• facebook
  • whatsapp
  • telegram

యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభం

* మధ్యయుగంలో క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య జరిగిన మత యుద్ధాలను 'క్రూసేడులు' అంటారు.
* క్రైస్తవులు, మహమ్మదీయులకు పవిత్ర స్థలాలైన పాలస్తీనా, జెరూసలెం, బెత్లెహం ప్రదేశాలను ఆక్రమించడానికి ఈ యుద్ధాలు జరిగాయి.
* క్రీ.శ.1453లో అప్పటి టర్కీ సుల్తాన్ మహమ్మద్ - II గ్రీకు సంస్కృతికి నిలయమైన కాన్‌స్టాంటినోపుల్ నగరంపై దండెత్తి ఆక్రమించాడు. ఆ సమయంలో గ్రీకు పండితులు తమ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలతో యూరప్‌ దేశాలకు వెళ్లారు.
* ఈ విద్వాంసులు యూరప్ అంతటా పాఠశాలలు, మఠాలను స్థాపించి ప్రాచీన గ్రీకు సంస్కృతి, సాహిత్యాలను పునరుద్ధరించడానికి వారు తెచ్చిన గ్రంథాలను బోధించారు.
* ఈ ప్రాచీన సంస్కృతి, సాహిత్యాల పునరుద్ధరనను 'సాంస్కృతిక పునరుజ్జీవనం' లేదా 'రినేజాన్సు' అంటారు.
* కాన్‌స్టాంటినోపుల్ పతనం కంటే ముందుగానే ఇటలీ సాహిత్య రంగంలో రినేజాన్సు ప్రారంభమైంది.
* పెట్రార్క్, డాంటే, బాకాషియో లాంటి రచయితలు తమ రచనల ద్వారా వర్జిల్, సిసిరో, లెవీ, హోరాస్ లాంటి ప్రాచీన రచయితల సాహిత్యాన్ని చదవమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా విద్యా విధానాన్ని సంస్కరించవచ్చని సూచించారు.
* రోమన్‌ల ప్రాచీన భాష 'లాటిన్' కూడా ప్రాముఖ్యాన్ని కోల్పోయింది.
*  క్రీ.శ.15వ శతాబ్దపు యూరోపియన్ రచయితలు తమ దేశాల్లో ప్రజలు వాడే ప్రాంతీయ భాషలోనే రచనలు చేయడం ప్రారంభించారు. అనేక దేశాల రచయితలు బైబిల్‌ను తమ దేశ భాషల్లోకి అనువదించారు.
* శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడంతో వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం లాంటి రంగాల్లో పరిశోధనలు జరిగాయి.
* అచ్చుయంత్రాన్ని కనుక్కోవడం, పేపరు తయారుచేయడం వల్ల సైన్స్, సాహిత్య రంగాల్లో అభివృద్ధి చెందిన విజ్ఞానాన్ని ప్రజలు చదవగలిగారు.
* నావికా దిక్సూచిని కనుక్కోవడం వల్ల సముద్ర ప్రయాణాలు సులభమయ్యాయి.
* కాన్‌స్టాంటినోపుల్ నగరాన్ని తురుష్కులు స్వాధీనం చేసుకున్నారు.
* క్రీ.శ.15వ శతాబ్దం వరకు యూరోపియన్ వర్తకులు కాన్‌స్టాంటినోపుల్ ద్వారా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలతో వర్తకం చేయడానికి ప్రయాణించిన భూమార్గాన్ని తురుష్కులు మూసివేశారు. ఫలితంగా వారు సముద్ర మార్గాలను అన్వేషించి ఆసియా, ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం కొనసాగించారు. అదే సమయంలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని,  కొలంబస్ అమెరికాను కనుక్కున్నారు.
* సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా అప్పటి యూరోపియన్ ప్రజలు ప్రతి విషయాన్ని ప్రశ్నించి, తర్కించి, పరిశోధించి, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నేర్చుకోవడం ప్రారంభించారు. దీని వల్ల ప్రజల్లో రాజులు దైవాంశ సంభూతులనే భావం ఏర్పడి వారి నిరంకుశాధికారాన్ని ప్రజలు ధిక్కరించారు.
* రాజకీయ, సామాజిక, మత రంగాల్లో వచ్చిన ఈ మార్పులు యూరప్‌లో ఆధునిక యుగ ప్రారంభానికి నాంది పలికాయి.  ఫలితంగా భూస్వామ్య వ్యవస్థ క్షీణించి దాని స్థానంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది.
* పెట్టుబడిదారీ విధానాన్ని ప్రయివేటు వ్యక్తులు తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను సొంతం చేసుకునే ఒక ఆర్థిక విధానంగా నిర్వచించారు.


పారిశ్రామిక విప్లవం

* విప్లవం అంటే ఏదైనా రంగంలో వచ్చే ఆకస్మికమైన మార్పు.
* పరిశ్రమల్లో ఉపయోగపడే కొత్త యంత్రాలను కనిపెట్టి వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని 'పారిశ్రామిక విప్లవం' అని అంటారు. పరిశ్రమల్లో యంత్రాల వాడకం మొదట ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది.
* స్పిన్నింగ్ జెన్నీ అనే కొత్త యంత్రాన్ని వస్త్రాల నేతకు ఉపయోగించడం, ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడంతో ఇంగ్లండ్‌లో వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
* ఇతర పరిశోధనలు అంటే బ్లాస్ట్‌ఫర్నేస్ గనుల్లో ఉపయోగించే రక్షిత దీపం, విద్యుచ్ఛక్తి, టెలిఫోన్, టెలిగ్రాఫ్, రేడియో లాంటివి పారిశ్రామిక విప్లవాన్ని మరింత శక్తిమంతం చేశాయి.

సామ్రాజ్యవాదం ఆవిర్భావం
 

* బ్రిటిష్ సామ్రాజ్యం బర్మాకి కూడా విస్తరించింది. ఆఫ్రికాలోని చాలా భాగంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యూరోపియన్‌ల సామ్రాజ్యవాదం వ్యాపించింది.
ప్రపంచంలోని ముఖ్య సంఘటనలు - భారతదేశంపై వాటి ప్రభావం

అమెరికా, ఫ్రాన్స్‌లో విప్లవాలు

* 18వ శతాబ్దపు ద్వితీయార్థంలో వచ్చిన అమెరికా స్వాతంత్య్ర యుద్ధం, ఫ్రెంచి విప్లవం ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగినవి.

* బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర అమెరికాలో 13 వలస రాజ్యాలను స్థాపించింది. ఆ రాజ్యాల్లోని ప్రజలంతా ఇంగ్లండ్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఇంగ్లండ్‌ ప్రజలు అనుభవించే హక్కులను కల్పించలేదు.
* ఇంగ్లండ్, ఫ్రాన్స్‌కు చెందిన తత్వవేత్తలు తమ రచనల ద్వారా మానవుడికి స్వేచ్ఛగా, ఆనందంగా జీవించే హక్కు ఉందని ఉద్ఘాటించారు.
* బ్రిటిష్ ప్రభుత్వం ఈ హక్కులను తిరస్కరించడం, గుర్తించకపోవడం అమెరికా స్వాతంత్య్ర యుద్ధానికి కారణమైంది. ఫలితంగా అమెరికాలోని ఆంగ్ల వలసలు స్వాతంత్య్రం పొందాయి. క్రీ.శ.1783లో అమెరికా సర్వసత్తాక రాజ్యంగా ఏర్పడింది.
* ఫ్రాన్స్‌లో సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండేది. వీరంతా అమెరికా స్వాతంత్య్ర యుద్ధం నుంచి స్ఫూర్తిని పొందారు. ఫలితంగా అప్పటి ఫ్రెంచి చక్రవర్తి లూయీ XVIకి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో తిరుగుబాటు జరిగింది.
* క్రీ.శ.1789, జులై 14న ఫ్రాన్స్‌లో విప్లవం ప్రారంభమైంది. విప్లవకారులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాటం చేశారు. పారిస్‌లోని బాస్టిలు జైలు తలుపులు పగులగొట్టి ఖైదీలందర్నీ విడిపించారు.
* ఫ్రాన్స్‌లో ఏటా ఈ రోజును జాతీయదినంగా జరుపుకుంటారు.
* మానవులంతా పుట్టుకతోనే స్వేచ్ఛా జీవులని, వారు స్వేచ్ఛగానే జీవిస్తారని, వారందరికీ అన్ని హక్కులు సమానమేనని ఈ విప్లవం ప్రకటించింది. ఈ రెండు విప్లవాలు ప్రపంచమంతటా జాతీయ భావాలను బలపడేలా చేశాయి.
* జాతీయభావం అంటే ఒకే భాష మాట్లాడుతూ, ఒకే మతాన్ని పాటించే, ఒకే జాతికి చెందిన ప్రజలు ఒకే ప్రభుత్వం అధీనంలో ఉండాలని కోరుకోవడం.
* 19వ శతాబ్దంలో జర్మన్, ఇటలీలు తమ దేశాల ఏకీకరణ కోసం ఆయా భాషలు మాట్లాడే ప్రజలు ఒకే ప్రభుత్వం కిందకు వచ్చేందుకు పోరాడి సఫలమయ్యారు.

Posted Date : 24-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌