1. విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు?
జ: 1336
2. విజయనగర సామ్రాజ్య తొలి రాజధాని-
జ: అనెగొంది
3. విజయనగర సామ్రాజ్యం ఎవరి పేరుతో స్వతంత్ర రాజ్యంగా స్థాపితమైంది?
జ: విరూపాక్ష స్వామి
4. విజయనగర సామ్రాజ్యాన్ని తుంగభద్రా నదికి ఏ దిక్కున స్థాపించారు?
జ: దక్షిణం
5. 1344లో రాజధానిని విజయనగరానికి మార్చిన పాలకుడు ఎవరు?
జ: మొదటి హరిహరుడు
6. భాగపెల్సి తామ్రశాసనాన్ని వేయించిన పాలకుడెవరు?
జ: మొదటి హరిహరుడు
7. దేవులపల్లి తామ్ర శాసనాలు వేయించిన పాలకుడు-
జ: ఇమ్మడి నరసింహుడు
8. విజయనగర కాలం నాటి ప్రధాన బంగారు నాణెం
జ: మాడ
9. గజబేటకార బిరుదుతో రెండో దేవరాయలు వేయించిన నాణెం-
జ: పావలా వరహా
10. కిందివాటిని జతపరచండి.
1) ఇబన్ బటూట ఎ) మొదటి హరిహరుడు
2) నికోలో కాంటె బి) రెండో దేవరాయలు
3) అబ్దుల్ రజాక్ సి) మొదటి దేవరాయలు
4) వర్థెమా డి) శ్రీకృష్ణదేవరాయలు
జ: 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
11. సతీసమేతంగా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
జ: నికోలో కాంటె
12. విజయనగర కాలం నాటి గణికావృత్తి గురించి వివరించినదెవరు?
జ: అబ్దుల్ రజాక్
13. సతీసహగమనం, వసంతోత్సవాల గురించి రాసినదెవరు?
జ: నికోలో కాంటే
14. 'ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (విస్తృత విజయనగర సామ్రాజ్యం)' అనే గ్రంథాన్ని ఎవరు రాశారు?
జ: రాబర్ట్ సూయెల్
15. మహానాటక సుధానిధి గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: రెండో దేవరాయలు
16. రెండో విరూపాక్ష రాయల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు?
జ: అథనేషియన్ నికెటిన్
17. 'మధురా విజయం' గ్రంథకర్త ఎవరు?
జ: గంగాదేవి
18. తెలుగు భాషలో పంచతంత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) విష్ణుశర్మ 2) మహాలింగదేవుడు 3) నాచనసోముడు 4) ఎవరూకాదు
జ: 4 (ఎవరూకాదు)
19. 'విజయనగర రాజులు తెలుగువారు' అని అన్నదెవరు?
జ: రాబర్ట్ సూయెల్
20. 'మధురా విజయం' గ్రంథం ప్రకారం సంగమవంశ కుల గురువు ఎవరు?
జ: క్రియాశక్తి