• facebook
  • whatsapp
  • telegram

కాకతీయులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కాకతీయుల తొలి ప్రస్తావన ఉన్న దానార్ణవుడి శాసనమేది?
జ: మాగల్లు

 

2. కాకతీయులు ఎవరి కాలం నుంచి వరాహాన్ని తమ రాజ లాంఛనంగా స్వీకరించారు?
జ: రెండో ప్రోలరాజు

 

3. కిందివాటిని జతపరచండి.
1. నీతిసారం                           ఎ. ప్రతాపరుద్రుడు

2. ప్రతాపరుద్ర యశోభూషణం           బి. విద్యానాథుడు

3. మధురా విజయం                    సి. పాల్కురికి సోమనాథుడు

4. అనుభవసారం                       డి. గంగాదేవి

జ: 1 - ఎ, 2 - బి, 3 - డి, 4 - సి.
 

4. మాచల్దేవి పాత్ర గురించి వివరిస్తున్న గ్రంథం
జ: క్రీడాభిరామం

5. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందిన వెలమ నాయకుడు ఎవరు?
జ: రెండో సింగముడు

 

6. ఆంధ్ర దేశంలోని ప్రసిద్ధ గోళకీ మఠ కేంద్రమేది?
జ: మందడం

 

7. కాకతీయుల నాటి వర్తక శ్రేణుల గురించి వివరిస్తున్న శాసనం
జ: యనమదల శాసనం

 

8. కాకతీయుల కాలంలో రుద్రేశ్వరంగా పిలిచిన ప్రాంతం
జ: హనుమకొండ

 

9. కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు?
జ: దుర్జయుడు

 

10. గుమ్మడి తీగ సంతానం అని ఎవరిని పిలుస్తారు?
జ: కాకతీయులు

 

11. అరిగజ కేసరి బిరుదు పొందిన కాకతీయ పాలకుడు ఎవరు?
జ: మొదటి ప్రోలరాజు

 

12. శ్రీశైలంలో విజయ స్తంభాన్ని నాటిన కాకతీయ చక్రవర్తి
జ: రెండో ప్రోలరాజు

13. ఓరుగల్లును ఆంధ్ర నగరిగా పేర్కొన్న గ్రంథం
జ: క్రీడాభిరామం

 

14. హనుమకొండలో కడలాలయ బసదిని నిర్మించినవారు
జ: మైలమ

 

15. పలనాటి యుద్ధంలో రుద్రదేవుడు ఎవరి పక్షం వహించాడు?
జ: నలగాముడు

 

16. వరంగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేసినవారు
జ: రుద్రదేవుడు

 

17. రుద్రదేవుడు యాదవరాజు జైతుగి చేతిలో మరణించినట్లు తెలిపే ఆధారం
జ: చతుర్వర్గసారం గ్రంథం

 

18. హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని, రుద్రేశ్వరాలయాన్ని నిర్మించినవారు
జ: మొదటి ప్రతాపరుద్రుడు

 

19. కాకతీయుల కాలంనాటి తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి వివరిస్తున్న గ్రంథం
జ: ప్రతాపరుద్రీయం

 

20. తెలుగుభాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన పాలకుడు
జ: గణపతిదేవుడు

21. కిందివాటిని జతపరచండి.
1. శివదేవయ్య       ఎ. నీతిశాస్త్ర ముక్తావళి

2. బద్దెన            బి. పురుషార్థసారం

3. రుద్రదేవుడు       సి. నీతిసారం

4. మడికి సింగన     డి. సకలనీతి సమ్మతం

జ: 1 - బి, 2 - ఎ, 3 - సి, 4 - డి
 

22. గణపతిదేవుని గురువు ఎవరు?
జ: విశ్వేశ్వర శంభు

 

23. రెండో ప్రోలరాజు రెండో గొంక చేతిలో ఓడిపోయినట్లు చెబుతున్న గ్రంథం
జ: కేయూర బాహు చరిత్ర

 

24. గణపతి దేవుడు హనుమకొండలో జైనులను హింసించినట్లు చెబుతున్న గ్రంథం
జ: సిద్ధేశ్వర చరిత్ర

 

25. రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్లుకు మార్చిన పాలకుడు
జ: గణపతిదేవుడు

 

26. కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదు పొందినవారు
జ: రేచర్ల ప్రసాదిత్యుడు

27. జాయపసేనాని దక్షిణ దండయాత్రల గురించి వివరిస్తున్న శాసనం
జ: చేబ్రోలు శాసనం

 

28. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన పాలకుడు
జ: గణపతిదేవుడు

 

29. రుద్రమదేవి కాలంలో వచ్చిన మార్కోపోలో ఏ దేశానికి చెందినవాడు?
జ: ఇటలీ

 

30. కిందివాటిలో సరి కాని దాన్ని గుర్తించండి.
1) రుద్రమదేవి మరణం గురించి చందుపట్ల శాసనం తెలియజేస్తోంది.
2) రుద్రమదేవి మల్కాపురం శాసనం ప్రసూతి వైద్య కేంద్రాల గురించి వివరిస్తుంది.
3) రుద్రమదేవిని రాయగజకేసరి, రుద్రదేవమహారాజు బిరుదులతో ప్రస్తావించారు.
4) రుద్రమదేవి జటావర్మసుందర పాండ్యుడు అనే పాండ్య రాజును ఓడించింది.
జ: 4 (రుద్రమదేవి జటావర్మసుందర పాండ్యుడు అనే పాండ్య రాజును ఓడించింది)

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌