1. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాజ్యసభలో ఏ తేదీన ఆమోదం పొందింది?
జ: 2014, ఫిబ్రవరి 20
2. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
జ: 2014, మార్చి 1
3. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న మొదటి సూచన ఏది?
జ: ఆంధ్రప్రదేశ్లో యథాతథ స్థితిని కొనసాగించాలి
4. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో పేర్కొన ‘నియమిత దినం’ ఏది?
జ: 2014, జూన్ 2
5. కింది సంఘటనలను అవి జరిగిన కాలాల ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి.
ఎ) జై ఆంధ్ర ఉద్యమం
బి) జై తెలంగాణ ఉద్యమం
సి) గిర్గ్లానీ కమిషన్
డి) జీవో నెంబర్ 610
ఇ) 32వ రాజ్యాంగ సవరణ
1) ఎ, బి, సి, ఇ, డి 2) బి, ఎ, ఇ, డి, సి
3) బి, ఎ, ఇ, సి, డి 4) ఇ, సి, బి, ఎ, డి
జ: బి, ఎ, ఇ, డి, సి
6. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో ‘నియమిత దినం’ అంటే?
జ: గెజిట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసిన రోజు
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను శాస్త్రీయంగా పూర్తిచేయడానికి నియమించిన కమిటీ ఏది?
జ: శ్రీకృష్ణ కమిటీ
8. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 2014, ఫిబ్రవరి 14
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారు?
జ: వినోద్కుమార్ దగ్గల్