• facebook
  • whatsapp
  • telegram

తుపాను 

1. 'కత్రినా' అనే తుపాను (హరికేన్) వల్ల ఏ దేశంలో సుమారు 1836 మంది మరణించారు?
జ: అమెరికా


2. 2008 లో తమిళనాడులో సంభవించిన తుపాను పేరేంటి?
జ: నిషా


3. 1999 లో ఏ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ వల్ల 8913 మందికి పైగా ప్రజలు మరణించారు?
జ: ఒరిస్సా


4. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో 5,00,000 మంది మరణానికి కారణమైన భోలా తుపాను ఎప్పుడు సంభవించింది?
జ: 1970


5. ఒక ప్రాంతంలో తుపాను వచ్చినప్పుడు జరిగే నష్టం ఏమిటి?
జ: వేగంగా వీచే గాలి వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి; వరదలొచ్చి గ్రామాలు ముంపునకు గురవుతాయి; రోడ్లు, భవనాలు దెబ్బతిని ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.


6. తుపాను సంభవించినపుడు కలిగే పరిణామాలేవి?
జ: గాలి అధిక వేగంతో వీస్తుంది; వర్షపాతం కలుగుతుంది; సముద్రంలో అలల ఉద్ధృతి పెరుగుతుంది.


7. భారతదేశంలోని ఏ సముద్రంలో తుపానులు ఎక్కువగా సంభవిస్తాయి?
జ: బంగాళాఖాతం


8. అరేబియా తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాలకు తుపాను ముప్పు ఎక్కువ?
జ: గుజరాత్, మహారాష్ట్ర


9. బంగాళాఖాతం తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రానికి తుపాను వల్ల కలిగే నష్టం ఎక్కువ?
జ: ఒరిస్సా


10. భారతదేశంలో తుపాను విపత్తుకు గురయ్యే ప్రాంత పరిమాణం -
జ: 8.5%

Posted Date : 27-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌