మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిని జతపరచండి.
1) శ్రీపర్వతీయులు ఎ) ఆనందగోత్రజులు
2) బప్ప భట్టారక పాదభక్తులు బి) తూర్పు చాళుక్యులు
3) త్రికూట పర్వతాధిపతులు సి) ఇక్ష్వాకులు
4) హారితీపుత్రులు డి) శాలంకాయనులు
జ: 1-సి; 2-డి; 3-ఎ; 4-బి
2. 'ఇక్షు చిహ్నాన్ని పూజించే కృష్ణా నదీతీరంలోని వారే ఇక్ష్వాకులు' అని అన్నదెవరు?
జ: కాల్డ్వెల్
3. శతసహస్ర హాలక బిరుదు పొందిన ఇక్ష్వాక రాజు-
జ: మొదటి శాంతమూలుడు
4. మాంధాత శిల్పం ఏ ప్రాంతంలో బయల్పడింది?
జ: జగ్గయ్యపేట
5. ఆంధ్రదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన వంశీయులు
జ: ఇక్ష్వాకులు
6. నాగార్జునకొండ వద్ద చైత్యాన్ని నిర్మించిన స్త్రీ-
జ: శాంతిశ్రీ
7. దక్షిణ భారతదేశంలో తొలి తామ్రశాసనం వేయించిన పాలకులు-
జ: బృహత్పలాయనులు
8. శాలంకాయనుల ఆరాధ్య దైవం
జ: చిత్రరథస్వామి
9. సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకుని తెలుగు నేలపై పాలించిన తొలి వంశం-
జ: విష్ణుకుండినులు
10. చేజర్ల కపోతేశ్వరాలయాన్ని నిర్మించినదెవరు?
జ: దామోదర వర్మ
11. బౌద్ధమతాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు
జ: గోవిందవర్మ
12. తన కుమారుడికి మూడో మాధవవర్మ ఉరిశిక్ష విధించినట్లు తెలుపుతున్న గ్రంథం-
జ: నచికేతోపాఖ్యానం
13. ఇక్ష్వాకుల కాలం నాటి దేవాలయాలు బయల్పడిన వీరాపురం ఏ జిల్లాలో ఉంది?
జ: కర్నూలు
14. నెల్లూరు జిల్లా భైరవ కొండ గుహాలయాలు ఏ మతానికి సంబంధించినవి?
జ: శైవం
15. తొలి తెలుగు వాక్యం విజయోత్సవ సంవత్సరంబుల్ ఏ శాసనంలో ఉంది?
జ: చిక్కుళ్ల శాసనం
16. ఆంధ్రరాష్ట్ర అధికార చిహ్నం పూర్ణకుంభం ఏ గుహాలయాల్లో ఉంది?
జ: ఉండవల్లి గుహలు
17. ఆనందగోత్రజుల రాజ లాంఛనం-
జ: వృషభం
18. ఆంధ్రదేశంలో విష్ణుదేవాలయాలు ఉన్నట్లు తెలిపే తొలి శాసనం
జ: పెదవేగి శాసనం
19. ఇక్ష్వాకుల రాజధాని-
జ: విజయపురి
20. కిందివాటిని జతపరచండి.
1) చేజర్ల శాసనం ఎ) దామోదరవర్మ
2) మట్టిపాడు శాసనం బి) కందారరాజు
3) గోరంట్ల శాసనం సి) అత్తివర్మ
4) చిక్కుళ్ల శాసనం డి) రెండో విక్రమేంద్రవర్మ
జ: 1-బి; 2-ఎ; 3-సి; 4-డి