం, 1950లో హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలు వేర్వేరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లుగా మారాయి.హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955 ప్రకారం 1960, ఆగస్టు 3న హైదరాబాద్, సికింద్రాబాద్‌ కార్పొరేషన్లను విలీనం చేసి ఒకే మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. 


* ప్రస్తుతం తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 16 మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ఉన్నాయి. 


* పరిపాలనా సౌలభ్యం కోసం నగర పాలక సంస్థను డివిజన్లుగా విభజిస్తారు. వాటిలోని ఓటర్లు రహస్య ఓటింగ్‌ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో కార్పొరేటర్లను ఎన్నుకుంటారు. 


* మైనార్టీ వర్గాలకు చెందిన ఇద్దరిని ‘కో-ఆప్టెడ్‌’ సభ్యులుగా నామినేట్‌ చేస్తారు. 


మేయర్, డిప్యూటీ మేయర్‌: కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్‌గా, మరొకరిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రాజకీయ అధిపతిగా, ప్రథమ పౌరుడిగా మేయర్‌ వ్యవహరిస్తారు, సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.


మున్సిపల్‌ కార్పొరేషన్‌-కమిషనర్‌: సీనియర్‌ ఐఏఎస్‌ క్యాడర్‌ వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పదవిలో నియమిస్తుంది. నగరపాలక సంస్థకు పరిపాలనాపరమైన అధిపతిగా కమిషనర్‌ వ్యవహరిస్తారు.కార్పొరేషన్‌ సమావేశాల అజెండాను రూపొందిస్తారు. తీర్మానాల అమలుకు కృషి చేస్తారు.


* పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం అయిదేళ్లు.


స్థాయీ సంఘాలు (స్టాండింగ్‌ కమిటీలు): పట్టణ స్థానిక సంస్థలకు స్థాయీ సంఘాలను ‘కళ్లు, చెవులు, చేతులు’గా పేర్కొంటారు. వీటిలో సంబంధిత సంస్థల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సభ్యులుగా ఉంటారు. ఇవి వార్షిక బడ్జెట్‌ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తాయి. అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని, రికార్డులను పొందుతాయి. 


స్థాయీ సంఘాలు - రకాలు: పురపాలక సంస్థలు పరిపాలనను సమర్థంగా నిర్వహించడానికి 6 రకాల స్థాయీ సంఘాలు సహకరిస్తాయి. * ఆర్థిక అంశాల స్థాయీ సంఘం * విద్యకు సంబంధించిన స్థాయీ సంఘం * వైద్య ఆరోగ్య స్థాయీ సంఘం * మహిళా సంక్షేమ స్థాయీ సంఘం * వెనుకబడిన వర్గాల సంక్షేమ స్థాయీ సంఘం * పన్నుల


స్థాయీ సంఘం


కంటోన్మెంట్‌ బోర్డు: సైనిక స్థావరాలున్న ప్రాంతాల్లో ప్రజలకు పౌర సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డులను ఏర్పాటుచేస్తారు. వీటికి సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. మన దేశంలో ఆంగ్లేయుల పాలనా కాలంలో 1924లో ‘కంటోన్మెంట్‌ బోర్డ్‌ యాక్ట్‌’ను తొలిసారిగా చేశారు. ఈ చట్టాన్ని 2006లో సవరించారు. ప్రస్తుతం మనదేశంలోని కంటోన్మెంట్‌ బోర్డుల సంఖ్య 62. వీటిలో ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. ఏడుగురు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. సంబంధిత ప్రాంత మిలిటరీ కమాండింగ్‌ ఆఫీసర్‌ ఈ బోర్డుకు హోదా రీత్యా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. కార్యనిర్వాహక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్‌ బోర్డు ఉంది.


నోటిఫైడ్‌ ఏరియా కమిటీలు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మున్సిపల్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు లేని చోట ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నోటిఫైడ్‌ ఏరియా కమిటీలను ఏర్పాటు చేస్తుంది. దీనిలోని సభ్యులందరినీ నామినేట్‌ చేస్తుంది. ఎన్నికైన సభ్యులు ఉండరు. ఇవి చట్టబద్ధమైన సంస్థలు కావు.


టౌన్‌ ఏరియా కమిటీలు: చిన్న చిన్న పట్టణాల్లో ప్రజలకు పౌర సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ‘టౌన్‌ ఏరియా కమిటీ’లను ఏర్పాటు చేస్తారు. ఇవి ‘సెమీ మున్సిపల్‌ అథారిటీ’ పద్ధతిలో ఉంటాయి. వీటిలో పూర్తిగా ఎన్నికైన లేదా నామినేట్‌ చేసిన లేదా కొంతమంది ఎన్నికైన లేదా నామినేట్‌ అయిన సభ్యులుంటారు. ఇవి చట్టబద్ధమైన సంస్థలు.


పోర్ట్‌ ట్రస్టు: నౌకాశ్రయాల పరిరక్షణ, నిర్వహణతోపాటు అందులోని ఉద్యోగులు, కార్మికులకు పౌరసదుపాయాలు కల్పించడానికి చట్టం ద్వారా పోర్టు ట్రస్టులను పార్లమెంటు  ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. వీటికి ఛైర్మన్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మేజర్‌ పోర్ట్‌ చట్టం-2021 ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 13 పోర్ట్‌ ట్రస్టులు ఉన్నాయి.


ప్రత్యేక ప్రయోజన సంస్థలు: పట్టణాల్లో బహుళ ప్రయోజనాల కోసం వివిధ అంశాలపై రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేస్తుంది. ఇవి స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిసి పనిచేస్తాయి. ఒక్కోసారి స్వతంత్రంగానూ విధులు నిర్వహిస్తాయి. వీటి అధిపతులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.


ఉదా: పట్టణాభివృద్ధి సంస్థలు, హౌసింగ్‌ బోర్డులు, ఎలక్ట్రికల్‌ సప్లయ్‌ బోర్డులు.


రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 29-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌