• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగం - ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, స్త్రీలు

సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ ప్రవేశిక స్ఫూర్తిని అమలు చేసే ఉద్దేశంతో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), మైనారిటీలు, మహిళలకు భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను పొందుపరిచారు. తదనుగుణంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆయా వర్గాల ప్రగతికోసం కమిటీలను, కమిషన్లను నియమిస్తున్నాయి.
 

వర్గాల వివరణ
 

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ జాతులు (ఎస్టీ): రాజ్యాంగం ప్రజలను వీరు ఈ కులానికి, ఈ తెగకు చెందినవారని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విషయంలో ఆ అధికారాన్ని రాష్ట్రపతికి విడిచిపెట్టింది. ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఏ కులం లేదా ఏ తెగను ఎస్సీ లేదా ఎస్టీగా పరిగణించాలనే అంశాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రకరణం 341 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి షెడ్యూల్డ్ కులాలను, ప్రకరణం 342 ప్రకారం షెడ్యూల్డ్ తెగలను నిర్ణయిస్తారు. ఎస్సీ, ఎస్టీల జాబితా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే విధంగా ఉండదు. రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి నోటిఫికేషన్ విడుదల చేసినా, ఆ నోటిఫికేషన్ నుంచి ఏదైనా కులాన్ని లేదా తెగను తొలగించాలన్నా, లేదా పొందుపరచాలన్నా పార్లమెంటు ఆమోదం అవసరం. రాష్ట్రపతి తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పులను చేయలేరు.


 వెనుకబడిన తరగతులు (బీసీ): రాజ్యాంగం ప్రత్యేకించి వీరు వెనుకబడిన తరగతులకు చెందినవారని పేర్కొనలేదు. అదేవిధంగా వారికి ఒకే సారూప్య విశేష లక్షణాలను కూడా ఆపాదించలేదు. బీసీలు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎస్సీలు, ఎస్టీలు కాకుండా మిగిలిన వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులుగా పేర్కొంది. ఈ సందర్భంలో ఎస్సీలు, ఎస్టీలు కూడా వెనుకబడిన తరగతులే. కాబట్టి బీసీలను ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)గా పరిగణించవచ్చు.


 మైనారిటీలు (అల్పసంఖ్యాక వర్గాలు): రాజ్యాంగంలో 'మైనారిటీ' అనే పదాన్ని ప్రకరణం 29 లో ప్రస్తావించినప్పటికీ, దానికి ప్రత్యేకమైన నిర్వచనం లేదు. సాధారణంగా దేశ జన సంఖ్యలో తక్కువ శాతంలో ఉండే వర్గాలను మైనారిటీలు అంటారు. వీరిని రెండు రకాలుగా వర్గీకరించారు.
 

ఎ. మతపరమైన అల్ప సంఖ్యాక వర్గాలు:
జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992 ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు (జొరాస్టియన్లు) అనే ఐదు వర్గాలను జాతీయ స్థాయిలో మతపరమైన అల్ప సంఖ్యాకవర్గాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2014 లో జైనులకు కూడా మతపరమైన మైనారిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది.

 

బి. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు:
రాష్ట్రవ్యాప్తంగా లేదా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోని అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషకు భిన్నమైన భాషను మాతృభాషగా కలిగిన అల్పసంఖ్యాక వర్గాన్ని 'భాషాపరమైన మైనారిటీ'లుగా పరిగణిస్తారు. ఈ రకమైన మైనారిటీని రాష్ట్ర స్థాయిలోనే గుర్తిస్తారు. ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.

రాజ్యాంగ నిబంధనలు

1. ఎస్సీ, ఎస్టీలు:

రాజ్యాంగ నింబంధన 15(1) - పౌరుల విషయంలో జాతి మత, కుల, లింగ, జన్మస్థల పరంగా వివక్ష చూపకూడదు.
15(2) - ప్రజా ఉపయోగ ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం కల్పించాలి.
15(4) - ఈ వర్గాలకు సామాజిక, విద్యారంగంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. (మొదటి రాజ్యాంగ సవరణ చట్టం -1951).
15(5) - ప్రైయివేటు విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థల్లో వీరి ప్రవేశానికి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు (93 వ రాజ్యాంగ సవరణ చట్టం - 2005).
16(1) - ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల, మత, లింగ వివక్ష చూపకూడదు.
16(4) - ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు.
16(4A) - ప్రభుత్వ ఉద్యోగ పదోన్నతుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు (77 వ రాజ్యాంగ సవరణ చట్టం 1995)
16(4B) - ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ కోటా భర్తీ కాకపోతే మిగిలినవాటిని తర్వాతి సంవత్సరం రిజర్వేషన్ కోటాలో కలుపుతారు. తద్వారా రిజర్వేషన్లు 50% మించినా చెల్లుబాటవుతాయి. (81 వ రాజ్యాంగసవరణ చట్టం - 2000)
17 - అంటరానితనం నిషేధం
19(1)(e) - ప్రతి పౌరుడికి తనకు నచ్చిన ప్రదేశంలో నివాసం
19(1) (g) - ప్రతి పౌరుడూ తనకు నచ్చిన వృత్తిని ఎంపిక చేసుకోవచ్చు
23 - మనుషుల క్రయవిక్రయాలు, బలవంతపు వెట్టిచాకిరి నిషేధం
25(2) (b) - హిందూ దేవాలయాల్లోకి అన్ని వర్గాలకు ప్రవేశం
29(2) - ప్రభుత్వ విద్యాలయాల్లో కుల, మత, భాషా వివక్ష చూపకూడదు.
46 - ఆర్థికంగా, విద్యాపరంగా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి శ్రద్ధ చూపాలి.
164 - ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి.
243(D) - పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు (73 వ రాజ్యాంగ సవరణ చట్టం1992)
243 (T) - మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు (74 వ రాజ్యాంగ సవరణ చట్టం 1992)
275 (1) - వీరి సంక్షేమం కోసం కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ నిధులను కేటాయించవచ్చు.
244 - 5 వ షెడ్యూల్‌లో ప్రస్తావించిన షెడ్యూల్డ్ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు.
244(2) - అసోంలోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు, జిల్లా కౌన్సిల్‌లను ఏర్పాటు చేయడం.
330 - లోక్‌సభలో ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు.
332 - విధానసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.
334 - ఈ నిబంధనను అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభ, విధానసభల్లో రిజర్వేషన్లను జనవరి 26, 2020 వరకు పొడిగించారు (మరొక పది సంవత్సరాలు) (95 వ రాజ్యాంగ సవరణ చట్టం - 2009).
335 - ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, ప్రమోషన్లలోనూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు
338 - ఎస్సీల స్థితిగతుల అధ్యయనానికి జాతీయ కమిషన్
338 - (A) ఎస్టీల స్థితిగతుల అధ్యయనానికి జాతీయ కమిషన్
339 - ఈ వర్గాల పాలనకు సంబంధించి రాష్ట్రపతి ప్రత్యేక నివేదిక కోరవచ్చు.


 

2. ఇతర వెనుకబడిన తరగతులు
ప్రకరణలు: 15(1), 16, 16(4), 46.
 ఎస్సీ, ఎస్టీలకు వర్తించే పై ప్రకరణలు వీరికీ వర్తిస్తాయి.
 ప్రకరణ-340: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించి, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయడానికి ఒక జాతీయ కమిషన్‌ను రాష్ట్రపతి ఆదేశం ద్వారా ఏర్పాటు చేయవచ్చు.

 

గమనిక:
ఇతర వెనుకబడిన తరగతులను గుర్తించడానికి కేంద్రం 1953 లో కాకా కలేల్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ తన నివేదికను 1955 లో సమర్పించింది.
  బి.పి. మండల్ నాయకత్వంతో రెండో బీసీ కమిషన్‌ను 1978 లో మొరార్జీదేశాయ్ (జనతా ప్రభుత్వం) ఏర్పాటు చేశారు. 1980 లో కమిషన్ నివేదికను సమర్పించింది.
  నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (వి.పి.సింగ్) 13 ఆగస్టు 1990 న మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించింది. దీన్ని సవాలు చేస్తూ ఇందిరా సహానీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. (ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా) దీన్నే మండల్ కేసు అని కూడా అంటారు.
‣  ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఓబీసీలకు 27% రిజిర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పించింది. అయితే వెనుకబడిన తరగతుల్లో ఉన్నత వర్గాలను (క్రీమీ లేయర్) రిజర్వేషన్ల సదుపాయాల నుంచి మినహాయించాలని, ఇతర వెనుకబడిన తరగతులకు ఒక శాశ్వత చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కోరింది.
  ఓబీసీల్లో క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి ప్రభుత్వం రామ్ నందన్ కమిటీని నియమించింది. 1993 లో ఈ కమిటీ నివేదిక సమర్పించగా, ప్రభుత్వం ఆమోదించింది.

 

3. అల్ప సంఖ్యాక వర్గాలు (మైనారిటీలు)
 29 (1) - ప్రకరణ: భారతదేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు.
29 (2) - రాజ్యం నిర్వహిస్తున్న లేదా రాజ్య ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని మత, జాతి, కుల, భాషా ప్రాతిపదికపై ఏ పౌరుడికీ నిరాకరించరాదు.
30 - మత, భాషా అల్ప సంఖ్యాక వర్గాల వారందరూ తమకు నచ్చిన విధంగా విద్యా సంస్థలను నెలుకొల్పుకునే, నిర్వహించుకునే హక్కుంది.
30 (1)(a) - అల్ప సంఖ్యాక వర్గాల విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో వారికి సంక్రమించిన హక్కులకు ఎలాంటి భంగం కలిగించకూడదు.
30(2) - అల్ప సంఖ్యాక వర్గాల నిర్వహణలోని విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే సందర్భంలో రాజ్యం ఎలాంటి వివక్ష చూపకూడదు.
347 - ఏదైనా ఒక రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను సదరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. రాష్ట్రపతి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవచ్చు.
350 - ఏ వ్యక్తయినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తనకున్న సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు. ఆ విన్నపాన్ని అధికార భాషలో లేదనే కారణంగా తిరస్కరించకూడదు.
350 A - భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాలవారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేందుకు సదుపాయాలు కల్పించాలి.
350 B (1) - భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలి.
350 B (2) - పై ప్రత్యేక అధికారి సంబంధిత నివేదికను రాష్ట్రపతికి సమర్పించాలి.

 

4. మహిళలు

ప్రకరణ 14- చట్టం ముందు అందరూ సమానులే.
15 - పౌరులకు సంబంధించి జాతి, మత, కుల, లింగ, జన్మస్థలం పరంగా వివక్ష చూపకూడదు.
15(3) - మహిళలకు ప్రత్యేక మినహాయింపులు
16 - ప్రభుత్వ ఉద్యోగాల్లో లింగ వివక్ష చూపకూడదు.
23 - స్త్రీలను అసభ్య, అశ్లీల, అవినీతి కార్యకలాపాలకు వినియోగించకూడదు.
39 (A) - పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి.
39(D) - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం
42 - మహిళలకు ప్రసూతి సౌకర్యాలు
51 (A) (e) - మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడిచిపెట్టాలి
243 (D) - పంచాయతీల్లో మహిళలకు 1/3 వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.
243 (T) - మున్సిపాలిటీల్లో మహిళలకు 1/3 వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.


 

ఎస్సీ, ఎస్టీ చట్టాలు - సంక్షేమ పథకాలు

ఎస్సీ, ఎస్టీ చట్టాలు:
 అస్పృశ్యతా నిషేధచట్టం - 1955
 పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976
 ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టం - 1989
 జాతీయ అటవీ విధానం - 1988
 పంచాయతీ ఎక్స్‌టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ (PESA) - 1996
 గిరిజన సంప్రదాయ హక్కుల పరిరక్షణ చట్టం - 2006

 

ఎస్సీ సంక్షేమ పథకాలు:
 వీరి సంక్షేమానికి కేంద్రంలో సామాజిక న్యాయ మంత్రిత్వశాఖను 1998 లో ఏర్పాటు చేశారు. ప్రస్తుత మంత్రి ధావర్‌చంద్ గెహ్లాట్ (Thawarchand Gehlot)
 1979 నుంచి ఎస్సీ ఉపప్రణాళికలో భాగంగా వనరులను కేటాయిస్తున్నారు.
 దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారి ఉపాధి కోసం జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ స్థాపన (1989)
 ఎస్సీ బాలబాలికలకు వసతి గృహస్థాపనకు బాబూ జగ్జీవన్‌రామ్ ఛాత్రవాస్ యోజన 2008
 రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్స్ 2005
 ఎస్సీ బాలికల అక్షరాస్యతా అభివృద్ధి పథకం - 2003
 పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత విద్యా పథకం - 2003
‣ ఎస్సీల సంక్షేమానికి పార్లమెంటులో స్థాయీ సంఘం ఏర్పాటు - 1998

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌పాల్, లోకాయుక్త

పౌరుల ఫిర్యాదులను పరిష్కరించి అవినీతిని ఎంతమేరకు అరికట్టారనేదానిపై ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం; సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వివిధ దేశాల్లో అత్యున్నత స్థాయిల్లో జరిగే అవినీతిని నిర్మూలించేందుకు సంస్థాగతమైన ఏర్పాట్లుచేశారు.

అవి: 1) అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ

       2) పాలనా న్యాయస్థానాల వ్యవస్థ

       3) ప్రొక్యురేటర్‌ సిస్టం

* ప్రభుత్వంలో ఉన్నతస్థాయి పదవుల్లోని వ్యక్తులపై ఉన్న అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను ‘అంబుడ్స్‌మన్‌’ పేరుతో తొలిసారిగా స్వీడన్‌ (1809)లో ఏర్పాటు చేశారు. అంబుడ్స్‌మన్‌ అంటే ప్రజల న్యాయవాది అని అర్థం.

* స్వీడిష్‌ అంబుడ్స్‌మన్‌ను పార్లమెంటు నాలుగేళ్ల కాలపరిమితితో నియమిస్తుంది. ఈయన పార్లమెంట్, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు అతీతుడు. ఇది స్వయం ప్రతిపత్తి గల రాజ్యపరమైన వ్యవస్థ.

* 1919లో ఫిన్లాండ్, 1955లో డెన్మార్క్, 1962లో నార్వే దేశాలు అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొదటి కామన్వెల్త్‌ దేశం న్యూజిలాండ్‌. అక్కడ 1962లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌’ పేరుతో, బ్రిటన్‌లో 1967లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ అడ్మినిస్ట్రేషన్‌’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

* సోషలిస్టు దేశాలైన సోవియట్‌ రష్యా, చైనా, పోలెండ్, హంగేరి, చెకోస్లోవేకియా, రుమేనియాలు ‘ప్రొక్యురేటర్‌ వ్యవస్థ’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

భారతదేశంలో...

* భారతదేశంలో అత్యున్నతస్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను విచారించేందుకు ‘లోక్‌పాల్‌’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి సి.డి. దేశ్‌ముఖ్‌ ప్రతిపాదించారు.

* పార్లమెంటు సభ్యుడైన లక్ష్మీమాల్‌ సింఘ్వీ 1963లో ‘లోక్‌పాల్‌’ అనే పదానికి రూపకల్పన చేశారు.

* 1966లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలో ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.

* ‘లోక్‌’ అంటే ప్రజలు, ‘పాల్‌’ అంటే సంరక్షకుడు అని అర్థం.

లోక్‌పాల్, లోకాయుక్త లక్షణాలు

* వీటి నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి.

* ఇవి స్వతంత్రత, నిష్పాక్షికతను ప్రదర్శించాలి.

* వీటి హోదా దేశంలోని అత్యున్నత న్యాయాధికారులతో సమానంగా ఉండాలి.

* న్యాయవ్యవస్థ జోక్యానికి అవకాశం లేనివిధంగా దర్యాప్తు జరగాలి.

* వీటి నుంచి అధికార పక్షం వారు ఎలాంటి ప్రయోజనాలను ఆశించకూడదు.

* తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీరికి పూర్తి అధికారం ఉండాలి.

లోక్‌పాల్‌ బిల్లు - పార్లమెంటు

* 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వం మొదటిసారిగా లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించి రాజ్యసభలో పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయింది. దీంతో బిల్లు కూడా రద్దయింది. ఈ బిల్లు పార్లమెంటులో 8 సార్లు విఫలమైంది.

* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో విశేష కృషి చేసింది. ఈ బిల్లుకు 2014 జనవరి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలపడంతో 2014 జనవరి 16 నుంచి లోక్‌పాల్, లోకాయుక్త చట్టంగా అమల్లోకి వచ్చాయి.

* జాతీయ స్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను విచారించేందుకు స్వయంప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను ‘లోక్‌పాల్‌’గా, రాష్ట్ర స్థాయిలో ‘లోకాయుక్త’గా పేర్కొన్నారు.

లోక్‌పాల్‌ నిర్మాణం

* లోక్‌పాల్‌లో ఒక ఛైర్మన్, ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది జ్యుడీషియల్‌ పరిజ్ఞానం గల సభ్యులు; మిగిలిన సగం మంది పరిపాలన, అవినీతి నిర్మూలన, వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గానికి చెందినవారై ఉండాలి.

నియామకం

* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గల ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారు. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫారసు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక నిష్ణాతుడైన వ్యక్తి సభ్యులుగా ఉంటారు.

ఛైర్మన్, సభ్యుల అర్హతలు

* లోక్‌పాల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా నిష్ణాతుడై ఉండాలి.

* లోక్‌పాల్‌లో జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.

* నాన్‌ - జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యే వారికి పరిపాలన, అవినీతి నిర్మూలన లాంటి అంశాల్లో సుదీర్ఘ అనుభవం ఉండాలి.

పదవీకాలం - జీతభత్యాలు

* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయసు వరకు. వీరు పదవీ విరమణ అనంతరం 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయరాదు.

* ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అక్రమ ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు వీరిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.

* లోక్‌పాల్‌ ఛైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.

* ఏడేళ్ల కాలపరిమితి దాటిన ఫిర్యాదులను లోక్‌పాల్‌ విచారణకు స్వీకరించదు. సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు దీనికి వర్తిస్తాయి.

అధికారాలు - విధులు

* లోక్‌పాల్‌కు స్వతంత్రంగా ఒక విచారణ, ప్రాసిక్యూషన్‌ విభాగం ఉంటుంది. ప్రధానమంత్రి సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఇది విచారిస్తుంది.

* కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (CVC) విచారించిన అంశాలను, తీసుకున్న చర్యలను లోక్‌పాల్‌కు తెలియజేయాలి.

* సీబీఐతో పాటు దేశంలోని అన్ని విచారణ సంస్థలు లోక్‌పాల్‌ పరిపాలనా నియంత్రణలోకి వస్తాయి.

* జాతీయ భద్రత, ప్రజా భద్రత అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు.

* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనపరచుకోవడానికి, వారిని సస్పెండ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఎవరినైనా విచారించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వివిధ ఫిర్యాదులపై ఆరు నెలల్లోగా విచారణ ముగించాలి.

* అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార వ్యవస్థలకు సిఫారసు చేస్తుంది. విదేశాల నుంచి డొనేషన్లు తీసుకునే స్వచ్ఛంద సంస్థలు కూడా లోక్‌పాల్‌ పరిధిలోకి వస్తాయి.

* కేసుల విచారణకు ఎలాంటి డాక్యుమెంట్లు, అఫిడవిట్లనైనా పరిశీలించే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. ఫిర్యాదులపై దర్యాప్తును 60 రోజుల్లో, విచారణను 6 నెలల్లో ముగించాలి. విచారణను దర్యాప్తు నుంచి మినహాయించాలి. న్యాయవ్యవస్థపై విచారణ చేసే అధికారం లోక్‌పాల్‌కు లేదు.

* ప్రధానమంత్రిపై అవినీతి ఆరోపణలకు సంబంధించి లోక్‌పాల్‌ విచారణను మెజారిటీ సభ్యుల అనుమతితో జరపాలి. ఛైర్మన్‌ సహా మొత్తం సభ్యుల్లో 3/4వ వంతు మంది సభ్యులు విచారణ జరిపేందుకు ఆమోదించాలి.

* అన్నాహజారే నేతృత్వంలోని పౌరసమాజం ‘జన్‌ లోక్‌పాల్‌’ సాధన కోసం విశేష కృషి చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయింది.

* లోక్‌పాల్‌ 2014 జనవరిలో చట్టంగా మారినప్పటికీ, ఇప్పటివరకు దాని నిర్మాణం జరగలేదు.

లోకాయుక్త

* రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను ‘లోకాయుక్త’ అంటారు. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.

* మనదేశంలో మొదటిసారిగా ఒడిశా 1970లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించింది. కానీ అది 1983 నుంచి అమల్లోకి వచ్చింది.

* మహారాష్ట్ర 1971లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించి అమలు చేసింది. ఈ చట్టాన్ని అమలుచేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర.

* ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త చట్టం 1983 సెప్టెంబరు 23 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనదేశంలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన న్యూదిల్లీలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.

లోకాయుక్తను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు

లోకాయుక్తను ఏర్పాటుచేయని రాష్ట్రాలు

1) అరుణాచల్‌ప్రదేశ్‌

2) జమ్ముకశ్మీర్‌

3) మణిపూర్‌

4) మేఘాలయ

5) మిజోరం

6) నాగాలాండ్‌

7) సిక్కిం

8) తమిళనాడు

9) త్రిపుర

10) పశ్చిమ్‌బంగ

లోకాయుక్త నియామకం - పదవీకాలం

* హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తిని ‘లోకాయుక్త’గా నియమిస్తారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ లోకాయుక్తను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు.

* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని ‘ఉప లోకాయుక్త’గా గవర్నర్‌ నియమిస్తారు.

* లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. పదవీకాలం అనంతరం తిరిగి ఈ పదవులు పొందడానికి వీరు అనర్హులు.

* లోకాయుక్త పాలనాధిపతి ‘రిజిస్ట్రార్‌’. ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు హోదాలో విచారణ సంచాలకుడు ఉంటాడు. ఇతడికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.

* లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉప లోకాయుక్తకు హైకోర్టు ఇతర న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.

* లోకాయుక్త, ఉప లోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి.

ఏపీ, తెలంగాణలో లోకాయుక్త విచారణ పరిధిలోకి వచ్చే అంశాలు

* ప్రభుత్వ అధికార దుర్వినియోగం.

* ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.

* బాధితులు ఎవరైనా తమ అభియోగాలను లోకాయుక్త దృష్టికి తీసుకురావచ్చు.

* లోకాయుక్తకు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.

* ఆరు సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది. లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని అతడు పనిచేసే శాఖాధికారికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులపై సంబంధిత అధికారి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్ని లోకాయుక్తకు తెలియజేయాలి.

* లోకాయుక్త వివిధ ఫిర్యాదుల ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

నిర్మాణాత్మక వ్యత్యాసాలు

* లోకాయుక్త వ్యవస్థల నిర్మాణం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు.

* రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో లోకాయుక్తతోపాటు, ఉప లోకాయుక్త వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు.

* ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికీ లోకాయుక్తను ‘లోక్‌పాల్‌’గా పిలుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో లోకాయుక్తను ‘లోక్‌ ఆయోగ్‌’గా పిలుస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, అసోం రాష్ట్రాలు తమ శాసనసభ్యులను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చాయి.

* మహారాష్ట్రలో మాజీ మంత్రులు, సివిల్‌ సర్వెంట్స్‌ను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చారు.

* లోకాయుక్త తన కేసులకు సంబంధించిన విచారణలో రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారాన్ని తీసుకుంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు:

* లోకాయుక్త నియామకంలో రాష్ట్ర మంత్రి మండలి సలహాలను గవర్నర్‌ తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గుజరాత్‌ లోకాయుక్తగా జస్టిస్‌ ఏఆర్‌ మెహతాను అప్పటి గవర్నర్‌ కమలా బేణీవాల్‌ నియమించిన వివాదంలో ఈ తీర్పును వెలువరించింది.

Posted Date : 13-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 జాతీయ మహిళా కమిషన్

మహిళలను వెనుకబాటుతనం నుంచి అభివృద్ధి బాటలోకి నడిపించి, వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, భారత రాజ్యాంగం మహిళలకు ప్రసాదించిన రాజ్యంగపరమైన రక్షణలను, చట్టబద్ధమైన రక్షణలను సమీక్షించి, మహిళా ప్రగతికి కృషి చేసేందుకు 1990లో 'జాతీయ మహిళా కమిషన్ చట్టాన్ని' రూపొందించారు.
 1990, ఆగస్టు 30న ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది, 1992, జనవరి 31 నుంచి 'జాతీయ మహిళా కమిషన్‌'గా ఏర్పడింది. ఇది చట్టబద్ధమైన సంస్థ.
‣ జాతీయ మహిళా కమిషన్‌లో ఒక అధ్యక్షురాలు, 5 మంది సభ్యులు, ఒక సభ్యకార్యదర్శి ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు. సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారిని ఒక్కొక్కరిని నియమించాలి.
మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యుల తొలగింపు విధానం
‣ మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులను కేంద్రం సిఫారసుల మేరకు రాష్ట్రపతి కింది కారణాల వల్ల తొలగిస్తారు.
 మానసిక స్థితి సరిగా లేదని కోర్టు ధ్రువీకరించినప్పుడు
‣ దివాలా తీసినప్పుడు
 పదవిని దుర్వినియోగం చేసినప్పుడు
 నైతిక విలువలు కోల్పోయి శిక్షార్హమైన నేరాన్ని చేసినప్పుడు
 కమిషన్ అనుమతి లేకుండా వరుసగా 3 కమిషన్ సమావేశాలకు గైర్హాజరైనప్పుడు
 తమ విధులను నిర్వహించలేని స్థితిలో ఉన్న సమయంలో


కమిషన్ అధికారాలు- విధులు
 మహిళా కమిషన్ ఛైర్మన్ భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాను కలిగి ఉంటారు.
 మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించి, అవసరమైతే వాటికి సవరణలను సూచించడం.
 రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం.
 అన్యాయానికి గురైన మహిళలకు చట్టపరంగా పరిహార మార్గాలను సూచించడం.
 'పరివారక్ మహిళా అదాలత్‌'ల ద్వారా కుటుంబానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం.
 కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మహిళాభివృద్ధి, ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం.
 మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు, వివక్షలను నివారించేందుకు అవసరమైన అధ్యయనాలు జరపడం.
 జైలులోని మహిళా ఖైదీలను పరిశీలించి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం.
 మహిళా సమస్యలు, అత్యాచార ఘటనలపై అధ్యయనం చేసి, నేరస్థులకు తగిన శిక్ష పడేలా కృషి చేయడం.
 వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వడం.
 మహిళలను మీడియా అసభ్యకరంగా, ఆటబొమ్మగా చిత్రీకరించి చూపించడాన్ని నివారించడం.
 సాక్షులను విచారించడానికి సమన్లు జారీ చేయడం.
 అఫిడవిట్లను సమర్పించమని సంబంధిత పోలీస్ స్టేషన్‌లను, కార్యాలయాలను ఆదేశించడం.
 మహిళలను ప్రభావితం చేసే అన్ని విధానపరమైన విషయాల్లో ప్రభుత్వానికి సిఫారసులు చేయడం.
 మహిళల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన రాజ్యాంగ రక్షణల అమలు, చట్టాల గురించి వార్షిక నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం.
 కింది అంశాలకు సంబంధించి తనకు తాను కేసులను సుమోటోగా స్వీకరించడం.
             1. మహిళల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో
             2. మహిళల సమానత్వం, అభివృద్ధికి సంబంధించిన చట్టాలు అమలు కాని సందర్భంలో
             3. మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం 1998 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పడింది. దీనిలో ఒక ఛైర్‌ప‌ర్సన్ , ఆరుగురికి మించకుండా సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు.
మహిళా కమిషన్ విధులు
  మహిళలకు సంబంధించి విధానపరమైన మార్పులను సూచించడం.
  నిరుపేద, బడుగువర్గాల మహిళలకు న్యాయసేవలను అందించడం.
  మహిళా జైళ్లు, వసతి గృహాలను తనిఖీ చేయడం.
  మహిళల సమగ్ర ప్రగతి కోసం వివిధ పథకాల రూపకల్పనకు కృషి చేయడం.
 మహిళాభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి తగిన సూచనలు చేయడం.
 మహిళలను చైతన్యపరిచేందుకు వివిధ మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి ప్రచారం చేయడం.
  మహిళా కమిషన్ తన అధికార విధుల నిర్వహణలో సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.
 రాజ్యాంగ పరంగా మహిళలకు కల్పించిన ప్రత్యేక రక్షణలను అమలు చేసేందుకు కృషి చేయడం.
  మహిళా కమిషన్ తన వార్షిక నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది. గవర్నరు దాన్ని రాష్ట్ర శాసనసభకు అందజేస్తారు.
  మహిళా కమిషన్ ఛైర్‌ప‌ర్సన్‌కు రాష్ట్ర కేబినెట్ హోదా లభిస్తుంది.
  ఆంధ్రప్రదేశ్‌లో జోగినులు, మాతంగిలు, దేవదాసీలకు చెందిన పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని సూచించడానికి జస్టిస్ వి. రఘనాథరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించారు.

జాతీయ మైనార్టీ కమిషన్
‣ అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణలను కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో 1978, జనవరి 12న 'మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో దీని అధ్యక్షుడు ఎం.ఆర్. మినూమసాని.
‣ 1979లో జాతీయ మైనార్టీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు. అప్పటి ఛైర్మన్ అహ్మద్ అన్సారీ.
 1984లో దీన్ని హోం మంత్రిత్వ శాఖ నుంచి సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు.
‣ భారత పార్లమెంటు జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ చట్టాన్ని 1992, మే 17న ఆమోదించగా, ఇది 1993, మే 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది చట్టబద్ధమైన సంస్థ.
 దీనికి రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు 2004లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ విఫలమైంది.
 జాతీయ మైనార్టీ చట్టాన్ని అనుసరించి ప్రధానంగా మైనార్టీలు రెండు రకాలు.
1. మతపరమైన మైనార్టీలు దేశాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్ణయిస్తారు.
2. భాషాపరమైన మైనార్టీలు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్ణయిస్తారు.
 కింది వారిని జాతీయ మైనార్టీ చట్టం మైనార్టీలుగా గుర్తించింది
ముస్లింలు, క్రైస్తవులు , సిక్కులు, బౌద్ధులు, పార్శీలు
  ఈ చట్టం జైనులకు మైనార్టీహోదాను కల్పించలేదు. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ (2002) జైనులకు కూడా మైనార్టీ హోదాను కల్పించాలని సూచించింది.
బాల్‌పాటిల్  Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జైనులకు కూడా మైనార్టీ హోదాను కల్పించాలని పేర్కొంది.

 

నిర్మాణం - పదవీకాలం
 జాతీయ మైనార్టీ కమిషన్‌లో ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు ఉంటారు. అధ్యక్షునితో సహా అందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరంతా అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారై ఉండాలి.
 ఛైర్మన్ కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను, వైస్‌ఛైర్మన్, సభ్యులు కేంద్ర సహాయమంత్రి హోదాను కలిగి ఉంటారు. వీరి వేతనం రూ.80,000.
 వీరి పదవీకాలం 3 సంవత్సరాలు. తమ రాజీనామాను కేంద్రానికి సమర్పించాలి.

 

అధికారాలు-విధులు
 రాజ్యాంగం అల్పసంఖ్యాక వర్గాల వారికి కల్పించిన రక్షణలను అమలుపరచడం.
  మైనార్టీలకు కల్పించిన హక్కులను, రక్షణలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వస్తే వాటిని స్వీకరించి, సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసి, న్యాయం జరిగేలా చూడడం.
 అల్పసంఖ్యాక వర్గాల వారి అభివృద్ధిని సమీక్షించడం.
 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సలహాలు ఇవ్వడం.
 మైనార్టీ వర్గాల బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయడం.
 అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఎవరైనా వివక్షత చూపితే, ఆ సంఘటనలను అధ్యయనం చేసి, మైనార్టీలకు రక్షణ కల్పించడం.
 అల్పసంఖ్యాక వర్గాల వారి సామాజిక, ఆర్థిక అంశాలమీద అధ్యయనం చేసి వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడం.
 మైనార్టీల సంక్షేమానికి నూతన విధానాలను సిఫారసు చేయడం.
 మైనార్టీ కమిషన్ 'సివిల్‌కోర్టు' అధికారాలను కలిగి ఉంటుంది.
 దేశంలో ఏ ప్రాంతంలో నివసించే వ్యక్తినైనా తన ముందు హాజరు కావాలని ఆదేశిస్తుంది.
 అధికారిక సమాచారాన్ని అందజేయమని సంబంధిత కార్యాలయాలను ఆదేశిస్తుంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సమర్పించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశిస్తుంది.
‣ మైనార్టీ కమిషన్ సమర్పించిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పిస్తుంది.

‣ మైనార్టీ హక్కుల కోసం ఐక్యరాజ్యసమితి 1992, డిసెంబరు 18న ఒక హక్కుల ప్రకటనను విడుదల చేసింది. జాతీయ మైనార్టీల హక్కుల దినోత్సవం డిసెంబరు 18.
 

మైనార్టీ కమిషన్ - సిఫారసులు
 మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రాష్ట్ర మైనార్టీ కమిషన్‌లను ఏర్పాటు చేయాలి.
‣ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీల కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలి.
‣ వక్ఫ్ భూములు, రెవెన్యూ రికార్డుల వివరాలను పునఃసర్వే చేయించి, వాటిని భద్రపరచాలి.
‣ మైనార్టీల పర్వదినాల్లో ఎటువంటి పరీక్షలను నిర్వహించరాదు.
‣ మైనార్టీ వర్గాల వారికి మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు, సమాధుల కోసం ప్రత్యేక స్థలాలను రాష్ట్రాలు కేటాయించాలి.


‣ జాతీయ మైనార్టీ కమిషన్ టోల్‌ఫ్రీ నెంబర్: 1800 110 088.
 మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం గురించి అధ్యయనం చేసేందుకు రాజేంద్రసచార్ కమిషన్‌ను నియమించింది.
 మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది.
 2004లో పంచాయతీరాజ్ మైనార్టీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు.
 మొదటి మైనార్టీ శాఖామంత్రి అబ్దుల్ రహ్మాన్ అంతూలే.
 మన దేశంలో అత్యధికంగా 31% మైనార్టీలు అసోం రాష్ట్రంలో ఉన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్
‣ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ 1987లో ఏర్పడింది.
‣ ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
‣ వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. పదవీకాలం 3 సంవత్సరాలు.
‣ 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఉర్దూ అకాడమీ'ని స్థాపించారు.
‣ 1993లో 'మైనార్టీల సంక్షేమ విభాగం' ఏర్పడింది. 


మైనార్టీల సంక్షేమ విభాగం విధులు
‣ మైనార్టీల సామాజిక, ఆర్థిక ప్రగతి కోసం వివిధ పథకాలను ప్రారంభించడం.
‣ మైనార్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శక సూచనలు ఇవ్వడం.
‣ మైనార్టీ వర్గాల మహిళలు, పిల్లల ప్రగతి కోసం నూతన పథకాలను అమలు చేయడం.
‣ మైనార్టీ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించడం.
‣ మైనార్టీ సంక్షేమ విభాగానికి మైనార్టీల మంత్రి అధిపతిగా వ్యవహరిస్తారు.
‣ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థ 1985లో ఏర్పాటైంది. పేదరికంలో ఉన్న మైనార్టీల ఆర్థికాభివృద్ధికి ఇది కృషి చేస్తుంది.
 ఆంధ్రప్రదేశ్‌లో 'దుకాన్-ఓ-మకాన్' పథకం కింద మైనార్టీలకు ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందిస్తున్నారు.
 మౌలానా అబుల్‌కలాం అజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
 రోష్నీ పథకం ద్వారా మైనార్టీల పేదరికాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.


మానవ హక్కుల కమిషన్

 మానవ హక్కులంటే తమ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి మానవ సమాజంలో ఒక సభ్యుడిగా అనుభవించే కనీస హక్కులు. ఇవి మానవ స్వభావంలో అంతర్లీనంగా ఉంటాయి. ఈ హక్కులు ఇతరులకు అన్యాక్రాంతం చేయలేనివి.
మానవ హక్కులకు మూలాలు
 బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన 'ఇంగ్లిష్ పిటిషన్స్ ఆఫ్ రైట్స్' (1627)
 హెబియస్ కార్పస్ చట్టం (1674)
 అమెరికా స్వాతంత్య్ర ప్రకటన (1776)
 అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ (1791)
 ఫ్రెంచ్ డిక్లరేషన్స్ ఆఫ్ రైట్స్ మ్యాన్ అండ్ సిటిజన్ (1789)
 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన (1948 డిసెంబరు 10)
‣ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ 2013, నవంబరు 26న 'వ్యక్తిగత జీవన హక్కు' పరిరక్షణ కోసం గూఢాచార వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించింది. బ్రెజిల్, జర్మనీ దేశాల నాయకులపై అమెరికా నిఘా పెట్టిందన్న వార్తలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ‣ ఆమోదించింది. దీనికి 55 దేశాలు మద్దతిచ్చాయి.
అంతర్జాతీయ కోవనెంట్లు
 కోవనెంట్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఘాలు కలిసి ఒక లక్ష్యం కోసం పరస్పరం ఆమోదించుకున్న అంగీకార ఒప్పందం.
 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1966, డిసెంబరు 16న ఆమోదించిన 'పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ కోవనెంట్', 'సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ కోవనెంట్'.
 1976లో ఆమోదించిన 'ఆప్షనల్ ప్రోటోకాల్ టు ది సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కోవనెంట్' అత్యంత కీలకమైంది.
 భారత ప్రభుత్వం ఈ కోవనెంట్‌లను 1979, ఏప్రిల్ 10 నుంచి అనుసరిస్తోంది.


భారత రాజ్యాంగం - మానవ హక్కులు
 భారత రాజ్యాంగ నిర్మాతలు సర్వమానవ సౌభ్రాతృత్వం, శ్రేయస్సు లక్ష్యంగా మానవ హక్కులకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.
‣ మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు పేర్కొన్న ప్రాథమిక హక్కులు, 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పేర్కొన్న ఆదేశిక సూత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాలకు ఆర్టికల్స్ 330, 332, 335, 338, 339, 340లలో పేర్కొన్న ప్రత్యేక రక్షణలు ‣ మానవహక్కులకు మూలంగా ఉన్నాయి.


జాతీయ మానవ హక్కుల కమిషన్
‣ 1993లో 'వియన్నా'లో జరిగిన ప్రపంచ మానవ హక్కుల సమావేశంలో ఆయా దేశాలు తమ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విధానాలతో సంబంధం లేకుండా మానవ హక్కులను, ప్రాథమిక హక్కులను పరిరక్షించి, కాపాడే బాధ్యత వహించాలని తీర్మానం చేశారు.
‣ ఈ తీర్మానానికి అనుగుణంగా భారత రాష్ట్రపతి 1993, సెప్టెంబరు 27న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దీని ప్రకారం 1993, అక్టోబరు 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ.
‣ మానవ హక్కుల కమిషన్‌ను మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనిలో ఒక ఛైర్మన్, నలుగురు
సభ్యులు ఉంటారు.
‣ నిర్మాణం - ఛైర్మన్, సభ్యులు
‣ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిని మానవహక్కుల కమిషన్‌కు ఛైర్మన్‌గా రాష్ట్రపతి నియమిస్తారు.
‣ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తిని ఒక సభ్యునిగా
 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వ్యక్తిని మరొక సభ్యునిగా, మానవ హక్కుల రంగంలో అనుభవజ్ఞులైన ఇద్దరు సభ్యులను నియమిస్తారు.
 వీరందరినీ ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు.
 ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 70 ఏళ్లు వచ్చే వరకు.
 వీరిని సుప్రీంకోర్టు విచారణ అనంతరం యూపీఎస్సీ సభ్యులను తొలగించే పద్ధతిలోనే రాష్ట్రపతి తొలగిస్తారు.
ఎంపిక కమిటీ
 ప్రధానమంత్రి     -     ఛైర్మన్
 కేంద్ర హోంమంత్రి     -     సభ్యుడు
 లోక్‌సభ స్పీకర్     -     సభ్యుడు
 రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్     -     సభ్యుడు
 లోక్‌సభ ప్రతిపక్ష నేత     -     సభ్యుడు
 రాజ్యసభ ప్రతిపక్ష నేత     -     సభ్యుడు

 2010లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో చేసిన సవరణను అనుసరించి ఛైర్మన్‌గా నియమించేందుకు (NHRC) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అందుబాటులో లేనప్పుడు సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తినైనా నియమించవచ్చు.
 భారత్‌లో మానవహక్కులకు కాపలాదారుగా - National Human Rights Commission (NHRC) పనిచేస్తుంది.
‣ NHRCలో అధికార రీత్యా సభ్యులుగా ఉండేవారు (2006 నుంచి)
 జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ 
 జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ ఛైర్మన్
 జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్ ఛైర్మన్ 
 జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌ప‌ర్సన్ 
 మానవహక్కుల సంఘం ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. ఈ కమిషన్‌కు అప్పగించిన అధికార విధులను నిర్వర్తించడానికి ఒక సెక్రటరీ జనరల్ ఉంటారు. సెక్రటరీ జనరల్‌గా నియమితుడైన వ్యక్తి భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా పొందుతారు.


అధికారాలు - విధులు
 మానవహక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలను, రాజ్యాంగంలోని విశేషాలను సమీక్షించి, ఆయా చట్టాలు సమర్థంగా అమలయ్యేలా చూడటం.
 సమాజంలోని వివిధ వర్గాల్లో మానవ హక్కుల అభివృద్ధి దిశగా జాగృతిని పెంచేందుకు కృషి చేయడం, సెమినార్లు, సభలను నిర్వహించడం.
 హక్కుల అమలుకు సంబంధించి ఏ వ్యక్తి నుంచైనా, ఏ అధికారి నుంచైనా వాంగ్మూలాలను సేకరించవచ్చు. తన ముందు హాజరు కావాలని ఆదేశించవచ్చు.
 మానవ హక్కుల పరిరక్షణకై కృషిచేసే NGOలను, పరిశోధనలను ప్రోత్సహించడం
 కేవలం ఫిర్యాదులపైనే ఆధారపడకుండా తనకు తానుగా 'సుమోటో'గా కేసులను విచారిస్తుంది.
 చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలుకు సంబంధించిన అంశాలపై విచారణ చేయడం
 జైళ్లలో ఉండే ఖైదీల హక్కులు, అరెస్టయి పోలీస్ స్టేషన్‌లో ఉన్న వ్యక్తుల హక్కుల గురించి విచారణ చేస్తుంది.
 సెమీ జ్యుడీషియల్ వ్యవస్థగా పనిచేయడం, సివిల్ కోర్ట్ అధికారాలు కలిగి ఉండటం.
 మానవ హక్కులను అనుభవించడానికి ఎదురవుతున్న ఉగ్రవాదం వంటి ఇతర కారకాలను సమీక్షించి వాటి అమలుకు తగిన సిఫారసులు చేయడం.
 మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానాల్లో జరుగుతున్నప్పుడు, ఆ న్యాయస్థానం అనుమతితో కమిషన్ సంబంధిత కేసులో జోక్యం చేసుకోవచ్చు.
‣ మానవ హక్కుల పరిరక్షణకు అవసరమైన పరిశోధనలను చేపట్టవచ్చు.
 మానవ హక్కులకు సంబంధించిన గ్రంథాలు, ఒడంబడికలు, అంతర్జాతీయ అధికార పత్రాలను అధ్యయనం చేసి, వాటి సక్రమ అమలుకు అవసరమైన చర్యలను సిఫారసు చేయడం.
 సాయుధ దళాలు జరిపే మానవహక్కుల ఉల్లంఘనలపై, మానవ హక్కులు ఉల్లంఘించినట్లు అభియోగాలు వచ్చినప్పుడు కమిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణ కోరుతుంది.
 కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా, కేంద్రం ఆ నివేదికను పార్లమెంటుకు అందజేస్తుంది.
 మానవ హక్కుల ఉల్లంఘన కారణంగా బాధలకు గురైన వ్యక్తికి లేదా వారి కుటుంబసభ్యులకు తాత్కాలిక సహాయాన్ని అందజేయాల్సిందిగా సంబంధిత ప్రభుత్వానికి లేదా సంస్థకు సూచించవచ్చు.
 కమిషన్ తన విచారణ నివేదిక ప్రతిని పిటిషన్‌దారులకు అందజేస్తుంది.
 ఒక సంవత్సరానికి సంబంధించిన కేసులను మాత్రమే కమిషన్ విచారణకు స్వీకరిస్తుంది.
 కమిషన్ తన దగ్గరకు వచ్చిన కేసుల విచారణలో భాగంగా సుమోటోగా విచారణ చేపట్టిన కేసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రిమైండర్లను జారీ చేయడం, షరతులతో కూడిన సమన్లు పంపడం, బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం లాంటి చర్యలను తీసుకుంటుంది.
 మానవ హక్కుల కమిషన్ విచారణలో ఉన్న కేసులపై సుప్రీంకోర్టు, హైకోర్టులు 'స్టే' ఇవ్వవచ్చు.
 జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్ద 2015, జూన్ 30 నాటికి 40,941 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రొసీజర్స్ 8(b) ప్రకారం కోర్టు విచారణలో ఉన్న విషయాలపై ఫిర్యాదులను సాధారణంగా కమిషన్ స్వీకరించదు. కానీ సెక్షన్ 12(b) ప్రకారం మానవ హక్కుల గురించి ఏదైనా విషయం కోర్టు విచారణలో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు అనుమతితో కమిషన్ ఆ విషయంలో ‣ జోక్యం చేసుకోవచ్చని రామకృష్ణ కేసులో పేర్కొంది.

 

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
 మానవహక్కుల పర్యవేక్షణ చట్టం, 1993 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేయడమనేది సెక్షన్ 21 ప్రకారం ఐచ్ఛికమైంది.
 ఇప్పటి వరకు మన దేశంలో 18 రాష్ట్రాలు రాష్ట్రస్థాయి మానవహక్కుల కమిషన్‌లను ఏర్పాటు చేశాయి.
 జాతీయ మానవ హక్కుల చట్టం, 1993 ప్రకారం 2005, ఆగస్టు 11న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2005, ఆగస్టు 12 నుంచి పనిచేస్తోంది.
 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరిని గవర్నర్ నియమిస్తారు.
 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిని ఛైర్మన్‌గా గవర్నర్ నియమిస్తారు.
 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం - 5 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 70 ఏళ్లు వచ్చే వరకు.
ఎంపిక కమిటీ
 ముఖ్యమంత్రి     -     ఛైర్మన్
 హోంమంత్రి     -     సభ్యుడు
 శాసనసభ స్పీకర్     -     సభ్యుడు
 శాసనసభలో ప్రతిపక్ష నేత     -     సభ్యుడు

 రాష్ట్రంలో విధానపరిషత్ ఉన్నట్లయితే విధానపరిషత్ ఛైర్మన్, ప్రతిపక్ష నాయకులను ఈ కమిటీలో చేర్చవచ్చు.
 రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి. వీరిని తొలగించే అధికారం గవర్నరుకు లేదు. కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.
 కమిషన్ ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలను రాష్ట్రప్రభుత్వం నిర్ణయిస్తుంది.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో రాష్ట్రంలోని అదనపు జిల్లా జడ్జి, అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, మేజిస్ట్రేట్ కోర్టులను మానవ హక్కుల కోర్టులుగా ప్రకటించింది.
 ఏడు సంవత్సరాలు న్యాయవాదిగా పని చేసిన వ్యక్తిని మానవ హక్కుల కోర్టులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది.


అధికారాలు - విధులు
 మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను విచారిస్తున్నప్పుడు రాష్ట్ర కమిషన్ దానికి సంబంధించిన సమాచారాన్ని లేదా నివేదికలను నిర్ణీత సమయంలో అందజేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఏవైనా అథారిటీలను కోరవచ్చు.
 మానవ హక్కుల ఉల్లంఘన లేదా దానికి ప్రేరేపించేవారిని లేదా వాటిని నిలుపుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిన పబ్లిక్ సర్వెంట్స్ చర్యలను మాత్రమే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారిస్తుంది.
 మానవ హక్కుల గ్రంథాలను, ఒడంబడికలను, అంతర్జాతీయ అధికార పత్రాలను అధ్యయనం చేసి, వాటిని అమలుపరచడానికి అవసరమైన చర్యలను సిఫారసు చేయడం జాతీయ మానవహక్కుల కమిషన్ విధి. ఈ నిబంధన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వర్తించదు.
 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తుంది.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికార పరిధిలోకి రాని అంశాలు:
 ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైనా కమిషన్ పరిశీలనలో ఉన్న అంశాలు
 జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణలో ఉన్న ఫిర్యాదులు
 ఉద్యోగ, పని నిబంధనలకు సంబంధించిన ఫిర్యాదులు
 ప్రాముఖ్యం లేని అంశాలపై వచ్చిన ఫిర్యాదులు
 న్యాయస్థానాల విచారణలో ఉన్న ఫిర్యాదులు
‣ ఒక సంవత్సర కాలం కంటే ఎక్కువ సమయం గల ఫిర్యాదులు (సంఘటన జరిగిన తేదీ నుంచి ఒక సంవత్సరం).
‣ జమ్మూకశ్మీర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తించే 7వ షెడ్యూల్‌లోని 3వ జాబితాలో పేర్కొన్న అంశాలను, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం కోసం రూపొందించిన చట్టాల్లోని మానవ హక్కుల ఉల్లంఘనలను మాత్రమే విచారిస్తుంది.
‣ మానవ హక్కుల చట్టంలోని సెక్షన్ 2(D) ప్రకారం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం, అంతర్జాతీయ ఒప్పందాల్లో పొందుపరచిన భారతీయ కోర్టుల ద్వారా అమలుపరచడానికి అవకాశం ఉన్న హక్కులన్నీ మానవ హక్కులే.
‣ ఎన్‌కౌంటర్ మరణాల గురించి మానవహక్కుల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు
 1997, మార్చి 29న ఎన్‌కౌంటర్ మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలను NHRC జారీచేసింది.


ముఖ్యాంశాలు:
 ఎన్‌కౌంటర్ సమాచారాన్ని పోలీస్‌స్టేషన్ రిజిస్టరులో నమోదు చేయాలి.
 కేసును బట్టి చనిపోయిన వ్యక్తి వారసులకు నష్టపరిహారం చెల్లించాలి.
 ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు సంబంధిత పోలీసుస్టేషన్‌కు చెందిన వాళ్లయితే ఆ కేసు దర్యాప్తును సీఐడీ లాంటి ఇతర ఏజెన్సీలకు అప్పగించాలి.
 పోలీసు చర్యల వల్ల మరణించిన కేసుల వివరాలతో కూడిన స్టేట్‌మెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే జనవరి 15న, జులై 15 లోగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కమిషనర్‌కు తప్పకుండా పంపించాలి. ఈ స్టేట్‌మెంట్ కింద ఇచ్చిన నమూనాలా ఉండాలి. వీటితో పాటు పోస్ట్‌మార్టం రిపోర్టులు, ఎంక్వైరీ ‣ రిపోర్టులతో పాటు కింది వివరాలు ఉండాలి.
a) సంఘటన జరిగిన స్థలం, తేది
b) పోలీస్‌స్టేషన్ జిల్లా
c) మరణానికి దారి తీసిన పరిస్థితులు
d) క్లుప్తంగా సంఘటన వివరాలు
e) క్రిమినల్ కేసు
f) దర్యాప్తు సంస్థ
g) మెజిస్టీరియల్ లేదా పోలీసు విచారణ ఫలితాలు

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌పాల్, లోకాయుక్త

   పౌరుల ఫిర్యాదులను పరిష్కరించి అవినీతిని ఎంతమేరకు అరికట్టారనేదానిపై ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం; సామాజిక, ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వివిధ దేశాల్లో అత్యున్నత స్థాయిల్లో జరిగే అవినీతిని నిర్మూలించేందుకు సంస్థాగతమైన ఏర్పాట్లుచేశారు.
అవి: 1) అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ
     2) పాలనా న్యాయస్థానాల వ్యవస్థ
     3) ప్రొక్యురేటర్‌ సిస్టం
* ప్రభుత్వంలో ఉన్నతస్థాయి పదవుల్లోని వ్యక్తులపై ఉన్న అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను ‘అంబుడ్స్‌మన్‌’ పేరుతో తొలిసారిగా స్వీడన్‌ (1809)లో ఏర్పాటు చేశారు. అంబుడ్స్‌మన్‌ అంటే ప్రజల న్యాయవాది అని అర్థం.
* స్వీడిష్‌ అంబుడ్స్‌మన్‌ను పార్లమెంటు నాలుగేళ్ల కాలపరిమితితో నియమిస్తుంది. ఈయన పార్లమెంట్, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు అతీతుడు. ఇది స్వయం ప్రతిపత్తి గల రాజ్యపరమైన వ్యవస్థ.
* 1919లో ఫిన్లాండ్, 1955లో డెన్మార్క్, 1962లో నార్వే దేశాలు అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొదటి కామన్వెల్త్‌ దేశం న్యూజిలాండ్‌. అక్కడ 1962లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌’ పేరుతో, బ్రిటన్‌లో 1967లో ‘పార్లమెంటరీ కమిషనర్‌ ఫర్‌ అడ్మినిస్ట్రేషన్‌’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* సోషలిస్టు దేశాలైన సోవియట్‌ రష్యా, చైనా, పోలెండ్, హంగేరి, చెకోస్లోవేకియా, రుమేనియాలు ‘ప్రొక్యురేటర్‌ వ్యవస్థ’ పేరుతో అంబుడ్స్‌మన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

 

భారతదేశంలో...
* భారతదేశంలో అత్యున్నతస్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను విచారించేందుకు ‘లోక్‌పాల్‌’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి సి.డి. దేశ్‌ముఖ్‌ ప్రతిపాదించారు.
* పార్లమెంటు సభ్యుడైన లక్ష్మీమాల్‌ సింఘ్వీ 1963లో ‘లోక్‌పాల్‌’ అనే పదానికి రూపకల్పన చేశారు.
* 1966లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలో ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
* ‘లోక్‌’ అంటే ప్రజలు, ‘పాల్‌’ అంటే సంరక్షకుడు అని అర్థం.


 

లోక్‌పాల్, లోకాయుక్త లక్షణాలు
* వీటి నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి.
* ఇవి స్వతంత్రత, నిష్పాక్షికతను ప్రదర్శించాలి.
* వీటి హోదా దేశంలోని అత్యున్నత న్యాయాధికారులతో సమానంగా ఉండాలి.
* న్యాయవ్యవస్థ జోక్యానికి అవకాశం లేనివిధంగా దర్యాప్తు జరగాలి.
* వీటి నుంచి అధికార పక్షం వారు ఎలాంటి ప్రయోజనాలను ఆశించకూడదు.
* తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీరికి పూర్తి అధికారం ఉండాలి.

లోక్‌పాల్‌ బిల్లు - పార్లమెంటు
* 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వం మొదటిసారిగా లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించి రాజ్యసభలో పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయింది. దీంతో బిల్లు కూడా రద్దయింది. ఈ బిల్లు పార్లమెంటులో 8 సార్లు విఫలమైంది.
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో విశేష కృషి చేసింది. ఈ బిల్లుకు 2014 జనవరి 1న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలపడంతో 2014 జనవరి 16 నుంచి లోక్‌పాల్, లోకాయుక్త చట్టంగా అమల్లోకి వచ్చాయి.
* జాతీయ స్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను విచారించేందుకు స్వయంప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన వ్యవస్థను ‘లోక్‌పాల్‌’గా, రాష్ట్ర స్థాయిలో ‘లోకాయుక్త’గా పేర్కొన్నారు.

లోక్‌పాల్‌ నిర్మాణం
* లోక్‌పాల్‌లో ఒక ఛైర్మన్, ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది జ్యుడీషియల్‌ పరిజ్ఞానం గల సభ్యులు; మిగిలిన సగం మంది పరిపాలన, అవినీతి నిర్మూలన, వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గానికి చెందినవారై ఉండాలి.

నియామకం
* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గల ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారు. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫారసు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక నిష్ణాతుడైన వ్యక్తి సభ్యులుగా ఉంటారు.


ఛైర్మన్, సభ్యుల అర్హతలు
* లోక్‌పాల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా నిష్ణాతుడై ఉండాలి.
* లోక్‌పాల్‌లో జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
* నాన్‌ - జ్యుడీషియల్‌ సభ్యులుగా నియమితులయ్యే వారికి పరిపాలన, అవినీతి నిర్మూలన లాంటి అంశాల్లో సుదీర్ఘ అనుభవం ఉండాలి.

పదవీకాలం - జీతభత్యాలు
* లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయసు వరకు. వీరు పదవీ విరమణ అనంతరం 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయరాదు.
* ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అక్రమ ప్రవర్తన కారణంగా సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు వీరిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
* లోక్‌పాల్‌ ఛైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
* ఏడేళ్ల కాలపరిమితి దాటిన ఫిర్యాదులను లోక్‌పాల్‌ విచారణకు స్వీకరించదు. సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు దీనికి వర్తిస్తాయి.

అధికారాలు - విధులు
లోక్‌పాల్‌కు స్వతంత్రంగా ఒక విచారణ, ప్రాసిక్యూషన్‌ విభాగం ఉంటుంది. ప్రధానమంత్రి సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఇది విచారిస్తుంది.
* కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (CVC) విచారించిన అంశాలను, తీసుకున్న చర్యలను లోక్‌పాల్‌కు తెలియజేయాలి.
* సీబీఐతో పాటు దేశంలోని అన్ని విచారణ సంస్థలు లోక్‌పాల్‌ పరిపాలనా నియంత్రణలోకి వస్తాయి.
* జాతీయ భద్రత, ప్రజా భద్రత అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు.
* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనపరచుకోవడానికి, వారిని సస్పెండ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఎవరినైనా విచారించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వివిధ ఫిర్యాదులపై ఆరు నెలల్లోగా విచారణ ముగించాలి.
* అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార వ్యవస్థలకు సిఫారసు చేస్తుంది. విదేశాల నుంచి డొనేషన్లు తీసుకునే స్వచ్ఛంద సంస్థలు కూడా లోక్‌పాల్‌ పరిధిలోకి వస్తాయి.
* కేసుల విచారణకు ఎలాంటి డాక్యుమెంట్లు, అఫిడవిట్లనైనా పరిశీలించే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. ఫిర్యాదులపై దర్యాప్తును 60 రోజుల్లో, విచారణను 6 నెలల్లో ముగించాలి. విచారణను దర్యాప్తు నుంచి మినహాయించాలి. న్యాయవ్యవస్థపై విచారణ చేసే అధికారం లోక్‌పాల్‌కు లేదు.
* ప్రధానమంత్రిపై అవినీతి ఆరోపణలకు సంబంధించి లోక్‌పాల్‌ విచారణను మెజారిటీ సభ్యుల అనుమతితో జరపాలి. ఛైర్మన్‌ సహా మొత్తం సభ్యుల్లో 3/4వ వంతు మంది సభ్యులు విచారణ జరిపేందుకు ఆమోదించాలి.
* అన్నాహజారే నేతృత్వంలోని పౌరసమాజం ‘జన్‌ లోక్‌పాల్‌’ సాధన కోసం విశేష కృషి చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయింది.
* లోక్‌పాల్‌ 2014 జనవరిలో చట్టంగా మారినప్పటికీ, ఇప్పటివరకు దాని నిర్మాణం జరగలేదు.

లోకాయుక్త
* రాష్ట్ర స్థాయిలోని అత్యున్నత వ్యక్తుల అవినీతి, అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను ‘లోకాయుక్త’ అంటారు. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.
* మనదేశంలో మొదటిసారిగా ఒడిశా 1970లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించింది. కానీ అది 1983 నుంచి అమల్లోకి వచ్చింది.
* మహారాష్ట్ర 1971లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించి అమలు చేసింది. ఈ చట్టాన్ని అమలుచేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర.
* ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త చట్టం 1983 సెప్టెంబరు 23 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం మనదేశంలో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన న్యూదిల్లీలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటుచేశారు.

లోకాయుక్తను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు

లోకాయుక్తను ఏర్పాటుచేయని రాష్ట్రాలు
1) అరుణాచల్‌ప్రదేశ్‌
2) జమ్ముకశ్మీర్‌
3) మణిపూర్‌
4) మేఘాలయ
5) మిజోరం
6) నాగాలాండ్‌
7) సిక్కిం
8) తమిళనాడు
9) త్రిపుర
10) పశ్చిమ్‌బంగ


 

లోకాయుక్త నియామకం - పదవీకాలం
* హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తిని ‘లోకాయుక్త’గా నియమిస్తారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ లోకాయుక్తను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు.
* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని ‘ఉప లోకాయుక్త’గా గవర్నర్‌ నియమిస్తారు.
* లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. పదవీకాలం అనంతరం తిరిగి ఈ పదవులు పొందడానికి వీరు అనర్హులు.
* లోకాయుక్త పాలనాధిపతి ‘రిజిస్ట్రార్‌’. ప్రత్యేక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు హోదాలో విచారణ సంచాలకుడు ఉంటాడు. ఇతడికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.
* లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉప లోకాయుక్తకు హైకోర్టు ఇతర న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
* లోకాయుక్త, ఉప లోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలి.

ఏపీ, తెలంగాణలో లోకాయుక్త విచారణ పరిధిలోకి వచ్చే అంశాలు
* ప్రభుత్వ అధికార దుర్వినియోగం.
* ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.
* బాధితులు ఎవరైనా తమ అభియోగాలను లోకాయుక్త దృష్టికి తీసుకురావచ్చు.
* లోకాయుక్తకు సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు, విధులు ఉంటాయి.
* ఆరు సంవత్సరాల్లోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది. లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారుచేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని అతడు పనిచేసే శాఖాధికారికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులపై సంబంధిత అధికారి మూడు నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్ని లోకాయుక్తకు తెలియజేయాలి.
* లోకాయుక్త వివిధ ఫిర్యాదుల ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి. లోకాయుక్త సిఫారసులు కేవలం సలహా పూర్వకమైనవి. వీటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

నిర్మాణాత్మక వ్యత్యాసాలు
* లోకాయుక్త వ్యవస్థల నిర్మాణం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు.
* రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో లోకాయుక్తతోపాటు, ఉప లోకాయుక్త వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు.
* ఒడిశా, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఇప్పటికీ లోకాయుక్తను ‘లోక్‌పాల్‌’గా పిలుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో లోకాయుక్తను ‘లోక్‌ ఆయోగ్‌’గా పిలుస్తున్నారు.
* ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, అసోం రాష్ట్రాలు తమ శాసనసభ్యులను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చాయి.
* మహారాష్ట్రలో మాజీ మంత్రులు, సివిల్‌ సర్వెంట్స్‌ను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చారు.
* లోకాయుక్త తన కేసులకు సంబంధించిన విచారణలో రాష్ట్ర దర్యాప్తు సంస్థల సహకారాన్ని తీసుకుంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు:
* లోకాయుక్త నియామకంలో రాష్ట్ర మంత్రి మండలి సలహాలను గవర్నర్‌ తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గుజరాత్‌ లోకాయుక్తగా జస్టిస్‌ ఏఆర్‌ మెహతాను అప్పటి గవర్నర్‌ కమలా బేణీవాల్‌ నియమించిన వివాదంలో ఈ తీర్పును వెలువరించింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు

జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్, 338 ప్రకారం ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను కాపాడటానికి 1978లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా జాతీయ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీని మొదటి ఛైర్మన్ బోళ పాశ్వాన్ శాస్త్రి.
* ఈ కమిషన్‌ను 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 'నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌'గా మార్చింది.
* దీనికి వి.పి. సింగ్ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ చట్టం (1990) ద్వారా రాజ్యాంగ భద్రతను కల్పించడంతో 1992, మార్చి 12 నుంచి నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అమల్లోకి వచ్చింది.

నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు

* రామ్‌ధన్                    -    1992 - 1995
* ఎం. హనుమంతప్ప      -   1995 - 1998
* దిలీప్‌సింగ్ భూరియా     -  1998 - 2002
* విజయ్ శంకర్ శాస్త్రి        -   2002 - 2004
* అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 89వ రాజ్యాంగ సవరణ చట్టం, 2004 ప్రకారం నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రెండుగా విభజించి, ఆర్టికల్, 338 ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్‌ను; ఆర్టికల్, 338(A) ప్రకారం నేషనల్ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

నేషనల్ ఎస్సీ కమిషన్ (ఆర్టికల్ 338)
* ఆర్టికల్, 338(1) - షెడ్యూల్డు కులాల వారికి జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
* ఆర్టికల్, 338(2) - పార్లమెంటు రూపొందించిన చట్టంలోని నిబంధనలను అనుసరించి ఎస్సీ కమిషన్‌కు ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు.
* వీరి సర్వీసు నిబంధనలు, పదవీ కాలపరిమితి రాష్ట్రపతి నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఉంటాయి. పదవీ కాలం 3 సంవత్సరాలు.
* ఆర్టికల్, 338(3) - ఎస్సీ కమిషన్‌కు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఇతర సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార పత్రం ద్వారా నియమిస్తారు. సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా మహిళై ఉండాలి.
* ఆర్టికల్, 338(4) - ఎస్సీ కమిషన్ స్వతంత్ర సంస్థ. అంటే తన పని విధానాన్ని తానే నియంత్రించుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది.

అధికారాలు - విధులు
      ఆర్టికల్, 338(5) ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్ కింది విధులను నిర్వహిస్తుంది.

* షెడ్యూల్డు కులాల రక్షణ, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, విచారించడం.
* షెడ్యూల్డు కులాల ఆర్థిక, సామాజిక, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే ప్రణాళికల రూపకల్పనలో తగిన సలహాలు ఇవ్వడం, వారి అభివృద్ధి పురోగతిని మూల్యాంకనం చేయడం.
* షెడ్యూల్డు కులాల వారికి రాజ్యాంగపరంగా, చట్టపరంగా కల్పించిన ప్రత్యేక హక్కులకు సంబంధించిన అన్ని అంశాలను విచారించడం, పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం.
* షెడ్యూల్డు కులాల వారికి కల్పించిన పరిరక్షణల అమలుతీరు గురించి రాష్ట్రపతికి వార్షిక నివేదికలను సమర్పించడం లేదా అవసరాన్ని బట్టి ఇతర సమయాల్లో కూడా నివేదికలను పంపడం.
* రాష్ట్రపతి నిర్ణయించిన మేరకు షెడ్యూల్డు కులాల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి, పురోగతి కోసం ఇతర విధులను నిర్వహించడం.
* అధికారాల నిర్వహణలో 'సివిల్ కోర్టు' అధికారాలను కలిగి ఉండటం.
* ఏ అధికారినైనా తన ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని కోరవచ్చు లేదా అఫిడవిట్‌ను సమర్పించాలని కోరవచ్చు. ఎలాంటి రికార్డులనైనా పరిశీలించవచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గాల సంక్షేమాన్ని ఉద్దేశించి తీసుకునే చర్యల అమలు తీరును మాత్రమే కాకుండా నూతనంగా వీరికోసం అమలుచేసే పథకాల గురించి ఎస్సీ కమిషన్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.
* 1976 నాటి పౌరహక్కుల పరిరక్షణ చట్టం, 1989 నాటి ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం అమలు తీరును ఈ కమిషన్ సమీక్షిస్తుంది.
* కోర్టులు, కార్యాలయాల నుంచి అవసరమైన పబ్లిక్ రికార్డులు, ఇతర నకళ్లను పొందడం.
* ఎస్సీ కమిషన్ అందించే నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పిస్తారు.
* ఎస్సీ కమిషన్ సమర్పించిన నివేదికలోని అంశాలు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే దాని ప్రతిని రాష్ట్రపతి గవర్నర్‌కు పంపగా, గవర్నర్ దాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.

ఛైర్మన్ సభ్యుల జీతభత్యాలు
* ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేంద్ర కేబినెట్ మంత్రి హోదా, డిప్యూటీ ఛైర్మన్ కేంద్ర సహాయమంత్రి హోదా, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన సౌకర్యాలను కలిగి ఉంటారు.
* ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి జీతంతో సమానమైన వేతనాలు పొందుతారు.
* పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులను ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులుగా నియమిస్తే వారికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు.
* జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. ఈ కమిషన్ అధీన కార్యాలయాలను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ప్రధాన కార్యాలయంలో 4 విభాగాలు ఉన్నాయి. అవి:
1. పాలనా సమన్వయ విభాగం: ఇది కమిషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలను సమన్వయ పరుస్తుంది.
2. సేవా పరిరక్షణ విభాగం: ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ వర్గాలకు సమకూర్చిన సౌకర్యాల అమలును పర్యవేక్షిస్తుంది.
3. పౌరహక్కుల పరిరక్షణ విభాగం: ఇది వివిధ చట్టాల అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
4. సామాజిక, ఆర్థిక అభివృద్ధి విభాగం: షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది.


నేషనల్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌లు

1. సూరజ్‌భాన్          -      2004 - 2007
2. భూటాసింగ్           -      2007 - 2010
3. పి.ఎల్. పునియా    -      2010 - 2013

* షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ 'అనుశుచిత్ జాతివాణి' పేరుతో ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 'ఈ-మాగజైన్‌'ను విడుదల చేస్తుంది.
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేములను దళితుడిగా పి.ఎల్. పునియా నేతృత్వంలోని నేషనల్ ఎస్సీ కమిషన్ ధ్రువీకరించింది.
* రోహిత్ దళితుడు కాదని అతడి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని ఏర్పాటు చేసిన 'రూపన్‌వాల్ కమిషన్‌'ను ఎస్సీ కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. కులంపై తుది నిర్ధారణ అధికారి జిల్లా కలెక్టర్ అని పేర్కొంది.
* ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం 1968లో ఒక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని 1978లో స్థాయీ సంఘంగా మార్పు చేశారు. దీనిలో 20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల, తెగల కమిషన్
* ఆంధ్రప్రదేశ్‌లో 2003లో చేసిన చట్టం ప్రకారం షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఒక ఛైర్మన్, 5 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సభ్యులందరూ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కృషి చేసేవారై ఉండాలి.
* సభ్యులు, ఛైర్మన్ పదవీకాలం 3 సంవత్సరాలు.

అధికారాలు - విధులు
* రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కల్పించిన సదుపాయాలు, అమలు జరుగుతున్న తీరును విచారించి, నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది. ఈ నివేదికను గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.
* ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
* కమిషన్ సమక్షంలో ఉండే ఏదైనా ప్రొసీడింగ్‌ను ఐపీసీ ప్రకారం జ్యుడీషియల్ ప్రొసీడింగ్‌గా భావించాలి.
* వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు
*
కె. పున్నయ్య - 2003 - 2006
* ఎమ్. నాగార్జున - 2007 - 2009
* 2010 నుంచి కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించలేదు.
* 2013లో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి, వేర్వేరు కమిషన్‌లుగా ఏర్పాటు చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా 2016లో కారెం శివాజీ నియమితులయ్యారు.

జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్
* ఆర్టికల్, 338(A) ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ను 2004, ఫిబ్రవరి 19న ఏర్పాటు చేశారు.
* నేషనల్ ఎస్టీ కమిషన్ ప్రధాన కార్యాలయం 'న్యూదిల్లీ'లో ఉంది. దీనికి భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, జయపుర, రాయ్‌పూర్, రాంచీలలో ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
ఆర్టికల్, 338(A)(1): షెడ్యూల్డు తెగల కోసం ఒక షెడ్యూల్డు తెగల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
ఆర్టికల్, 338(A)(2): నేషనల్ ఎస్టీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.

* అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు షెడ్యూల్డు తెగలకు చెందినవారై ఉండాలి. మిగిలిన ఒకరు కచ్చితంగా షెడ్యూల్డు తెగలకు చెందిన మహిళై ఉండాలి. వీరందరి పదవీకాలం 3 సంవత్సరాలు.
* అధ్యక్షుడు - కేంద్ర కేబినెట్ మంత్రితో సమానమైన హోదాను, జీతభత్యాలను పొందుతారు.
* ఉపాధ్యక్షుడు - కేంద్ర సహాయ మంత్రితో సమానమైన హోదాను, జీతభత్యాలను పొందుతారు.
* సభ్యులు - భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాను, జీతభత్యాలను పొందుతారు.
ఆర్టికల్, 338(A)(3): అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్, 338(A)(4): ఎస్టీ కమిషన్ తన పని విధానాన్ని తానే నియంత్రించుకుంటుంది.

నేషనల్ ఎస్టీ కమిషన్ అధికారాలు - విధులు
* షెడ్యూల్డు తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికా ప్రక్రియలో పాల్గొనడం. ఈ తెగలకు సంబంధించిన విధాన ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
* ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న రక్షణ, ప్రత్యేక హక్కులను పరిరక్షించడం.
* ఎస్టీల సంక్షేమం, సామాజిక, ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, వాటిని సమర్థంగా అమలు చేయడం గురించి తగిన సలహాలు ఇవ్వడం.
* ఎస్టీల రాజ్యాంగ పరిరక్షణ పనితీరుపై రాష్ట్రపతికి వార్షిక నివేదికలను సమర్పించడం. ఈ నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటులో ప్రవేశపెడతారు.
* ఎస్టీ కమిషన్ పంపిన నివేదికలో కొంత భాగం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందైతే, ఆ నివేదిక ప్రతిని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించాలి. దాన్ని గవర్నర్ శాసనసభలో ప్రవేశపెడతారు.
* ఎస్టీ వర్గాల హక్కులు, రక్షణలకు భంగం వాటిల్లితే వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.
* ఎస్టీ కమిషన్ కేసుల విచారణ ప్రక్రియలో భాగంగా సివిల్‌కోర్టులా వ్యవహరిస్తుంది.
* గిరిజనులు అనాదిగా అనుసరిస్తున్న 'పోడు వ్యవసాయ పద్ధతిని' నివారించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేయడం.
* PESA Act (Panchayat Raj Extension to the Scheduled Areas)ను షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపచేయడానికి కృషి చేయడం.
* అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించడం.
* గిరిజనులకు చెందిన భూమిని అన్యాక్రాంతం కాకుండా నివారించడం.
* చట్టరీత్యా ఆదివాసీలకు ఖనిజ, జల వనరులపై తగిన హక్కులను కల్పించడం.
* ఎస్టీ వర్గాల హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల ఆధారంగా లేదా సుమోటోగా విచారణ జరపడం.
* గిరిజనులకు జీవనోపాధి సంబంధిత అవకాశాలను పెంపొందించడం.
* ఏదైనా న్యాయస్థానం నుంచి లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి పబ్లిక్ రికార్డును లేదా దాని కాపీని పొందవచ్చు.
* అఫిడవిట్లపై సాక్ష్యాలను సేకరించడం. సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించమని ఉత్తర్వులను జారీచేయడం.
* వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు కమిషన్ ముందు హాజరవ్వాలని సమన్లు జారీ చేసి, అవి అమలయ్యేలా చూడటం.
* ఎస్టీ వర్గాలపై ప్రభావం చూపే అన్ని ముఖ్యమైన, విధానపరమైన అంశాలకు సంబంధించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కమిషన్‌ను సంప్రదించాలి.

నేషనల్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు
* కున్వర్ సింగ్ - 2004 - 2007
* ఊర్మిళా సింగ్ - 2007 - 2010
* రామేశ్వర్ ఓరాన్ - 2010 - 2013
* రామేశ్వర్ ఓరాన్ - 2013
* భారత ప్రభుత్వం నేషనల్ ట్రైబల్ పాలసీని 2010లో రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల కమిషన్
* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి, ఎస్టీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్ర షెడ్యూల్డు తెగల కమిషన్‌కు సంబంధించిన బిల్లును 2013, జూన్ 19న శాసనసభలో ప్రవేశపెట్టారు.
* రాష్ట్ర ఎస్టీ కమిషన్‌లో ఛైర్మన్‌తోపాటు అయిదుగురు సభ్యులు ఉంటారు.
* గిరిజన వర్గాలకు చెందిన ప్రముఖ వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించాలి.
* సభ్యుల్లో తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలి.
* మైదాన ప్రాంతం నుంచి ఒక సభ్యుడిని, ఏజెన్సీ ప్రాంతం నుంచి మిగిలిన వారిని నియమిస్తారు.
* ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరందరినీ గవర్నర్ నియమిస్తారు. వీరు తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పిస్తారు.అధికారాలు - విధులు
* రాష్ట్ర ఎస్టీ కమిషన్ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు, విధులను చెలాయిస్తుంది.
* ఎవరైనా వ్యక్తికి సమన్లు జారీచేసి తన ముందు హాజరు కావాలని ఆదేశిస్తుంది.
* గిరిజనుల హక్కులపై ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, గిరిజనుల సంక్షేమానికి నూతన సిఫారసులను చేయడం.
* గిరిజనుల ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన విధానాల అమలుతీరును పర్యవేక్షించడం.
* తన నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించడం. గవర్నర్ ఈ నివేదికను రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తారు.
* గిరిజనుల సామాజిక, ఆర్థిక రాజకీయ ప్రగతి కోసం కృషి చేయడం.

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
* బి.పి. మండల్ కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఇందిరాసహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన విషయాలను పరిశీలించడానికి శాశ్వత సంఘాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
* ఈ తీర్పు ఆధారంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్, 340 ప్రకారం భారత ప్రభుత్వం 1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టాన్ని రూపొందించింది.
* ఈ చట్టం 1993, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* బీసీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు.
* ఛైర్మన్, సభ్యులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యులు పొందే హోదాను, జీతభత్యాలను పొందుతారు.

బీసీ కమిషన్ అధికారాలు - విధులు
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించే రక్షణలు, ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసేందుకు కృషి చేయడం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయడం.
* వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి, వాటిని మెరుగుపరిచేందుకు సూచనలు చేయడం.
* బీసీ వర్గాల ప్రగతికోసం రూపొందించిన సిఫారసులను ఒక నివేదిక రూపంలో రాష్ట్రపతికి అందజేయడం, రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.
* కమిషన్ తన విధులను నిర్వహించే విషయంలో సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.
* వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో మార్పులు, చేర్పులను సిఫారసు చేస్తుంది.
* 1953లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1931 జనాభా లెక్కల ఆధారంగా బీసీ వర్గాల జనాభా 31 నుంచి 69 శాతం ఉన్నట్లు పేర్కొంది.
* బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం బిహార్.
* 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సిఫారసులు చేసేందుకు బి.పి. మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
* 1979లో జనతాప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో మండల్ కమిషన్ సిఫారసులు అమలుకాలేదు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలుచేసింది.
* 1963లో ఎం.ఆర్. బాలాజీ కేసులో, 1964లో దేవదాసన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించరాదు. కాబట్టి, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ సిఫారసు చేసింది.
* మండల్ కమిషన్ సిఫారసులను ఇందిరాసహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. అవి:
* ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సమర్థనీయమే.
* ఓబీసీల్లోని సంపన్న శ్రేణి (క్రిమీలేయర్)ని రిజర్వేషన్‌ల నుంచి మినహాయించాలి.
* జాతీయ స్థాయిలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
* రిజర్వేషన్లు 50% మించకూడదు.
* 93వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని 2008లో సుప్రీంకోర్టు సమర్థించింది.
* 2007లో నేషనల్ శాంపిల్ సర్వే సేకరించిన వివరాల ప్రకారం మన దేశంలో 41.36% ఓబీసీలు ఉన్నారు.
* జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.

నేషనల్ బీసీ కమిషన్ ఛైర్మన్లు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1993లో వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టాన్ని రూపొందించి, దీని ద్వారా వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 1994, మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చింది.
* రాష్ట్ర బీసీ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని గవర్నర్ నియమిస్తారు. పదవీ కాలం 3 సంవత్సరాలు.

అధికారాలు - విధులు
* ఏదైనా వెనుకబడిన తరగతిని వెనుకబడిన తరగతి జాబితాలో ఎక్కువ హోదాలో చేర్చడానికి సంబంధించి లేదా తక్కువ హోదాలో చేర్చడానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, తగిన సలహాలను ప్రభుత్వానికి ఇవ్వడం.
* బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి.
* ఏదైనా వర్గానికి చెందిన పౌరులు తమను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చమని కోరినప్పుడు దాన్ని పరిశీలించి తగిన సలహాను ప్రభుత్వానికి ఇవ్వడం.
* మనోహర్ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 1968లో బీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.
* మురళీధర రావు కమిషన్ సిఫారసుల మేరకు 1985లో ఎన్‌టీఆర్ ప్రభుత్వం బీసీ వర్గాలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు పరిచింది.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రొవిజన్స్‌ - ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం

భారత్‌లో సంక్షేమ యంత్రాంగం

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రొవిజన్లు, రిజర్వేషన్లు

రూస్కో పౌండ్ అభిప్రాయం ప్రకారం 'ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. సంక్షేమ రాజ్యాలే శ్రేయోరాజ్యాలు'.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం 'భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నించడం'.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అభిలషణీయ విధానాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వసతులను కల్పించడం, అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన విధి.
దీన్ని సాకారం చేసేందుకు షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన కులాలు, మహిళలు, మైనార్టీలు, కార్మికులు, వికలాంగులు, బాలబాలికలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

 

రాజ్యాంగంలో సంక్షేమ మూలాలు
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చింది.
సామ్యవాదం అనే పదం ద్వారా ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవి:
జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వం 1957లో దేశంలోని జీవిత బీమా సంస్థలన్నింటినీ జాతీయం చేసి ఎల్ఐసీ నియంత్రణలోకి తీసుకొచ్చింది.
ఇందిరా గాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను జాతీయం చేసింది. 1970లో రాజభరణాలను రద్దుపరచింది. 1975లో 20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమాన్ని ప్రకటించింది.
భారత రాజ్యాంగంలోని 16వ భాగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను వివరించారు.
ఆర్టికల్ 15 (3) ప్రకారం మహిళలకు, బాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.
ఆర్టికల్ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా ప్రగతికి ప్రత్యేక పథకాలను చేపట్టాలి.
 ఆర్టికల్ 243 (D) ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లోనూ, ఆర్టికల్ 243 (T) ప్రకారం నగర/ పట్టణ ప్రభుత్వాల ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్.
 ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్
‣  ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్
1989లో షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది.

 

ఎస్సీ వర్గాల సంక్షేమం
‣  షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వారికి 1979 నుంచి పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారు.
1989లో నిరుపేదలైన ఎస్సీ వర్గాల స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నెలకొల్పారు.
ఎస్సీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా వసతిగృహాల స్థాపనకు 2008లో బాబూ జగ్జీవన్‌రామ్ ఛాత్రావాస్ యోజనను ప్రారంభించారు.
 డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా ఎస్సీ వర్గాల వారికి కిడ్నీ, లివర్ వ్యాధులు, క్యాన్సర్ చికిత్స కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
 హరిజనవాడల్లో అంబేడ్కర్ జలధార పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నారు.
ఆర్టికల్ 16 (4A): రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేదని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లయితే కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి సీనియారిటీతో కూడిన పదోన్నతిని కల్పించడానికి ఆయా వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని, సీనియార్టీకి రిజర్వేషన్ వర్తించదని 2015 సెప్టెంబరు 12న సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 17: దీని ప్రకారం అంటరానితనం నిషేధం. అంటరానితనం పాటించడాన్ని నేరంగా పరిగణిస్తారు. 1955లో భారత పార్లమెంటు అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని రూపొందించింది. దీన్ని పార్లమెంటు 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చింది.
ఆర్టికల్ 23: దీని ప్రకారం మనుషుల క్రయవిక్రయాలు, వెట్టిచాకిరీని నిషేధించారు. జోగిని, దేవదాసీ లాంటి సాంఘిక దురాచారాలను నిషేధించారు. 1976లో వెట్టిచాకిరీ నిషేధ చట్టం, కనీస వేతనాల అమలు చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టాలను రూపొందించారు.
ఆర్టికల్ 330: ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభలో కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి. ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని సీట్లను రిజర్వ్ చేయాలి.
ఆర్టికల్ 335: ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతులు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీల అర్హత మార్కులను ప్రభుత్వం తగ్గించవచ్చు.

 

అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకం: షెడ్యూల్డు కులాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
జాతీయ సఫాయి కర్మచారి కమిషన్: పారిశుద్ధ్య కార్మికులను వారి వృత్తుల నుంచి విముక్తి చేసి ప్రత్యామ్నాయ సదుపాయాలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.
2004 - 05 సంవత్సరం నుంచి బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయ ఉపకార వేతనాలను అందిస్తున్నారు.

 

గిరిజన ప్రాంతాలు, గిరిజనుల (ఎస్టీ) సంక్షేమం
భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూళ్లలో షెడ్యూల్డు తెగల (ఎస్టీ) పరిపాలనాంశాలను పొందుపరిచారు.
ఆర్టికల్ 366 (25) ప్రకారం హిందు, బౌద్ధ, సిక్కు మతాలను అనుసరించేవారు, ఆదిమ మత పద్ధతులను అనుసరించేవారిని షెడ్యూల్డు తెగలుగా పరిగణిస్తారు.
ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నరును సంప్రదించిన తర్వాత షెడ్యూల్డు తెగల నిర్వచనాన్ని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగానే పార్లమెంటు చట్టాలు చేస్తుంది.
2007, మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిర్వచనాన్ని తెలియజేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు.

 

5వ షెడ్యూల్ ముఖ్యాంశాలు
దీనిలో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనను చేర్చారు.
ఆర్టికల్ 244 (1) ప్రకారం సంబంధిత రాష్ట్ర గవర్నరుతో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఒక ప్రాంతాన్ని 'షెడ్యూల్డు ప్రాంతం'గా ప్రకటిస్తారు.
గవర్నర్లు ప్రతి సంవత్సరం తమ రాష్ట్రాల్లోని షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలనపై రాష్ట్రపతికి నివేదిక పంపాలి.
రాష్ట్రపతి ఆదేశం మేరకు షెడ్యూల్డు ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల సలహా మండలిని ఏర్పాటు చేయాలి.
ఈ మండలిలో సభ్యుల సంఖ్య 20 మంది. వీరిలో వ వంతు మంది షెడ్యూల్డు తెగలకు చెందిన శాసనసభ్యులై ఉండాలి.
షెడ్యూల్డు తెగల శాసనసభ్యులు తగినంతమంది లభించని పక్షంలో మిగిలిన స్థానాలను షెడ్యూల్డు తెగల పౌరులతో నింపాలి.

 

6వ షెడ్యూల్ ముఖ్యాంశాలు
‣ దీనిలో గిరిజన ప్రాంతాలను చేర్చారు.
అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర లాంటి 4 రాష్ట్రాలను చేర్చారు.
ఈ రాష్ట్రాల్లో స్వయంప్రతిపత్తి ఉన్న జిల్లాలు ఉన్నాయి.

 

గిరిజన జిల్లా కౌన్సిళ్లు
ఆర్టికల్ 244 (2), ఆర్టికల్ 275 (1) ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లాలు, ప్రాంతాల ఏర్పాటు ద్వారా జిల్లా కౌన్సిళ్లు, ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు ద్వారా అసోంలోని గిరిజన ప్రాంతాల్లో పరిపాలన జరగాలని నిర్దేశించారు.
గిరిజనేతరుల వడ్డీ వ్యాపారాలను, ఇతర వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడానికి జిల్లా కౌన్సిళ్లకు అధికారాలు కల్పించారు.
కేంద్ర, రాష్ట్రాల చట్టాలు తమ జిల్లాలకు వర్తించకుండా నిరోధించే అధికారాలు ఈ కౌన్సిళ్లు కలిగి ఉన్నాయి.
ఈ కౌన్సిళ్లు క్రమం తప్పకుండా ఆదాయ, వ్యయ ఖాతాలను నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది.
ఈ కౌన్సిళ్ల పనితీరును మదింపు చేయడానికి అవసరమైతే గవర్నర్ ఒక కమిషన్‌ను నియమించవచ్చు.
‣ ఈ కౌన్సిళ్ల కార్యకలాపాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని సందేహం కలిగినప్పుడు వీటిని రద్దు చేసే అధికారం గవర్నరుకు ఉంది.

 

జిల్లా మండళ్లు, ప్రాంతీయ మండళ్లల నిర్మాణం
ప్రతి స్వయంప్రతిపత్తి జిల్లాకు ఒక జిల్లా మండలి ఉంటుంది.
జిల్లా మండలిలో 30 మంది సభ్యులు ఉండాలి.
వీరిలో 26 మంది వయోజన ఓటు ద్వారా ఎన్నికవుతారు.
మిగిలిన నలుగురిని గవర్నర్ నామినేట్ చేస్తారు.
‣  ప్రతి స్వతంత్ర ప్రాంతానికి ఒక ప్రాంతీయ మండలి ఉంటుంది.
 ప్రతి జిల్లా మండలిని ఆ జిల్లా పేరుతో పిలుస్తారు.
 ప్రాంతీయ మండలిని ఆ ప్రాంతం పేరుతో పిలుస్తారు.
 స్వయంప్రతిపత్తి జిల్లా పరిపాలన మొత్తం జిల్లా కౌన్సిల్ చేతుల్లో ఉంటుంది.
 జిల్లాలోని స్వతంత్ర ప్రాంతాల పరిపాలన మాత్రం ప్రాంతీయ మండలి పరిధిలో ఉంటుంది.
 రాష్ట్ర గవర్నర్ ఆయా తెగల ప్రాతినిధ్య సంఘాలు, తెగల మండళ్లతోనూ సంప్రదించి జిల్లా మండలి, స్వతంత్ర మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రూపొందిస్తారు.
జిల్లా మండలి సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.
 నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం మాత్రం గవర్నర్ అభీష్టంపై ఆధారపడి ఉంటుంది.

 

షెడ్యూల్డు తెగల అభివృద్ధి చట్టాలు
 నేచర్ - మ్యాన్ - స్పిరిట్ భావన ప్రకారం ప్రకృతి, మానవుడు, ఆరాధనల మధ్య విడదీయలేని సంబంధం ఉంది.
‣  కొన్ని తెగల్లో వివాహానికి ముందుగా మామిడి చెట్లను వివాహం చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది.

 

అటవీ చట్టం - 1878
 ఈ చట్టం ద్వారా అడవులపై రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని మరింత విస్తృతపరిచారు.
 అడవుల్లో సంచరించడం, పశుపోషణ లాంటి కార్యకలాపాలను నిషేధించారు.
‣  భారతదేశ మొదటి అటవీ విధానాన్ని 1894లో ప్రకటించారు.భారత 

 

అటవీ చట్టం - 1927
ఈ చట్టం ద్వారా ఏర్పాటైన అటవీ శాఖ అధికారులు, అటవీ గార్డులు, ఐఎఫ్ఎస్ అధికారులతో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థకు అధికారాలు సమకూర్చారు.
ఈ చట్టం ప్రకారం అటవీ వనరులకు నష్టం చేకూర్చే ఏ వ్యక్తినైనా వారంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంది.
1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అడవులు అనే అంశాన్ని రాష్ట్ర జాబితాలోకి బదిలీ చేశారు.

 

గిరిజన భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం - 1959
ఈ చట్టాన్ని 1/70 అంటారు.
దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో 1959లో అమల్లోకి తెచ్చారు.

 

ఈ చట్టంలోని కీలకాంశాలు
గిరిజనేతరులు గిరిజనుల భూములను కొనకూడదు.
గిరిజనేతరులు తమ భూములను అమ్మాల్సి వస్తే గిరిజనులకే అమ్మాలి.
గిరిజనులు తమ భూములను తమవే అని నిరూపించుకోవాలి.

 

PESA చట్టం 1996
Panchayats Extension to the Scheduled Areas Act - PESA 1996, డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగంలోని 9వ భాగంలో ఆర్టికల్ 243 ప్రకారం పంచాయతీలకు సంబంధించిన అంశాలను షెడ్యూల్డు ప్రాంతాలకు కూడా వర్తించేలా చేసిన చట్టం ఇది.
దిలీప్‌సింగ్ భూరియా కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టాన్ని చేశారు.

దిలీప్‌సింగ్ భూరియా కమిటీ గిరిజన ప్రాంతాల్లో స్వపరిపాలనకు 3 అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది. అవి:
ఎ) గ్రామసభ: ఇది గిరిజనులు నివసించే సహజ ప్రాంతంపై ఆధిపత్యం కలిగి ఉండి, ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది.
బి) గ్రామ పంచాయతీ: ఇది గ్రామ సభ నుంచి ఎన్నికైన ప్రతినిధులతో ఏర్పడుతుంది.
సి) బ్లాకు/ తాలూకా: ఇది అత్యున్నత స్థాయి సంస్థ.  జిల్లా కౌన్సిల్‌లా ఉండే సంస్థ.
 

కీలకాంశాలు
గ్రామ ఓటరు జాబితాలో పేరు నమోదు అయిన వ్యక్తులతో కూడిన గ్రామసభ ఉంటుంది.
గ్రామసభ తమ ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక గుర్తింపు, సామాజిక వనరులు, వివాద పరిష్కారాలు మొదలైన వాటిని భద్రంగా నిలిపి ఉంచడానికి, సంరక్షించుకోవడానికి అధికారాలు కలిగి ఉంటుంది.
  ప్రతి పంచాయతీ గ్రామసభ నుంచి ప్రణాళికలు, కార్యక్రమాల కోసం సక్రమంగా నిధుల వినియోగం జరిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది.
  అన్ని పంచాయతీల ఛైర్మన్ పదవులు షెడ్యూల్డు తెగలకు మాత్రమే రిజర్వ్ చేస్తారు.
  మధ్యస్థాయిలో లేదా జిల్లా స్థాయిలో ఏదైనా ఒక తెగకు సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సీట్లలో  వ వంతు మించకుండా ప్రతినిధులను నామినేట్ చేయవచ్చు.
  షెడ్యూల్డు ప్రాంతాల్లోని చిన్నతరహా జలవనరుల నిర్వహణ కూడా ఆ స్థాయిలోని పంచాయతీలకు అప్పగించాలి.
  అభివృద్ధి కార్యక్రమాల కోసం షెడ్యూల్డు ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా గ్రామసభ లేదా పంచాయతీల అభిప్రాయాన్ని తీసుకోవాలి.
  షెడ్యూల్డు ప్రాంతాల్లో గనుల లీజు విషయంలో పంచాయతీల సిఫార్సులను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
  రాజ్యాంగంలోని 9వ భాగంలో నిర్దేశించిన ప్రకారం జనాభాను అనుసరించి ఆయా వర్గాలకు సీట్లలో రిజర్వేషన్లు అమలు చేయాలి.


రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన పంచాయతీలకు బదిలీ చేసే అధికారాలు
  మద్యపాన నిషేధం, నియంత్రణ
  గ్రామీణ మార్కెట్లను నిర్వహించడం
  చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు
  భూమి పరాధీనం కాకుండా చర్యలు చేపట్టడం
  పరాధీనమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం
  సాంఘిక విభాగాల్లో పనిచేస్తున్న సంస్థల నిర్వహణ
  షెడ్యూల్డు ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల నియంత్రణ


అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006
  అనాది కాలం నుంచి గిరిజనులకు, అటవీ నివాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించడానికి 2006, డిసెంబరు 18న అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని చేశారు.
  ఈ చట్టం 2008, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
  దీని ద్వారా గిరిజనులకు మొదటిసారిగా అటవీ హక్కులు, వృత్తి హక్కులను కల్పించారు.
  ఈ చట్టం ద్వారా 95,022 మంది వ్యక్తులకు 8,09,059 ఎకరాల అటవీ భూమికి సంబంధించిన టైటిల్ డీడ్స్ పంపిణీ చేశారు.
  ఈ చట్టం గిరిజనులకు కమ్యూనిటీ హక్కులతో పాటు చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించుకునే హక్కులను కూడా కల్పించింది.


 రాజ్యాంగపరంగా గిరిజనులకు కల్పించిన రక్షణలు
ఆర్టికల్ 15(4): ఎస్టీలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించకూడదు.
ఆర్టికల్ 16(4): ఉద్యోగాల భర్తీలో ఎస్టీ వర్గాలకు కల్పించే రిజర్వేషన్లను వివక్షగా భావించకూడదు.
ఆర్టికల్ 17: అస్పృశ్యతను నిషేధించారు.
‣ భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు. ఈ చట్టం ప్రకారం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధిస్తారు.
ఆర్టికల్ 46: ఎస్టీ వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాలి.
ఆర్టికల్ 164: ఎస్టీల సంక్షేమం కోసం ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక గిరిజన మంత్రిని నియమించాలి.
ఆర్టికల్ 244 (1): అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలను మినహాయించి ఏదైనా ఒక రాష్ట్రంలోని షెడ్యూల్డు ప్రాంతాలు, షెడ్యూల్డు తెగల పరిపాలనకు సంబంధించి 5వ షెడ్యూల్‌లోని నిబంధనలు అనుసరించాలి.
ఆర్టికల్ 244 (2): అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి 6వ షెడ్యూల్‌లోని నిబంధనలను అనుసరించాలి. దీని ప్రకారం ప్రత్యేక జిల్లా కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలి. ఈ కౌన్సిళ్లకు శాసన, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు ఇచ్చారు.
ఆర్టికల్ 275 (1): వివిధ రాష్ట్రాల్లో ఎస్టీల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
ఆర్టికల్ 330: లోక్‌సభలో ఎస్టీ వర్గాల వారికి 47 స్థానాలను రిజర్వ్ చేశారు.
ఆర్టికల్ 332: వివిధ రాష్ట్రాల విధాన సభల్లో ఎస్టీ వర్గాలకు అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేశారు.
ఆర్టికల్ 338 (A): జాతీయ ఎస్టీ కమిషన్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 339: షెడ్యూల్డు ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్డు తెగల సంక్షేమంపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది.


గిరిజనుల పాలనాభివృద్ధి - కమిటీలు
‣ ఎం.ఎస్.చౌదరి కమిటీ - 1961 సిఫార్సులు
 వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీని నియమించారు.
 గిరిజనులకు లభిస్తున్న హక్కులు, రాయితీలను పునఃసమీక్షించడానికి, అటవీ ప్రాంతానికి 8 కి.మీ. పరిధిలో  ఉన్న గిరిజన, ఇతర వర్గాల వారికి మాత్రమే హక్కులు, రాయితీలు కల్పించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.
  అటవీ పరిమాణం, స్వభావాన్ని అనుసరించి అందులో పశువులు మేపుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
  చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా చేపట్టి శాఖాపరమైన డిపోల ద్వారా గిరిజనులకు పంపిణీ చేయాలి.


రాయ్‌బర్మన్ కమిటీ - 1971
  ఈ కమిటీ గిరిజన జీవన విధానంలో అడవుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది.
  గతంలో చేసిన అటవీ విధానాల్లో గిరిజన ఆర్థిక వ్యవస్థలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పు పట్టింది.
‣ ఉచిత వంట చెరకు, పశుగ్రాసం, గృహ నిర్మాణం కోసం కలప మాత్రమే కాకుండా గిరిజనులకు మొత్తం చిన్న తరహా అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంలో మూడో వంతు కేటాయించాలని సిఫారసు చేసింది.
  త్రికోణ అటవీ విధానంలో మూడు భుజాలు గిరిజన వ్యక్తి, గిరిజన సముదాయం, జాతీయ ప్రయోజనాలు. ఈ మూడింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
  అటవీ విధానం 3 రకాల అవసరాలను తప్పనిసరిగా తీర్చాలి.
               1. ఆవరణ సంబంధమైన సంరక్షణ
               2. ఆహారం, పండ్లు
               3. ఇంధనం, పశుగ్రాసం, ఇతర గిరిజన గృహసంబంధ అవసరాలు, మృత్తిక, నీటి యాజమాన్య పద్ధతులు, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించాలి.
  1988 నాటి జాతీయ అటవీ విధానం మొదటిసారిగా అడవుల్లో నివసించే ప్రజల అవసరాలను గుర్తించింది.
  క్షీణించిపోతున్న అడవులను పునరుద్ధరించడానికి చేపట్టిన కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ సంఘాలను భాగస్వాములను చేయడానికి అన్ని రాష్ట్రాల అటవీ కార్యదర్శులకు తగిన మార్గదర్శక సూత్రాలతో కూడిన ఆదేశాన్ని 1990, జూన్ 1న విడుదల చేశారు.
  1996, మే వరకు 16 రాష్ట్రాలు సంయుక్త అటవీ నిర్వహణ చర్యలు చేపట్టాయి.


వర్జీనియస్ జాక్సా కమిటీ - 2013
  ఈ కమిటీని గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య స్థాయిలను అధ్యయనం చేసేందుకు భారత ప్రభుత్వం నియమించింది.
  2014, మేలో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
  గిరిజనులకు సరైన రీతిలో పునరావాసాన్ని కల్పించాలి.
  PESA చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి.
  గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  గిరిజనులు వివిధ కేసుల రీత్యా జైళ్లలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
  గిరిజన ఆరోగ్య ఉప ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.


ఆదివాసీ ప్రాంతాలు - స్వయంప్రతిపత్తి జిల్లాలు
Part - 1 : అసోం
1. ఉత్తర కాచార్ హిల్స్ జిల్లా
2. కార్బీ అంగ్‌లాంగ్ జిల్లా
3. బోడోలాండ్ జిల్లా
Part - 2 : మేఘాలయ
1. ఖాసీ హిల్స్ జిల్లా
2. జైంతియా హిల్స్ జిల్లా
3. గారోహిల్స్ జిల్లా
Part - 2A
1. త్రిపురలోని ఆదివాసీ ప్రాంతాల జిల్లా
Part - 3 : మిజోరం
1. చక్మా జిల్లా
2. మారా జిల్లా
3. లాయి జిల్లా


గిరిజన అభివృద్ధి సంస్థలు
షెడ్యూల్డు కులాల, తెగల పరిశోధన, శిక్షణ సంస్థ: ఎస్టీ కమిషన్, దేబర్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ సంస్థను ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశారు.
దీని విధులు
  గిరిజన కోటా కిందకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులను నిర్ధారించడం.
  గిరిజనులకు కల్పించిన రాజ్యాంగ పరమైన రక్షణలను అమలుపరచడం.
  గిరిజన ఎథ్నోగ్రఫిక్ అధ్యయనం.
  విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో చేరడానికి ముందు షెడ్యూల్డు తెగల అభ్యర్థుల పరిశీలన.
  గిరిజన భాష, హస్తకళలు, పాటలు, నృత్యాలను సంరక్షించడం.
  గిరిజన సంస్కృతి, వారసత్వం గురించి ప్రజలకు తెలియజేసేందుకు, గిరిజన మ్యూజియాలను ఏర్పాటు చేయాలి.


జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ - 2001
  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో లాభాపేక్ష లేని ఒక సంస్థగా దీన్ని ఏర్పాటు చేశారు.
  గిరిజనులకు ఆదాయాన్ని చేకూర్చే కార్యక్రమాలను అమలు పరచడానికి తక్కువ వడ్డీతో రుణ సహాయాన్ని ఏర్పాటు చేయాలి.


గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య - 1987
‣ Tribal Co-operative Marketing Federation of India (TRIFED)
  దీన్ని న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా 1987లో స్థాపించారు.
  ఇది మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ చట్టం 1984 కింద ఏర్పడింది.
  గిరిజనులు సేకరిస్తున్న సూక్ష్మ, అటవీ ఉత్పత్తులను సరైన ధరలకు విక్రయించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం మార్కెట్ డెవలపర్‌గా పని చేస్తోంది.


గిరిజన కో - ఆపరేటివ్ కార్పొరేషన్ విధులు
  గిరిజనులు సేకరించే అటవీ ఫలసాయాన్ని తగిన ధరలకు కొనడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి కృషి చేయడం.
  గిరిజనుల వ్యవసాయ, గృహావసరాల కోసం తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం కల్పించడం.
  గిరిజనులకు నిత్యావసర సరకులను సరసమైన ధరలకు లభ్యమయ్యేలా చూడటం.


సమగ్ర గిరిజన అభివృద్ధి ఏజెన్సీ (Integrated Tribal Development Agency)
  గిరిజనుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు.
  వీటికి అధికారి ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ).
  దేశంలో ఇప్పటివరకు 194 ఐటీడీఏలను ఏర్పాటు చేశారు.
  ఇవి సంబంధిత గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తాయి.
ట్రైబల్ సబ్ ప్లాన్
  అయిదో పంచవర్ష ప్రణాళికా కాలంలో కొత్త మార్గాన్ని అవలంబించి ఎస్టీల కోసం ట్రైబల్ సబ్ ప్లాన్‌ను ప్రారంభించారు.
‣  ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా 1974లో ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రారంభించారు. దీన్నే ఇందిరమ్మ కలలు అంటారు.
‣ సమాజంలో ఎస్టీ జనాభా దామాషాలో ప్రతి సంవత్సరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికా బడ్జెట్ నుంచి ఈ వర్గాల అభివృద్ధి కోసం నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా కేటాయించిన నిధులు మురిగిపోవు.
 ఎస్టీ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది.
 ఎస్టీ ఉపప్రణాళిక నిధులను సద్వినియోగం చేసేందుకు నోడల్ ఏజెన్సీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి.
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది.


ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ (పీటీజీ)
 కొన్ని కొండ జాతుల వారిలో అక్షరాస్యత మరీ తక్కువగా ఉండి, వారి జనాభా రానురాను పడిపోతోంది.
 వారు ఉపయోగించే వ్యవసాయ పూర్వ సాంకేతిక పద్ధతులు, ఆర్థిక పరిస్థితులు చాలా వెనుకబడినవి.
 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇలాంటి 75 వర్గాలను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ (పీటీజీ)గా గుర్తించారు.
 ఒక్కో వర్గంలోని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
 వారు మరీ మారుమూల ప్రాంతాల్లో ఉంటారు.
 నిర్వహణ వసతి సౌకర్యాలు వీరికి తక్కువగా అందుతాయి.
 వీరి అవసరాలు మిగతా కొండజాతుల వారితో పోలిస్తే పూర్తిగా వేరుగా ఉంటాయి.
 ట్రైబల్స్‌లో వీరు మరీ వల్నరబుల్ వర్గాలు.


ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం - 1989
 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని 1989, సెప్టెంబరు 11న పార్లమెంటు ఆమోదించింది. 1990, జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది.
 ఇది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా వర్గాలపై జరుగుతున్న దాడులను నియంత్రిస్తుంది.


గిరిజన బాలబాలికలకు హాస్టళ్ల నిర్మాణ పథకం
 ఈ పథకం ద్వారా మాధ్యమిక, ఉన్నత, విశ్వవిద్యాలయ స్థాయిల్లో అవసరమైన నూతన వసతిగృహాల నిర్మాణం, ఇదివరకే ఉన్న హాస్టళ్లకు అదనపు గదుల నిర్మాణం చేపట్టడం.
 ఈ భవనాలకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఉచితంగా అందజేస్తాయి.
 హాస్టళ్ల నిర్వహణ, నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతుంది.


పుస్తక నిధి పథకం
 వృత్తి విద్య కోర్సులను అభ్యసించే గిరిజన విద్యార్థులు ఖరీదైన పుస్తకాల భారాన్ని భరించలేకపోతున్నారు.
 దీనివల్ల సంభవించే డ్రాప్ అవుట్లను తగ్గించడానికి పుస్తకాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం అందిస్తారు.
‣ ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు
 గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 (1) ప్రకారం నిర్దేశించిన సహాయం ప్రకారం దేశవ్యాప్తంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న 100 ఆదర్శ పాఠశాలలను స్థాపించాలని
‣ 1997 - 98లో నిర్ణయించారు.
 10వ పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి 92 పాఠశాలలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.


వనబంధు కళ్యాణ యోజన (2014)
 గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం 2014 జులైలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
 గిరిజనులకు, ఇతర ప్రజలకు హెచ్‌డీఐ సూచీలో ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లోని ఒక్కో గిరిజన జిల్లా చొప్పున ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.


రోష్ని పథకం:
 భారత గ్రామీణాభివృద్ధి శాఖ 2013, జూన్ 7న దేశవ్యాప్తంగా 24 జిల్లాల్లో ప్రారంభించింది. ఈ జిల్లాలన్నీ అత్యంత నక్సల్స్ ప్రభావిత జిల్లాలే.
 ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాను ఎంపిక చేశారు.
 ఈ పథకం కింద 50,000 మంది గిరిజన యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
 నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 : 25 నిష్పత్తిలో భరిస్తాయి.
 ఈ పథకాన్ని 3 సంవత్సరాల పాటు అమలుచేస్తారు.


CCD పద్ధతి: (Conservation Cum Develpoment)
 PTGల కోసం 11వ ప్రణాళికా కాలంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ CCD(సంరక్షణ, అభివృద్ధి) అనే నూతన ప్రణాళికను రూపొందించింది.
దీని లక్ష్యాలు
1. దారిద్య్ర నిర్మూలన
2. అక్షరాస్యత స్థాయి పెంపు
3. ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం
4. సంస్కృతి పరిరక్షణ
గిరిజన ప్రాంతాల్లో వృత్తి విద్య
 గిరిజనులు స్వయం ఉపాధిని, తమకు అనుకూలమైన సరైన ఉపాధిని పొందడానికి వారి విద్యార్హతలు, ప్రస్తుత మార్కెట్ ధోరణులను అనుసరించి సంప్రదాయ లేదా ఆధునిక వృత్తి విద్యల్లో వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ పథకం ఆశయం.
నేషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎంపవర్‌మెంట్ స్కీమ్ లక్ష్యాలు
 ఆదిమ గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడం.
 లబ్ధిదారులకు శిక్షణ కల్పించడం.
 మార్కెట్‌లను సంధానపరచడంలో సహాయపడటం.
 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం భూయాజమాన్య హక్కులు పొందిన గిరిజనులు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులు.


డాక్టర్ అంబేడ్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్
 కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
 అంబేడ్కర్ ఫౌండేషన్ కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖ ఒక్కో నవ జంటకు రూ.2.5 లక్షలు చొప్పున అందిస్తుంది.
 ఇందులో 50% అయిదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు.
 నవ దంపతుల్లో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ అయి ఉండి ఇద్దరి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటనివారు ఈ పథకానికి అర్హులు.
MADA (Modified Area Development Approach)
 కనీసం పదివేల జనాభా ఉండి దానిలో 50% లేదా అంతకంటే ఎక్కువ ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాలే MADA.
 దేశంలో ఇప్పటివరకు గుర్తించిన MADAల సంఖ్య 259.
 ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలుపరచడానికి ప్రత్యేక యంత్రాంగం ఉండదు.
 ఈ పథకాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు చేస్తారు.


బహుళార్థసాధక బ్లాకులు (1956)
 గిరిజనుల ఆర్థిక వ్యవస్థాపన, సాంస్కృతిక అభివృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఈ బ్లాకుల లక్ష్యం.
 ఈ బ్లాకుల పనితీరును పర్యవేక్షించడానికి ప్రజాప్రతినిధులతో కూడిన పంచాయతీలను ఏర్పాటుచేయాలని ఎల్విన్ కమిటీ సిఫారసు చేసింది.
 ఈ బ్లాకుల పనితీరు లోపభూయిష్టంగా ఉందని 1969లో నియమించిన షిలావో కమిటీ పేర్కొంది.


ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక
 ఉప ప్రణాళిక: ప్రణాళికా వ్యయంలో కొంత మొత్తాన్ని పక్కకు తీసి దాన్ని ప్రత్యేకంగా ఖర్చు చేయడాన్ని ఉప ప్రణాళిక అంటారు. ఇది ప్రణాళికా వ్యయంలో మరో ప్రణాళిక లాంటిది.
 మన దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1974లో ఎస్టీలకు గిరిజన ఉప ప్రణాళికను, 1979లో ఎస్సీలకు స్పెషల్ కాంపోనెంట్ ప్రణాళికను రూపొందించింది.
 మన దేశంలో ఎస్టీలకు 5వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి, ఎస్సీలకు 6వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ఉప ప్రణాళికకు నిధుల కేటాయింపు ప్రారంభమైంది.
 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామోదర రాజనరసింహ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఈ ఉపసంఘం 2007 నుంచి 2012 మధ్య కాలంలో ప్రభుత్వం కేటాయించిన, ఖర్చు చేసిన వార్షిక బడ్జెట్‌ల వివరాలను విశ్లేషించింది.
 దీని ప్రకారం ఎస్సీ జనాభా ఆధారంగా ఎస్సీ ఉప ప్రణాళికకు 16.2% ఖర్చు చేయాలి. కానీ 12.5% మాత్రమే ఖర్చు చేశారు.
 ఎస్టీ జనాభా ఆధారంగా ఎస్టీ ఉప ప్రణాళికకు 6.6% ఖర్చు చేయాలి. కానీ 5.22% మాత్రమే ఖర్చు చేశారు.
 ఈ విశ్లేషణ ప్రకారం ఇప్పటివరకు రూ.21,000 కోట్లు నిధులు దారి మళ్లాయి.
 దామోదర రాజనరసింహ కమిటీ నిధుల సక్రమ వినియోగం కోసం ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలని, 32 సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించింది.
 వీటిలో 29 సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపి 2012లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధతను కల్పించింది. ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
 2013 - 14 ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు సంవత్సరానికి రూ.12,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
 ఈ ఉప ప్రణాళిక ప్రకారం ఎస్సీ వర్గాల వారికి 16.41%, ఎస్టీ వర్గాల వారికి 7% నిధులు నిర్దేశించారు.


ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోని ముఖ్యాంశాలు
 ఈ ఉప ప్రణాళిక అమలుకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.
 దీన్ని జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ పర్యవేక్షిస్తుంది.
 ముఖ్యమంత్రి అధ్యక్షతన  ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి ఈ ఉప ప్రణాళిక అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
 ఈ చట్టం 10 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అప్పటికి కూడా ఈ వర్గాల వారు అభివృద్ధి చెందకపోతే మరోసారి పొడిగిస్తారు.
 దీనికి సంబంధించిన నిధులు కేటాయించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు.
 దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో చదువు కోవడానికి రూ.10 లక్షలు గ్రాంటుగా అందిస్తారు.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమగ్రమైన అభివృద్ధిని సాధించేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం.


మైనార్టీల సంక్షేమం
‣ భారత రాజ్యాంగంలో మైనార్టీ అనే పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. దేశ జనాభాలో తక్కువ శాతంగా ఉన్న వర్గాలను మైనార్టీలుగా పేర్కొనవచ్చు. మన దేశంలో మైనార్టీలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
1. మతపరమైన మైనార్టీలు
 జాతీయ మైనార్టీల కమిషన్ చట్టం - 1992లోని సెక్షన్ 2 (C) ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలను జాతీయ స్థాయిలో మైనార్టీ కమ్యూనిటీలుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
 జైన మతస్థులకు కూడా మైనార్టీ హోదాను కల్పిస్తూ కేంద్ర కేబినెట్ 2014, జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ 2014, జనవరి 27న వెలువడింది.
2. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు
  రాష్ట్ర వ్యాప్తంగా లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో  అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషకు భిన్నమైన భాషను మాతృభాషగా కలిగిన అల్పసంఖ్యాక వర్గాన్ని భాషాపరమైన మైనార్టీగా పరిగణిస్తారు.
ఆర్టికల్ 347: ఏదైనా ఒక రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను కూడా సదరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. దానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఆ భాషను కూడా రాష్ట్రమంతటా అధికారికంగా గుర్తించాలని రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు.
ఆర్టికల్ 350: ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తన సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు.
ఆర్టికల్ 350 (A): భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యా బోధన జరపాలి. అవసరమైతే ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేస్తారు.
ఆర్టికల్ 350 (B) (1): భాషాపరమైన మైనార్టీల ప్రగతి కోసం రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని నియమించగలరు.
ఆర్టికల్ 350(B)(2): భాషాపరమైన మైనార్టీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలపై పరిశీలన జరిపి, రాష్ట్రపతికి నివేదికలు సమర్పించడం ప్రత్యేక అధికారి బాధ్యత. ఈ నివేదికలను రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పించాలి. ఈ నివేదికల ప్రతులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాష్ట్రపతి పంపుతారు.
 జాతి నిర్మాణంలో మైనార్టీల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం తొలిసారిగా 15 అంశాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది
 రాజేంద్ర సచార్ కమిటీ సిఫార్సుల మేరకు మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వం 2006, సెప్టెంబరు 10న మైనార్టీల ప్రగతి కోసం 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించింది.


జియో పార్శీ పథకం
 మన దేశంలోని పార్శీల జనాభా క్షీణతను నివారించేందుకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2013, సెప్టెంబరు 23న జియో పార్శీ అనే పథకాన్ని ప్రారంభించింది.
నయా రోష్ని పథకం
 మైనార్టీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2012 - 13 నుంచి నయా రోష్ని పథకాన్ని ప్రారంభించింది.
నయా మంజిల్
 మైనార్టీల విద్య, జీవనోపాధి అవసరాలను తీర్చడానికి 2015, ఆగస్టు 8న పట్నాలో నయా మంజిల్ పథకాన్ని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా ప్రారంభించారు.
నందలాల్ జోత్వానీ కమిషన్
 భాషాపరమైన మైనార్టీల కమిషనర్ డాక్టర్ నందలాల్ జోత్వానీ 2013, జులై 25న తన నివేదికను కేంద్రానికి సమర్పించారు. భాషాపరమైన మైనార్టీ కమిషనర్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించడం ఇది 49వ సారి.
కేంద్ర వక్ఫ్ మండలి (మత ధార్మిక సంస్థ)
 కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల నిర్వహణకు, దేశంలోని వక్ఫ్‌ల పాలనకు సంబంధించిన విషయాల్లో సహకరించేందుకు భారత ప్రభుత్వం 1964 డిసెంబరులో కేంద్ర వక్ఫ్ మండలిని ఏర్పాటు చేసింది.
 కేంద్ర వక్ఫ్ మండలిలో 20 మంది సభ్యులు ఉంటారు. దీనికి ఛైర్మన్‌గా కేంద్ర మైనార్టీల వ్యవహారాల మంత్రి ఉంటారు. ఈ మండలి సంవత్సరానికి 2 సార్లు సమావేశమవుతుంది.
జాతీయ మైనార్టీల అభివృద్ధి ఆర్థిక సంస్థ
 గోపాల్‌సింగ్ కమిటీ నివేదిక ఆధారంగా మైనార్టీలకు కంపెనీల చట్టం ప్రకారం 1994లో జాతీయ మైనార్టీల అభివృద్ధి ఆర్థిక సంస్థను ఏర్పాటు చేశారు. దీన్ని మొదటిసారిగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తర్వాత దీన్ని 2005లో మైనార్టీల వ్యవహారాల మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు.
 మైనార్టీలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహకారం, నైపుణ్యాల పెంపుదల కోసం ఇది కృషి చేస్తుంది.
 నేషనల్ వక్ఫ్ డెవలమెంట్ కార్పొరేషన్ (NAWADCO) ను 2014, జనవరి 29న రూ.500 కోట్లతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రారంభించింది.
మౌలానా ఆజాద్ ఫౌండేషన్
 దీన్ని 1989, జులై 6న ఏర్పాటు చేశారు. ఇది మైనార్టీల్లోని పేదవారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది.
 ఇది భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆర్థిక సహకారంతో నడుస్తుంది. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 15. దీనికి అధ్యక్షుడిగా మైనార్టీ వ్యవహారాల మంత్రి వ్యవహరిస్తారు.
రంగనాథ్ మిశ్రా కమిటీ (2004)
 అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం చేయడానికి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారు.
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది.
 ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, పార్శీలను ఎస్సీల పరిధి నుంచి మినహాయిస్తూ 1950లో వెలువరించిన ఆదేశాలను రద్దుచేయాలని సిఫారసు చేసింది.
రాజేంద్రసింగ్ సచార్ కమిటీ
 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 2005, మార్చి 9న రాజేంద్రసింగ్ సచార్ కమిటీని ఏర్పాటు చేసింది.
సిఫార్సులు
 మతపరమైన మైనార్టీల సమస్యల నివారణకు సమానావకాశాల కమిషన్లను ఏర్పాటు చేయాలి.
 అజ్లాఫ్ తరగతిని బీసీ వర్గాల జాబితాలో చేర్చాలి.
 ప్రాథమిక విద్యను ఉర్దూ భాషలో బోధించాలి.
 మదర్సాలను రాష్ట్ర విద్యా బోర్డులకు అనుసంధానం చేయాలి.
 ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేయకూడదు.


15 సూత్రాల పథకం
* రాజేంద్రసింగ్ సచార్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 15 సూత్రాల కార్యక్రమాన్ని 2006, సెప్టెంబరు 10న ప్రకటించింది. ఇవి విద్యారంగం, ఉపాధిరంగం, మైనార్టీల ఆవాస ప్రదేశాలను మెరుగుపరచడం, మతపరమైన ఉద్రిక్తలను నివారించడం, నియంత్రించడం మొదలైన వాటికి సంబంధించిన మౌలికాంశాలు. అవి
1) మైనార్టీలు నివసించే వాడల్లో సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కస్తూర్బాగాంధీ పాఠశాలను నెలకొల్పాలి.
2) సమీకృత బాలల అభివృద్ధి పథకం అమల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను మైనార్టీ వర్గాలు నివసించే ప్రదేశాల్లో నెలకొల్పాలి.
3) ముస్లిం విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందే పాఠశాలలను గుర్తించి, అందులో ఉర్దూ ఉపాధ్యాయులను నియమించడం.
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా విద్యారంగంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడం.
5) ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించడం.
6) మదర్సాలను ఆధునికీకరించి ముస్లిం కుటుంబాలకు అందుబాటులో ఉంచడం.
7) ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద అల్పసంఖ్యాక వర్గాల వారికి గృహాలను కేటాయించడం.
8) మైనార్టీలు నివసించే మురికివాడల్లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణాభివృద్ధి పథకం కింద మౌలిక సదుపాయాలను కల్పించడం.
9) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం ఉపాధి పథకాలను అమలు చేసేటప్పుడు 15% నిధులను అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించడం.
10) సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా మైనార్టీలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.
11) తక్కువ వడ్డీకి రుణ సౌకర్యాలు కల్పించడం.
12) మైనార్టీ అభ్యర్థులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా వారికి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఎక్కువ భాగస్వామ్యం కల్పించడం.
13) మత కల్లోలాల బాధితులకు తగిన నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని కల్పించడం.
14) మతపరమైన ఉద్రిక్తతలకు కారకులైన వారిని ప్రత్యేక న్యాయస్థానాల్లో త్వరితగతిన విచారించి నిందితులకు కఠిన శిక్ష విధించడం.
15) మతపరమైన ఉద్రిక్తతలు నెలకొనే ప్రాంతాల్లో తమ విధులను నిష్పక్షపాతంగా సమర్థంగా నిర్వహించే రెవెన్యూ, పోలీసు అధికారులను నియమించాలి.
ఈ 15 సూత్రాలకు అదనంగా 2009, అక్టోబరు 22న మరో 3 అంశాలను చేర్చారు. అవి:
1) జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
2) చిన్న, మధ్య తరహా పట్టణాల్లో పట్టణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
3) పట్టణ మౌలిక సదుపాయాల కల్పన పథకం.


సమాన అవకాశాల కమిషన్
 విద్యా, ఉద్యోగాల్లో మైనార్టీలు వివక్ష ఎదుర్కోకుండా నివారించేందుకు సమాన అవకాశాల కమిషన్ (EOC)ను ఏర్పాటు చేయాలని 2014, ఫిబ్రవరి 20న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
 రాజేంద్రసింగ్ సచార్ కమిటీ నివేదిక ప్రకారం దేశ జనాభాలో 18.5% ముస్లింలు ఉండగా ప్రభుత్వ అధికార యంత్రాంగంలో వీరి సంఖ్య కేవలం 2.5% మాత్రమే. దీన్ని సమతౌల్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ అత్యాచార/ అకృత్యాల నిరోధక చట్టం - 1989
 షెడ్యూల్డు కులాల, తెగల సంరక్షణకు భాతర పార్లమెంటు 1989లో షెడ్యూల్డు కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1990 జనవరి 30 నుంచి జమ్మూకశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని కులం పేరుతో దూషించడం, అవమాన పరచడం నేరం.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి భూములను చట్ట వ్యతిరేకంగా, బలవంతంగా స్వాధీనపరచుకోవడం నేరం.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యక్తులను తినకూడని, తాగకూడని పదార్థాలను బలవంతంగా తీసుకోమని ఒత్తిడి చేయడం నేరం.
 వీరిపై తప్పుడు కేసులు, తప్పుడు సమాచార నిందలు మోపడం నేరం.
 వీరి నివాస స్థలాల్లోకి వ్యర్థ పదార్థాలను, కళేబరాలను విసరడం నేరం.
 బావులు, హోటళ్లు లాంటి ప్రాంతాల్లోకి అనుమతి నిరాకరించడం నేరం.
 వీరి ఆస్తులు కోల్పోయే విధంగా విస్ఫోటన పదార్థాలను వినియోగించిన వారికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించడం.
 వీరు ఉపయోగించే జలాశయాలను కలుషితం చేయడం వల్ల అలాంటి నేరానికి పాల్పడిన వారికి చట్టరీత్యా 6 నెలలకు తగ్గకుండా 5 సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.
 వీరిని ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించకుండా నిరోధించడం నేరం.
‣ ఈ వర్గాల వారితో బలవంతంగా వెట్టి చాకిరీ చేయించడం నేరం.
 ఈ వర్గాల వారిపై హత్యాయత్నం చేస్తే జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తారు.
 ఈ చట్టం ప్రకారం ఈ వర్గాల వారిపై అత్యాచారం చేసిన వ్యక్తులను అరెస్టు చేసి నేరుగా ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచవచ్చు.
 ఈ చట్టాన్ని అమలు చేయడంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అశ్రద్ధ చేయడం ద్వారా లేదా ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన  ప్రయోజనాలను నిలిపివేసినట్లయితే సంబంధిత ఉద్యోగి ఒక సంవత్సరం పాటు జైలు శిక్షకు గురవుతారు.
 ఈ కేసులు అధికంగా నమోదయ్యే ప్రాంతాల్లో విచారణ కోసం ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి.
 ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు జిల్లా సెషన్స్ కోర్టులకు విచారణ అధికారాలు కల్పించారు.
‣  కనీసం 7 సంవత్సరాల న్యాయవాద వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించి బాధితుల తరఫున వాదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి.
 ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు తమను తాము సంరక్షించుకునే సందర్భంలో అవసరమైతే వారు ఆయుధాలను సమకూర్చుకోవచ్చు.
 ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని సంపాదించే వ్యక్తులు హత్యకు గురైనప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టపరిహారంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, వారి పిల్లల చదువు బాధ్యతల్ని ప్రభుత్వం స్వీకరించాలి.
‣ కనీసం డీఎస్పీ స్థాయి అధికారి విచారణ తర్వాత మాత్రమే కేసులను నమోదు చేయాలి.
 1995లో ఈ చట్టంలో చేసిన సవరణను అనుసరించి  దుర్వినియోగపరిచే వ్యక్తులకు కూడా అంతే స్థాయిలో శిక్షను విధించాల్సి ఉంటుంది.
‣ ఈ చట్టం అమలుతీరును పర్యవేక్షించడానికి కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేశారు. అవి:
1) కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వంలో 18 మంది సభ్యుల మండలి
2) రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 25 మంది సభ్యుల మండలి.
3) జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో 16 మంది సభ్యుల మండలి.
  పైన పేర్కొన్న 3 మండళ్లలో ఎంఎల్ఏ, ఎంపీ, ప్రభుత్వ ఉద్యోగులు, అనధికారులు, మంత్రులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.
 జిల్లా కమిటీలు తమ నివేదికలను రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర కమిటీలు తమ నివేదికలను కేంద్ర కమిటీకి పంపాలి. మార్చి 31లోగా ఈ అంశాలపై ఒక నివేదికను ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచాలి.
 ఈ చట్టం ప్రకారం శిక్షకు గురైనవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
 ఈ చట్టాన్ని కేంద్రం రూపొందించినప్పటికీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
 ఈ చట్టంపై అవగాహన కల్పించడానికి విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలి.


చట్టం అమలు
 ఈ చట్టం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి.
 ఈ చట్టం ప్రకారం 2002లో 27,894 కేసులు ఉంటే 2006లో 32,407 కేసులు నమోదయ్యాయి.
 ఈ చట్టం అమలుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 24 రాష్ట్రాల్లో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు.
 ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో సహా 17 రాష్ట్రాల్లో ప్రత్యేక సెల్స్‌ను ఏర్పాటు చేశారు.


ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక సవరణ చట్టం - 2015
 1989 నాటి ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేసే ఉద్దేశంతో ఈ చట్టానికి 2015లో సవరణ చేశారు. ఈ సవరణ చట్టం 2016, జనవరి 23 నుంచి అమల్లోకి వచ్చింది.
దీనిలోని ముఖ్యాంశాలు.
 ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మెడలో చెప్పుల దండను వేయడం లేదా వారిని నగ్నంగా ఊరేగించడం నేరం.
 ఈ వర్గాల వ్యక్తిని మానవ లేదా జంతు కళేబరాలను మోయాలని లేదా పారవేయమని బలవంతం చేయడం నేరం.
 ఈ వర్గాల వారిని వివస్త్రను చేయడం, శిరోజాలు, మీసాలు తొలగించడం; వారి గౌరవాన్ని భంగపరచేలా ముఖానికి లేదా దేహానికి రంగు పూయడం నేరం.
 ఎస్సీ, ఎస్టీ వర్గాలు వారిలో వారు కలహించుకునేలా వారి మధ్య శతృత్వాన్ని పెంచేలా మాట్లాడటం, రాయడం, సైగలు చేయడం, దృశ్యాలను చూపడం నేరం.

అధికారుల బాధ్యతలు
 పోలీసు  అధికారులు బాధితులు చెప్పిన వివరాలను యదాతథంగా రాయాలి. వారి నుంచి సంతకం తీసుకునేముందు ఆ వివరాలను చదివి వినిపించాలి.
 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్ రిజిస్టరులో నమోదు చేయాలి.
 ఫిర్యాదు కాపీని ఫిర్యాదుదారుడికి ఉచితంగా అందజేయాలి.
 బాధితుల లేదా సాక్షుల స్టేట్‌మెంటులను రికార్డు చేయాలి.
 బాధితులకు, సాక్షులకు, వారిపై ఆధారపడిన వారికి తగిన రక్షణలు కల్పించాలి.
 న్యాయ సహాయానికి సంబంధించిన వివరాలను వారికి తెలియజేయాలి.
 ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, గాయల పాలైనప్పుడు తగిన నష్ట పరిహారం చెల్లించాలి.
 విచారణ జరపబోయే ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా వారికి తెలియజేయాలి.

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సమాచార హక్కు చట్టం

ప్రభుత్వ పాలనలో పాదర్శకతను పెంపొందించి, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ఇది ప్రభుత్వ పాలనలో బాధ్యతాయుత విధానానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

నేపథ్యం:

  పారదర్శక ప్రభుత్వ పాలనే లక్ష్యంగా 1776లో స్వీడన్‌ తన దేశ రాజ్యాంగంలో తొలిసారిగా సమాచార హక్కును పొందుపరిచి మిగిలిన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.

1951లో ఫిన్‌లాండ్, 1966లో అమెరికా, 1970లో డెన్మార్క్, నార్వే దేశాలు సమాచార హక్కును చట్టబద్ధం చేశాయి.

‣  1923లో ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో ‘అధికార రహస్యాల చట్టాన్ని (The Official Secrets Act, 1923)' రూపొందించి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయరాదని నిర్ణయించారు.

సుప్రీంకోర్టు తీర్పు

1976లో రాజ్‌ నారాయణ్‌ Vs ఇందిరా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజలు సార్వభౌములని, ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు తప్పనిసరిగా అందించాల్సిందేనని, సమాచార హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని పేర్కొంది.

 రాజ్యాంగంలోని స్వేచ్ఛా స్వాంతంత్య్రపు హక్కును తెలిపే ఆర్టికల్‌ 19 (1)(a) లోనే సమాచార హక్కు కూడా ఉంది.

 రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీతలు సందీప్‌ పాండే (సామాజికవేత్త), అరుణారాయ్‌ (మాజీ ఐఏఎస్‌ అధికారి) కృషి ఫలితంగా మనదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.

 అటల్‌ బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2002లో ‘సమాచార స్వాతంత్య్ర చట్టాన్ని’ రూపొందించింది. ఈ చట్టంలోని లోపాలను సవరించి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ సమాచార హక్కు చట్టాన్ని 2005, అక్టోబరు 12 నుంచి జమ్ముకశ్మీర్‌ మినహా దేశవ్యాప్తంగా అమలుచేసింది. జమ్ముకశ్మీర్‌లో ఈ చట్టం 2009 నుంచి అమల్లోకి వచ్చింది.

ముఖ్యాంశాలు:

 ఈ చట్టంలో మొత్తం 6 చాప్టర్లు ఉన్నాయి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(J) ప్రకారం ప్రభుత్వ పాలనకు సంబంధించిన 17 రకాల సమాచారాలను పౌరులు పొందవచ్చు.

అవి:

1) రికార్డులు

2) పత్రాలు

3) సలహాలు

4) అభిప్రాయాలు

5) ఈ - మెయిల్స్‌

6) నివేదికలు

7) మెమోలు

8) కాంట్రాక్టులు

9) ఆర్డర్లు

10) లాగ్‌ పుస్తకాలు

11) సర్క్యులర్లు

12) పత్రికా ప్రకటనలు

13) రాతపుస్తకాలు

14) నమూనాలు

15) మోడల్స్‌

16) ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న గణాంకాలు

17) అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారికి అందుబాటులో ఉండే ప్రైవేట్‌ సంస్థల వివరాలు

 రికార్డులు, సర్టిఫైడ్, జిరాక్స్‌ కాపీలు; డాక్యుమెంట్లు, వీడియో టేపులు, సీడీలు, ఫొటోలు, ప్లాపీల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.

సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాని అంశాలు (సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 8, 24 ప్రకారం)

 భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు

 దేశ రక్షణకు సంబంధించిన, గూఢచార సంస్థలు అందించే సమాచారం

 విదేశాలు, అంతర్జాతీయ సంస్థలతో భారతదేశం కుదుర్చుకునే ఒప్పందాలు

 రాష్ట్రపతికి పరిపాలనలో కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు

 గవర్నర్‌కు పరిపాలనలో రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే సలహాలు

 న్యాయ విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అంశాలు

  కేరళ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలన్నింటినీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దుచేసింది. సహకార సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని, వాటిని ప్రభుత్వ సంస్థలుగా పరిగణించలేమని జస్టిస్‌ సిక్రీ, జస్టిస్‌ రాధాకృష్ణన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

సమచారాన్ని పొందడం

  సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 5(1) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి/సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటాడు. సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డును ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. దీని ఆధారంగా సంబంధిత అధికారి నుంచి సమాచారాన్ని పొందవచ్చు.

దరఖాస్తు నమూనా - దరఖాస్తు రుసుము

  సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా లేదు.

  సమాచారం కోసం తెల్ల కాగితంపై విన్నపం అని రాసి ఇస్తే సరిపోతుంది.

  గ్రామస్థాయి సంస్థలకు దరఖాస్తు రుసుము ఉచితం. మండల స్థాయిలో రూ.5; జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిలో రూ.10 చెల్లించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(5) ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి దరఖాస్తు రుసుము ఉచితం.

 జి.ఓ.ఎం.ఎస్‌ నెం.740 ప్రకారం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(3) ప్రకారం దరఖాస్తు రుసుమును నగదు లేదా ఇండియన్‌ పోస్టల్‌ ఆర్డర్‌ లేదా బ్యాంక్‌ చెక్కు లేదా డీడీ లేదా చలానా రూపంలో చెల్లించవచ్చు.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 6(2) ప్రకారం సమాచారాన్ని ఎందుకు కోరుతున్నారని దరఖాస్తుదారుడిని అడిగే అధికారం ప్రభుత్వ అధికారికి లేదు.

సమచారం ఇచ్చేందుకు గడువు

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(1) ప్రకారం కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారి 30 రోజుల వ్యవధిలో ఇవ్వాలి.

 వ్యక్తి జీవించే హక్కు, స్వేచ్ఛలకు సంబంధించిన సమాచారాన్ని 48 గంటల్లోగా ఇవ్వాలి.

సమాచారం కోసం అప్పీలు

 నిర్దేశించిన గడువులోగా ఏ విషయాన్ని తెలియజేయకపోతే సమాచారం ఇవ్వడానికి తిరస్కరించినట్లుగానే భావించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 19(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయ ఉన్నత అధికారికి మొదట అప్పీలు చేయాలి. అప్పుడు సంబంధిత అధికారి 30 - 45 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. అయినప్పటికీ సమాచారం ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు 90 రోజుల వ్యవధిలో అప్పీలు చేస్తే, తదుపరి గడువును సమాచార కమిషన్‌ నిర్ణయిస్తుంది.

సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా, శిక్షలు

 దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించిన, ఎక్కువ దరఖాస్తు రుసుము కోరిన; అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినా, కోరిన సమాచారాన్ని ధ్వంసం చేసినా, ఇవ్వడాన్ని అడ్డుకున్నా సమాచార హక్కు చట్టం ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. వీటికి పాల్పడిన ప్రజా సమాచార అధికారికి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 20(1) ప్రకారం రోజుకు రూ.250 చొప్పున గరిష్ఠంగా రూ.25000 జరిమానా విధిస్తారు. తరచూ ఈ చట్టం ఉల్లంఘనకు పాల్పడే అధికారులపై సెక్షన్‌ 20(2) ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపడతారు.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(6) ప్రకారం 30 రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాలి.

సమాచారం - స్వచ్ఛంద వెల్లడి

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన విధులు, బాధ్యతలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, జవాబుదారీతనం, ఉద్యోగుల వివరాలు, వారి జీతభత్యాలు, బడ్జెట్‌ కేటాయింపు, రికార్డుల పట్టికలు, రాయితీల వివరాలు, ప్రజా సమాచార అధికారి వివరాలు, సలహా సంఘాల సమాచారాన్ని కార్యాలయాల్లో స్వచ్ఛందంగా వెల్లడించాలి.

 జి.ఒ.ఎం.ఎస్‌. నెం.454 ప్రకారం సమాచారాన్ని పొందేందుకు A3/A4 కాగితానికి రూ.2, ప్లాపీకి రూ.50, సీడీకి రూ.100, డీవీడీకి రూ.200 చెల్లించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 6(3) ప్రకారం దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఒక సంస్థకు చెందనట్లయితే సంబంధిత P.I.O. (Public Information Officer) సంస్థకు పంపాలి. దరఖాస్తు అందిన అయిదు రోజుల్లోపు విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలి. అతడు కోరిన రూపంలోనే సమాచారాన్ని అందించాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 7(9) ప్రకారం ఎక్కువ ఆర్థిక వనరులు ఖర్చయ్యే, రికార్డు భద్రత ప్రమాదంలో ఉన్న సందర్భంలో తప్ప, దరఖాస్తుదారుడు కోరిన రూపంలో సమాచారాన్ని ఇవ్వాలి.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 21 ప్రకారం దరఖాస్తుదారుడిపై ఎలాంటి దావాలు, న్యాయవిచారణ, చట్టపరమైన చర్యలు తీసుకోరాదు.

 నిర్ణీత గడువులోగా సమాచారం లభించనప్పుడు సమాచార కమిషన్‌కు వెళ్లాల్సివస్తే, సమాచార చట్టంలోని సెక్షన్‌ 19(8)(బి) ప్రకారం పరిహారం పొందవచ్చు.

 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం సమాచార కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలపై దావాను వేయరాదు. ఇతర విచారణను ఏ న్యాయస్థానాలు చేపట్టరాదు, ప్రశ్నించకూడదు.

చట్టం - ప్రచార బాధ్యత

‣ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం దీని ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాలి.

 కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ‘ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ పోర్టల్‌’ను 2013, ఆగస్టు 21న ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా 82 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర సమాచార కమిషన్‌

 సమాచార హక్కు చట్టంలోని అధికార విధులను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2005, అక్టోబరు 13న న్యూదిల్లీ కేంద్రంగా ‘సెంట్రల్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేసింది. దీనిలో ఒక ప్రధాన సమాచార కమిషనర్, పది మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు.

 ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫారసుల మేరకు రాష్ట్రపతి సమాచార కమిషనర్లను నియమిస్తారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వరకు (ఏది ముందయితే అది వర్తిస్తుంది). జీతభత్యాలు, సర్వీసు నియమాలు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటాయి.

 ప్రధాన, ఇతర సమాచార కమిషనర్లను సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఆరోపణలు రుజువైతే రాష్ట్రపతి తొలగిస్తారు.

 సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న 57వ దేశం భారత్‌.

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్లు

విజిల్‌ బ్లోయర్స్‌ రక్షణ చట్టం, 2014

 ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరే వ్యక్తులకు బెదిరింపులు ఎదురైనప్పుడు వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సమాచార హక్కు కార్యకర్తలకు పరిరక్షణ బిల్లు (విజిల్‌ బ్లోయర్స్‌)ను తీసుకువచ్చింది. దీన్ని రాష్ట్రపతి 2014, మే 9న ఆమోదించగా, 2014 మే, 12న ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు.

ముఖ్యాంశాలు

  సమాచార హక్కుకు సంబంధించిన కార్యకర్తలకు రక్షణ కల్పించడం.

  సమాచార హక్కు కార్యకర్తల గోప్యతను నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశ పూర్వకంగా బయటపెట్టే అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50,000 జరిమానా విధిస్తారు.

  అవినీతి అధికారుల వివరాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం.

  కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమాచారం పొందే వ్యక్తులు ‘కాంపిటెంట్‌ అథారిటీ’ అంటే సంబంధిత కేంద్ర పాలిత ప్రాంత పాలకుడి లేదా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను సంబోధిస్తూ దరఖాస్తులో సమాచారాన్ని కోరాలి.

 రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి పరోక్షంగా నిధులు పొందడంతో పాటు ప్రజావిధుల్లో పాల్గొంటాయి కాబట్టి అవి ప్రజాసంస్థల కిందకే వస్తాయని 2013 జూన్, 3న కేంద్ర సమాచార కమిషన్‌ స్పష్టం చేసింది. జాతీయ రాజకీయ పార్టీలు ఆరు వారాల్లోగా సమాచార అధికారులు, అప్పిలేట్‌ యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.

 అన్ని రాజకీయ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951’ కింద నమోదైన రాజకీయ పార్టీలను ప్రజా సంస్థలుగా భావించరాదని పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాయి.

 సమాచార హక్కు చట్టం - 2005 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు.

  సమాచార హక్కు చట్టం - 2005లో పొందుపరిచిన అధికార విధులను అమలు చేయడానికి ఈ చట్టంలోని సెక్షన్‌ 15(1) ప్రకారం రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్ర సమాచార కమిషన్‌’ను ఏర్పాటు చేయాలి.

 ఆంధ్రప్రదేశ్‌లో 2005, అక్టోబరు 13న రాష్ట్ర సమాచార కమిషన్‌ అమల్లోకి వచ్చింది.

  రాష్ట్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు పది మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లు ఉంటారు. వీరందరినీ రాష్ట్ర గవర్నర్‌ నియమిస్తారు.

 సమాచార హక్కు చట్టంపై కేవలం 23% మంది ప్రజలకు మాత్రమే అవగాహన ఉందని ‘ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌’ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.

 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించే బోర్డు సభ్యుల పేర్లు, చిరునామాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించడం కుదరదు. ఇంటర్వ్యూ చేసినవారి పేర్లను వెల్లడిస్తే వారి భద్రతకు అపాయం కలుగుతుందని బిహార్‌ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉద్యోగాల ఇంటర్వ్యూ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

Posted Date : 13-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లా కమిషన్‌

దేశంలో న్యాయ పాలనను సమర్థవంతంగా నిర్వహించడానికి, సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందించడానికి, అవసరమైన అంశాలపై శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించి, తగు సూచనలు, సిఫార్సులు చేసేందుకు ‘లా కమిషన్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ నేపథ్యం, నిర్మాణం, విధులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


నేపథ్యం

* మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆంగ్లేయుల పాలనా కాలంలో చార్టర్‌ చట్టం  1833 ప్రకారం 1834లో లార్డ్‌ మెకాలే అధ్యక్షతన తొలిసారిగా లా  కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* దీని తర్వాత 1853, 1861, 1879లలో వివిధ లా    కమిషన్‌లు ఏర్పాటయ్యాయి. వీటి సిఫార్సుల మేరకు మనదేశంలో 1859లో సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌; 1860లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌; 1861లో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లను రూపొందించారు.


స్వాతంత్య్రానంతరం..

* స్వాతంత్య్రం తర్వాత మనదేశంలో మొదటి లా కమిషన్‌ను 1955లో ఎంసీ సెతల్‌వాడ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీన్ని మూడేళ్లకోసారి పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు.
* దేశంలో ఇప్పటి వరకు 21 లా కమిషన్‌లను ఏర్పాటు చేశారు.
* న్యాయ మంత్రిత్వశాఖకు సలహాదారుగా వ్యవహరించడం దీని ఉద్దేశం.
* ఈ కమిషన్‌లో ఛైర్మన్‌ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), నలుగురు సభ్యులు ఉంటారు. 

 

20వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఎన్నికల సంస్కరణల అమలుపై 255వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించింది.
* ఉరిశిక్ష రద్దుకు సంబంధించి 262వ నివేదికలో కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం మొదలైనవి మినహాయించి ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని పేర్కొంది.


21వ లా కమిషన్‌ - ప్రధాన సిఫార్సులు:

* ఇది తన 268వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించి, కింది సిఫార్సులు చేసింది.
* తప్పుచేసే న్యాయవాదులకు శిక్షలు విధించాలి. 
* న్యాయవాదులు సమ్మె చేయడం వల్ల కక్షిదారులకు నష్టం జరిగితే సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి. ఈ అంశాల పర్యవేక్షణకు ఒక చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలి.
* అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు లేకుండా, ఇద్దరికీ కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాలి.
* వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సమకూర్చినా దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి. వారు విడాకులు తీసుకుంటే స్త్రీకి సమాన వాటా ఇవ్వాలి. 
* క్రికెట్‌తో సహా ఇతర అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
* బెట్టింగ్‌ను చట్టబద్ధం చేశాక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మోసాలు జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి.


వేతన కమిషన్‌ (Pay Commission) 

* ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తోంది.ఇది మారుతున్న కాల పరిస్థితులు, నిత్యావసర సరకుల ధరల పెరుగుదల ఆధారంగా ఉద్యోగులు, పింఛన్‌దార్ల వేతనాలు, ఇతర అంశాలపై అధ్యయనం చేసి  ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తుంది.
* మనదేశంలో ఇప్పటివరకు 7 వేతన సవరణ కమిషన్‌లు ఏర్పాటయ్యాయి.

వేతన సవరణ సంఘం సంవత్సరం ఛైర్మన్‌
1వ 1946 శ్రీనివాస వరదాచారియార్‌
2వ 1957 జగన్నాథ్‌ దాస్‌
3వ 1970 రఘువీర్‌ దయాళ్‌
4వ 1983 పి.ఎన్‌.సింఘాల్‌
5వ 1994 రత్నవేల్‌ పాండ్యన్‌
6వ 2006 జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
7వ 2014 జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌

                

లా కమిషన్‌ విధులు
* కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలపై అధ్యయనాలు నిర్వహించి, సంస్కరణలను సూచిస్తుంది. దేశంలో అమల్లో ఉన్న వివిధ చట్టాల పనితీరును అధ్యయనం చేస్తుంది.
* ఏదైనా విషయంలో సంస్కరణలు అవసరమని భావిస్తే కమిషన్‌ స్వయం పరిశీలన చేయొచ్చు. సమాజంలోని విభిన్న వర్గాల సామాజిక స్థితిగతులు, ఆచార సంప్రదాయాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేస్తుంది.
* సామాజిక, రాజకీయ, న్యాయ అంశాలపై అభిలషణీయమైన నివేదికలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిస్తుంది.


వివిధ లా కమిషన్‌లు, ఛైర్మన్‌ల వివరాలు

లా కమిషన్‌ ఛైర్మన్‌ పదవీకాలం
1వ జస్టిస్‌ ఎంసీ సెతల్వాడ్‌ 1955-58
2వ జస్టిస్‌ వెంకట్రామ అయ్యర్‌ 1958-61
3వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1961-64
4వ జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ 1964-68
5వ జస్టిస్‌ కేవీకే సుందరం (ఐసీఎస్‌ అధికారి) 1968-71
6వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1971-74
7వ జస్టిస్‌ పీబీ గజేంద్ర గడ్కర్‌ 1974-77
8వ జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా 1977-79
9వ జస్టిస్‌ పీవీ దీక్షిత్‌ 1979-80
10వ జస్టిస్‌ కేకే మాథ్యూ 1981-85
11వ జస్టిస్‌ డీఏ దేశాయ్‌ 1985-88
12వ జస్టిస్‌ ఎంపీ ఠక్కర్‌ 1988-91
13వ జస్టిస్‌ కేఎన్‌ సింగ్‌ 1991-94
14వ జస్టిస్‌ కే జయచంద్రారెడ్డి 1995-97
15వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి 1997-2000
16వ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి
ఎం. జగన్నాథరావు
2000-01
2002-03
17వ  జస్టిస్‌ ఎం జగన్నాథరావు 2003-06
18వ జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణ్‌ 2006-09
19వ జస్టిస్‌ పి వెంకట్రామిరెడ్డి 2009-12
20వ జస్టిస్‌ డీకే జైన్‌ (రాజీనామా చేశారు) 
జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

2012-13
2013-15

21వ జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2015-18

                         
నమూనా ప్రశ్నలు

1. 1834లో ఏర్పాటైన లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?

1) లార్డ్‌ మెకాలే         2) చార్లెస్‌ హాప్‌కిన్స్‌
3) థామస్‌ ఉడ్స్‌         4) ఎలిన్‌బరో


2. కిందివాటిలో సరికానిది ఏది?
1) సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1859లో రూపొందించారు.
2) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ను 1860లో రూపొందించారు.
3) క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను 1861లో రూపొందించారు.
4) కామన్‌ సివిల్‌ కోడ్‌ను 1866లో రూపొందించారు.


3. మనదేశంలో స్వాతంత్య్రం తర్వాత 1955లో ఏర్పడిన మొదటి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరించింది?
1) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌
2) ఎం.సి.సెతల్‌వాడ్‌ 
3) శ్రీనివాస అయ్యంగార్‌  
4) వరదాచారి అయ్యర్‌


4. కిందివాటిలో సరైంది ఏది?
1) సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లా కమిషన్‌కు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
2) సాధారణంగా మూడేళ్లకోసారి లా కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారు.
3) మనదేశంలో ఇప్పటివరకు 21 లా కమిషన్‌లు తమ నివేదికలను సమర్పించాయి.
4) పైవన్నీ సరైనవే


5. వివిధ లా కమిషన్‌లు వాటి అధ్యక్షులకు సంబంధించి సరికానిది ఏది? 
1) 14వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.జయచంద్రారెడ్డి
2) 15వ లా కమిషన్‌ - జస్టిస్‌ బి.పి.జీవన్‌రెడ్డి
3) 16వ లా కమిషన్‌ - జస్టిస్‌ కె.ఎన్‌.సింగ్‌
4) 18వ లా కమిషన్‌ - జస్టిస్‌ ఎ.ఆర్‌.లక్ష్మణ్‌


6. 21వ లా కమిషన్‌కు అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్‌ 2) జస్టిస్‌ డి.కె.జైన్‌
3) జస్టిస్‌ పి.వెంకట్రామిరెడ్డి
4) జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా

 

7. 21వ లా కమిషన్‌ సిఫార్సును గుర్తించండి.
1) న్యాయవాదుల సమ్మె వల్ల కక్షిదారులు నష్టపోతే, సంబంధిత న్యాయవాదులే పరిహారం చెల్లించాలి.
2) క్రికెట్‌తో సహా అన్ని క్రీడలపై బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలి.
3) ఉరిశిక్షను మరిన్ని రంగాలు/ నేరాలకు విస్తరించాలి.
4) 1, 2


8. 21వ లా కమిషన్‌ సిఫార్సులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
1) అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు వివాహ వయోపరిమితులు ఉండటం సరికాదు.
2) అమ్మాయిలు, అబ్బాయిల వివాహ వయోపరిమితి 18 సంవత్సరాలుగా ఉండాలి.
3) వివాహమైన దంపతుల్లో ఆస్తిని ఎవరు సంపాదించినా, దాన్ని వారి ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి.
4) పైవన్నీ సరైనవే


9. ఉగ్రవాదం, దేశంపై యుద్ధం ప్రకటించడం లాంటి నేరాలు తప్ప, ఇతర అన్ని రకాల నేరాలకు ఉరిశిక్షను రద్దు చేయాలని 262వ నివేదికలో పేర్కొన్న లా  కమిషన్‌ ఏది?
1) 21వ లా కమిషన్‌     2) 20వ లా కమిషన్‌
3) 19వ లా కమిషన్‌     4) 18వ లా కమిషన్‌


10. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల జీతభత్యాలు, ఇతర అంశాలపై అధ్యయనం కోసం మనదేశంలో ఇప్పటి వరకు ఏర్పాటైన వేతన సవరణ కమిషన్‌లు?
1) 5       2) 6       3) 7       4) 8


11. వివిధ వేతన సవరణ కమిషన్‌లు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
1) ఒకటో వేతన సవరణ కమిషన్‌ -   శ్రీనివాస వరదాచారియార్‌
2) రెండో వేతన సవరణ కమిషన్‌ -    రత్నవేల్‌ పాండ్యన్‌
3) ఆరో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ
4) ఏడో వేతన సవరణ కమిషన్‌ -   జస్టిస్‌ ఎ.కె.మాథూర్‌


12. 20వ లా కమిషన్‌ ఎన్నికల సంస్కరణ అమలుపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదిక ఎన్నోది? 
1) 239వ నివేదిక          2) 251వ నివేదిక
3) 255వ నివేదిక          4) 265వ నివేదిక


సమాధానాలు: 1-1; 2-4; 3-2; 4-4; 5-3; 6-1; 7-4; 8-4; 9-2; 10-3; 11-2; 12-3.

Posted Date : 06-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌