1. మన దేశంలో ఏ సంవత్సరంలో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడి, కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలైంది?
1) 1967 2) 1971 3) 1980 4) 1991
2. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిపిన కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే విభజనను ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు?
1) 5వ షెడ్యూల్ 2) 6వ షెడ్యూల్
3) 7వ షెడ్యూల్ 4) 8వ షెడ్యూల్
3. కేంద్ర, రాష్ట్ర శాసనసంబంధాల గురించి రాజ్యాంగంలోని శ్రీఖివ భాగంలో ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు?
1) ఆర్టికల్ 245 265 2) ఆర్టికల్ 245 255
3) ఆర్టికల్ 255 265 4) ఆర్టికల్ 240 255
4. ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ శాసనాలు రూపొందించాలంటే రాజ్యసభ ఎంత మెజార్టీతో తీర్మానించాలి?
1) 2/3 వ వంతు 2)1/3 వ వంతు
3) 1/4 వ వంతు 4) 1/2 వ వంతు
5. అవశిష్టాంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంట్కు ఉంటుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటోంది?
1) ఆర్టికల్ 247 2) ఆర్టికల్ 248
3) ఆర్టికల్ 249 4) ఆర్టికల్ 250
6. పార్లమెంట్ వివిధ చట్టాలను రూపొందించిన సంవత్సరాలకు సంబంధించి సరికానిది?
7. భారత ప్రభుత్వం రూపొందించే ఆదాయపన్ను చట్టాలు భారత్లో శాఖలను కలిగి ఉన్న విదేశీ సంస్థలకూ వర్తిస్తాయని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
1) వాదియా జు( స్టేట్ ఆఫ్ బాంబే
2) కామేశ్వరి సింగ్ జు( స్టేట్ ఆఫ్ బిహార్
3) రుత్వియా జు( స్టేట్ ఆఫ్ పంజాబ్
4) ముద్రా జు( స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
8. మనదేశంలో ఒక అంశం అవశిష్టాధికారమా? కాదా? అని ఎవరు ధ్రువీకరిస్తారు?
1) పార్లమెంట్ 2) రాష్ట్రపతి
3) సుప్రీంకోర్టు 4) అటార్నీ జనరల్
సమాధానాలు
1-1 2-3 3-2 4-1 5-2 6-4 7-1 8-3.